/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ Yadagiri Goud
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సింగర్ మంగ్లీ

సింగ‌ర్ మంగ్లీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంగ్లీ ప్రయాణిస్తున్న కారును ఓ డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆమెతో పాటు కారులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి స్వ‌ల్ప గాయాల‌ య్యాయి.

హైదరాబాద్,బెంగళూరు జాతీయ రహదారిపై తొండుపల్లి వంతెన వద్ద ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగిందని శంషాబాద్ పోలీసులు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతి వనం లో ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవానికి మంగ్లీ శనివారం హాజరయ్యారు. అదేరోజు అర్ధరాత్రి తర్వాత మేఘ్‌రాజ్‌, మనోహర్‌తో కలిసి ఆమె కారులో తిరుగు ప్రయాణం అయ్యారు..

హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయల్దేరారు. శంషా బాద్‌ మండలం తొండుపల్లి వంతెన వద్దకు రాగానే.. కర్ణాటకకు చెందిన ఓ డీసీ ఎం వెనక నుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది.

ఈ ఘటనలో కారులో ఉన్న ముగ్గురికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాదంలో కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి పదవ తరగతి పరీక్షలు షురూ

తెలుగు రాష్ట్రాల్లో నేటి నుండి పదో తరగతి 2024 పరీక్షలు ప్రారంభం కానున్నా యి. మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. ఏడు సబ్జెక్ట్‌లకు టెన్త్ పరీ క్షలు జరుగుతాయి.

పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తం గా దాదాపు 3,473 ఎగ్జాం సెంటర్లను విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రధాన పరీక్షలు 28వ తేదీతో ముగియ నుండగా.. మిగతా రెండు రోజులు ఓరియంటల్, ఒకేషనల్‌ పరీక్షలు జరు గుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు పరీక్షలు జరప నున్నారు.

పేపర్ లీకేజీ వంటి అవాం చిత సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇన్విజలేటర్లతోపాటు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇతర అధికారులు కూడా పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు తీసు కురాకుండా నిషే ధించారు. 130 సమస్యా త్మక పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పదో తర గతి పరీక్షలకు 7, 25,620 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. వీరిలో రెగ్యుల ర్ విద్యార్ధులు 6,23,092 మంది ఉండగా.. గత ఏడాది ఫెయిలై అయిన విద్యార్ధులు 1,02,528 మంది ఉన్నారు. లీకేజీలను అరికట్టేందుకు ప్రశ్నాపత్రా నికి ప్రత్యేక యూనిక్‌ కోడ్‌ నంబర్‌ ప్రింట్‌ చేశారు.

ఈ యూనిక్ కోడ్ ద్వారా ఏ సెంటర్ నుంచి ఎవరు పేపర్ లీక్ చేశారో క్షణాల్లో తెలుసు కునేలా కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొ చ్చారు. పరీక్షలకు హాజర య్యే విద్యార్ధులు ఉదయం 8.45 నిమిషాల నుంచి పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి స్తారు. హాల్ టిక్కెట్లు చూపి తే ఆర్టీసీ బస్సులో టెన్త్‌ విద్యార్ధులకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించారు.

ఎన్నికల కోడ్ నిబంధనలు

ప్రజాధనంతో పత్రికలు, టీవీల్లో ఇచ్చే ప్రకటనలు నిలిపివేయాలి. పథకాల లబ్ధిదారులకు ఇచ్చే పత్రాలు, అధికారిక వెబ్ సైట్ల నుంచి ప్రజాప్రతినిధుల ఫొటోలు తొలగించాలి.

ప్రభుత్వ కార్యాలయాలతో పాటు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ స్తంభాలపై నాయకుల పోస్టర్లు తొలగించాలి.

ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ అధికారిక వాహనాల విని యోగం నిలిపివేయాలి.

అధికారుల బదిలీలపై నిషేధం, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన కూడదు...

తెలంగాణ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఖరారు

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడు దలైంది.ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ షెడ్యూల్‌ ఎట్టకేలకు ఎన్ని కల కమిషన్‌ విడుదల చేసింది.

అయితే దేశంలో మొత్తం ఐదు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, లోక్‌సభ ఎన్నికలు మాత్రం దేశవ్యాప్తంగా జరుగను న్నాయి.

18వ లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, జమ్మూకశ్మీర్‌ రాష్ట్రాల అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ఖరారైంది.

