/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz మునిపంపుల గ్రామంలో తాటి చెట్టు నుండి జారిపడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు Vijay.S
మునిపంపుల గ్రామంలో తాటి చెట్టు నుండి జారిపడి గీత కార్మికునికి తీవ్ర గాయాలు


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామ నివాసి కునూరు పాండు తండ్రి సత్తయ్య వయసు 48 ఈరోజు ఉదయం రోజువారి వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తున్న క్రమంలో కాలుజారి కింద పడడం జరిగింది నడుము వెన్నుపూస మరియు ఎడమ కాలు కు దెబ్బలు తగిలినవి తోటి గీత కార్మికులు కుటుంబ సభ్యులు కలిసి రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు .

విషయం తెలవగానే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు పులిబిక్షం మండల నాయకులు తూర్పునూరు శ్రీనివాస బావుండపల్లి బాలరాజు బాలగోని మల్లయ్యగంగాపురం సైదులు మామిండ్ల రవి తేజ బాధితుని కునూరు పాండును పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.  మాట్లాడుతూ పాండుకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి ప్రభుత్వం ప్రమాదాలు నివారణకు సేఫ్టీ మోకులు అందించి గీత కార్మికుల ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుచున్నారుఎక్స్ గ్రేషయా నెలరోజుల లోపే వారి కుటుంబానికి అందించాలని కోరారు.

జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయంలో జరగని జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, కలెక్టర్ ఆదేశాలిచ్చి సాయంత్రంలోగా జరుగుటకు చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్


యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బా రామకృష్ణ మాట్లాడుతూ ఈరోజు శుక్రవారం బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతిని నిర్వహించలేదని అన్నారు. కలెక్టర్ ఆఫీస్ నుండి గ్రామపంచాయతీ వరకు అన్ని ఆఫీసులలో జయంతులు నిర్వహించేదని, ఈసారి ఎలక్షన్ కోడ్ ఉన్నందున స్టాచు దగ్గరే జయంతి జరిపాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. బాబు జగ్జీవన్ రావ్ మహనీయుని వలనే ఈరోజు సెలవు తీసుకుని ఒక గంట సేపు జయంతి కోసం కేటాయించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కలెక్టర్ అధికారులకు ఆదేశాలిచ్చి సాయంత్రం వరకు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీ తదితర కార్యాలయంలో జయంతి వేడుకలు నిర్వహించాలని కోరారు. లేనియెడల దళిత సంఘాలు కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా చేపడతామని అన్నారు..

ఈనెల 6న మోత్కూరులో మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు


యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పట్టణంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలు మోత్కూరి విజయలక్ష్మి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తేదీ 6-04-24 శనివారం ఉదయం 10 గంటలకు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం భవనం మోత్కూరు లో నిర్వహిస్తున్నామని ట్రస్ట్ అధ్యక్షులు మోత్కూరి బ్రహ్మ ఆచార్య ఆన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఉగాదికి నిస్వార్ధంగా సమాజ సేవ చేస్తున్న మహనీయులకు ఉగాది పురస్కారాలను అందించాలని, ఈ క్రోధినామ సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని అన్నారు. ఈ ఉగాది పురస్కారాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుర్రం లక్ష్మీ నరసింహ రెడ్డి జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ భువనగిరి, గుర్రం కవిత లక్ష్మీ నరసింహారెడ్డి మోత్కూరు మున్సిపల్ చైర్మన్, మోత్కూరు నరహరి తెలుగు ప్రాచ్య కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు, అభినయ శ్రీనివాస్ రాష్ట్ర ఉత్తమ గేయ రచయిత అవార్డు గ్రహీత, ఎస్ ఎన్ చారి రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేఖరి తదితరులు హాజరై ఉగాది పురస్కార గ్రహీతలకు పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

వేములకొండ మూసి పరివాహక ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టివేత ...కేసు నమోదు చేసిన ఎస్సై మహేందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ శివారులో గల మూసి పరివాహక ప్రాంతం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ని పక్కా సమాచారంతో గురువారం వలిగొండ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వేములకొండ గ్రామానికి చెందిన పులిపలుపుల శివకు చెందిన ట్రాక్టర్ గా పోలీసులు గుర్తించారు. ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనుమతి లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి, నర్సయ్య గూడెం గ్రామాలలో గురువారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వలిగొండ తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకే అమ్ముకోవాలని, దళారులను నమ్మి మోసపోవద్దని అన్నారు. రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఏ పి ఎమ్ జానీ , రవీందర్, పంచాయతీ సెక్రెటరీ నరేందర్ , ఏఈఓ సాయి, వెల్వర్తి మహిళా సంఘం సభ్యులు అధ్యక్షురాలు ఎడవెల్లి పోచమ్మ,సభ్యురాలు పల్లె వాణి, బూడిద శ్రీలత,కల్కూరి నరసింహ, నర్సాయిగూడెం మహిళా సంఘం సభ్యులు అధ్యక్షులు మాదాని రోజా, పసల రాణి, పసల శ్రీదేవి. సింగాని పర్వతమ్మ ,పసల బాల రవి పాల్గొన్నారు.

