/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz రాజకీయాల పట్ల ఆసక్తి లేదు- ప్రముఖ సినీ హీరో సుమన్ Miryala Kiran Kumar
రాజకీయాల పట్ల ఆసక్తి లేదు- ప్రముఖ సినీ హీరో సుమన్

రాజకీయాల పట్ల ఆసక్తి లేదు

- ప్రముఖ సినీ హీరో సుమన్

ప్రస్తుత రాజకీయాల పట్ల తనకు ఏలాంటి ఆసక్తి లేదని ప్రముఖ సినీ హీరో సుమన్ అన్నారు. ఆదివారం ఖమ్మంలోని కరాటే ప్రోగ్రాములో పాల్గొని తిరుగు ప్రయాణంలో మార్గ మధ్యలో సూర్యాపేటలోని రాజు గారి తోట కు విచ్చేశారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా సుమన్ యువసేన అధ్యక్షులు గుండా వెంకన్న ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా విలేకరులు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ విషయమై అడగగా తాను తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ నుండి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పోటీపై వస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ఆయన చెప్పారు. ప్రస్తుతం కళామతల్లి సేవలోనే తరిస్తానని తెలిపారు. రాజకీయాల్లో చేరాలని ఆసక్తి కలిగినప్పుడు తెలియజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుమన్ యువసేన సభ్యులు కర్నాటి రంగయ్య, గోపారపు రాజు, బొల్లం సురేష్, గుడిపాటి రమేష్, బోనగిరి విజయకుమార్, బచ్చు పురుషోత్తం* తదితరులు పాల్గొన్నారు.

లేబర్ అధికారుల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి,పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి

లేబర్ అధికారుల ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

 పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలి

   దండంపల్లి సత్తయ్య

   నూతన ప్రభుత్వం కార్మిక శాఖను సమీక్షించి లేబర్ అధికారుల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు 

       ఆదివారం సుందరయ్య భవన్లో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నల్గొండ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన సత్తయ్య మాట్లాడుతూ శాఖలో నూతన నియామకాలు లేక కార్మికులకు అందాల్సిన సంక్షేమ పథకాలు సకాలంలో విచారణ చేసి క్లెయిమ్స్ విడుదల కాక వందలాది దరఖాస్తులు పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ ,కుటుంబ సభ్యుల చేర్పింపు, ప్రసూతి ,వివాహ కానుకలు కార్మికులకు అందజేయడంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం నివారించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న భవన నిర్మాణ ముడి సరుకుల ధరల వలన పనులు కోల్పోతున్న రోజువారి అడ్డా కూలీలను సంక్షేమ బోర్డు ద్వారా నమోదు చేసుకొని సగం కూలి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

     *తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) పట్టణ అధ్యక్షుడు సలివోలు సైదాచారి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు బై రోజు ఆంజనేయులు, కోశాధికారి కావునపల్లి సురేష్, సహాయ కార్యదర్శి గడగోజు సైదాచారి, ప్రచార కార్యదర్శి గడగోజు శ్రీనివాసచారి, సభ్యులు విశ్వనాధుల ఈశ్వర చారి, రత్నాచారి ,మదనాచారి, భాస్కరాచారి, పోలోజు రవి, విశ్వనాధుల శ్రీనివాసచారి, తదితరులు పాల్గొన్నారు.

విజయవంతమైన బీసీ రాజ్యాధికార సమితి సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సు, ప్రజా పాలనలో అన్ని వర్గాలను బాగసామ్యూల్ని చేయండి: దాసు సురేష్

అగ్రవర్ణాలకే అవకాశాలిస్తే సామాజిక న్యాయం సాధ్యమయ్యేదెలా ? దాసు సురేశ్ 

 

ప్రజాపాలనలో సబ్బండ వర్గాలనూ భాగస్వామ్యుల్ని చెయ్యండి ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి.

సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సులో సమాన అవకాశాలపై తీర్మానించిన బిసి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు.

బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు దాసు సురేశ్ నేతృత్వంలో శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి మాజీ ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్ , అజీజ్ పాషా , ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు విషారధన్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు .. 

తెలంగాణలో దశాబ్దాలుగా వివక్షకు, నిరాదరణకు లోనవుతున్న బీసీ, అణగారిన వర్గాలు తమ అవకాశాలకోసం నేటికీ పోరాడాల్సిన పరిస్థితులే నెలకొన్నాయని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ సదస్సులో పలు సామాజిక ప్రజా సంఘాల నాయకులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు సామూహికంగా నినదించారు ..

