/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz సుంకిశాల లో కీర్తిశేషులు పైళ్ళ రమణమ్మ మొదటి సంవత్సరం, నివాళులర్పించిన కుమారుడు పైళ్ల వెంకట్ రెడ్డి USA Vijay.S
సుంకిశాల లో కీర్తిశేషులు పైళ్ళ రమణమ్మ మొదటి సంవత్సరం, నివాళులర్పించిన కుమారుడు పైళ్ల వెంకట్ రెడ్డి USA

:

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో.

పైల్ల రమణమ్మ మొదటి సంవత్సరం మాష్కం. వేద పండితుల మంత్రాలతో ఘనంగా నిర్వహించిన ఎన్నారై పైళ్ల  వెంకట్ రెడ్డి షామిని .మనుమలు. శ్రీఆన్ష్. ఆరూష్ . కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అక్కలు వరలక్ష్మి. మాధవి. రాధాకృష్ణారెడ్డి. గురుపాల్ రెడ్డి. అల్లుండ్లు శ్రేజన్ రెడ్డి. వినీత్ రెడ్డి.అచ్చుత్ రెడ్డి. కుటుంబ సభ్యులు పాల్గొని . పైల్ల రమణమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు.

 ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పైల్ల రాజావర్ధన్ రెడ్డి. చెరుకు శివయ్య గౌడ్డా. డాక్టర్ భూపాల్ రెడ్డి. పైల్ల మోహన్ రెడ్డి. బొక్క బుచ్చిరెడ్డి పైల్ల సుధర్మ రెడ్డి . మెట్టు కొండల్ రెడ్డి. సంజీవరెడ్డి. నాగరాజు. పాల్గొన్నారు.

నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు తొలి రోజు పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు


_యాదాద్రి భువనగిరి: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి._

తొలి రోజు స్వస్తీ వాచనం, అంకురార్పణ కార్యక్రమం, విశ్వక్సేనారాధన, రక్షా బంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

_• ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో వేడుకలు పరిపూర్ణం కానున్నాయి._

ప్రధాన ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండో సారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాఢ వీధుల్లో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. 

వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా 11 రోజుల పాటు స్వామి వారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. 

కాగా, యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

_• 10 వేల మంది కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు._

యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు మంత్రులంతా విచ్చేయనున్నారు. 

స్వామి వారికి సీఎం రేవంత్‌ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం ఉంది. 11 గంటలకు సీఎం, మంత్రులు తిరిగి హెలికాప్టర్‌లో భద్రాచలం పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.

యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండ పైన దేవస్థానం ఆంక్షలు విధించింది. 

_ఉదయం 8 నుంచి 11 గంటల వరకు దర్శనాలు నిలిపి వేస్తున్నట్టు ఈవో రామకృష్ణా రావు తెలిపారు. కొండ పైకి భక్తులను, వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు._

