/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: ఏఐఎస్ఎఫ్ Vijay.S
రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి: ఏఐఎస్ఎఫ్


రేపటి నుంచి జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగ

రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఉప్పల శాంతి కుమార్ అన్నారు అలాగే పరీక్ష కేంద్రాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని సెంటర్లలో కరెంటు సౌకర్యాలు ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు అదేవిధంగా విద్యార్థులు నీరసంకు గురయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులకు ప్రథమ చికిత్స నిమిత్తం ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎం టెంటు మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ ఆరోగ్యశాఖ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారన్నారు అదేవిధంగా ర్యాంకుల కోసం కార్పొరేట్ విద్యాసంస్థలు అడ్డుదారులు దొరికే అవకాశం ఉందని  అటువంటి వాటికి విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయాలని అలా జరిగిన నేపథ్యంలో ఆ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యార్థులు మనో ధైర్యం తో పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత తీసుకురావాలని కోరారు

      

ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన ప్రీతం కు శుభాకాంక్షలు తెలిపిన ఎన్ఎస్యూఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్


తెలంగాణ ప్రభుత్వ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన నాగరిగారి ప్రీతం ను వారి నివాసంలో శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్ ఎస్ యూ ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కనుకుంట్ల బాబురావు ,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుంట్ల కొండల్ ,యూత్ కాంగ్రెస్ కార్యదర్శి బాలస్వామి ,పొట్ట శరత్ రాజు పేతురు పాల్గొన్నారు.

బద్దం యాదమ్మ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి : కొడారి వెంకటేష్, వయోవృద్ధుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్


 

 వయోవృద్ధురాలు అని చూడకుండా భూమి పట్టా కోసం, మానసికంగా శారీరకంగా హింసించి, బద్దం యాదమ్మ మృతికి కారణమైన కోడలు, కొడుకు, మనవడి పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని యాదాద్రి భువనగిరి జిల్లా "వయోవృద్ధుల సంక్షేమ సంఘం" కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వలిగొండ మండలం (ఎం) తుర్కపల్లి గ్రామానికి చెందిన బద్దం యాదమ్మ (80), నలుబై ఏళ్ళ క్రితమే భర్తను కోల్పోయి, ఎన్నో కష్టాలు పడి ఇద్దరు కుమారులను, ఒక కుమార్తెను పెంచి పెద్ద చేసి, వారికి పెళ్ళిళ్ళు చేసి ప్రయోజకులను చేసింది. తనకున్న భూమిని కొంతభాగం పెద్ద కుమారునికి, కొంతభాగం చిన్న కుమారునికి పట్టా చేసింది. కొంత భూమిని తన పేరుమీద ఉంచుకుంది. తన తదనంతరం ఆమె ఇద్దరు కుమారులకు చెందే విధంగా చేయాలని ఆమె కోరింది. కానీ ఇది నచ్చని ఆమె పెద్ద కొడుకు, కోడలు, మనవడు ఆమె పేరు మీదున్న సుమారు మూడు ఎకరాల భూమిని తమకు పట్టా చేయాలని యాదమ్మను, గత కొంత కాలంగా వేధిస్తున్నారు. నేను చనిపోయే వరకూ ఆ భూమి నాపేరు మీదనే ఉంటుందని యాదమ్మ చెప్ఫడంతో , కొడుకు, కోడలు, మనవడు విచక్షణ కోల్పోయి గత ఆదివారం రోజున యాదమ్మ ను చేతులతో, కర్రలతో విపరీతంగా కొట్టి గాయపరిచారు. తల్లికి గాయాలైన విషయం తెలుసుకున్న మోత్కూరు లో ఉంటున్న కుమార్తె కొంతం సువర్ణ, తుర్కపల్లి కి వచ్చి, పరిస్థితి తెలుసుకొని వలిగొండ పోలీసులకు పిర్యాదు చేసి యాదమ్మను చికిత్స కోసం మోత్కూరు కు తీసుకెళ్ళింది. ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తుండగా శుక్రవారం యాదమ్మ కు కడుపులో విపరీతంగా నొప్పి రావడం తో డాక్టరు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు వెళ్ళాలని సూచించగా మార్గమధ్యంలో యాదమ్మ మృతి చెందారు

. వలిగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాదమ్మ పేరునగల భూమిని తన పేరుమీద రిజిష్టర్ చేయాలని, మానసికంగా, శారీరకంగా హింసించిన కొడుకు సాయిరెడ్డి, కోడలు స్వరూప, మనవడు రాంరెడ్డి ల పై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయాలని, పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేసే అవకాశం ఉన్నందున సెక్షన్ 201 కింద కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ -2007 ప్రకారం బద్దం యాదమ్మ కు న్యాయం జరగాలని, బద్దం యాదమ్మ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, జిల్లా కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా న్యాయమూర్తి కి పిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని , అధికారులను, పోలిస్ లను ఆయన కోరారు.