ప్రస్తుత ప్రభుత్వంలో అవకాశాలు పదవులు కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి చెందడం తెలంగాణ ప్రజలను సబ్బండ వర్గాల ప్రజలను ఆలోచింపజేస్తుందని సభాధ్యక్షులు దాసు సురేశ్ తన ప్రారభోపన్యాసంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తమ ప్రభుత్వంగా భావించి ప్రజలు గెలిపిస్తే అటువంటి ప్రజా ప్రభుత్వంలో బీసీ దళిత గిరిజన మైనార్టీలకు సముచిత ప్రాతినిధ్యం లేకపోవడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు..ఆర్థికంగా ఎదగడానికి ఈ వర్గాలకు ప్రత్యేకమైన ఫైనాన్స్ కమీషన్ ను, పారిశ్రామిక, వ్యాపార ఔత్సాహిక విభాగాలను అందుకు అవసరమైన ఆర్థిక సబ్ ప్లాన్ ను ప్రభుత్వం అమలుచేయాలన్నారు.. 

జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి సమాన అవకాశాల గురించి అనేక సమావేశాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ ఇదే స్పూర్తితో బీసీ ఎస్టీ వర్గాలకు డిప్యూటీ సీఎం గా అవకాశాలను కల్పించాలని జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కోరారు .. గత ప్రభుత్వం 4 గురు బీసీలకు మంత్రులుగా అవకాశమివ్వగా ఈ ప్రభుత్వంలో కేవలం రెండు మంత్రివర్గ పదవులకే బీసీలను పరిమితం చేయడం భాధాకరమన్నారు.. రానున్న పార్లమెంటు ఎన్నికలలో 8 స్థానాలకు తగ్గకుండా బీసీ లకు అవకాశమివ్వాలన్నారు.. 

అలుపెరగకుండా నిరంతరం క్షేత్రస్థాయి పోరాటాలు చేయడం ద్వారానే బీసీలు, అణగారిన వర్గాలకు అధికారం దక్కుతుందని మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ పేర్కొన్నారు.. ప్రగతి భవన్ పేరును జ్యోతిబాపూలే ప్రజా భవన్ గా మార్చినంత మాత్రాన ఆ మహనీయుని ఆశయాలు నెరవేరవని జ్యోతిబాపూలే ఆకాంక్షించిన సమసమాజ స్థాపన, సబ్బండ వర్గాలను అధికారానికి చేరువ చేయడం ద్వారానే ఆ మహనీయుని ఆకాంక్షలు నెరవేరుతాయని తెలిపారు ..

తెలంగాణలో అధికారంలోకి వచ్చి ప్రజా పాలన కొనసాగిస్తామని , సామాజిక న్యాయ సాధన చేకూరుస్తామని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చివరకు తెలంగాణలో రాజకీయ ప్రాతినిధ్యపు అవకాశాలను కేవలం ఒకే ఒక్క సామాజిక వర్గానికి పరిమితంచేస్తూ ఇతర వర్గాలను అపహాస్యం , అవహేళన చేస్తున్నదని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు ..ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన మెజారిటీ పదవులను కేవలం ఒకేఒక్క సామాజిక వర్గానికి కట్టబెట్టడం తీవ్ర అభ్యంత్రకరమన్నారు.. 

 బీసీలు అనగారిన వర్గాలు ఆర్థికంగా సామాజికంగా ఎదగనిదే రాజకీయంగా ఎదగడం కష్టమని మాజీ ఎంపీ అజీజ్ పాషా తెలిపారు బీసీలకు ప్రత్యేకమైన పారిశ్రామిక పాలసీని ఫైనాన్స్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు

పార్లమెంట్లోని ఓబిసి స్టాండింగ్ కమిటీ మాదిరిగా తెలంగాణ అసెంబ్లీలో బీసీ లెజిస్లేచర్ కమిటీని ఏర్పాటు చేయాలని ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ భలపరిచారు.,రానున్న ఎన్నికలలో మెజారిటీ బీసీలు అధికారం చేపట్టే విధంగా కార్యాచరణ రూపొందించారు..

రాజ్యాధికార మూలాలు చరిత్రలోనే ఉన్నాయని బీసీ దళిత గిరిజన మైనారిటీ వర్గాలు తమ చరిత్రను తెలుసుకోగలిగినప్పుడే భవిష్యత్తు నిర్మాణం, రాజ్యాధికారాన్ని చేపట్టగలుగుతారని ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశారదన్ మహరాజ్ పేర్కొన్నారు

పరిపాలన తమకు చేతకాదా అని, పాలనలో తమకు భాగస్వామ్యం కావాలని పలువురు వక్తలునినదించారు..  

ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కన్వీనర్ గుజకృష్ణ ,బిసి రాజ్యాధికార సమితి గౌరవ అధ్యక్షులు దొంత ఆనందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఇంజనీర్ ఆళ్ల రామకృష్ణ ముఖ్య నాయకులు గాజు యుగేందర్ యాదవ్ , ఊరుగొండ శివ, మడత కిశోర్ , బీసీ ఉద్యోగ సంఘాల చైర్మన్ దానకర్ణ చారి ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ వ్యవస్థాపక సభ్యురాలు కృష్ణ లత కన్వీనర్ బోనం ఊర్మిళ సలహాదారులు సిహెచ్ భద్ర పూసల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, పొదిల రాజు , , సాయిబాబా , యువ నాయకులు పాక శ్రీనివాస్ రోజా నేత బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి జక్కని సంజయ్, సౌత్ ఇండియా కాపు సంక్షేమ సంఘం వేల్పురి శ్రీనివాస్, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు జంపాల రాజేష్ పద్మశాలీ సంఘం అధ్యక్షులు బూర మల్లేశం బిజెపి బీసీ మోర్చా నాయకులు బొమ్మిడాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు

తుంగతుర్తి శాసనసభ్యులు మందుల శామ్యూల్ మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొంపెల్లి బిక్షపతి మరియు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ 

 తుంగతుర్తి లో జరిగినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఎమ్మెల్యే మందుల శామ్యూల్ గారిని ఘనంగా సత్కరించడం జరిగింది.

ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలని జీవో నెంబర్ 2 అడ్వకేసి పదాన్ని తొలగించాలని జీవో నెంబర్ 342 అమలు చేసి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయులకు bed హాయ్ రెడికేషన్ చేయుటకు అవకాశం కల్పించాలని ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో యాదాద్రి జిల్లా అధ్యక్షులు బోయ రాములు బహుజన టీచర్స్ యూనియన్ నాయకులు ఇటికాల రవీందర్ 

ఎర్ర యాదగిరి సూర్యాపేట మాజీ జిల్లా అధ్యక్షులు మిట్ట గడపల రామ్మోహన్ దర్శనం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలపై స్పష్టతనివ్వాలి:ఏఐటీయూసీ రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలపై స్పష్టతనివ్వాలి

     ఏఐటీయూసీ రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్

*

   సింగరేణిలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం స్పష్టత నివ్వాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-AITUC కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య డిమాండ్ చేశారు.శనివారం నాడు కొత్తగూడెం కార్పొరేట్ లో కాంట్రాక్ట్ కార్మికుల పని ప్రదేశాలలో జనరల్ బాడీ సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడి మూడు నెలలు పూర్తికావస్తున్నప్పటికీ, హైకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాల జీవోలను అమలు చేయడంలో కానీ, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచే విషయంలో కానీ సానుకూలంగా ఉన్నామని చెబుతూనే వేతనాలను పెంచకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.సింగరేణి యాజమాన్యం కూడా వేతనాలను పెంచే విషయంలో, పెండింగ్ లో ఉన్న జెఏసి ఒప్పందంలోని అంశాలను అమలు చేసే విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని,కొత్తగా వచ్చిన సింగరేణి చైర్మన్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని కానీ ఎటువంటి ఫలితం రావడంలేదని విమర్శించారు.బ్యాంకుల ద్వారా చెల్లించే ప్రమాద బీమా విషయంలో కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఏ బ్యాంకులలో బ్యాంకు ఖాతాలను కొనసాగించాలి అనేదానిపై మార్గదర్శకాలను తెలుపాలని కోరారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి భారం పడదని,ఇప్పటికైనా వేతనాలను పెంచే విషయంలో స్పష్టత నివ్వాలని డిమాండ్ చేశారు.సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టు కార్మికులు నిరాశతో ఆందోళన చెందుతున్నారని తెలిపారు.కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల ఇతర సమస్యల గురించి అసెంబ్లీ సమావేశాలలో,సింగరేణి యాజమాన్యం దగ్గర గతం కంటే కొంత మెరుగుగా చర్చలు జరుగుతున్నప్పటికీ వేతనాల పెంపుదళలో జాప్యం జరగడం సరికాదని విమర్శించారు.తక్షణమే సింగరేణి యాజమాన్యం, తెలంగాణ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల కోడ్ లోపల సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని లేనియెడల నిరసనలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఏం చంద్రశేఖర్, కే నరసింహారావు, వినోద, శంకర్, అనసూర్య,శాంత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండలో ఘనంగా సద్గురు సంత్ సేవాలాల్ జన్మదిన వేడుకలు, వేడుకలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టేల శివకుమార్

