/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz చర్ల: మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి:న్యూడెమోక్రసీ-IFTU Miryala Kiran Kumar
చర్ల: మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి:న్యూడెమోక్రసీ-IFTU

మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలి:న్యూడెమోక్రసీ-IFTU

స్కూల్స్ లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారికి వేతనం పెంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్,IFTU నాయకులు నరేష్ లు అన్నారు.

ఈరోజు మండలంలో మధ్యాహ్న భోజనాల పథక కార్మికుల సమస్యలపై వారిని కలిసి అనేక సమస్యల్ని సేకరించారు అనంతరం వారు మాట్లాడుతూ 

మధ్యాహ్న భోజన పథకంలో అనేకమంది వేల కార్మికులు పనిచేస్తున్నారని వీరికి గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని ఇప్పటికైనా ఈ ప్రభుత్వం గుర్తించి వారికి 3000 రూపాయలు ఇవ్వాలని పెరిగిన ధరల కనుగుణంగా వారి వేదనం కూడా 6000 లకు పెంచాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ,భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు గా కోరుతున్నాం. కనీసం వారికి గ్యాస్ కూడా ఇవ్వడం లేదని అలాగే వారే కట్టాలని సేకరించుకొని వచ్చి వంట చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దీనితో తీవ్ర అనారోగ్యాలకు గురయ్యే పరిస్థితి వచ్చిందని వారన్నారు వర్కర్లకి కనీసం పీఎఫ్ గానీ ఈఎస్ఐ గాని ఇన్సూరెన్స్ గాని ఎలాంటి బీమా పథకాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది కావున ప్రభుత్వం కార్మిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని వీరికి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం.ఈ సర్వే కార్యక్రమంలో సరక్క నిలమ్మ సావిత్రి లేయమ్మ రాము తదితరులు పాల్గొన్నారు.

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి నిర్వహణ..

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి నిర్వహణ..

 భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, సంఘసంస్కర్త ,రచయిత్రి, ఉద్యమకారిణి "

సావిత్రిబాయి పూలే; 127వర్ధంతి  

 పురస్కరించుకొని  కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న

 బీపీ మండల్ గారి విగ్రహం వద్ద

 సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడమైనది ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు సింగం లక్ష్మి మాట్లాడుతూ 19వ శతాబ్దం మొదటి భాగంలో మన సమాజంలో ఉన్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా తన జీవితాంతం పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతులు చేసిన వీరవనిత శ్రీమతి సావిత్రిబాయి పూలే అని వీరు తన భర్త ప్రోద్భావంతో చదువు నేర్చుకొని తన తోటి మహిళలకు చదువు నేర్పడం కోసం అనేకమైన మహిళా పాఠశాలలను నెలకొల్పి వారిని విద్యావంతులు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ని అడ్డంకులు ఎదురైన ధైర్యంగా నిలదొక్కుకొని సమాజాన్ని చైతన్యం చేసిన ఉద్యమకారిణి శ్రీమతి సావిత్రిబాయి పూలే అని కొనియాడారు

ఈ కార్యక్రమంలో భువనగిరి దేవేందర్ ,ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ కార్యదర్శిలు అక్కినపల్లి లక్ష్మయ్య ఖమ్మం పాటి రాజు 

 దళిత కవి వేముల ఎల్లన్న 

గౌడ సంఘం చెరుకు మల్లికార్జున్ గౌడ్ 

బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పొగాకు నాగరాజు ,

బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండె వెంకటేశ్వర్లు

 పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం దశరథఈ కార్యక్రమంలో భువనగిరి దేవేందర్ ,ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్ దళిత కవి వేముల ఎల్లన్న బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు

గౌడ సంఘం చెరుకు మల్లికార్జున్ గౌడ్ 

బలిజ సంఘం జిల్లా అధ్యక్షులు పొగాకు నాగరాజు ,

ఉద్యోగుల సంఘం కార్యదర్శులు అక్కినపల్లి లక్ష్మయ్య ఖమ్మంపాటి రాజు బత్తుల లింగయ్య యాదవ్

 పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం దశరథ

 వనం లలిత, సుజాత , సూరెడ్డి సరస్వతి 

యాదవ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చల్లా కోటేష్ యాదవ్ యాదవ  ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి బెల్లి నాగరాజు యాదవ్ బీసీ సంగం

 జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్ 

విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ చారి 

రజక సంఘం జిల్లా అధ్యక్షులు ఆమంచి అంజయ్య

 లగడ పురం వెంకన్న ,వల్ల కీర్తి శ్రీనివాస్ దుర్గయ్య 

 సమాచార సమితి రాష్ట్ర నాయకులు బండమీది అంజయ్య 

 పగి లి కృష్ణ ,తిరుపతయ్య గౌడ్ బెస్త సంఘం వెంకటకృష్ణ నాయకులు వడ్డెర సంఘం నాయకులు సుర ముత్యాలు

 వనం లలిత, సుజాత , సూరెడ్డి సరస్వతి సమాచార సమితి నాయకులు బండ మీద అంజయ్య

యాదవ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చల్లా కోటేష్ యాదవ్ యాదవ  ఉద్యోగుల సంఘం ప్రచార కార్యదర్శి బెల్లి నాగరాజు యాదవ్ బీసీ సంగం

 జిల్లా ఉపాధ్యక్షులు వెంకన్న యాదవ్ 

విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ చారి 

రజక సంఘం జిల్లా అధ్యక్షులు ఆమంచి అంజయ్య

 లగడ పురం వెంకన్న ,వల్ల కీర్తి శ్రీనివాస్ దుర్గయ్య 

 పగి లి కృష్ణ ,తిరుపతయ్య గౌడ్ బెస్త సంఘం నాయకులు వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్య

 

ఆస్ట్రేలియాలో తెలుగు మహిళ దారుణ హత్యకు గురైంది.

హైదరాబాద్ కు చెందిన చైతన్య,చెత్త కుప్పలో విగతజీవిగా కనిపించింది. విక్టోరియాలోని బక్లీలో ఈ ఘటన జరిగింది.

ఆమె భర్త అశోక్ ఇటీవల హైదరాబాద్ రావడంతో మిర్కావేలోని పాయింట్ కుక్లోని తన అపార్ట్మెంట్ లో ఉంటోంది.

దీంతో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ మిరియాల వెంకటేశ్వర్లు

బిజెపి నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డ మిరియాల వెంకటేశ్వర్లు

నల్లగొండ నియోజకవర్గం బిజెపిలో చిన్న కార్యకర్తగా మొదలైన మిరియాల వెంకటేశ్వర్లు ప్రస్థానం నేడు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులుగా నియామకం అయ్యే వరకు చేరింది. చివరిసారి జరిగిన నల్లగొండ మున్సిపాలిటీ ఎలక్షన్లో తన 35 వార్డులో ప్రతిపక్షాల తాకిడి ఎంతో ఉన్నప్పటికీ 35 వార్డులో బిజెపి పార్టీని గెలిపించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు నియామకం కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్లడంలో తన వంతు పాత్ర పోషిస్తానని తెలియజేశారు.

పేద పద్మశ్రీలను ఆదరించండి- ముఖ్యమంత్రికి దాసు సురేష్ విజ్ఞప్తి

పేద పద్మశ్రీలను ఆదరించండి- ముఖ్యమంత్రికి దాసు సురేష్ విజ్ఞప్తి 

పేదవర్గాల నుండి వికసించిన పద్మశ్రీ గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం 50 వేల రూపాయల పెన్షన్ 

,రాష్ట్రమంతా ఉచితంగా పర్యటించే ఆర్టీసీ రవాణా సౌకర్యంతో బాటు 10 లక్షల రూపాయల విలువైన హెల్త్ కార్డులను ఇచ్చి అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ సవినయంగా కోరారు.. ఇటీవల తెలంగాణ నుండి ఎంపికైన పద్మశ్రీలకు 25 లక్షల రూపాయల నగదు పారితోషకం మరియు 25 వేల రూపాయల పెన్షన్ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి తన మానవత్వాన్ని చాటడాన్ని తెలుగు సమాజం అంతా హర్షిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు..తెలంగాణ ఏర్పడిన నాటినుండి నేటివరకు పద్మశ్రీ గా ఎంపికైన 28 మంది పద్మశ్రీలకు పెన్షన్ మరియు ఇతర సౌకర్యాలను కల్పించి కళాకారులకు,సామాజిక కార్యకర్తలకు, స్వచ్ఛందసేవా కార్యక్రమ నివాహకులకు ముఖ్యమంత్రి ప్రేరణగా నిలవాలన్నారు..పద్మశ్రీగా ఎన్నికైన వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వే ప్రయాణంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని ఉచితంగా కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ అంశంపై ముఖ్యమంత్రి సత్వరమే సానుకూలంగా స్పందించి పద్మశ్రీలకు అండగా నిలవాలన్నారు .

నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాద్ నగర్ కు చెందిన నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. నవీన్ కుమార్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఒప్పందం

ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఒప్పందం 

హైదరాబాద్:మార్చి 09

ప్రముఖ టాటా గ్రూప్ కంపె నీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటుకు టాటా కంపెనీ, ప్రభుత్వానికి మధ్య ఈరోజు అగ్రిమెంట్ కుదిరింది.

ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ మేరకు రాష్ట్రంలోని ప్రభు త్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నా లజీస్ లిమిటెడ్ కంపె నీ అప్ గ్రేడ్ చేయనుంది.

ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కింద 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంత రాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణను టాటా టెక్నా లజీస్ అందిచనుంది.

2024-25 విద్యాసంవత్స రం నుంచే ఈ ప్రాజెక్టు అమ లుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొ న్నారు. ఈ భేటీలోనే టాటా కంపెనీకి ప్రభుత్వానికి మధ్య కుదిరింది...

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి  ప్రకటించిన రేవంత్ సర్కారు 

హైదరాబాద్ మార్చి 09 

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023- 24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కా రాలు అందజేశారు.

అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారా నికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

హామీ ఇచ్చిన రెండ్రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టు కోవడంతో ఆర్టీసీ ఉద్యోగు లకు హర్షం వ్యక్తం చేస్తున్నారు...

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు

కరీంనగర్ - బి. వినోద్ కుమార్

పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్

ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు

మహబూబాబాద్ - మాలోత్ కవిత

గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం సమష్టి నిర్ణయం ప్రకారం నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు..

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పోలీస్ ఉన్నతాధికారులు.