/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హైదరాబాద్ జిల్లాలలో విస్తృత తనిఖీలు Yadagiri Goud
హైదరాబాద్ జిల్లాలలో విస్తృత తనిఖీలు

ఎన్నికల నోటిఫికేషన్‌ విడు దలైన నేపథ్యంలో ఎన్‌ఫో ర్స్‌మెంట్‌ బృందాలు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ప్రత్యేక నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా పోలీస్‌, ఎస్‌. ఎస్‌.టి, ఎఫ్‌.ఎస్‌.టి టీమ్‌లు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

నగరంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 24 గంటలపాటు 9 టీంలు పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో మూడ్రోజుల్లోనే రూ.35లక్షలకుపైగా స్వాధీనం చేసుకున్న ఈ బృందాలు, విలువైన వస్తువులను సీజ్‌ చేశాయి. మంగళవారం ఒక్కరోజే రూ.16,43,300తోపాటు రూ.10,250 విలువగల వస్తువులను సీజ్‌ చేశారు.

హైదరాబాద్‌ జిల్లాలో ఎఫ్‌. ఎస్‌.టీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు రూ.9,30,000 సీజ్‌ చేయగా, పోలీసులు మరో రూ.7,13,300ను పట్టుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం రూ.17,25, 311 విలువగల వస్తువుల ను పట్టుకున్నారు. 54.67 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని.. 8 మందిని ప్రోహిబిషన్‌ కేసుల్లో అరెస్టు చేశారు.

మంగళవారం నగదు, ఇతర వస్తువులపై 5 ఫిర్యాదులు రాగా.. పరిశీలించి పరిష్క రించారు. ఇప్పటి వరకు వరకు 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.

ఏపీ, తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు, పరీక్ష ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష ఫలితాలు..

ఏపీ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం

ఏపీ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో

ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షలు: మే 13 నుంచి19 వరకు

ఏపీ డీఎస్సీ 2024 పరీక్షలు: మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు

తెలంగాణలో ఉద్యోగ పరీక్షలు :పరీక్ష ఫలితాలు

తెలంగాణ పదో తరగతి 2024 ఫలితాలు: మే 2వ వారం

తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు: ఏప్రిల్‌ చివరిలో

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలు: జులై 17 నుంచి 31 వరకు

తెలంగాణ టెట్‌ 2024 పరీక్షలు: మే 20 నుంచి జూన్‌ 3వ తేదీ వరకు

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జూన్‌ 9, 2024.

టీఎస్సీయస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీ: అక్టోబర్‌ 21, 2024.

తెలంగాణ ఈఏపీసెట్ 2024 పరీక్ష తేదీలు: మే 9 నుంచి 12 వరకు

తెలంగాణ RDC CET-2024 పరీక్ష: ఏప్రిల్ 28, 2024.

తెలంగాణ పీజీఈసెట్‌ – 2024 పరీక్ష తేదీ: జూన్‌ 6 నుంచి జూన్‌ 9 వరకు, 2024.

తెలంగాణ ఐసెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 4, 5 తేదీల్లో, 2024

తెలంగాణ లా సెట్‌-2024 పరీక్ష తేదీ: జూన్‌ 3, 2024

అఖిల భారత ప్రవేశ పరీక్షల తేదీలు

సీయూఈటీ (యూజీ) – 2024 ప్రవేశ పరీక్ష: మే 15 నుంచి 31 వరకు, 2024.

నీట్‌ యూజీ 2024 పరీక్ష ఫలితాల తేదీ: జూన్‌ 14, 2024

తెలుగు రాష్ట్రాల్లో వేసవి సెలవులు..

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇచ్చే అవకాశం ఉంది.

యోగా బాబాకు నోటీసులు ; కోర్టుకు హాజరుకండి

కోర్టు ధిక్కరణ కేసులో న్యాయస్థానం ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని యోగా గురు రాందేవ్‌ బాబాను, ఆయన యాజమాన్యంలోని పతం జలి ఆయుర్వేద్‌ సంస్థ ఎండీ ఆచార్య బాలకృష్ణను సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది.