నల్లగొండలో ఘనంగా సద్గురు సంత్ సేవాలాల్ జన్మదిన వేడుకలు, వేడుకలో పాల్గొన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కట్టేల శివకుమార్

నల్గొండ జిల్లా లో సద్గురు సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను క్లాక్ టవర్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి asp నాయక్ మరియు ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అభగోని రమేష్ గౌడ్ రావడం జరిగింది ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ కొండ జిల్లాలో బంజారా భవన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సేవాలాల్ ఆసియా సాధన కోసం కృషి చేయాలని విద్యతోనే రాజ్యాధికారం సాధించవచ్చని తెలియజేశారు కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్డిఓ ప్రవీణ్ నాయక్ నల్గొండ ఎమ్మార్వో ఆర్డీవో డిటిడబ్ల్యూ రాజకుమార్ కౌన్సిలర్ ప్రదీప్ డాక్టర్ మాతృ రవి నాయక్ వెంకటేష్ నాయక్ త్రిక చైర్మన్ బిక్కు కమిషన్ నెంబర్ సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ రాజ్యాధికార సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గపు సతీష్ ఇమ్రాన్ భగవాన్ నాయక్ చందులాల్ సురేందర్ నాయక్ మహేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో కనిపించని సామాజిక న్యాయం... బిసి అణగారిన వర్గాల రాజకీయ అభివృద్ధికై మార్చి 2న ఆత్మగౌరవ సదస్సు: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షుడు

రాజకీయాల్లో కనిపించని సామాజిక న్యాయం.. మార్చ్2న హైద్రాబాద్లో బీసీ,అణగారిన వర్గాల ఆత్మగౌరవ సదస్సు.. దాసు సురేశ్ - అధ్యక్షులు; బీసీ రాజ్యాధికార సమితి

ప్రస్తుత రాజకీయాల్లో సామాజిక న్యాయం క్రమంగా కనుమరుగవుతున్నదనీ, బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఆర్థికంగా బలంగా లేకపోవడంతో రాజకీయాల్లో అవకాశాలకు ఆమడ దూరంలో నెట్టివేయబడుతున్నాయని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఓక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు..సామాజిక న్యాయం వివిధ పార్టీల విధానాల్లో, మేనిఫెస్టోలలో ప్రచురితమవుతున్నా దానిని అమలు విషయంలో మాత్రం పార్టీలకు చిత్తశుద్ధి కరువవుతుందని పేర్కొన్నారు .. ఈ దరిమిలా బీసీ అణగారిన వర్గాల “ఆత్మగౌరవ సదస్సును” మార్చి 2వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా నిర్వహించనున్నామని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు..  

సామాజిక మార్పు కోసం తెలంగాణ ప్రజలు ఎంచుకున్న ప్రభుత్వంలో సబ్బండ వర్గాలు ఏ విధమైన పరిపాలనను కోరుకుంటున్నాయో స్వయంగా తెలియజెప్పడానికి వివిధ రాజకీయ పార్టీల బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతినిధులు, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, న్యాయ వ్యవస్థలోని ప్రముఖులు, జర్నలిస్టులు విద్యార్థి, ఉద్యమ ,కార్మిక మహిళా నాయకులు, వివిధ కులసంఘాల నాయకులు ఈ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలను వెలుబుచ్చనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నాయకులు నేతృత్వం వహించనున్నారని దాసు సురేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు..

కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్

కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి: బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్

కులగణన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలి.. కులగణన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు కనీసం 6 మంత్రి పదవులను, 10 ఎంపీ సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దా సురేష్ డిమాండ్..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమగ్ర కులగణన తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని ఇదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ఈ తీర్మానానికి మద్దతు తెలుపడం హార్షనీయమని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ తెలిపారు.. శనివారం బాగ్లింగంపల్లిలోని కేంద్ర కార్యాలయం నందు ఏర్పాటు చేసిన తెలంగాణ మేధావుల మేధోమధన కార్యక్రమానికి పలు రాజకీయ పార్టీలు, సామాజిక ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు..

