/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz పేద పద్మశ్రీలను ఆదరించండి- ముఖ్యమంత్రికి దాసు సురేష్ విజ్ఞప్తి Miryala Kiran Kumar
పేద పద్మశ్రీలను ఆదరించండి- ముఖ్యమంత్రికి దాసు సురేష్ విజ్ఞప్తి

పేద పద్మశ్రీలను ఆదరించండి- ముఖ్యమంత్రికి దాసు సురేష్ విజ్ఞప్తి 

పేదవర్గాల నుండి వికసించిన పద్మశ్రీ గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం 50 వేల రూపాయల పెన్షన్ 

,రాష్ట్రమంతా ఉచితంగా పర్యటించే ఆర్టీసీ రవాణా సౌకర్యంతో బాటు 10 లక్షల రూపాయల విలువైన హెల్త్ కార్డులను ఇచ్చి అండగా నిలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ సవినయంగా కోరారు.. ఇటీవల తెలంగాణ నుండి ఎంపికైన పద్మశ్రీలకు 25 లక్షల రూపాయల నగదు పారితోషకం మరియు 25 వేల రూపాయల పెన్షన్ను ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి తన మానవత్వాన్ని చాటడాన్ని తెలుగు సమాజం అంతా హర్షిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు..తెలంగాణ ఏర్పడిన నాటినుండి నేటివరకు పద్మశ్రీ గా ఎంపికైన 28 మంది పద్మశ్రీలకు పెన్షన్ మరియు ఇతర సౌకర్యాలను కల్పించి కళాకారులకు,సామాజిక కార్యకర్తలకు, స్వచ్ఛందసేవా కార్యక్రమ నివాహకులకు ముఖ్యమంత్రి ప్రేరణగా నిలవాలన్నారు..పద్మశ్రీగా ఎన్నికైన వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రైల్వే ప్రయాణంలో ఫస్ట్ క్లాస్ ప్రయాణాన్ని ఉచితంగా కల్పిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఈ అంశంపై ముఖ్యమంత్రి సత్వరమే సానుకూలంగా స్పందించి పద్మశ్రీలకు అండగా నిలవాలన్నారు .

నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షాద్ నగర్ కు చెందిన నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డికి బీ-ఫామ్ అందజేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. నవీన్ కుమార్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఒప్పందం

ప్రముఖ టాటా గ్రూప్ కంపెనీతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక ఒప్పందం 

హైదరాబాద్:మార్చి 09

ప్రముఖ టాటా గ్రూప్ కంపె నీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలోని 65 ఐటీఐ కాలేజీలలో అధునాతన సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల స్కిల్లింగ్ సెంటర్లు ఏర్పాటుకు టాటా కంపెనీ, ప్రభుత్వానికి మధ్య ఈరోజు అగ్రిమెంట్ కుదిరింది.

ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూ పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు. ఈ అగ్రిమెంట్ మేరకు రాష్ట్రంలోని ప్రభు త్వ ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా టాటా టెక్నా లజీస్ లిమిటెడ్ కంపె నీ అప్ గ్రేడ్ చేయనుంది.

ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ కింద 9 లాంగ్ టర్మ్, 23 షార్ట్ టర్మ్ కోర్సులతో పాటు నైపుణ్యాల మధ్య అంత రాన్ని తగ్గించే బ్రిడ్జి కోర్సుల నిర్వహణను టాటా టెక్నా లజీస్ అందిచనుంది.

2024-25 విద్యాసంవత్స రం నుంచే ఈ ప్రాజెక్టు అమ లుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా, శనివారం సచివాలయంలో టాటా టెక్నాలజీస్ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఇతర అధికారులు పాల్గొ న్నారు. ఈ భేటీలోనే టాటా కంపెనీకి ప్రభుత్వానికి మధ్య కుదిరింది...

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి ప్రకటించిన రేవంత్ సర్కారు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి  ప్రకటించిన రేవంత్ సర్కారు 

హైదరాబాద్ మార్చి 09 

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, ఇటీవల హైదరా బాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023- 24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కా రాలు అందజేశారు.

అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సంద ర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారా నికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

హామీ ఇచ్చిన రెండ్రోజుల్లో ప్రభుత్వం మాట నిలబెట్టు కోవడంతో ఆర్టీసీ ఉద్యోగు లకు హర్షం వ్యక్తం చేస్తున్నారు...

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు

కరీంనగర్ - బి. వినోద్ కుమార్

పెద్దపల్లి - కొప్పుల ఈశ్వర్

ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు

మహబూబాబాద్ - మాలోత్ కవిత

గత రెండు రోజులుగా ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం సమష్టి నిర్ణయం ప్రకారం నలుగురు అభ్యర్థులను అధినేత ప్రకటించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు..

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ..