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కేంద్రం లోనికి గ్రేస్ టైం 15 నిమిషాలు ఇవ్వాలి: దుబ్బ రామకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు


యాదాద్రి భువనగిరి జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ రేపటి నుండి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోనికి ఒక్క నిమిషం ఆలస్యమైనచో అనుమతి నిరాకరణ నిబంధన నుండి ఐదు నిమిషాలకు బదులుగా 15 నిమిషాలు ఇవ్వాలని అన్నారు పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు దాదాపు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు అధికంగా ఉన్నారు. వారంతా ఆయ ప్రాంతాల నుండి సరైన రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందు పడాల్సిన పరిస్థితి నెలకొంది కావున ఈ 15 నిమిషాల వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

వలిగొండ మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన జడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని అభివృద్ధి పనులు జెడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి జడ్పిటిసి నిధులు అరుర్ గ్రామము నుండి చంద్రాయన గుట్టకు వెళ్లే కల్వర్టు కు 3,50,000కేటాయించినారు. వెలివేర్తి లో సిసి రోడ్డు కోసం 250000 జెడ్పిటిసి నిధుల నుండి కేటాయించి న్నారు. వేములకొండ దగ్గర కల్వర్టు కు నాలుగు లక్షల రూపాయలు.

 జడ్పిటిసి నిధుల నుండి కేటాయించి ఈరోజు  గ్రామ పెద్దలు సమక్షంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెల్వర్తి ఎంపీటీసీ ఎడవెల్లి యాదగిరి వేములకొండ ఎంపిటిసి సామ రామిరెడ్డి. మండల నాయకులు రసూలు పులిపాలుపుల రాములు. అరూరు గ్రామ శాఖ అధ్యక్షులు బుర్ర నరసింహ మాజీ ఉప సర్పంచ్ సుక్క ముత్యాలు పరమేష్ నరసింహ . కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ ...తుర్కపల్లి గ్రామానికి చెందిన వృద్ధురాలు మృతి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని తుర్కపల్లి గ్రామానికి చెందిన బద్దం యాదమ్మ భర్త నర్సిరెడ్డి నీ తన పెద్ద కోడలు బద్దం స్వరూప మరియు ఆమె కుమారుడు బద్దం సాయి రెడ్డి వ్యవసాయ భూమిని తమ పేరు మీద రిజిస్టర్ చేయాలని తరచూ కర్రలతో కొట్టడంతో బద్దం యాదమ్మ తేదీ 12 -03- 24 న కోడలు స్వరూప పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మోత్కూర్ లో ఉంటున్న తన పెద్ద కూతురు కొంతం సువర్ణ దగ్గర ఉండగా శుక్రవారం రాత్రి 10:30 నిమిషాలకు కడుపు, ఛాతిలో నుండి నొప్పి రావడంతో మోత్కూరులో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యాదమ్మ మృతి చెందారు. మృతురాలి కుమారుడు బద్దం మల్లారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నమని శనివారం వలిగొండ ఎస్సై మహేందర్ లాల్ తెలిపారు.

బొమ్మలరామరంలో కల్నాన్ వినయ్ భాను రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


భారతదేశంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసినటువంటి కల్నల్ వినయ్ బాను రెడ్డి విగ్రహాన్ని బొమ్మల రామారం నడి బొడ్డున చౌరస్తాలో ఏర్పాటు చేయడం చాలా సంతోషమని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. కల్నల్ వినయ్ బాను రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా శనివారం వినయ్ బాను రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ..వారు ప్రాణత్యాగం చేసింది వారి కుటుంబం కోసమో ఇంకెవరి కోసమో కాదు భారతదేశ స్వాతంత్రం కోసం మన అందరి గుండెల్లో ఉండే వ్యక్తి మనం ఎప్పటికీ మర్చిపోలేని వ్యక్తి కల్నల్ వినయ్ భాను రెడ్డి అన్నారు. ఈ ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం ఇచ్చిన ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడానికి మీ వంతు కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.కల్నల్ వినయ్ బాను రెడ్డికి ప్రత్యేకంగా నివాళులర్పించారు..వారి కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన పవిత్రాత్మ పాఠశాల విద్యార్థినిలకు బహుమతులు అందజేత


విద్యార్థులు టాలెంట్ టెస్ట్ మాదిరిగానే 10వ తరగతి పరీక్షల్లో కూడా ఉన్నత ఫలితాలు సాధించాలి

ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు

*భారత విద్యార్థి ఫెడరేషన్ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో పదవ తరగతి జిల్లా స్థాయి టాలెంట్ నిర్వహించడం జరిగింది ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షలలో మొదటి స్థానం మొదటి ద్వితీయ స్థానాలు సాధించిన పవిత్రాత్మ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థినీలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ బహుమతులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించడం వలన పరీక్షల పట్ల వారిలో ఉన్న భయాందోళన దూరం చేస్తూ వారిలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ ప్రతి సంవత్సరం టాలెంట్ టెస్ట్ ద్వారా పరీక్షలకు ముందస్తుగా విద్యార్ధులను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు అదేవిధంగా రెండు రోజుల్లో ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులు అందరూ మానసిక ఒత్తిడికి గురికాకుండా సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకొని మంచిగా పరీక్షలు రాసి తమ తమ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని పరీక్షల్లో పాల్గొనబోయే విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు వేముల జ్యోతిబాసు నాయకులు మైసోల్ల నరేందర్ ఉపాధ్యాయులు పాండు , బాలశౌరి,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా భువనగిరి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి టౌన్ ప్రిన్స్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత అరెస్టుపై శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమము చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్తు చైర్మన్ శ్రీ ఎలిమినేటి సందీప్ రెడ్డి , ఆలేరు మాజీ శాసనసభ సభ్యులు శ్రీ బూడిద బిక్షమయ్య గౌడ్ , యాదాద్రి భువనగిరి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు శ్రీ కంచర్ల రామకృష్ణారెడ్డి , భువనగిరి జడ్పీటీసీ శ్రీ బీరు మల్లయ్య పాల్గొని మాట్లాడుతూ.. బి ఆర్ ఎస్ ను పార్లమెంట్ ఎన్నికల్లో ఎదుర్కొనలేకనే బిజెపి అరెస్టుల కు పాల్పడుతుందని అన్నారు. కాంగ్రెస్ బిజెపిలు రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలని ఉద్దేశంతో ఉన్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల శాఖ అధ్యక్షులు రాచమల్ల శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పంజాల సతీష్ గౌడ్, మండల సీనియర్ నాయకులు కొలను దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ అమరేందర్, బోడ్డు వెంకటేష్,మండల ప్రచార కార్యదర్శి పల్ల శ్రీనివాస్ రెడ్డి, BRS నాయకులు ఎర్ర శేఖర్ రెడ్డి, లక్ష్మీదేవి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు జీల్కపల్లి బలరాజ్ భువనగిరి నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ సేవా అవార్డు - 2024 పొందిన కొడారి వెంకటేష్, పద్మశ్రీ శాంత సిన్హా చేతుల మీదుగా ప్రధానం


 

 

 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా "సంకల్ప్ ఫౌండేషన్" ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డు లలో "కమ్యూనిటీ సర్వీస్ అవార్డు-2024" కు భువనగిరి కి చెందిన సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ ఎంపికైనారు. శుక్రవారం హైదరాబాద్ లోని చందానగర్ లోని హోటల్ స్వాగత్ రెసిడెన్సీ లో జరిగిన ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా కొడారి వెంకటేష్ అవార్డు ను అందుకున్నారు. "సంకల్ప్ ఫౌండేషన్ " ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రస్థాయిలో వివిధ రంగాలలో సేవలందించిన, మరియు ప్రత్యేక ప్రతిభను కనబరిచిన వారికి ఈ అవార్డులను అందజేశారు. ముఖ్యంగా వ్యవసాయ, చేనేత, పారిశుద్ధ్య, పారిశ్రామిక, మహిళా హక్కుల, మహిళా సాధికారత, పిల్లల హక్కుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, ఆద్యాత్మిక ,తదితర అంశాలపై పనిచేసిన వారిని గుర్తించి అవార్డులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత దశాబ్ద కాలంగా, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం , మహిళా సాధికారత కోసం కృషి చేసిన కొడారి వెంకటేష్

రాష్ట్రస్థాయి ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పిల్లల హక్కుల కోసం, మహిళా సమానత్వం కోసం నిరంతరం కృషి చేస్తున్న మా మార్గదర్శి పద్మశ్రీ శాంతా సిన్హా మేడం చేతులమీదుగా అవార్డును అందుకోవడం చాలా గర్వంగా, మరియు ఆనందంగా ఉందన్నారు. సంకల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గండ్ర మేడం ఆద్వర్యంలో లభించిన ఈ అవార్డుతో సామాజిక భాద్యత మరింత పెరిగిందన్నారు. నాతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నల్గొండ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఎర్ర శివరాజ్, సూర్యాపేట జిల్లా పీపుల్స్ ఫౌండేషన్ డైరెక్టర్ యాతాకుల సునీల్ లు ఎక్సలెంట్ అవార్డులకు ఎంపికైనారని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి ఎక్సలెన్స్ అవార్డు ఎంపికకు సహకరించిన వికారాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ ఇ. వెంకటేష్, సభ్యులు ధనసిరి ప్రకాష్ లకు కొడారి వెంకటేష్ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు