/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: కుంభం కీర్తి రెడ్డి Vijay.S
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి: కుంభం కీర్తి రెడ్డి


కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గం లోని నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వాటిని బూతులు బూత్ కమిటీలు గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో మహిళలను ప్రజలను చైతన్యపరిచి భువనగిరి నియోజకవర్గం నుండి గత 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవలేదు గత అసెంబ్లీ ఎన్నికలలో కార్యకర్తలు కష్టపడి అహర్నిశలు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించారు అదే ఉద్దేశంతో భువనగిరి ఎంపీ కి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులను శ్రీమతి కుంభం కీర్తి రెడ్డి గారు కోరారు ఈ కార్యక్రమంలో సుక్క స్వామి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఎగ్ సర్పంచ్ మరియు పులిగిల్ల బాలయ్య ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ గొల్లపెల్లి అశోక్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ చట్టం పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి: సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్


      జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టమును పోరాడి సాధించిన సిపిఎం ను, చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు చేస్తున్న మోడీ బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చట్ట పరిరక్షణ కోసం పోరాడుతున్న సిపిఎం భువనగిరి పార్లమెంటు అభ్యర్థి యుండి. జహంగీర్ గారిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు భాస్కర్ నర్సింహ్మ పిలుపునిచ్చానారు. గురువారం భువనగిరి మండల పరిధిలోని పెంచికల్ పహాడ్, అనాజిపురం గ్రామాలలో సిపిఎం పార్లమెంట్ అభ్యర్థి యండి.జహంగీరి గారిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పెంచికల్ పహాడ్ గ్రామంలో పని చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి కూలీల పని ప్రదేశాన్ని సందర్శించి వారి సమస్యలు తెలుసుకున్న అనంతరం భాస్కర్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు.అనాడు వామపక్షాలు, ప్రజా సంఘాలు పోరాడి సాధించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామీణ నిరుపేదలకు, వ్యవసాయ కూలీలకు ఉపాధికి ఉపయోగపడుతూ రెండు పూటల తిండి తినడానికి ఉపయోగపడుతుందని, గ్రామీణ పేదలు వ్యవసాయ కూలీలు గౌరవంగా జీవించడానికి ఉపాధి హామీ పనులు తోడ్పడుతున్నాయని అన్నారు. కానీ నేడు అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని ఎత్తివేయాలనే కుట్ర కోణం నుండి ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కార్మికుల పైన అనేక భారాలు మోపుతూ చట్టంలో ఉన్న సౌకర్యాలు అన్నింటినీ ఎత్తివేస్తున్నదని మొత్తమే చట్టం లేకుండా చేయాలనే ఆలోచనలో బిజెపి ఉన్నదని ఈఎన్నికల్లో బిజెపి నీ ఓడించకపోతే ఉపాధి చట్టం ఉండదని పేదలందరూ ఐక్యంగా బిజెపిని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. మరోపక్క నిత్యవసర వస్తువుల ధరలు పెంచుతూ పేదల పైన భారాలను మోపుతున్నదని కార్మిక చట్టాలను కాలరాస్తూ పనివారాన్ని పెంచుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న పరిస్థితి ఉన్నదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో బిజెపితో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్ పూర్తిగా విఫలమయ్యాయి అని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే ప్రజా ఉద్యమాల సారధి సిపిఎం సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగిర్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జే. వెంకటేష్ , కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఏదునూరి మల్లేశం, కమిటీ సభ్యులు సిలువేరు ఎల్లయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఎదునూరి వెంకటేశం, నాయకులు బిక్షపతి బాలయ్య, స్వామి, బాలరాజు, శ్రీకాంత్, వెంకటేశు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.