స్త్రీలకు కావలసిన హక్కులు స్వేచ్ఛ సమానత్వం కల్పించాలి : కొడారి వెంకటేష్


 ప్రపంచ వ్యాప్తంగా నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, ఆర్థిక అసమానతలతో పాటు అనేక అంశాలలో వంచించ బడుతున్నారని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ లో బహుజన ఆడపడుచు, మూట కొండూరు మాజీ సర్పంచ్ వడ్డెబోయిన (వంగపల్లి) శ్రీలత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టిన శ్రీలత, పేదరికం చదువుకు ఆటంకం కాదని నిరూపించారని ఆయన అన్నారు. తాను ఉన్నత చదువులు చదివి, ప్రజా సేవ కొరకై రాజకీయ రంగంలో ప్రవేశించి, ఉత్తమ సేవలందించారని ఆయన తెలిపారు . స్ర్తీ లకు ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు , హక్కులు ఉంటాయని వాటి కోసం శ్రీలత నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. మహిళల పక్షపాతి, మహిళల హక్కుల కోసం, మహిళల చదువుకోసం తన జీవితాంతం కృషిచేసిన, సామాజిక ఉద్యమ నాయకురాలు, సంఘసంస్కర్త , చదువుల తల్లి సావిత్రి భాయి పూలే వర్థంతి సందర్భంగా ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మూట కొండూరు మాజీ సర్పంచ్ వడ్డెబోయిన శ్రీలత మాట్లాడుతూ నేడు మహిళలపై జరుగుతున్న దాడులకు, వేదింపులకు అనేక చట్టాలు ఉన్నా, అవి కేవలం కాగితాలకే పరిమితం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.     స్ర్తీ, పురుష అసమానతలు, పౌష్టికాహారం లోపం, గృహ హింస, లైంగిక వేధింపులకు మహిళలు బలగుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వాలు స్త్రీ ల గురించి చేసే చట్టాలలో అనేక మార్పులు తేవాలని, గృహహింస, లైంగిక వేధింపులకు ప్రస్తుతం ఉన్న చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టి ఎస్ ఆర్టీసీ యాదగిరిగుట్ట డిపో మేనేజర్ బి శ్రీనివాస్, భువనగిరి స్టేషన్ మేనేజర్ రత్నయ్య, కంట్రోలర్ సోమరాజు, డాక్టర్ కొండా సోమయ్య, డాక్టర్ కొండా మురళి మోహన్, వంగపల్లి యువసేన నాయకులు శ్రీధర్, ఆర్టీసీ సిబ్బంది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

వేసవికాలంలో ఆరోగ్యంగా ఉండాలి : కొడారి వెంకటేష్ సామాజిక కార్యకర్త


 వేసవి కాలంలో ప్రజలు , ప్రయాణికులు తగు జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ కోరారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ లో తెలంగాణ ఎం ఆర్ పి ఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన "మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ" కార్యక్రమం ను ఆయన ప్రారంభించి, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు, ప్రయాణికులు వేసవికాలం లో ఆరోగ్యాన్ని హాని కలిగించే కూల్ డ్రింక్స్, ఐస్ క్రీం లాంటి వాటి జోలికి వెళ్లకుండా, మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ లాంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి బస్ స్టేషన్ మేనేజర్ రత్నయ్య, కంట్రోలర్ సుధాకర్ రెడ్డి, వంగపల్లి యువసేన నాయకులు శ్రీధర్, ఆర్టీసీ సిబ్బంది వెంకటేష్, మురళి తదితరులు పాల్గొన్నారు.

గోకారం పెద్దమ్మతల్లి మహిళ మత్స్య పారిశ్రామిక సహకార పాలకమండలి అధ్యక్షురాలుగా నూకల స్వాతి ఎన్నిక


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా.

 వలిగొండ మండలం గోకారం గ్రామంలో ఇదివరకే ఒక మత్స్య సొసైటీ ఉండగా, తాజాగా పెద్దమ్మ తల్లి మహిళా మత్స్య సహకార పాలకమండలి ఎన్నికలను ఘనంగా నిర్వహించారు. ఒక గ్రామంలో రెండు సొసైటీలు ఉండడం అరుదైనది కాగా, సంఘాలను ఏర్పాటు చేయడంలో ముదిరాజ్ మహాసభ నాయకులు నూతి చలపతి ముదిరాజ్ పాత్ర కీలకమైనదిగా చెప్పవచ్చు. గ్రామంలో నిర్వహించిన పెద్దమ్మ తల్లి మహిళ మత్స్య పారి శ్రామిక సహకార సంఘం పాలకమండలి అధ్యక్షురాలుగా శ్రీమతి నూకల స్వాతి ఎన్నిక కాగా,ఉపాధ్యక్షురాలుగా బుంగపట్ల నాగమణి, కార్యదర్శిగా నూకల కావ్య ఎన్నిక కాగా,

