మునిపంపుల గ్రామంలో తాటి చెట్టు నుండి జారిపడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామ నివాసి కునూరు పాండు తండ్రి సత్తయ్య వయసు 48 ఈరోజు ఉదయం రోజువారి వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో కాలుజారి కింద పడడం జరిగింది నడుము వెన్నుపూస మరియు ఎడమ కాలు కు దెబ్బలు తగిలినవి తోటి గీత కార్మికులు కుటుంబ సభ్యులు కలిసి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు .
విషయం తెలవగానే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పులిబిక్షం మండల నాయకులు తూర్పునూరు శ్రీనివాస బావుండపల్లి బాలరాజు బాలగోని మల్లయ్యగంగాపురం సైదులు మామిండ్ల రవి తేజ బాధితుని కునూరు పాండును పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. మాట్లాడుతూ పాండుకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం ప్రమాదాలు నివారణకు సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికుల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారుఎక్స్ గ్రేషయా నెలరోజుల లోపే వారి కుటుంబానికి అందించాలని కోరారు.
![]()



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి, నర్సయ్య గూడెం గ్రామాలలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వలిగొండ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకే అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ పి ఎమ్ జానీ , రవీందర్, పంచాయతీ సెక్రెటరీ నరేందర్ , ఏఈఓ సాయి, వెల్వర్తి మహిళా సంఘం సభ్యులు అధ్యక్షురాలు ఎడవెల్లి పోచమ్మ,సభ్యురాలు పల్లె వాణి, బూడిద శ్రీలత,కల్కూరి నరసింహ, నర్సాయిగూడెం మహిళా సంఘం సభ్యులు అధ్యక్షులు మాదాని రోజా, పసల రాణి, పసల శ్రీదేవి. సింగాని పర్వతమ్మ ,పసల బాల రవి పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వలిగొండ మండల అధ్యక్షులు బొల్ల సుదర్శన్ అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని CN రెడ్డి కాంప్లెక్స్ లో సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకరికంటి మొగలయ్యాగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహించ తలపెట్టిన జిల్లా కేంద్రంలో రైతు దీక్ష కార్యక్రమంను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.
అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 6/4/ 2024 రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు అదే రోజు టిఫిన్ బైటెక్ లను బూతుల వారిగా నిర్వహించి విజయవంతం చేయాలని వారు కోరారు ,మరియు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 45 రోజులపాటు ప్రతి బూతులలో ఇంటింటికి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని ప్రజలను కోరాలని వారు అన్నారు అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు స్వీకరించరో వారి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా నాయకులు సత్తయ్య గౌడ్ స్టేట్ కౌన్సిల్ మేంబర్ ఏలే చంద్రశేఖర్ ,ప్రధాన కార్యదర్శి లోడ లింగస్వామి,కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానేష గౌడ్, దయ్యాల వెంకటేష్ ,గంగదారి దయాకర్, డోగుపర్తి సంతోష్, మంద నరసింహ ,అప్పిశెట్టి సంతోష్, కొంతం రామచంద్రం ,మందాడి రంజిత్ రెడ్డి , మందుల నాగరాజు ,సంతోష్,బర్ల మల్లేశం దంతురు అరుణ్ ఎల్లంకి మురళి తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 6 న తుక్కుగూడ లో జరిగే తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .ఘట్కేసర్ లోని ఔషాపూర్ పిపిఆర్ కన్వెన్షన్ లో గురువారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సభ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం స్థాయి నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Apr 06 2024, 15:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.5k