హైదరాబాద్‌: బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడీ.. స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌, కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, పోలీస్ ఉన్నతాధికారులు.

రాజకీయాల పట్ల ఆసక్తి లేదు- ప్రముఖ సినీ హీరో సుమన్

రాజకీయాల పట్ల ఆసక్తి లేదు

- ప్రముఖ సినీ హీరో సుమన్

ప్రస్తుత రాజకీయాల పట్ల తనకు ఏలాంటి ఆసక్తి లేదని ప్రముఖ సినీ హీరో సుమన్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కరాటే ప్రోగ్రాములో పాల్గొని తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో సూర్యాపేటలోని రాజు గారి తోట కు విచ్చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సుమన్ యువసేన అధ్యక్షులు గుండా వెంకన్న ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా విలేకరులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై అడగగా తాను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ నుండి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పోటీపై వస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ఆయన చెప్పారు. ప్రస్తుతం కళామతల్లి సేవలోనే తరిస్తానని తెలిపారు. రాజకీయాల్లో చేరాలని ఆసక్తి కలిగినప్పుడు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ యువసేన సభ్యులు కర్నాటి రంగయ్య, గోపారపు రాజు, బొల్లం సురేష్, గుడిపాటి రమేష్, బోనగిరి విజయకుమార్, బచ్చు పురుషోత్తం* తదితరులు పాల్గొన్నారు.

లేబర్ అధికారుల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి,పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి

లేబర్ అధికారుల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

 పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి

   దండంపల్లి సత్తయ్య

   నూతన ప్రభుత్వం కార్మిక శాఖను సమీక్షించి లేబర్ అధికారుల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు 

       ఆదివారం సుందరయ్య భవన్లో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ శాఖలో నూతన నియామకాలు లేక కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో విచారణ చేసి క్లెయిమ్స్ విడుదల కాక వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ ,కుటుంబ సభ్యుల చేర్పింపు, ప్రసూతి ,వివాహ కానుకలు కార్మికులకు అందజేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం నివారించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న భవన నిర్మాణ ముడి సరుకుల ధరల వలన పనులు కోల్పోతున్న రోజువారి అడ్డా కూలీలను సంక్షేమ బోర్డు ద్వారా నమోదు చేసుకొని సగం కూలి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

     *తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పట్టణ అధ్యక్షుడు సలివోలు సైదాచారి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బై రోజు ఆంజనేయులు, కోశాధికారి కావునపల్లి సురేష్, సహాయ కార్యదర్శి గడగోజు సైదాచారి, ప్రచార కార్యదర్శి గడగోజు శ్రీనివాసచారి, సభ్యులు విశ్వనాధుల ఈశ్వర చారి, రత్నాచారి ,మదనాచారి, భాస్కరాచారి, పోలోజు రవి, విశ్వనాధుల శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.

విజయవంతమైన బీసీ రాజ్యాధికార సమితి సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సు, ప్రజా పాలనలో అన్ని వర్గాలను బాగసామ్యూల్ని చేయండి: దాసు సురేష్

అగ్రవర్ణాలకే అవకాశాలిస్తే సామాజిక న్యాయం సాధ్యమయ్యేదెలా ? దాసు సురేశ్ 

 

ప్రజాపాలనలో సబ్బండ వర్గాలనూ భాగస్వామ్యుల్ని చెయ్యండి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి.

సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సులో సమాన అవకాశాలపై తీర్మానించిన బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు.

బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసు సురేశ్ నేతృత్వంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్ , అజీజ్ పాషా , ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విషారధన్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు .. 

తెలంగాణలో దశాబ్దాలుగా వివక్షకు, నిరాదరణకు లోనవుతున్న బీసీ, అణగారిన వర్గాలు తమ అవకాశాలకోసం నేటికీ పోరాడాల్సిన పరిస్థితులే నెలకొన్నాయని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సులో పలు సామాజిక ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సామూహికంగా నినదించారు ..

ప్రస్తుత ప్రభుత్వంలో అవకాశాలు పదవులు కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి చెందడం తెలంగాణ ప్రజలను సబ్బండ వర్గాల ప్రజలను ఆలోచింపజేస్తుందని సభాధ్యక్షులు దాసు సురేశ్ తన ప్రారభోపన్యాసంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా భావించి ప్రజలు గెలిపిస్తే అటువంటి ప్రజా ప్రభుత్వంలో బీసీ దళిత గిరిజన మైనార్టీలకు సముచిత ప్రాతినిధ్యం లేకపోవడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు..ఆర్థికంగా ఎదగడానికి ఈ వర్గాలకు ప్రత్యేకమైన ఫైనాన్స్ కమీషన్ ను, పారిశ్రామిక, వ్యాపార ఔత్సాహిక విభాగాలను అందుకు అవసరమైన ఆర్థిక సబ్ ప్లాన్ ను ప్రభుత్వం అమలుచేయాలన్నారు.. 

జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి సమాన అవకాశాల గురించి అనేక సమావేశాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ ఇదే స్పూర్తితో బీసీ ఎస్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం గా అవకాశాలను కల్పించాలని జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోరారు .. గత ప్రభుత్వం 4 గురు బీసీలకు మంత్రులుగా అవకాశమివ్వగా ఈ ప్రభుత్వంలో కేవలం రెండు మంత్రివర్గ పదవులకే బీసీలను పరిమితం చేయడం భాధాకరమన్నారు.. రానున్న పార్లమెంటు ఎన్నికలలో 8 స్థానాలకు తగ్గకుండా బీసీ లకు అవకాశమివ్వాలన్నారు.. 

అలుపెరగకుండా నిరంతరం క్షేత్రస్థాయి పోరాటాలు చేయడం ద్వారానే బీసీలు, అణగారిన వర్గాలకు అధికారం దక్కుతుందని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు.. ప్రగతి భవన్ పేరును జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా మార్చినంత మాత్రాన ఆ మహనీయుని ఆశయాలు నెరవేరవని జ్యోతిబాపూలే ఆకాంక్షించిన సమసమాజ స్థాపన, సబ్బండ వర్గాలను అధికారానికి చేరువ చేయడం ద్వారానే ఆ మహనీయుని ఆకాంక్షలు నెరవేరుతాయని తెలిపారు ..

తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజా పాలన కొనసాగిస్తామని , సామాజిక న్యాయ సాధన చేకూరుస్తామని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరకు తెలంగాణలో రాజకీయ ప్రాతినిధ్యపు అవకాశాలను కేవలం ఒకే ఒక్క సామాజిక వర్గానికి పరిమితంచేస్తూ ఇతర వర్గాలను అపహాస్యం , అవహేళన చేస్తున్నదని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు ..ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మెజారిటీ పదవులను కేవలం ఒకేఒక్క సామాజిక వర్గానికి కట్టబెట్టడం తీవ్ర అభ్యంత్రకరమన్నారు.. 

 బీసీలు అనగారిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగనిదే రాజకీయంగా ఎదగడం కష్టమని మాజీ ఎంపీ అజీజ్ పాషా తెలిపారు బీసీలకు ప్రత్యేకమైన పారిశ్రామిక పాలసీని ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు

పార్లమెంట్లోని ఓబిసి స్టాండింగ్ కమిటీ మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో బీసీ లెజిస్లేచర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ భలపరిచారు.,రానున్న ఎన్నికలలో మెజారిటీ బీసీలు అధికారం చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు..

రాజ్యాధికార మూలాలు చరిత్రలోనే ఉన్నాయని బీసీ దళిత గిరిజన మైనారిటీ వర్గాలు తమ చరిత్రను తెలుసుకోగలిగినప్పుడే భవిష్యత్తు నిర్మాణం, రాజ్యాధికారాన్ని చేపట్టగలుగుతారని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహరాజ్ పేర్కొన్నారు

పరిపాలన తమకు చేతకాదా అని, పాలనలో తమకు భాగస్వామ్యం కావాలని పలువురు వక్తలునినదించారు..  

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కన్వీనర్ గుజకృష్ణ ,బిసి రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ ముఖ్య నాయకులు గాజు యుగేందర్ యాదవ్ , ఊరుగొండ శివ, మడత కిశోర్ , బీసీ ఉద్యోగ సంఘాల చైర్మన్ దానకర్ణ చారి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ వ్యవస్థాపక సభ్యురాలు కృష్ణ లత కన్వీనర్ బోనం ఊర్మిళ సలహాదారులు సిహెచ్ భద్ర పూసల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, పొదిల రాజు , , సాయిబాబా , యువ నాయకులు పాక శ్రీనివాస్ రోజా నేత బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి జక్కని సంజయ్, సౌత్ ఇండియా కాపు సంక్షేమ సంఘం వేల్పురి శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు జంపాల రాజేష్ పద్మశాలీ సంఘం అధ్యక్షులు బూర మల్లేశం బిజెపి బీసీ మోర్చా నాయకులు బొమ్మిడాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ 

 తుంగతుర్తి లో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని జీవో నెంబర్ 2 అడ్వకేసి పదాన్ని తొలగించాలని జీవో నెంబర్ 342 అమలు చేసి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు bed హాయ్ రెడికేషన్ చేయుటకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అధ్యక్షులు బోయ రాములు బహుజన టీచర్స్ యూనియన్ నాయకులు ఇటికాల రవీందర్ 

ఎర్ర యాదగిరి సూర్యాపేట మాజీ జిల్లా అధ్యక్షులు మిట్ట గడపల రామ్మోహన్ దర్శనం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.