/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఇంటి వద్దకే ఆర్టీసీ పార్సల్ డెలివరీ Yadagiri Goud
ఇంటి వద్దకే ఆర్టీసీ పార్సల్ డెలివరీ

ఆదాయం పెంచుకునేం దుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్‌ విభాగ నెట్‌వర్క్‌ను మరిం తగా విస్తరిస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థటీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు.

వినియోగదారులకు వేగ వంతమైన సేవలందిం చేందుకు త్వరలోనే పార్శిళ్లను ఇంటి వద్దనే పికప్, డెలివరీ చేస్తామని ఆయన చెప్పారు.

ఈరోజు హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో గురువారం నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్‌ మోడల్‌ కౌంటర్‌ను ప్రారంభించారు. కొత్త కౌంటర్‌ లో ఒక పార్శిల్‌ ను బుకింగ్‌ చేసి రశీదును వినియోగదారుడు శివ కుమార్‌కు ఆయన అందజేశారు.

అనంతరం లాజిస్టిక్స్ విభాగ కొత్త లోగో, బ్రోచర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారు లతో కలిసి ఆవిష్కరిం చారు. పార్శిళ్ల హోం పికప్‌, డెలివరీ కోసం వినియోగిం చే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లా డుతూ..టీఎస్‌ఆర్టీసీ లాజి స్టిక్స్‌ విభాగం తెలంగాణలో అతివేగంగా పార్శిళ్లను డెలివరీ చేసే వ్యవస్థ అని అన్నారు. ప్రతి రోజు సగటున 15 వేల పార్శిళ్లను బట్వాడా చేస్తున్నామని తెలిపారు.

ప్రత్యామ్నాయ ఆదాయాన్ని పెంచుకోవాలని నిర్ణయిం చిన సంస్థ.. ప్రయివేటు మార్కెట్‌కు ధీటుగా లాజి స్టిక్స్‌ విభాగాన్ని బలోపేతం చేస్తున్నదని తెలిపారు.

లాజిస్టిక్స్‌ సేవలకు సంబం ధించి సలహాలు, సూచన లు, ఫిర్యాదుల కోసం కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040-69440069 గానీ, https://www.tsrtclogistics.in వెబ్‌సైట్‌ను గానీ సంప్రదించవచ్చని సూచించారు.

కాంగ్రెస్ లోకి మాజీ మంత్రి : మల్లారెడ్డి ❓️

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ తగలబోతోందా. అంటే అవుననే సంకేతాలు ఇస్తు న్నాయి తాజా పరిణామా లు. పార్టీకి ఎంతో నమ్మిన బంటుగా ఉండే మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి త్వరలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్‌ని మల్లారెడ్డి, మరో నేత మర్రి రాజశేఖర్ రెడ్డి గురువారం కలిసినట్లు తెలుస్తోంది.బెంగళూరులోని ఓ హోటళ్లో డీకే శివకుమార్‌ తో మంతనాలు జరిపారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఇరు వురు దాదాపు సిద్ధమ య్యారు.

ఈ క్రమంలో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు శుక్ర వారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరారు. దీన్ని బట్టి అతి త్వరలోనే మల్లారెడ్డి కాంగ్రెస్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు

కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను నియమిం చారు.

ఈ మేరకు సెలక్షన్ కమిటీ సంబంధించి ఎంపిక ప్రక్రి యను చేపట్టింది. కాగా ఫిబ్రవరి నెలలో ఎన్నికల కమిషనర్‌ అనుప్ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా, ఇటీవల అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అరుణ్ కుమార్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు.దీంతో రెండు ఎన్నికల కమి షనర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి.

తాజాగా ఆ పదవులనే భర్తీ చేశారు. దేశంలో మరికొద్ది రోజుల్లోనే లోక్‌సభ ఎన్ని కలు జరగాల్సి ఉంది. సాధారణంగా కేంద్ర ఎన్నికల సంఘంకు సంబంధించి ముగ్గురు సభ్యుల కమిషన్ ప్యానెల్‌లో ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇద్దరు కమిష నర్‌లు ఉంటారు.

