/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్న, పార్టీ మారే ప్రసక్తే లేదు: మేడి ప్రియదర్శిని నకిరెకల్ నియోజకవర్గం ఇన్చార్జి Vijay.S
బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్న, పార్టీ మారే ప్రసక్తే లేదు: మేడి ప్రియదర్శిని నకిరెకల్ నియోజకవర్గం ఇన్చార్జి

బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నా...

- ఎలాంటి ఘటనలు జరిగిన పార్టీ మారే ప్రసక్తే లేదు...

- బీఎస్పీ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ...

- నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని

 ఎవరెన్ని ఆశలు పెట్టిన తలోగ్గేది లేదని, బహుజన వాదం కోసమే కట్టుబడి ఉన్నానని నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శిని అన్నారు. బహుజన వాదం అని చెప్పి, నమ్ముకున్న కార్యకర్తలను నట్టింట ముంచి మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని అన్నారు. శుక్రవారం నాడు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీలలో నాయకులు వస్తుంటారు, పోతుంటారు నకిరేకల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఎవరు అదైర్య పడొద్దని, అందరికీ వెన్నంటుగా ఉండి, అండగా ఉంటానని బీఎస్పీ పార్టీ నియోజకవర్గం ఇంఛార్జి మేడి ప్రియదర్శిని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు పావిరాల నరసింహ యాదవ్,నియోజకవర్గ చేరికల కమిటీ కన్వీనర్స్ మునుగోటి సత్తయ్య, చెరుకుపల్లి శాంతి కుమార్, చిట్యాల మండలం అధ్యక్షులు జోగు శేఖర్, రామన్నపేట మండల ఉపాధ్యక్షులుగుని రాజు,ప్రధాన కార్యదర్శి నకిరేకంటి నరసింహ, మండల కోశాధికారి గట్టు రమేష్,మండల మహిళా కన్వీనర్,బందెల అనిత, నాయకులు బాలాగోని మల్లయ్య గౌడ్,బుస్సు శ్రీకాంత్,రవి,యోగి, రామ్ కుమార్ బిఎస్పి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పోచంపల్లి మండలంలో నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులను పరామర్శించిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి


పోచంపల్లి మండలం అంతమ్మ గూడెం మరియు దోతిగుడెం గ్రామంలో పొలాలలో నీళ్లు లేక ఎండిపోయిన సందర్భంగా రైతులను పరామర్శించిన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ సభ్యులు శ్రీ గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ నాయక్, బుడద బిక్షమయ్య గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి గారు, కొలుపుల అమరేందర్, జడ్పీటీసీ శ్రీమతి కోట పుష్పలత మల్లారెడ్డి గారు, పోచంపల్లి ఎంపీపీ శ్రీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి గారు,వైస్ ఎంపీపీ శ్రీ పాక వెంకటేష్ గారు, PACs చైర్మెన్ శ్రీ భూపాల్ రెడ్డి గారు, BRS మండల పార్టీ అధ్యక్షులు శ్రీ పాటి సుధాకర్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శ్రీ మహిపాల్ రెడ్డి గారు, శ్రీ సుధాకర్ రెడ్డి గారు, దోతిగూడెం మాజీ సర్పంచ్ శ్రీ రామ్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ గ్రామ నాయకులు పాల్గొన్నారు.

భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శిగా మందుల నాగరాజు నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం రోజున భారతీయ జనతా పార్టీ మండల కార్యాలయంలో జరిగిన సమావేశంలో మండల శాఖ కార్యదర్శిగా నాగారం గ్రామానికి చెందిన మందుల నాగరాజును మండల పార్టీ అధ్యక్షులు బోళ్ల సుదర్శన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సి ఎన్ రెడ్డి జిల్లా కార్యదర్శి కొప్పుల యాది రెడ్డి భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి రాచకొండ కృష్ణ సమక్షంలో నియామక పత్రం అందజేసారు. ఈ నియామక పత్రం అందుకున్న మండల కార్యదర్శి మందుల నాగరాజు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మండల కార్యదర్శిగా నియమించిన జిల్లా కార్యదర్శి కొప్పుల యాదిరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాయకులు సీఎన్ రెడ్డి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కన్వీనర్ బందారపు లింగస్వామి రాచకొండ కృష్ణ మారోజు అనిల్ కు ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వలిగొండ మండలంలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి తన వంతు బాధ్యతగా కృషి చేస్తానని ఆయన అన్నారు.