అయితే ఇందులో జమ్మూ లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలు జరుగ నున్నాయి. అయితే లోక్‌సభ గడువు జూన్‌ 16తో ముగియ నుంది.

ఇక తెలంగాణ విషయా నికొస్తే రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.ఇప్పుడు కేవలం లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరుగనున్నాయి.

తెలంగాణలో మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియా సమావేశం ప్రకటించారు.

అయితే ఏపీ, తెలంగాణలో ఒకే సారి ఎన్నికలు జరుగ నున్నాయి. ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశవ్యా ప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రానుంది.

ఎన్నికలకు కోటి 50 లక్షల సిబ్బంది

ఎన్నికల ప్రక్రియలో కోటి 50 లక్షల సిబ్బంది ఉండను న్నట్లు రాజీవ్‌ తెలిపారు. జూన్‌ 16వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రేపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్?

రేపు మధ్యాహ్నం 3 గంట లకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. లోక్ సభ ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు రేపే నగారా మోగనుంది.

ఈ మేరకు ఈసీ నేడు అధికారికంగా ప్రకటించింది. నాలుగు రాష్ట్రాల శాసన సభ ఎన్నికలు కూడా ఇదే సమయంలో జరుగుతా యని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరగ నున్నాయి.

లోక్ సభ పదవీకాలం జూన్ 16తో ముగుస్తోంది. ఈలో గానే కొత్త ప్రభుత్వం ఏర్ప డాల్సి ఉంటుంది. గత ఎన్నికల సమయంలో మార్చ్ 10న షెడ్యూల్ విడుదలయింది.

ఏప్రిల్ 11 నుంచి ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది. మరోవైపు రేపు ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో… రేప టి నుంచి దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది...

తెలంగాణలో నేటి నుండి ఒంటి పూట బడి

రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించ నున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ తెలిపారు.

ప్రభుత్వ, ప్రయివేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు తప్ప కుండా ఒంటిపూట బడు లను అమలులోకి తీసుకు రావాలని కమిషనర్ ఆదేశించారు.లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.

దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని వెల్లడించారు.

ప్రతి పని దినం నాడు 12.30 గంటలకు మధ్యా హ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు. పదోతరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.

మరో ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన బిఆర్ఎస్

పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.

తాజాగా.. మల్కాజిగిరి, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలను అభ్యర్థులను వెల్లడించారు. మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఖరారు చేయగా.. ఆదిలా బాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆత్రం సక్కు పేరును గులాబీ బాస్ ప్రకటించారు.

ముఖ్య నేతలతో జరిపిన చర్చల అనంతరం అభ్యర్థు లను ప్రకటించారు. తాజా గా, ఇద్దరు అభ్యర్థుల ప్రకట నతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా 11కి చేరింది.

ఇంకా 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను బీఆర్‌ఎస్‌ ప్రకటించాల్సి ఉంది. కాగా, తొలి జాబితాలో బీఆర్‌ ఎస్‌.. ఐదుగురు అభ్యర్థు లను ప్రకటించింది.

ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మహబూ బాబాద్‌ (ఎస్టీ రిజర్వ్‌) స్థానం నుంచి సిట్టింగ్‌ ఎంపీ మాలోత్‌ కవిత, కరీంనగర్‌ నుంచి మాజీ ఎంపీ బోయి నపల్లి వినోద్‌కుమార్‌, పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌) స్థానం నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, మహబూ బ్ నగర్-మన్నె శ్రీనివాస్ రెడ్డిలను ఖరారు చేసింది.

అటు.. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ నుంచి కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్యకు అవకాశం ఇచ్చారు.

కాంగ్రెస్ కోట గేట్లు తెరిచాం ఇక బిఆర్ఎస్ ఖాళీ

చేరికలపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని అన్నారు.

బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా కాంగ్రెస్‌‌కు నష్టం లేదని తెలిపారు. తాము గేట్లు తెరిచాం.. ఇక బీఆర్ఎస్ ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు.

కీలక నేతలు తమతో టచ్‌లో ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. పాత కాంగ్రెస్ నేతలంతా తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నారని అన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల పైనే కుట్రలు చేసి.. ఓడగొట్టుకున్న ఘనత బీఆర్ఎస్‌దే అని ఎద్దేవా చేశారు.

కాగా, రెండ్రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహిం చిన సభలో సరిగ్గా ఇదే హెచ్చరికను బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు.

పదే పదే ప్రభుత్వం కూలి పోతుందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించి హెచ్చరించారు. కాంగ్రెస్ గేట్లు తెరిస్తే కల్వ కుంట్ల కుటుంబ సభ్యులు తప్పా ఆ పార్టీలో ఎవరూ ఉండబోరు అని సీఎ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిం చారు.

అయితే, తాజాగా.. తాము గేట్లు ఆల్రేడీ తెరిచామని బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని సీతక్క చేసిన కామెంట్లు రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారాయి...

తెలంగాణ టెన్త్‌ పరీక్షలకు నిమిషం నిబంధన ఎత్తివేత.. 5 నిమిషాల గ్రేస్‌ టైమ్‌కు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో 2023-24 విద్యా సంవత్సారానికి గానూ మార్చి 18 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లను ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసింది.

ఏప్రిల్‌ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యా ర్ధులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది.

ఆయా తేదీల్లో పరీక్షలకు హాజర య్యే విద్యార్థులు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశిం చేందుకు ఐదు నిమిషాల గ్రేస్ టైం ఇస్తున్నట్లు గురు వారం మార్చి 14 ప్రకటిం చింది.టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతాయి.

తాజా నిబంధనతో 9.35 గంటల వరకు విద్యార్ధులను పరీక్ష కేంద్రంలోకి అనుమతి స్తారు. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపో జిట్ కోర్సు, సైన్స్ సబ్జెక్టులు మినహా మిగిలిన పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించ నున్నారు.

ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, పార్ట్-1 ఫిజికల్ సైన్స్, పార్ట్-2 బయోలా జికల్ సైన్స్ పరీక్షలు జరిగే రెండు రోజులలో ఉదయం 9.30 నుంచి ఉదయం 11 గంటల వరకు జరుగు తాయి.

పదో తరగతి పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఐదు నిమి షాల గ్రేస్ టైమ్ ఉంటుం ది.కాగా ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు.ఈసారి అన్ని కేంద్రాల వద్ద అదనపు భద్రతను ఏర్పాటు చేయ నున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణా రావు తెలిపారు.

ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా 2,676 కేంద్రాల్లో టెన్త్‌ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేసుకున్నారు. వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు.

పరీక్షలను పర్యవేక్షించేం దుకు ఒక్కో పరీక్ష కేంద్రంలో విద్య, రెవెన్యూ శాఖల నుంచి ఒక్కో అధికారి, ఓ ఏఎస్‌ఐ, ఇద్దరు కానిస్టేబు ళ్లతో కూడిన 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమిం చారు.

విద్యార్థులకు తప్పు ప్రశ్న పత్రాలు జారీ చేస్తే ఇన్విజి లేటర్లనే బాధ్యులుగా చేయా లని పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. తమ విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్విజిలేటర్లను పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరిం టెండెంట్‌ వివరణలు కోరాలని ఆదేశించారు.

అటువంటి వారిపై తెలం గాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్స్‌ ఆఫ్‌ మాల్‌ప్రా క్టీసెస్‌ అండ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) యాక్ట్‌ 1997 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికా రులు తెలిపారు..

యాదాద్రి ఆలయ ఈవోగా భాస్కర్ రావు నియామకం

యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణ రావుపై ప్రభు త్వం బదిలీ వేటువేసింది. సీఎం రేవంత్ రెడ్డి పర్య టనలో ఆలయ ఈవో రామకృష్ణ ప్రొటోకాల్ పాటించలేదన్న ఆరోప ణలతో దేవాదాయ ధర్మాదాయ శాఖ బదిలీ చేసింది.

డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క పట్ల అమర్యాదగా వ్యవహరించడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చే సమ యంలో మిగతా మంత్రుల కంటే కాస్త తక్కువ ఎత్తున్న స్టూల్‌పై డిప్యూటీ సీఎంను కూర్చోబెట్టారు.

దీంతో ఉపముఖ్యమంత్రికి అవమానం అంటూ పెద్ద ఎత్తున దుమారం రేపింది. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం స్పందించారు. అవమానం లాంటిది ఏమీ లేదని... తానే కింద కూర్చున్నానని చెప్పుకొచ్చారు.

అయినా నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆలయ ఈవోపై చర్యలు తీసుకు న్నారు. యాదాద్రి ఈవోగా భాస్కర్ రావును నియమి స్తూ ఉత్తర్వులు జారీ చేశారు.