రెండు కమిషనర్ల పోస్టులు ఖాళీగా ఉండటంతో వెంటనే వాటిని భర్తీచేయాల్సి వచ్చింది. సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను కేంద్ర ఎన్నికల కమిషనర్లగా నియామకం అయ్యారు

TDP Second List: టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల.. అభ్యర్థులు వీళ్లే

అమరావతి: తెలుగు దేశం పార్టీ రెండవ విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 34 మంది అభ్యర్థుతో కూడి జాబితాను విడుదల చేసింది..

1 గాజువాక-పల్లా శ్రీనివాసరావు

2. మాడుగుల- పైల ప్రసాద్

3. రంపచోడవరం - మిర్యాల శిరీష

4. గోపాలపురం-మద్దిపాటి వెంకటరాజు

5. ప్రతిపాడు-వరుపుల సత్యప్రభ

6. దెందులూరు-చింతమనేని ప్రభాకర్

7. గుంటూరు ఈస్ట్-మహ్మద్ నజ్జీర్

8. గిద్దలూర్-అశోక్ రెడ్డి

9. పెద్దకూరప్రాడు-భాష్యం ప్రవీణ్

10. రాజమండ్రి రూరల్-గోరెంట్ల బుచ్చయ్య చౌదరి

11. నరసన్నపేట- బొగ్గురమణమూర్తి

12. కొవ్వూరు-ముప్పిడి వెంకటేశ్వరరావు

13. గురజాల-యరపతినేని శ్రీనివాసరావు

14. కోవూర్- వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

15. చోడవరం-కేఎస్‌ఎన్‌ఎస్ రాజు

16. గుంటూర్ వెస్ట్- పిడుగురాళ్ల మాధవి

17. ఆత్మకూరు-ఆనంరాం నారాయణరెడ్డి

18. నందికొట్కూర్- గిత్త జయసూర్య

19. కదిరి-కందికోట యశోదా దేవి

20. మాడుగుల-ఫైలా ప్రసాద్

21. కందుకూర్ - ఇటూరి నాగేశ్వరరావు

22. మదనపల్లి-షాజహాన్ భాషా

23. గాజువాక- పల్లాశ్రీనివాసరావు.

Gold Smuggling: రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు..

ఈ క్రమంలో రూ.40.08 కోట్ల విలువైన 61.08 కిలోల విదేశీ బంగారం, రూ.13 లక్షల నగదు, 17 కార్లు, 30 మొబైల్స్, 21 ఇంటర్నెట్ డాంగిల్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నాయి. అదే సమయంలో 12 మందిని అరెస్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో డీఆర్‌ఐ పాట్నా, ముజఫర్‌పూర్, గోరఖ్‌పూర్, అస్సాం యూనిట్లు పాల్గొన్నాయి..

వాస్తవానికి గౌహతిలోని నివాస సముదాయం నుంచి బంగారం స్మగ్లింగ్ సిండికేట్(syndicate smuggling) నిర్వహిస్తున్నట్లు DRIకి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అస్సాం యూనిట్ ఏజెన్సీ పలు చోట్ల సోదాలు చేయగా 22.74 కిలోల బరువున్న 137 బంగారు బిస్కెట్లు, రూ.13 లక్షల నగదు లభించాయి. అలాగే 21 వాహనాల తాళాలు, 30 మొబైల్ ఫోన్లు, 25 ఇంటర్నెట్ డాంగిల్స్ స్వాధీనం చేసుకోగా, ఆ ఇంట్లో ఆరుగురిని అరెస్టు చేశారు..

Simultaneous polls: 'జమిలి ఎన్నికల'పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

దిల్లీ: 'ఒకే దేశం.. ఒకే ఎన్నికలు' పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది..

ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. ఈ ఉదయం కోవింద్ సహా కమిటీ సభ్యులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. జమిలి ఎన్నికలపై 18,629 పేజీల నివేదికను ప్రథమ పౌరురాలికి అందజేశారు.

దాదాపు 190 రోజుల పాటు ఈ అంశంపై కమిటీ అధ్యయనం జరిపింది. పలు రంగాల నిపుణులతో విస్తృత సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. అనంతరం నివేదికను రూపొందించింది. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు ఆర్టికల్స్‌ను సవరించాలని కమిటీ తమ నివేదికలో సూచించినట్లు తెలుస్తోంది. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం..

ఏకకాల ఎన్నికల నిర్వహణపై గత కొన్నేళ్లుగా బలంగా ప్రచారం చేస్తున్న మోదీ సర్కారు.. 2023 సెప్టెంబరులో దీనిపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను (Ramnath Kovind) నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది.ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది..