భువనగిరి పార్లమెంట్ స్థానాన్ని అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే కేటాయించాలి: మండల బీసీ సంఘం అధ్యక్షుడు సాయిని యాదగిరి డిమాండ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో గురువారం రోజున మండల బీసీ సంఘం నాయకులు సాయిని యాదగిరి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా అన్ని రాజకీయ పార్టీలు బిసి నాయకులకే కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలకు ఆయన డిమాండ్ చేశారు బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలలో బీసీలకు కాకుండా రెడ్డి సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని బీసీలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో బీసీ అభ్యర్థికి పార్లమెంటు స్థానాన్ని కేటాయించి నట్లయితే బిసిలు బీసీ నాయకులను గెలిపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని రాజకీయ పార్టీ నాయకులకు డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నా ఓసీలకు సీట్లు కేటాయించడం వలన ఓట్లు వేసేది బీసీలు నాయకులుగా ఎన్నుకోబడేది ఓసీలా అని ఆయన ప్రశ్నించారు. బీసీ నాయకులకు అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ టికెట్ ఇవ్వకుంటే బీసీల సత్తా ఏమిటో రాజకీయ పార్టీలకు చూపిస్తామని ఆయన అన్నారు.

భువనగిరి పార్లమెంటులో సిపిఎం ను గెలిపించండి: సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు


యాదాద్రి భువనగిరి జిల్లా: రాజకీయాల్లో విలువలు బ్రష్టు పడుతున్న కాలంలో వాటిని కాపాడడానికి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ సుత్తి కొడవలి నక్షత్రం పై ఓటు వేసి ప్రజలు గెలిపించాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు విజ్ఞప్తి చేశారు. గురువారం భువనగిరి లో సుందరయ్య భవన్లో సిపిఎం అభ్యర్థి ఎండి జాంగిర్ తో కలిసి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర కమిటీ ఇలా నిర్ణయం మేరకు భువనగిరిలో సిపిఎం పోటీ చేస్తుందని అన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని భువనగిరి, జనగామ, ఇబ్రహీంపట్నం, ఆలేరు ,మునుగోడు ,తుంగతుర్తి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో కమ్యూనిస్టు ఉద్యమాలకు కేంద్రాలని అన్నారు .గతంలో నకిరేకల్, తుంగతుర్తి, మునుగోడు, ఆలేరు ,భువనగిరి ఇబ్రహీంపట్నంలో కమ్యూనిస్టులు గెలిచారని గుర్తు చేశారు. ఈ ప్రాంత ప్రజల సమస్యలను పార్లమెంటులో గత అభ్యర్థులు ప్రస్తావించక పోయారన్నారు. కమ్యూనిస్టులు మాత్రమే ప్రస్తావిస్తారని తెలిపారు.

మిగతా రాజకీయ ప్రక్షాలు చేసే రాజకీయ జిమ్మిక్కులను ప్రజలు గందరగోళం పడకుండా ఎంతో చైతన్యవంతంగా ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడుతున్న కమ్యూనిస్టులను సిపిఎం ను గెలిపించాలని కోరారు . ఎండి జహంగీర్ యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన వారిని, గత 35 సంవత్సరాలుగా సిపిఎం సభ్యత్వం తీసుకొని 32 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా పనిచేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులకు నరసింహ బట్టుపల్లి అనురాధ జిల్లా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు దోనూరు నర్సిరెడ్డి కల్లూరు మల్లేశం దాసరి పాండు మంగ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగరిగారి ప్రీతం ను సన్మానించిన దర్గాయి హరిప్రసాద్


తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన పిసిసి ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నాగరి గారి ప్రీతం గారిని ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షులు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలు పట్టణాల నుండి విచ్చేసిన ఎస్సి విభాగం నాయకులు కార్యకర్తలు గాంధీభవన్ లో జరిగిన అభినందన సభలో సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా దర్గాయి హరిప్రసాద్ మాట్లాడుతూ......

పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, దళిత వ్యతిరేక విధానాలపై ప్రాణాలకు తెగించి పోరాడి ఎన్నో కష్టాలను నష్టాలను కేసులను అనుభవించి అధిష్టానం ఆదేశం మేరకు శాసనసభ టికెట్ కూడా త్యాగం చేసిన ప్రితమన్న గారికి న్యాయం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం హర్షనీయమని ప్రితమన్న గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద దళిత కుటుంబాలలో వెలుగులు చూస్తామని దళిత కుటుంబాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత ప్రితమన్న తీసుకుంటాడని ప్రితమన్న గారు భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని యాదాద్రి భువనగిరి జిల్లా లో ఉన్న తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన లక్ష్మీనరసింహస్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదం స్వామివారి చిత్రపటం శాలువాలు అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ విభాగం కన్వీనర్ నాగారం శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు కొండాపురం గణేష్, గోపి శ్రీనివాస్, చిలుకా కిష్టయ్య,మల్లేష్, సోమన్న, ఊదరి శ్రీనివాస్, బింగి శ్రీనివాస్, కుక్క బాల నరసింహ, సన్నాయిల రఘు, ఎనుతుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండ మండల మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బొలుగుల భాగ్యమ్మ నియామకం


 

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ఆరూరు గ్రామానికి చెందిన బోలుగుల భాగ్యమా బిజెపి పార్టీకి ఆమె సేవ చేసినందుకు అధిష్టానం గుర్తించి ,వలిగొండ మండలం మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ... వలిగొండ మండలం బిజెపి పార్టీ అధ్యక్షులు బోల్ల సుదర్శన్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేసినారు. ఈ సందర్భంగా బొలుగుల భాగ్యమ్మ మాట్లాడుతూ...

