/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ఈనెల 12, 13న యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఎఫ్ఐ నాల్గవ మహాసభ జయప్రదం చేయండి: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు Vijay.S
ఈనెల 12, 13న యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ఎఫ్ఐ నాల్గవ మహాసభ జయప్రదం చేయండి: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు


భువనగిరిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో SFI భువనగిరి మండల మహాసభ కుక్కుట్ల శివాని అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది, ఈ మహాసభకు ముఖ్య అతిథిగా SFI జిల్లా కార్యదర్శి వనం రాజు హాజరై మాట్లాడుతూ వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఊపిరి పోసిన ఆంధ్ర మహాసభకు కేంద్రమైన భువనగిరి పట్టణంలో ఈనెల 12 13 తేదీల్లో SFI యాదాద్రి భువనగిరి జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించుకుంటున్నాం,* కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్లను, ఫెలోషిప్ వెంటనే విడుదల చేయాలి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అవకాశవాద రాజకీయాలను ఓడించాలి,

అదేవిధంగా మతోన్మాద రాజకీయాలు చేస్తున్న బిజెపిని ఓడగొట్టే విధంగా విద్యార్థులందరూ ఏకం కావలసిన పరిస్థితి ఉందని , బిజెపి ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత విద్యను పూర్తిగా కాషాయకరణ, విద్యను ధ్వంసం చేయడం జరిగింది. విద్య అనేది అంగట్లో సరుకుగా మారింది అదేవిధంగా గత టిఆర్ఎస్ పూర్తిగా విద్యారంగాన్ని విస్మరించింది,అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమైంది విద్యారంగం అభివృద్ధి చెందే వారి పాలన విధానం కనబడుటలేదు, పెండింగ్లో ఉన్న 7200 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి, పెంచిన మెస్ కాస్మోటీ ఛార్జ్ లను వెంటనే అమలు చేయాలని, అద్దె భవనంలో ఉన్న హాస్టల్ లను సొంత బిల్డింగ్ను ఏర్పాటు చేసి నూతన గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని , విద్యారంగ సమస్యలను పరిష్కరించేలా విద్యార్థులకు సన్నగా చేయడం కోసం ఈ మహాసభలు ఎంతో తోడ్పడతాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో GMPS జిల్లా అధ్యక్షులు దయ్యాల నరసింహ SFI జిల్లా ఉపాధ్యక్షులు లావుడియా రాజు SFI మండల నాయకులు అన్నంపట్ల రమణ, కుకుట్ల శివాని, మోటే శంకర్, సల్మాన్ ముద్దంనాగరాజు,ముద్ధంమహేష్, జన నితిన్, హరిగే మని,వంశీ, తదితరులు పాల్గొన్నారు.

               

మాదిగలకు ఎంపీ టికెట్లు కేటాయించని కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్తాం : ఎంఆర్పిఎస్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద MRPS ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోకో నిర్వహించడం జరిగింది 

ముఖ్య అతిథులు

MSP ఉమ్మడి నల్గొండ జిల్లా కో ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..

 తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉంటే

అందులో ఒక్క సీటు కూడ మాదిగలకు కేటాయించక పోవడం బాధాకరం

కాంగ్రెస్ పార్టీ పూర్తిగ మాలల పార్టీ గ మారింది

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కర్కే తన మాల కులస్తులకే ఎంపీ సీట్లు కేటాయిస్తున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా మాలల చేతుల్లో బంది అయ్యాడు...

మాదిగల జనాభా 75% ఉన్న ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా మాదిగలను అణిచివేతకు గురి చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క మాదిగ బిడ్డను కూడా ఎదగనీయకుండా నేను మాదిగనని చెప్పుకుంటూ కడియం శ్రీహరి తన రాజకీయ జీవితము అంచలంచలుగా ఎదుగుకుంటూ ఇపుడు వరంగల్ పార్లమెంట్ ఎంపీ సీటు తన కూతురికి కావ్యకు ఇప్పించడం మాదిగలకు బాధాకరం.

మాదిగ కులస్తులు 100% కడియం కావ్యను మాదిగ పల్లెలలో మాదిగ గ్రామాలలో మండల కేంద్రంలో నియోజకవర్గం లో జిల్లా కేంద్రంలో రానీయమని ఓడిస్తామని మాట్లాడడం జరిగింది

ఈ కార్యక్రమంలో.... దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ మంద శంకర్ మాదిగ ఇటుకల దేవేందర్ మాదిగ బూడిద జాన్ కుసంగల కుమార్ బోడ సునీల్ బొజ్జ సైదులు కొమర స్వామి ఇరుగు శ్రీశైలం కిషోర్ రాజశేఖర్ రమేష్ రాజు ప్రసాద్ ప్రశాంత్ శ్రీకాంత్ శీను బాలయ్య తదితరులు పాల్గొన్నారు

ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి: ఏఐటియూసి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 భువనగిరిలో స్వర్ణగిరి మానేపల్లి హిల్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నూతనంగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తెలిపారు.

