/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఈనెల 5 న భువనగిరిలో తలపెట్టిన రైతు దీక్ష కార్యక్రమం జయప్రదం చేయాలి: రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకిరికంటి మొగులయ్య Vijay.S
ఈనెల 5 న భువనగిరిలో తలపెట్టిన రైతు దీక్ష కార్యక్రమం జయప్రదం చేయాలి: రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకిరికంటి మొగులయ్య


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వలిగొండ మండల అధ్యక్షులు బొల్ల సుదర్శన్ అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని CN రెడ్డి కాంప్లెక్స్ లో సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకరికంటి మొగలయ్యాగారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేపు రాష్ట్ర శాఖ పిలుపుమేరకు నిర్వహించ తలపెట్టిన జిల్లా కేంద్రంలో రైతు దీక్ష కార్యక్రమంను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు 6/4/ 2024 రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం మరియు అదే రోజు టిఫిన్ బైటెక్ లను బూతుల వారిగా నిర్వహించి విజయవంతం చేయాలని వారు కోరారు ,మరియు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో 45 రోజులపాటు ప్రతి బూతులలో ఇంటింటికి తిరుగుతూ బిజెపికి ఓటు వేయాలని ప్రజలను కోరాలని వారు అన్నారు అదేవిధంగా ఇంటింటికి తిరుగుతూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు స్వీకరించరో వారి ఇంటికి వెళ్లి ఓటర్లను ఓటు అభ్యర్థించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ ,జిల్లా నాయకులు సత్తయ్య గౌడ్ స్టేట్ కౌన్సిల్ మేంబర్ ఏలే చంద్రశేఖర్ ,ప్రధాన కార్యదర్శి లోడ లింగస్వామి,కిసాన్ మోర్చా జిల్లా నాయకులు కందుల తానేష గౌడ్, దయ్యాల వెంకటేష్ ,గంగదారి దయాకర్, డోగుపర్తి సంతోష్, మంద నరసింహ ,అప్పిశెట్టి సంతోష్, కొంతం రామచంద్రం ,మందాడి రంజిత్ రెడ్డి , మందుల నాగరాజు ,సంతోష్,బర్ల మల్లేశం దంతురు అరుణ్ ఎల్లంకి మురళి తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 6న తుక్కుగూడలో జరిగే తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలి : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి


ఈనెల 6 న తుక్కుగూడ లో జరిగే తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .ఘట్కేసర్ లోని ఔషాపూర్ పిపిఆర్ కన్వెన్షన్ లో గురువారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సభ సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...తెలంగాణ జన జాతర సభను విజయవంతం చేయుటకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, నియోజకవర్గం స్థాయి నాయకులు ,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 5న భువనగిరి లో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ను జయప్రదం చేయండి: వల్లాస్ రాజ్ కాళ భైరవ జిల్లా కిసాన్ మోర్చా సెక్రటరీ


భారతీయ జనతా పార్టీ భువనగిరి మండల అధ్యక్షుడు చిర్క సురేష్ రెడ్డి అధ్వర్యంలో మీడియా సమావేశం మండల పార్టీ ఆఫీసులో ఏర్పాటు చెయ్యడం జరిగింది.

ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కిసాన్ మోర్చ సెక్రటరీ వల్దాస్ రాజ్ కాళభైరవ పాల్గొనడం జరిగింది.

వల్దాస్ రాజ్ కాళభైరవ మాట్లాడుతూ ప్రస్తుత అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లి ఎన్నికల్లో రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ,రైతు భరోసా క్రింద 15000 ,రైతు కూలీలకు 12000 ,కౌలు రైతులకు 15000, msp క్రింద రైతులకు 500 బోనస్ ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం, అధికారంలోకి రాగానే ఇవ్వన్ని హామీలను అమలు చెయ్యకుండా రైతులను,ప్రజలను మోసం చేస్తుందన్నారు.

మాయమాటలతో రైతులను,ప్రజలను మోసం చేసి అధికారం చేపట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకంగా ఈ నెల 5-4-2024 రోజున భువనగిరి జిల్లా కేంద్రంలో జిల్లా కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఈ దీక్ష కీ పెద్ద ఎత్తున రైతులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు మానిక్యం రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చ సోషల్ మీడియా కన్వీనర్ కుషంగల ప్రభాకర్ ఉన్నారు

హీరో సుమన్, జైహింద్ గౌడులను మర్యాదపూర్వకంగా కలిసిన రాగిరి మల్లేష్ గౌడ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వి ఫైవ్ న్యూస్ సీనియర్ రిపోర్టర్ రాగిరి మల్లేశం గౌడ్ ప్రముఖ హీరో సుమన్ , నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు జై హింద్ గౌడ్ ను హైదరాబాదులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ వర్ధంతి సందర్భంగా  మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. సుమన్ మరియు జై హింద్ గౌడ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు.