పార్టీ కోసము అహర్నిశలు కృషి చేస్తానని, పార్టీ బలోపేతము చేసే దిశగా ప్రయాణిస్తానని మాట్లాడినారు.

 ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి మండల అధ్యక్షుడు బోళ్ళ సుదర్శన్ ఆధ్వర్యంలో నూతన మండల కమిటీ ఎంపిక


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండలం అధ్యక్షులు బోల్ల సుదర్శన్ ఆధ్వర్యంలో గురువారం నూతన మండల కమిటీ పదాధికారులు ఎన్నిక కావడం జరిగింది .మండల బిజెపి ప్రధాన కార్యదర్శులుగా మారోజు అనిల్ కుమార్ , లోడే లింగస్వామి ,ఉపాధ్యక్షులుగా దయ్యాల వెంకటేష్, డోగిపర్తి సంతోష్, గంగాదారి దయాకర్, వేల్పుల కొమరెల్లి, రుద్రపల్లి మచ్చ గిరి ,రావుల పద్మా రెడ్డి, కార్యదర్శులుగా మైసోల్ల చిన్న మత్స్యగిరి బైరు మల్లేశం, మందుల నాగరాజు ,చిలకమర్రి లావణ్య, కొండపర్తి రాజేష్, గంగాపురం నరేష్ ,కోశాధికారిగా అప్పిశెట్టి సంతోష్, బీజేవైఎం మండల అధ్యక్షులుగా మందాడి రంజిత్ రెడ్డి, మహిళా మోర్చా అధ్యక్షురాలుగా చిన్నం అంజమ్మ, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బొలుగుల భాగ్యమ్మ ,ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా వెలిమినేటి వెంకటేశం ,కిసాన్ మోర్చా అధ్యక్షులుగా కొత్త రామచంద్రం, దళిత మోర్చా అధ్యక్షులుగా పల్లెర్ల నరసింహ,మండల సోషల్ మీడియా కన్వీనర్ గా రాస శ్రీశైలంలను నియమించడం జరిగింది వారందరికీ అద్యక్షులు బోల్ల సుదర్శన్ నియామక పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు CN రెడ్డి ,పార్లమెంట్ కన్వీనర్ బందారపు లింగస్వామి, జిల్లా సెక్రెటరీ కొప్పుల యాదిరెడ్డి అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,BJYM జిల్లా సెక్రటరీ రేగూరి అమరేందర్ ,కనతల అశోక్ రెడ్డి, శీలోజు శ్రీరాములు, బచ్చు శ్రీనివాస్, కందుల తానేష గౌడ్ మంద నరసింహ, బందారపు రాములు బుంగమట్ల మహేష్,దంతూరి అరుణ్ ,ఏర్రబొలు జంగయ్య, బర్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో బుధవారం వల్లమల పెద్ద నర్సింహ మృతి చెందడంతో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సౌజన్యంతో కుంభం ప్రేమలత శ్రీనివాస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5,000 రూపాయలు వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో  గ్రామశాఖ అధ్యక్షుడు పీసరి వెంకట్ రెడ్డి ఉపాధ్యక్షుడు కొంత ఎల్లగౌడ్ ,బిక్షపతి , కార్యదర్శి చిన్నం స్వామి , కందాటి సోమిరెడ్డి , అరూరు నరసింహ ,వెంకటయ్య ,అంజయ్య ,చాంద్ పాషా ,లక్ష్మీనర్సయ్య ,తదితరులు పాల్గొనడం జరిగింది.

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీబీనగర్ జడ్పిటిసి


యాదాద్రి భువనగిరి జిల్లా  స్త్రీ, శిశు సంక్షేమ స్థాయి సంఘం చైర్మెన్ బీబీనగర్ జడ్పీటిసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి దంపతులు, బీబీనగర్ మాజీ సర్పంచ్ మల్లగారి భాగ్యలక్ష్మి శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గురువారం ఉదయం హైదరాబాదులో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మరో వంద మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ లో చేరారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తున్నందుకే కాంగ్రెస్ లో చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొట్టోల్ల శ్యామ్ గౌడ్, బీబీనగర్ మండల నాయకులు ,కార్యకర్తలు ,తదితరులు పాల్గొన్నారు.