ఈనెల 5 న భువనగిరిలో తలపెట్టిన రైతు దీక్ష కార్యక్రమం జయప్రదం చేయాలి: రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకిరికంటి మొగులయ్య


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వలిగొండ మండల అధ్యక్షులు బొల్ల సుదర్శన్ అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని CN రెడ్డి కాంప్లెక్స్ లో సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకరికంటి మొగలయ్యాగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహించ తలపెట్టిన జిల్లా కేంద్రంలో రైతు దీక్ష కార్యక్రమంను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 6/4/ 2024 రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు అదే రోజు టిఫిన్ బైటెక్ లను బూతుల వారిగా నిర్వహించి విజయవంతం చేయాలని వారు కోరారు ,మరియు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 45 రోజులపాటు ప్రతి బూతులలో ఇంటింటికి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని ప్రజలను కోరాలని వారు అన్నారు అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు స్వీకరించరో వారి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా నాయకులు సత్తయ్య గౌడ్ స్టేట్ కౌన్సిల్ మేంబర్ ఏలే చంద్రశేఖర్ ,ప్రధాన కార్యదర్శి లోడ లింగస్వామి,కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానేష గౌడ్, దయ్యాల వెంకటేష్ ,గంగదారి దయాకర్, డోగుపర్తి సంతోష్, మంద నరసింహ ,అప్పిశెట్టి సంతోష్, కొంతం రామచంద్రం ,మందాడి రంజిత్ రెడ్డి , మందుల నాగరాజు ,సంతోష్,బర్ల మల్లేశం దంతురు అరుణ్ ఎల్లంకి మురళి తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 6న తుక్కుగూడలో జరిగే తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలి : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


ఈనెల 6 న తుక్కుగూడ లో జరిగే తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .ఘట్కేసర్ లోని ఔషాపూర్ పిపిఆర్ కన్వెన్షన్ లో గురువారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సభ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం స్థాయి నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 5న భువనగిరి లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ను జయప్రదం చేయండి: వల్లాస్ రాజ్ కాళ భైరవ జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ


భారతీయ జనతా పార్టీ భువనగిరి మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి అధ్వర్యంలో మీడియా సమావేశం మండల పార్టీ ఆఫీసులో ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కిసాన్ మోర్చ సెక్రటరీ వల్దాస్ రాజ్ కాళభైరవ పాల్గొనడం జరిగింది.

వల్దాస్ రాజ్ కాళభైరవ మాట్లాడుతూ ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లి ఎన్నికల్లో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ,రైతు భరోసా క్రింద 15000 ,రైతు కూలీలకు 12000 ,కౌలు రైతులకు 15000, msp క్రింద రైతులకు 500 బోనస్ ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే ఇవ్వన్ని హామీలను అమలు చెయ్యకుండా రైతులను,ప్రజలను మోసం చేస్తుందన్నారు.

మాయమాటలతో రైతులను,ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఈ నెల 5-4-2024 రోజున భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ దీక్ష కీ పెద్ద ఎత్తున రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మానిక్యం రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ సోషల్ మీడియా కన్వీనర్ కుషంగల ప్రభాకర్ ఉన్నారు

హీరో సుమన్, జైహింద్ గౌడులను మర్యాదపూర్వకంగా కలిసిన రాగిరి మల్లేష్ గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వి ఫైవ్ న్యూస్ సీనియర్ రిపోర్టర్ రాగిరి మల్లేశం గౌడ్ ప్రముఖ హీరో సుమన్ , నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు జై హింద్ గౌడ్ ను హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా  మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. సుమన్ మరియు జై హింద్ గౌడ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు.

వేసవిలో తాగునీటి సరఫరా లో సమస్యల నివారణకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్


యాదాద్రి భువనగిరి జిల్లా కి ప్రధమ జిల్లా కలెక్టర్ గా విశిష్ట సేవలను అందించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనిత రామచంద్రన్ ను సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈ వేసవికాలం లో రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకి మంచినీటి సరఫరా లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి ప్రత్యేక అధికారులను నియమించారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అనిత రామచంద్రన్ ని నియమించారు.