వేసవిలో తాగునీటి సరఫరా లో సమస్యల నివారణకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేక అధికారిగా అనితా రామచంద్రన్


యాదాద్రి భువనగిరి జిల్లా కి ప్రధమ జిల్లా కలెక్టర్ గా విశిష్ట సేవలను అందించి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న అనిత రామచంద్రన్ ను సీనియర్ ఐఏఎస్ అధికారిని ఈ వేసవికాలం లో రెండు నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకి మంచినీటి సరఫరా లో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి ప్రత్యేక అధికారులను నియమించారు. అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అనిత రామచంద్రన్ ని నియమించారు.

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకి మాస్క్ తొలగించి అధికారికంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించాలి: ఎమ్మార్పీఎస్


యాదాద్రి భువనగిరి జిల్లా డాక్టర్ బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో జిల్లాలోని వివిధ మండలాల్లో గ్రామాలలో బాబు జగ్జీవన్ రామ్వి గ్రహాలకి మాస్క్ వేయడం జరిగిందని ,ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకి తక్షణమే మాస్క్ తొలగించి అధికారికంగా జయంతి కార్యక్రమాలు నిర్వహించాలని బుధవారం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బా రామకృష్ణ మాదిగ, ఎమ్మార్పీఎస్ నాయకులు ఇటికల దేవేందర్ మాదిగ ,కోళ్ల జహంగీర్, కుసంగుల కుమార్ తదితరులు పాల్గొన్నారు

.

అసిఫ్ నహర్ ప్రాజెక్టు కాలువలో నీరు లేక ... కర్షకుల గోస వర్ణనాతీతం , పట్టించుకోని పాలకులు, అధికారులు


 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నెమలి కాల్వ గ్రామంలో 1906 సంవత్సరంలో ఆసిఫ్ నహర్ ప్రాజెక్టును నిర్మించారు.ఈ ప్రాజెక్టు ద్వారానకిరేకల్ మండలం మూసి ప్రాజెక్టుల వరకుసాగునీరు అందుతుంది. రబీ సీజన్లో నాగారం గ్రామ రైతులు కాల్వ కింద వరి నాట్లు వేసి పొట్ట దశకు వచ్చే సమయంలో నీరు లేక ఎండిపోయే ప్రమాదంనెలకుంది.దీనితో రైతుల బాధలు వర్ణాతీతం. పెట్టుబడులు పెట్టిపంట పండించికోతకొచ్చే దశలో నీరు లేక ఎండిపోతున్నాయి.

అన్నిఉన్న అల్లుడు నోట్లో శని ఉన్న చందంగాకర్షకుల బాధ ఉంది. మూసిలో నీరు సమృద్ధిగా ఉన్న ఫలితం లేకపోతుంది.మూసి నీటిని కాలువలోకి రాకుండామూసిలో వదలడంతో పంట ఎండిపోతుంది. నీటిని కాల్వకు వదలాలని రైతులు నీటిపారుదల శాఖ అధికారులకు విన్నవించిన ఫలితం లేదు. స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పంటలను, కాలువలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతుల బాధలు తీర్చాలని కోర్చున్నారు.

భువనగిరిలో బిఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యక్రమం బుధవారం నిర్వహించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు, గుంతకండ్ల జగదీష్ రెడ్డి గారు బీఆర్ఎస్ అభ్యర్థి క్యమా మల్లేష్ గారు ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు  

 ఈ సందర్భంగా మాట్లాడుతూ నాయకులు మాట్లాడుతూ...

కాంగ్రెస్ అంటేనే లీక్ లు ,ఫెక్ న్యూస్ లు...పాలన గాలికొదిలేశారు కాంగ్రెస్ వాళ్లు......అక్రమ కేస్ లతో కాలయాపన చేస్తుంది... 

ఈ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటున్నాడు రేవంత్ రెడ్డి మరి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెట్టాలి.

పార్టీలో చేరికలతో కాంగ్రెస్ బిజీ అయ్యంది.. కేసీఆర్  బయటికి రాగానే రాష్ట్రంలో కాల్వల్లో నీళ్లు పారుతున్నాయ్....ఎనటికైన కేసీఆర్ గారే తెలంగాణ కు శ్రీరామరక్ష...

ఎన్నికల కోడ్ సాకుతో హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్ మోసం చేసింది.

ధాన్యం కి 500 బోనస్ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసింది. కాంగ్రెస్ కు ఓటు అడిగే హక్కు లేదు...ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాం అని మోసం చేశారు..కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను గ్రామాల్లో విడమర్చి చెప్పాలి.

కార్యకర్తలు అంతా ఉద్యమ స్పూర్తితో పోరాటం చేయాలి..