ఆరోగ్య రక్షణకు సంబంధిం చి పత్రికలలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారంటూ వీరిద్దరిపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ మోసపూరిత ప్రకటనలు ఇస్తున్నారంటూ పతంజలిపై గతంలో ఫిర్యాదులు వచ్చాయి.

వీటిపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సంద ర్భంగా ఇకపై అలాంటి ప్రకటనలు ఇవ్వబోమని ఆ సంస్థ హామీ ఇచ్చింది. అయితే దానిని విస్మరించి, మీడియాలో ప్రకటనలు కొనసాగిస్తూనే ఉన్నారని న్యాయస్థానం తాజాగా అభిప్రాయపడింది.

1954వ సంవత్సరపు డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమిడీస్‌ అభ్యంతరకర ప్రకటనలు చట్టంలోని సెక్షన్‌ 3, 4ను రాందేవ్‌, బాలకృష్ణ ఉల్లంఘించారనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని న్యాయమూ ర్తులు హిమా కోహ్లీ, అహ్స నుద్దీన్‌ అమానుల్లా తెలిపారు.

వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై సమాధానమివ్వాలని వారి ద్దరినీ జస్టిస్‌ కోహ్లీ ఆదేశిం చారు. రాందేవ్‌, బాలకృష్ణ లకు ఫిబ్రవరి 26న సుప్రీం కోర్టు కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది.

ఆరోగ్య సంరక్షణకు సంబం ధించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తున్నారని అందులో తెలిపింది. గుండె జబ్బులు, ఆస్థమా వంటి వ్యాధులను నయం చేస్తామంటూ ఆధారాలు లేని వాదనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ వ్యాధులకు సంబంధిం చిన ఔషధాల గురించి ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఆ వ్యాపార ప్రకటనలను తొలగించడానికి తీసుకున్న చర్యలేమిటో తెలియజేస్తూ అఫిడవిట్‌ సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

గత సంవత్సరం నవంబ ర్‌లో కూడా పతంజలి ఆయుర్వేదపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆధునిక వైద్యానికి వ్యతిరేకంగా తప్పుదోవ పట్టించే వాదనలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఇలాంటి ప్రచార కార్యకలాపాలను కొనసాగిస్తే కోటి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ఇక లేనట్లే

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరుగుతు న్నాయి..

కాగా, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు రద్దయ్యాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సెలవులను నిషేధిస్తూ జిల్లా ఎన్నికల అధికారులు, కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.

ఎన్నికలకు సంబంధించిన ఉత్తర్వులు, మెయిల్స్‌, ఇతర సమాచారాన్ని అందించేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సెలవు దినాల్లో కూడా పని చేయాలని సూచించారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వస్తాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎండల వేళ.. ఉరుముల వాన

_ఎండల వేళ_.. _ఉరుముల వాన_

_రాష్ట్రంలో నాలుగు రోజులపాటు భిన్న వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణతాపం, ఉక్కపోతతో పాటు తేలికపాటి వర్షాలు కురువనున్నట్లు అంచనా వేసింది._

_కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అసౌకర్య వాతావరణం ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మార్చి నెలలో ఇలాంటి వాతావరణం అరుదుగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు._

నేడు కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్,లోకి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. సోమవారం బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరను న్నట్లు ఎక్స్ వేదికగా ప్రవీణ్‌ కుమార్ ప్రకటించారు.

తన రాజకీయ భవితవ్యంపై ఆదివారం వందలాది శ్రేయో భిలాషులు, ఆప్తులు, అభి మానులందరితో మేధోమ ధనం జరిపానని పేర్కొ న్నారు.

ఆ సభలో రకరకాల అభిప్రా యాలు వచ్చాయని, కానీ తన మీద నమ్మకంతో తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంటనే నడుస్తామని మాట ఇచ్చిన అందరికీ ఎక్స్ వేదిక గా ప్రవీణ్‌కుమార్ హృదయ పూర్వక ధన్య వాదాలు తెలిపారు.