       

భువనగిరి పార్లమెంట్ అభివృద్ధి బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తోనే సాధ్యం: పడమటి జగన్మోహన్ రెడ్డి


వలిగొండ మండలం టేకుల సోమారం గ్రామంలో భువనగిరి బిజెపి అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారి గెలుపు కొరకై ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు ఒక్కొక్కటిగా వివరించడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని వారిని కోరడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర బిజెపి నాయకులు సీఎన్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ రాచకొండ కృష్ణ గారు, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ గారు, మండల ఉపాధ్యక్షులు సంతోష్ గారు, భారతీయ జనతా యువమోర్చా మండల అధ్యక్షులు మందడి రంజిత్ రెడ్డి గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు వెంకటేష్ గారు, టేకుల సోమరం గ్రామ బూత్ అధ్యక్షులు పాటి వెంకట్ రెడ్డి , నవీన్ రెడ్డి, రామకృష్ణ , అంబరీష్ , భాను ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

గురుకులాల్లో, సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన భోజనం అందించాలి ఏఐఎస్ఎఫ్


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, ప్రభుత్వ బీసీ సంక్షేమ హాస్టల్ ను గురువారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది 

ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా లో ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సంక్షేమ హాస్టల్లో గురుకులాలు సందర్శించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

ఈనెల 14వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మృతి చెందిన విద్యార్థి చిత్రపటానికి సంఘ నాయకులు విద్యార్థులు కలిసి శ్రద్ధాంజలి ఘటించారు 

విద్యార్థి మృతికి కారణమైన సాంఘిక సంక్షేమ గురుకుల రీజనల్ కోఆర్డినేటర్ రజిని గారిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేశారు ఇక మీదట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇలాంటి ఘటనలు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ప్రభుత్వ ఉన్నతాధికారులను కోరారు 

సంక్షేమ హాస్టల్లో వార్డెన్లు విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు 

అనంతరం విద్యార్థులతో కలిసి భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో పాటు మధ్యాహ్న భోజనం చేయడం జరిగింది 

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు మచ్చ వినయ్, రామ్ పాక చందు, శివ, సంతోష్ విద్యార్థులు పాల్గొన్నారు.

తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత


తుమ్మల నరసయ్య సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేత.అరూరు గ్రామంలో అప్పారెడ్డిపల్లి కాలనీలో ముప్పుడి రాములు భార్య బాలమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడం జరిగింది వారి కుటుంబ సభ్యులకు తుమ్మల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసినారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ ఓబిసి అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య మాజీ ఎంపీటీసీ పోలేపాక చంద్రయ్య మత్స్యగిరిగుట్ట మాజీ ధర్మకర్త కసరబోయిన లింగయ్య యాదవ్ మాజీ వార్డు సభ్యులు సత్యనారాయణ యాదవ్ మాజీ హై స్కూల్ చైర్మన్ జినుకల మల్లేష్ యాదవ్ ప్రైమర్ స్కూల్ మాజీ చైర్మన్ ఆవుల అంజయ్య యాదవ్ యూత్ నాయకులు ఎలిమినేట్ సంతోష్ చుక్క రామచంద్రు పిన్నిటి లింగారెడ్డి జినుకల బాల నరసింహ జున్ను కల మహేష్ నరసింహ చారి తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం, మీడియా సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ హనుమంతు కే జెండగే


యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ కే జండగే (యాదాద్రి జిల్లా కలెక్టర్ భువనగిరి పార్లమెంట్ ఎన్నికల అధికారి) పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

 18 ఏప్రిల్ నుంచి 25 ఏప్రిల్ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,

 ఎన్నికల కౌంటింగ్ కేంద్రంగా భువనగిరిలో ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లోఏర్పాటు చేశామని అన్నారు.

పార్లమెంట్ పరిధిలో 2141 పోలింగ్ కేంద్రాలు. 

1804930 మంది ఓటర్లు 896,2 19 మంది పురుషులు 908632 మంది స్త్రీలు ఇతరులు 79 మంది.

245 మంది సెక్టర్ ఆఫీసర్స్ 126 వివిధ రకమైన విజిలెన్స్ టీమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

రెండు వెబ్ రెబెల్ పోలింగ్ కేంద్రాలు. 

సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు 637. 

అభ్యర్థుల నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసు నందు అభ్యర్థుల హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేశామని అన్నారు.

పొలిటికల్ పార్టీ సువిధ క్యాండిడేట్ యాప్ సువిధ పర్మిషన్ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవచ్చును.

 ప్రజలు సివిజన్ ,ఓటర్ హెల్ప్ ఆప్ ,సాక్ష్యం, కేవైసీ యాప్ ల ద్వారా ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు.

తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులు


తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూ ర్తులైన జస్టిస్‌ జగ్గన్నగారి శ్రీనివాస్‌రావు, జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌ రావులను శాశ్వత న్యాయ మూర్తులుగా నియమించ డానికి సుప్రీంకోర్టు కొలీజి యం సిఫార్సు చేసింది.

ఇద్దరు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తు లుగా సిఫారసు చేస్తూ 2024, ఫిబ్రవరి 13న హైకోర్టు కొలీజియం నిర్ణయించిందని తెలిపింది. ముఖ్యమంత్రి, గవర్నర్‌లు దీనికి తమ సమ్మతి తెలియజేశారని పేర్కొంది.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ డీవై చంద్ర చూడ్‌ నేతృత్వంలోని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌.గవాయిలతో కూడిన కొలీజియం సమావేశమై శాశ్వత న్యాయమూర్తు లుగా జస్టిస్‌ శ్రీనివాసరావు, జస్టిస్‌ రాజేశ్వర్‌రావులకు తగిన అర్హతలు కలిగి ఉన్నా రని నిర్ణయించినట్టు వెల్లడించింది.

తెలంగాణ హైకోర్టుకు చెందిన ఈ ఇద్దరు న్యాయ మూర్తుల తీర్పులు పరిశీ లించాలని ఇద్దరు న్యాయ మూర్తులతో కూడిన సుప్రీం కోర్టు కమిటీని సీజేఐ ఆదే శించారని.. ఆ కమిటీ ఆయా తీర్పులపై సంతృప్తి వ్యక్తం చేసిందని వివరిం చింది.

మొగిలి పాక గ్రామంలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం


వలిగొండ మండలం మొగిలిపాక గ్రామం లో శ్రీ

సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం  మండల్ కోర్ కమిటీ సభ్యులు, కాంగ్రేస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమామిడిసత్తిరెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగ నిర్వహించామని మొగిలి పాక కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పబ్బు ఎల్లయ్య గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడిగే వెంకన్న , మాజీసర్పంచ్ ముద్దసాని నరసింహారెడ్డి,ముద్దసాని రఘుపతిరెడ్డి , ముద్దసాని జైసింహ రెడ్డి, మాజీ సర్పంచ్ రచ్చ యాదగిరి. మాజీసర్పంచ్ మొగిలిపాక గోపాల్ , యాదవ్ సంగం అధ్యక్షులు మర్ల మల్లేష్ యాదవ్ , మొగిలిపాక పాపయ్య, జక్కా జనార్దన్ రెడ్డి, జడిగి నరసింహ , మొగిలిపాక యూత్ కాంగ్రేస్ సభ్యులు మొగిలిపాక రాంబాబు , కార్యదర్శి చెన్నారం మహేష్ అలాగే బజ్రంగ్ యూత్ సభ్యులు పాల్గొనడం జరిగింది .                    

          

దాసిరెడ్డి గూడెం లో అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వేద బ్రాహ్మణులచే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం జరుపబడినది. ఈ కళ్యాణ మహోత్సవానికి గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించినారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించిన భక్తులకు స్వామివారి కరుణాకటాక్షం ఎల్లవేళలా ఉండాలని ఆ సీతారామచంద్ర స్వామి వారిని కోరుతున్నాం. కళ్యాణ మహోత్సవం అనంతరం బందారపు లింగస్వామి జయమ్మ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రామాలయ కమిటీ మెంబర్లు రామభక్తులు గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వలిగొండ ఎస్బిఐ బ్యాంకులో నగదులో కొరత, పరారీలో క్యాషియర్ కేసు నమోదు చేసిన వలిగొండ ఎస్సై మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకులో నగదు లో కొరత ఏర్పడిందని బ్రాంచ్ మేనేజర్ జి మౌనిక స్థానిక వలిగొండ పోలీస్ స్టేషన్లో పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకులో పనిచేస్తున్న ఉద్యోగి, క్యాష్ ఇన్చార్జి కాలేరు అనిల్ కుమార్ ఈనెల 16వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా పరారీలో ఉన్నారు. ఎక్కడున్నాడో తెలియదు. అతని క్యాబిన్ చెక్ చేయగా నగదు లో రూ. 15 లక్షల 50 వేలు తక్కువగా ఉన్నాయి. ఎంక్వయిరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంక్ మేనేజర్ కోరారు. బ్యాంక్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.