     మంగళవారం రోజున స్వర్ణగిరి ఆటో డ్రైవర్స్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నూతనంగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా 100 మంది ఆటో డ్రైవర్లు ఏఐటీయూసీలో చేరారు. ఈ సందర్బంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ వారిని సాధారణంగా యూనియన్ లోకి ఆహ్వాణించడం జరిగింది. అనంతరం అయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం లో ఆటోలకు పార్కింగ్ స్థలం కేటాయించాలని, భువనగిరి కొత్త బస్టాండ్ లో ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో రవాణా రంగం లో సుమారుగా 15 లక్షల మంది ఆటో మీద ఆధారపడి జీవిస్తున్నారని, గత ప్రభుత్వాలు ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో, చాలా మంది డిగ్రీలు, ఉన్నత చదువులు చదివి ఉపాధి దొరకకపోవడంతో కుటుంబాన్ని పోషించడం కోసం అప్పులు చేసి ఆటోలు కొనుక్కొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిపించడంతో ప్రయాణికులు ఆటోలు ఎక్కకపోవడంతో ప్రస్తుతం రోజుకు 200 నుండి 300 మాత్రమే సంపాదించడంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. దీనివలన ప్రతినెలా ఫైనాన్స్ కట్టలేక మానసికంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఫైనాన్స్ కట్టలేక ఆటోలను కోల్పోయే ప్రమాదం ఉన్నదని అన్నారు. ఆటో డ్రైవర్లకు జీవనభృతి కింద నెలకు రూ.10,000/- ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విదంగా ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డ్ వెంటనే ఏర్పాటు చేయాలని,  డిమాండ్ చేశారు.

 అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది 

అధ్యక్షులు:- తారాల ఉపేందర్ 

 ఉపాధ్యక్షులు:- గోపరాజు గణేష్ , బింగి సురేష్ 

 ప్రధాన కార్యదర్శి:- మర్రి శివ 

 సహాయ కార్యదర్శులు:- మాటూరి దుర్గ, బోడ స్వామి 

కోశాధికారి :- ఎడ్ల నరేందర్

వర్కింగ్ ప్రెసిడెంట్ :- ఎండీ ఇమ్రాన్ 

 గౌరవ సలహా దారులు:- సామల శోభన్ బాబు,

గనబోయిన వెంకటేష్,

సామల భాస్కర్ 

గౌరవ అధ్యక్షులు :- గొర్ల లక్ష్మణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు యువత పునరంకితం కావాలి : పంజాల జైహింద్ గౌడ్ నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు


 నిజమైన స్నేహానికి ప్రతిరూపం , యువతకు ఆదర్శం, మతసామరస్యానికి ప్రతీకైన సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ను నేటి యువత ఆదర్శంగా తీసుకుని బహుజన రాజ్యాన్ని స్థాపించాలని నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షులు పంజాల జైహింద్ గౌడ్, పాపన్న యువసేన జాతీయ కన్వీనర్ పరిటాల రవి గౌడ్ లు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక భువనగిరి కోట వద్ద జరిగిన సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ 314 వ వర్థంతి సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపన్న గౌడ్ స్నేహితున్ని అప్పటి ఔరంగజేబు సైన్యం తీవ్రంగా కొడుతుంటే తాను వీరసైనికునిగా మారి నలుగురు ఔరంగజేబు సైనికులను హతమార్చాడని వారన్నారు.ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి నాలుగువేల మంది యువకులను సమీకరించి పాపన్న గౌడ్ ప్రైవేటు సైన్యాన్ని తయారుచేసుకొని ఆనాటి అన్యాయాలను, అక్రమాలను ఎదిరించాడని వారన్నారు.