Lok Sabha Election 2024: నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 (Lok Sabha Polls2024) షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఒకటి రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు ప్రకటించే అవకాశం ఉందంటూ జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి..

నేడో, రెపో షెడ్యూల్ ప్రకటించవచ్చని పేర్కొంటున్నాయి. ప్రకటన తేదీల్లో మార్పు ఏమైనా ఉన్నా ఈ వారంలో షెడ్యూల్ విడుదల కావడం ఖాయమంటూ రిపోర్టులు పేర్కొంటున్నాయి. కాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా వెలువడనుంది..

జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికల సన్నద్ధతపై ఎన్నికల సంఘం బృందం పరిశీలన అనంతరం నోటిఫికేషన్ వెలువడాల్సి ఉందని, అయితే ఎన్నికల సంఘం బుధవారం జమ్ముకాశ్మీర్‌లో పర్యటించడంతో ఇక నోటిఫికేషన్ వెలువడడమే తరువాయి అని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా సెప్టెంబర్ 30, 2024లోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు గతేడాది కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు ఎన్నికల సంఘం బృందం బుధవారం అక్కడ పర్యటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. భద్రతా పరిస్థితిని సమీక్షించిన అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలా? లేక వేర్వేరుగా నిర్వహించాలా? అనే దానిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు..

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా విడుదల

జూన్‌ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈ నెల 18న సోమవారం ఉదయం పదింటి నుంచి 20వ తేదీ ఉదయం పదింటి వరకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది.

లక్కీడిప్‌ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 21వ తేదీ ఉదయం పదింటికి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

మధ్యాహ్నం మూడు గంటలకు పై సేవల వర్చువల్‌ సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

జూన్‌ 19 నుంచి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్ఠాభిషేకంలో పాల్గొనేందుకు ఈ నెల 21న ఉదయం పదింటికి టికెట్లను అందుబాటులో ఉంచుతారు.

ఈ నెల 23న ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌దర్శనం, గదుల కోటా విడుదల చేస్తారు.

మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు.

25వ తేదీ ఉదయం పదింటికి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో టికెట్లను బుక్‌ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం

సీఎం రేవంత్‌రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం గాంధీభవన్‌లో దీప్‌దాస్ మున్షీ అధ్యక్షతన 13 పార్లమెంట్ నియోజక వర్గాల అభ్యర్థిత్వాలపై అభిప్రాయ సేకరణ జరిపారు.

అనంతరం దీప్‌దాస్ మున్షీ సారథ్యంలో ఎఐసిసి నేతలు సీఎం రేవంత్ నివాసంలో బుధవారం రాత్రి సమావేశ మయ్యారు.

ఈ సమావేశంలో అభిప్రా య సేకరణకు సంబంధిం చిన అంశాలపై దీప్‌దాస్‌ మున్షీ, సిఎం రేవంత్‌ల మధ్య చర్చలు నిర్వహించి నట్లు తెలుస్తోంది.

ఈ చర్చలలో భాగంగా సీఎం రేవంత్ సైతం తన అభిప్రాయాలను వెల్లడించి నట్లు సమాచారం. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత నివ్వాల్సిన అవసరం అంత ఉండకపోవచ్చన్న చర్చ చోటు చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఒకట్రెండు చోట్ల కొత్తవారికి అవకాశమిచ్చినా అభ్యంతరం ఉండదన్న అభిప్రాయం సైతం వ్యక్త మైనట్లు సమాచారం. అయితే అభిప్రాయ సేకరణ సందర్భంగా కొత్తవారికి అభ్యర్థిత్వాలు కట్టబెట్టే తీరుపై పార్టీ నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్త మైన సంగతి విదితమే.

మిగతా 13 లోక్‌సభ నియోజకవర్గాల అభ్య ర్థులను ఫైనలైజ్ చేసేందుకు సిఎం రేవంత్ ఢిల్లీ బాట పడుతున్నారు.

నేటితో ముగియనున్న గ్రూప్ 1 పరీక్ష దరఖాస్తు గడువు

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, నేటీతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది.

అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. గ్రూప్‌ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల అప్లికేషన్స్ వచ్చాయి.

పరీక్షకు 7 రోజుల ముందు నుంచి హాల్‌ టికెట్లు అందు బాటులోకి వస్తాయి...