తెలంగాణ విశాల ప్రయో జనాలను దృష్టిలో ఉంచు కొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను సోమవారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నానని వెల్లడించారు.

తాను ఎక్కడున్నా బహు జన మహనీయుల సిద్దాం తాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటానని, వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తానని స్పష్టం చేశారు.

దయచేసి నిండు మనస్సు తో ఆశ్వీరదించండి…జై భీం..జై తెలంగాణ..జై భారత్ అంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ట్వీట్ చేశారు.

సుప్రీం కోర్టుకు ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్

ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత అక్రమ అరెస్టును సవాల్‌ చేస్తూ సోమవారం ఆమె భర్త అనిల్‌ సుప్రీంకోర్టులో కంటెంప్ట్‌ అఫిడవిట్‌ వేయనున్నారు.

ఈ నెల 19న కవిత కేసు విచారణకు రానున్న నేప థ్యంలో ఈడీ ఆమెను అక్ర మంగా అరెస్టు చేసిందని, అది సుప్రీంకోర్టు గతంలో జారీచేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సర్వో న్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నారు.

కాగా, ఆదివారం ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారిం చారు.ఇప్పటికే కవిత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణలో ఉంది.

ఆ పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఈడీ అధికారు లు కవితను అరెస్ట్ చేయ డం నిబంధనలను విరుద్ధ మని కేటీఆర్ ఇప్పటికే ఆరోపించారు.ఇదే విషయం పై ఢిల్లీలో న్యాయవాదులో సంప్రదింపులు జరిపారు.

ప‌ట్టాలు త‌ప్పిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్

ఈ మ‌ధ్య కాలంలో రైళ్లు త‌రుచూ ప్ర‌మాదానికి గుర‌వుతున్నాయి. అధి కారులోప‌మో లేదా సాంకే తిక లోప‌మో గానీ ప్ర‌మాదా లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్‌లో సోమ‌వారం తెల్ల‌వారు జామునా సబర్మతీ-ఆగ్రా సూపర్ ఫాస్ట్ రైలు పట్టాలు తప్పింది.

అదృష్టవశాత్తూ ఈ ఘట నలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోని సబర్మతి నుంచి యూపీలోని ఆగ్రాకు వెళ్తోన్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రైస్ సోమవారం తెల్లవారుజామున రాజస్థాన్‌లోని అజ్మేర్ సమీపంలో ప్రమాదానికి గురయ్యింది.

మాదర్ రైల్వే స్టేషన్‌ సమీ పంలో తెల్ల‌వారుజా మునా రైలు ఇంజిన్‌తో పాటు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న సహా యక సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తు న్నారు.

రాత్రి తామంతా గాఢ నిద్ర లో ఉండా పెద్ద శబ్దం వినిపిం చిందని, చివరకు రైలు పట్టా లను తప్పినట్టు తెలిసిందని కొందరు ప్రయాణికులు మీడి యాకు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి.

హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణం అయ్యారు..

హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషా బాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీ ఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు షురూ

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు సబ్జెక్ట్‌లకు టెన్త్ పరీ క్షలు జరుగుతాయి.

పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తం గా దాదాపు 3,473 ఎగ్జాం సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియ నుండగా.. మిగతా రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలు జరు గుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరప నున్నారు.

పేపర్ లీకేజీ వంటి అవాం చిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసు కురాకుండా నిషే ధించారు. 130 సమస్యా త్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పదో తర గతి పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యుల ర్ విద్యార్ధులు 6,23,092 మంది ఉండగా.. గత ఏడాది ఫెయిలై అయిన విద్యార్ధులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రా నికి ప్రత్యేక యూనిక్‌ కోడ్‌ నంబర్‌ ప్రింట్‌ చేశారు.

ఈ యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో క్షణాల్లో తెలుసు కునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొ చ్చారు. పరీక్షలకు హాజర య్యే విద్యార్ధులు ఉదయం 8.45 నిమిషాల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. హాల్ టిక్కెట్లు చూపి తే ఆర్టీసీ బస్సులో టెన్త్‌ విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.