ఒక ముస్లిం అమ్మాయి తనని ఇష్టపడుతుందని తెలుసుకొని,ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని మతసామరస్యానికి ప్రతీకైనాడని, ఆమె సోదరుని సాయంతో భువనగిరి కోటను స్వాధీనం చేసుకుని ప్రజారంజకంగా పరిపాలించి చరిత్ర సృష్టించిచాడని, ఆతర్వాత గోల్కొండ కోట పై దండయాత్ర చేసి విజయం సాధించిన పాపన్న గౌడ్ బహుజన రాజ్యం జెండాను గోల్కొండ కోట పై ఎగురవేసాడని వారు తెలిపారు. గత పాలకులు సర్థార్ సర్వాయి పాపన్న చరిత్రను కనుమరుగు చేసారని,ఆ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించటానికి నేటి యువత కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ వర్థంతి కార్యక్రమంలో భువనగిరి మాజీ కౌన్సిలర్ దేవరకొండ సత్యనారాయణ, సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, పాపన్న మోకుదెబ్బ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బత్తుల గణేష్ గౌడ్, ప్రజా సంఘాల నాయకులు ఎర్ర శివరాజ్, గోపరాజు వెంకటేష్, మధు తదితరులు పాల్గొన్నారు

కమ్మ గూడెం సమీపంలోని ఆర్బిఆర్ ఫంక్షన్ హాల్ వద్ద, నగదు పట్టుకున్న వలిగొండ పోలీసులు


పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీల్లో భాగంగా వలిగొండ మండలం కమ్మ గూడెం సమీపంలోని ఆర్బిఆర్ ఫంక్షన్ హాల్ వద్ద వలిగొండ ఎస్సై డి మహేందర్ ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఎన్నికల నిబంధనల మించి నగదు తీసుకువెళ్తున్న గర్దాసు శివకుమార్ నుండి 5,04,569 డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఎన్నికల నిబంధనలో భాగంగా ఒక వ్యక్తి 50 వేలకు మించి తీసుకువెళ్లకూడదని ఒకవేళ నిబంధనల గురించి తీసుకువెళ్తున్నట్లయితే సరైన ధ్రువపత్రాలను సమర్పించాలని తెలిపారు.

చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ విజేతలకి బహుమతులు అందజేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి


చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ లో విజేత నిలిచిన వారికి మొదటి బహుమతి రూ 1,00,000 రెండవ బహుమతి 50,000రూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరియు ప్రజల మనిషి రాజన్న అందజేయడం జరిగింది.

చౌటుప్పల పట్టణ కేంద్రంలోని తంగడపల్లిలో 

ముస్కు మధుసూదన్ రెడ్డి స్టేడియంలో జరిగినటువంటి

చౌటుప్పల్ ప్రీమియర్ లీగ్ లో విజేత నిలిచిన వారికి మొదటి బహుమతి రూ 1,00,000/- రెండవ బహుమతి 50,000/-రూ

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అందజేయడం జరిగింది.

ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ స్పాన్సర్స్ మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ వెన్ రెడ్డి రాజు గారు,ZPTC చిలుకూరి ప్రభాకర్ రెడ్డి,Mpp తాడూరి వెంకట్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకులు పబ్బు రాజు గౌడ్ .

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి,మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నరసింహ గౌడ్, సింగల్ విండో చైర్మన్ చెన్నగొని అంజయ్య, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, అంతటి బాలరాజు, సందగళ్ళ సతీష్, మోగదాల రమేష్, బాలు మహేంద్ర, రావుల స్వామి, కొండూరు వెంకన్న తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

ఆర్థిక సహాయం అందజేసిన గోలిగూడెం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల మదిరె గోలిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు ఆదివారం రోజున అనారోగ్య కారణాలతో వేముల లక్ష్మమ్మ మరణించగా వారి కుటుంబానికి అంత్యక్రియల నిమిత్తం 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గోలిగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు కంచి రాములు, పులిగిల్ల గ్రామ శాఖ అధ్యక్షుడు బుగ్గ వెంకటేశం, బుగ్గ మనోజ్, బండారు మైసయ్య, కొంతం తిరుమల్ రెడ్డి, భోగ రమేష్, వేముల అమరేందర్, పర్వతం రాజు, పల్సం భాస్కర్, పల్లెర్ల స్వామి, పల్లెర్ల యాదగిరి, కళ్లెం జంగారెడ్డి, మంద రవి, వేముల అశోక్, తేర్యాల మల్లయ్య, రామోజీ, కంబాలపల్లి పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

నవోదయ సీటు సాధించిన పవిత్రాత్మ పాఠశాల విద్యార్థి బుర్ర జతీన్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రములోని పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న అరూరు గ్రామానికి చెందిన బుర్ర వాసుదేవ్ విజయాల కుమారుడు బుర్ర జతీన్ 2024 -25 విద్యా సంవత్సరానికి గాను జవహర్ నవోదయ విద్యాలయం చలకుర్తిలో సీటు పొందారు. ఈ సందర్భంగా వలిగొండ లోని పాఠశాల యాజమాన్యం విద్యార్థికి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తామని తెలిపారు. బాగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వాళ్ళ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కోరుతున్నారు.

మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ


భువనగిరి : రంజాన్ పవిత్ర మాస ఉపవాసా దీక్షలు పాటిస్తున్న నిరుపేద ముస్లిం కుటుంబాల కు మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ సౌజన్యంతో రెండవ రోజు సోమవారం మైనార్టీ వెల్ఫేర్ సొసై టీ జిల్లా అధ్యక్షులు ఇంతియాజ్ అహ్మద్,ఇస్తి యాక్ అహ్మద్ ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్ మసీదు వద్ద నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక మదర్ థెరిస్సా హైస్కూల్ కరస్పాండెంట్ సురేష్ కుమార్ మాట్లా డుతూపవిత్ర రంజాన్ మాసంలో నిరుపేద ముస్లిం కుటుంబాల సంక్షేమాన్ని దృష్టియందుం చుకొని స్వచ్ఛందంగా నిత్యవసరాలు పంపిణీ చేస్తున్న ఇంతియాజ్ అహ్మద్, ఇస్తియాక్ అహ్మద్ లు చేస్తున్న సామాజిక సేవలను గుర్తించి అభి నందించారు.భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.దీనికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు.

అనంతరం ఇంతియాజ్ మాట్లాడుతూ నిరుపేద ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏటా మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ సహకారంతో నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరుగు తుందన్నారు. ప్రతి ఏటాలాగే ఈసారి కూడ మేరాజ్ గ్రూప్ వారి సౌజన్యంతో ఇప్పటికే ఆదివారం రెండు లక్షల రూపాయల విలువగల నిత్యవసర సరు కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా సోమవారం రెండవ విడతలో భాగంగా పట్టణంలోని పేద ముస్లిం కుటుంబాల కు ఒక్కొక్కరికి 3000.రూపాయల రంజాన్ తోఫా కిట్టును మరో రెండు లక్షల రూపాయల తో నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగిందన్నారు . తమపై ఎంతో నమ్మకంతో ప్రతి ఏటా భువనగిరి పట్టణంలోని నిరుపేద ముస్లిం కుటుంబాలకు తమ వంతు సహాయంగా నిత్యవసర సరుకులు అందజేస్తున్న మేరాజ్ గ్రూప్ ఆఫ్ హైదరాబాద్ చైర్మన్ నదీమ్ ఖాన్ కు ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. పవిత్రమైన రంజాన్ మాసంలో పేదలను గుర్తించి వారికీ తమకు తోచిన సహాయం అందించాలన్నదే తమ లక్ష్య మన్నారు.ఈ కార్య క్రమంలో టీజేయు జిల్లా అధ్యక్షుడు ఎండి శానూర్ బాబా,మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండీఇస్తియాక్ అహ్మద్,సయ్యద్ రఫీఖ్ అహ్మద్,ఎండీ కామ్రాన్ హుస్సేన్,ఎండీ సలీం ఎండీ గయాజ్ అహ్మద్ ఎండీ సిరాజ్, ఎండీ మొఖ్తార్,అహ్మద్,ఆదిల్ రాషేద్,షకీల్,రెయ్యాన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి : పల్ల గొర్ల మోదీ రాందేవ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు


 భువనగిరి SV హోటల్లో నిర్వహించిన సమావేశంలో  విద్యార్థుల ఫీజు రీయింబర్స్ స్కాలర్షిప్ బకాయిలు 7200 కోట్లు విడుదల చేయాలి లేనియెడల కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదు అన్నారు బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ 100 రోజుల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓడు మీద ఉన్నప్పుడు ఓ మల్లన్న ఒడ్డు దిగాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉన్నది ఈ ప్రభుత్వ పరిస్థితి 100రోజుల్లో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ విగ్రహాలు వచ్చినాయి గాని విద్యార్థుల సమస్యలు తీరలేదు లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన bjp 6,brs 4, కాంగ్రెస్ పార్టీ బీసీలకు 2 టికెట్లు కేటాయించడం సిగ్గుచేటు అన్నారు అన్ని పార్టీలు బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించాలన్నారు బీసీ కార్పొరేషన్లను 56కు పెంచాలన్నారు తక్షణమే ఫీజు రీయిమెంట్స్ స్కాలర్షిప్ విద్యార్థుల సమస్యలు మరియు అన్ని రంగాల సమస్యలు పరిష్కరించాలన్నారు లేకుంటే లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం తప్పదు అన్నారు *ఈ సమావేశంలో ప్రజాసంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య,ఉపసర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షులు రాసాల యాదయ్య గౌడ్, నల్లమాసం నాదం, ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల అధ్యక్షులు పరధిన్,మనోజ్,మురళి, యూసన్, హాయ్ కిరణ్, మల్లేష్, ఫణి తదితరులు పాల్గొన్నారు.