అలివి గాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసింది..

ఇవ్వాళ కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది..

కొంత మంది స్వార్ధపరులు పార్టీని వీడి పోతున్నారు.. వాళ్ళను ప్రజలు నమ్మడం లేదు.. భువనగిరి లో గెలుస్తాం...క్యామ మల్లేష్ మాస్ లీడర్...తప్పకుండా గెలుస్తారు...

స్వయానా రాహుల్ గాంధీ సంతకాన్ని ఫోర్జరీ చేసి పార్టీ నుండి సస్పెండ్ అయిన వ్యక్తి భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి చమల కిరణ్ కుమార్ రెడ్డి...ప్రశ్నించే గొంతును గెలిలించండి.....అసెంబ్లీ లో కోట్లాడాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో BRS గెలవాలి.....

సబ్బండ వర్గాలను నిలువునా మోసం చేసింది కాంగ్రెస్....

నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మోసం చేశారు....నల్ల చట్టాలు తెచ్చి రైతులను చంపిన పార్టీ బీజేపీ....మళ్ళీ అధికారంలో కి వచ్చేది BRS పార్టీనే..

కొంత మంది పార్టీ విడి పోతే ఎం నష్టం లేదు.. పార్టీ వదిలి పోయిన వారు  కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడైనా మళ్ళీ వారిని పార్టీలో చేర్చుకోమ్...ఈ భూమి ఉన్నంత కాలం BRS ఉంటుంది.

దొడ్డి కొమురయ్య స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం.... కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త


 భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య స్పూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైందని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. బుధవారం భువనగిరి అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద నిర్వహించిన దొడ్డి కొమురయ్య 97 వ జయంతి సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాటి నిజాం నవాబు ఏర్పాటు చేసుకున్న రాజాకార్ ప్రైవేటు సైన్యం, దొరలు, జామీందారుల ఆగడాలకు వ్యతిరేకంగా చేపట్టిన శాంతియుత రైతాంగ పోరాట ఉద్యమంలో దొడ్డి కొమురయ్య పై రజాకార్లు కాల్పులు జరిపి ఆయన ప్రాణాలు బలిగొన్నారని ఆయన తెలిపారు.ఆ తరువాత తెలంగాణలో గుప్తల సంఘం, సాయుధ పోరాట సంఘాలు ఏర్పడి తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేసి రజాకార్ల నుండి విముక్తి కల్గించారని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా శాంతియుతంగా జరుగుతున్న సమయంలో కాసోజు శ్రీకాంత్ చారి మరణంతో తీవ్ర రూపం దాల్చిందని ఆయన అన్నారు. తొలి అమరుల స్పూర్తితో ప్రజలు పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నారని ఆయన అన్నారు.

నేటి యువత తొలి అమరులైన దొడ్డి కొమురయ్య, కాసోజు శ్రీకాంత్ చారిల జీవిత చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేసి, భవిష్యత్తు తరాలకు అందించటానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో శ్రీ కృష్ణ యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు పుట్ట వీరేష్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి ఆనంద్ యాదవ్, యాదవ సంఘం జిల్లా నాయకులు వేల్పుల యాద మల్లయ్య యాదవ్, గుండె బోయిన వీరేష్ యాదవ్, పర్వతం కృష్ణ యాదవ్, నక్కల చిరంజీవి యాదవ్, బద్దుల అశోక్ యాదవ్, శ్రీ రాం శరత్ యాదవ్ ,రాసాల రణధీర్ యాదవ్, మాదరబోయిన నరేష్ యాదవ్, శ్రీధర్ యాదవ్ కందుల విజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 5న భువనగిరిలో జరుగు సిపిఎం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశమును జయప్రదం చేయండి; మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు


 ఈనెల 5వ తేదీన భువనగిరి పట్టణంలోని ఎస్ఎల్ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ లో జరుగు సిపిఎం నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు కోరారు

  ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో జరిగిన సిపిఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుండి సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు దీనిలో భాగంగా భువనగిరి నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

 ఈ సమావేశానికి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు బి. వెంకట్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని తెలిపారు ఈ సమావేశంలో ఎన్నికల కోసం గ్రామీణ స్థాయిలో కార్యకర్తలు పనిచేసే ప్రణాళిక రూపొందించడం చర్చించడం జరుగుతుందని తెలిపారు ఈ సమావేశానికి సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ హాజరుకావాలన్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి 500 రూపాయల బోనస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పంట ఎండిపోయిన రైతులను ఆదుకోవాలని ఎకరానికి 20వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు 

   ఈ సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు కల్కూరి రామచందర్,కూర శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి గర్దాసు నరసింహ తదితరులు పాల్గొన్నారు