సభ్యులుగా కట్ట ప్రమీల, రొయ్యల కావ్య, మేడగొని మారమ్మ,రొయ్యల అంజమ్మ, కట్ట లావణ్య, కట్ట అండాలు, ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చలపతి తెలిపారు .ఈ సందర్భంగా మహిళా అధ్యక్షురాలుగా ఎన్నికైన నూకల స్వాతి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాక్షిగా ఏర్పాటైన ముదిరాజ్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం గ్రామంలోని ముదిరాజ్ మత్స్యకారుల అభివృద్ధికి పూర్తి తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు .సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తమ సంఘ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న పెద్దలు ముదిరాజ్ మహాసభ గోకారం మత్స్య సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు నూతి చలపతికి ధన్యవాదాలు తెలిపారు. తమ సంఘం ముందుకు నడవడానికి పూర్తి సహకారాన్ని అందజేయవలసిందిగా వారు కోరారు. ఈ సందర్భంగా నూతి చలపతి ముదిరాజ్ మాట్లాడుతూ' ముదిరాజులే మత్స్యకారులు" "మత్స్యకారులే ముదిరాజులు' అన్న నినాదాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో భాగంగా గోకారం గ్రామంలో రెండు సొసైటీలను ఏర్పాటు చేసి చరిత్ర సృష్టించడం జరిగిందని అన్నారు .ఇవి ముదిరాజ్ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

భువనగిరి అసెంబ్లీ అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి టౌన్ కమిటీ ఎన్నిక


బహుజన్ సమాజ్ పార్టీ భువనగిరి టౌన్ కమిటీని అసెంబ్లీ అధ్యక్షులు గుండు కృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలోఎన్నుకోవడం జరిగినది, భువనగిరి టౌన్ అధ్యక్షులుగా కోయగూరి వెంకటేష్ యాదవ్ గారిని , భువనగిరి టౌన్ ఉపాధ్యక్షులు బర్రె రామకృష్ణ గారిని , భువనగిరి టౌన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ లింగం గారిని , భువనగిరి టౌన్ కార్యదర్శి నిమ్మల రవికుమార్ ముదిరాజ్ గారిని , భువనగిరి టౌన్ కోశాధికారి కనుకుంట్ల రాము గారిని, భువనగిరి టౌన్ BVF కొల్లూరి రామ్ చరణ్ గారిని నియమించడం జరిగినది, నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది,

ముఖ్య అతిథులుగా: బాసాని మహేందర్ యాదాద్రి జిల్లా ఉపాధ్యక్షులు, మరియు (భువనగిరి టౌను మండలం ఇన్చార్జి) గారు డాక్టర్ మంచాల మహేష్ గారు యూనివర్సిటీ లీడర్ గారిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగినది,మాట్లాడుతూ రాష్ట్ర రథసారథి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ RS ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వంలో పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే పనిచేయాలని తద్వారా పురపాలక ఎన్నికలలో గెలిచి మున్సిపల్ చైర్మన్ అయ్యేవిధంగా పనిచేయాలని మాట్లాడడం జరిగినది, ఈ కార్యక్రమానికి అసెంబ్లీ ఉపాధ్యక్షులు బర్రె నాగేష్ గారు, పాల్గొనడం జరిగినది.

    

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పయనీర్ కంపెనీ ఆధ్వర్యంలో వెలువర్తిలో ఉచిత వైద్య శిబిరం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని            వెలువర్తి గ్రామంలో పయనీర్ కంపెనీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో పయనీర్ కంపెనీ టి ఎస్ ఎం. రవళి మాట్లాడుతూ మహిళల స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వం అణచివేతలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం నుంచే అంతర్జాతీయ మహిళా దినోత్సవంపుట్టుకొచ్చిందని మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అభివృద్ధి చెందాలని అన్నారు.డాక్టర్ జ్యోతి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత పరిశుభ్రతపాటించాలనిమహిళలుపురుషులతో సమానంగా ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చెందాలని అన్నారు. మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు.పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలోఎంపీటీసీ సత్యమ్మ పంచాయతీ కార్యదర్శి నరేందర్, స్టాఫ్ నర్స్సుమతి,ఆశా వర్కర్లులక్ష్మి.జ్యోతి.రేష్మ.లక్ష్మీ నరసమ్మ. ఎండి ఆర్ రాఘవేంద్ర గ్రామప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఈనెల 9న గోపరాజు పల్లి లో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు అధికారులకు ,ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పత్రిక అందజేత


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి లో ఈనెల 9న నిర్వహించే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి అధికారులను గురువారం సాయంత్రం ఐదు గంటలకి ఆహ్వానించారు. వలిగొండ మండల తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి మరియు వలిగొండ ఎంపీడీవో జితేందర్ రెడ్డిని , స్థానిక ఎస్సై మహేందర్ లాల్, ఎంపీపీ నూతి రమేష్ రాజ్ ,జడ్పిటిసి పద్మ అనంతరెడ్డి ,కరెంటు ఏ ఈ మచ్చేందర్,గో పరాజు పల్లి జై భీమ్ సేన సభ్యులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ..స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ రాములు ,వి రత్నయ్య ,ఎస్ రమేష్ , ఎన్ నరేందర్, కట్ట సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గృహ జ్యోతి జీరో బిల్లు రాని దరఖాస్తుదారులకు ఇబ్బందులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో ని ఎంపీడీవో కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా గృహ జ్యోతి పథకానికి ఇదివరకే కరెంటు మీటర్ నెంబరు, ఆధార్ కార్డు గృహ జ్యోతి దరఖాస్తు ఫారమును సమర్పించిన గృహ జ్యోతి పథకం ప్రారంభించి నా సమయంలో కరెంటు మీటర్ రీడింగ్ బిల్లు కోట్టే సమయంలో జీరో బిల్లు రాకపోవడంతో గృహ జ్యోతి లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు అన్నారు. దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి కి సంబంధించిన దరఖాస్తు ఫారం ను మళ్లీ స్థానిక ఎంపీడీవో ఆఫీసులో సమర్పించాలని చెప్పడంతో వలిగొండ మండలంలో 37 గ్రామ పంచాయతీల ప్రజలు గృహజ్యోతి లబ్ధిదారులు గత మూడు నాలుగు రోజులగా వలిగొండ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఈ పథకం అమలుకు నానాపాట్లు పడుతున్నారు. ఈ గృహజ్యోతి పథకానికి ఆఫీసులోని సిబ్బంది వచ్చిన గృహ జ్యోతి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని లబ్ధిదారులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని వారు వాపోయారు.

వలిగొండ మండలం జిల్లాలోనే 37 గ్రామపంచాయతీలు ఉన్న పెద్ద మండలం గా ఉన్న విషయం జిల్లా అధికారులకు మండల అధికారులకు తెలిసిన విషయమే అయినప్పటికీ ఇంత పెద్ద మండలానికి ఒకే ఎంపీడీవో ఆఫీస్ కార్యాలయంలో జీరో బిల్లు రాని దరఖాస్తుదారులు దరఖాస్తు ఫారంలు సమర్పించాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు నుండి రావడం పోవడం చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఈ జీరో బిల్లు దరఖాస్తు ఫారంలను ఒకే కార్యాలయంలో కాకుండా మండలంలోని వివిధ పెద్ద పెద్ద గ్రామపంచాయతీలలో దరఖాస్తు పోరాలను స్వీకరించి గృహజ్యోతి లబ్ధిదారులకు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని

స్థానిక ఎంపీడీవో అధికారిని కోరారు.

చిత్తాపురం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం చిత్తాపురం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులుగా వి .జస్వంత్, ఎన్ శామిని ,దేవి ప్రియ, పి హేమలత ,ఎం వరుణ్ కుమార్ ,ఏ వరుణ్ తేజ్, పాల్గొన్నారు. వీరికి ప్రధానోపాధ్యాయులు విజయానంద్ బహుమతులు ప్రధానం చేశారు .ఈ కార్యక్రమంలో వాలంటీర్లు ఎస్ విజయ్ కుమార్, రస్మిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.