సభాధ్యక్షత వహించిన దాసురేష్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం అస్పష్టంగా ఉందని తీర్మానం కాకుండా దీనికి జ్యూడిషల్ కమిషన్ లేదా ప్రత్యేకమైన బిల్లు ప్రవేశపెడితే తెలంగాణ ప్రజానీకానికి మరింత ఉపయోగంగా ఉండేదన్నారు.. తెలంగాణలో ప్రభుత్వం మారినా నేటికీ బీసీలపై అవకాశాలపరంగా వివక్ష కొనసాగుతూనే ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.. గత ప్రభుత్వంలో బీసీలకు నాలుగు మంత్రి పదవులు దక్కగా కాంగ్రెస్ పాలనలో నేడు కేవలం రెండు మంత్రి పదవులు మాత్రమే బీసీల చేతుల్లో ఉన్నాయన్నారు.. బీసీలకు కూడా ఉపముఖ్యమంత్రి పదవి దక్కాలని ఆకాంక్షిస్తున్నామన్నారు..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తామన్న కులగణకుకు చట్టబద్ధత లేకపోవడంవలన ప్రజాధనం నిష్ప్రయోజనమయ్యే అవకాశముందన్నారు .. అసెంబ్లీ తీర్మానం కంటే కులగణనను చట్టం చేయడం మరింత మెరుగైన విధానం అని దాసు సురేశ్ తెలిపారు. 2016లో కర్ణాటకలో 160 కోట్లతో 45 రోజులు లక్షా అరవై వేల మందితో నిర్వహించిన కులగణన ఫలితాలు నేటికీ బయటకు రాక ఫలితాలు ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడకపోవడాన్ని ఒకసారి పరిశీలించాలన్నారు.

రాష్ట్రంలో ఆస్తులు అగ్రవర్ణాలకు , అప్పులు బలహీన్న వర్గాలకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటివరకు రాష్ట్ర అప్పు 7.33 లక్షల కోట్లు కాగా కాళేశ్వరంలో అదనపు టిఎంసి కోసం వెచ్చించింది 1,40,000 కోట్లు అయితే ప్రతి సంవత్సరం అప్పుల వడ్డీకి చెల్లించడానికి 14000 కోట్లు ఖర్చు అవుతుండగా దీని భారం బలహీనవర్గాల మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు..

కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిన విధంగా ఐదు సంవత్సరాలకు గాను బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ను కేటాయిస్తామని, నిధులను సబ్ ప్లాన్ లో చేరుస్తామని కాంగ్రెస్ చెప్పిన హామీ ఏమయిందని దాసురేష్ ప్రశ్నించారు.. ఈ హామీ ప్రకారం ఈ వార్షిక బడ్జెట్లో చేర్చాల్సిన 20 వేల కోట్లకు గాను కేవలం 8000 కోట్లను మాత్రమే బీసీ సంక్షేమానికి వినియోగించడం ఏ మేరకు సబబు అని ప్రశ్నించారు..

బీసీల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ కంటే మెరుగ్గా పనిచేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బీసీలకు కేటాయించిన నాలుగు మంత్రి పదవులు అయినా ఎందుకు కేటాయించలేక పోతుందని ప్రశ్నించారు.. మంత్రి పదవులకు ప్రాతినిధ్యం లేని కులాలకు చెందిన వాకిటి శ్రీహరి ముదిరాజ్, వీర్లపల్లి శంకర్, బీర్ల ఐలయ్య , మఖన్ సింగ్, ఆది శ్రీనివాస్ లేదా అపారమైన అనుభవం ఉన్న మహేష్ కుమార్ గౌడ్ లకు ఎందుకు అవకాశం కల్పించరని ప్రశ్నించారు..

బీసీ ఉద్యమ నేత విజిఆర్ నారగోని అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలే తప్ప అవినీతి అధికారులు, నాయకులపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.. ప్రభుత్వం నియమించుకున్న సలహాదారులు ఉన్నత స్థాయి పదవులను కేవలం ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడం , ప్రాతినిధ్యం ఇవ్వడం సమసమాజ నిర్మాణానికి విఘాతకమన్నారు..ఇతర వర్గాలకు సమర్ధత లేదా అని ప్రశ్నించారు..సీఎంఓలో బీసీలకు సముచిత ప్రాధాన్యత ఎందుకు లేదన్నారు ..?

మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ , గురుకుల పాఠశాలలకు సమీకృత భవనాలను ఎప్పటి వరకు పూర్తి చేస్తారో కాలపరిమితిని తెలపాలన్నారు.. ఆదిలాబాద్,నిజామాబాద్,రంగారెడ్డి,హైదరాబాద్ జిల్లా నుండి ఒక్క మంత్రి లేకపోవడం పరిపాలన సౌభ్యానికి ఇబ్బంది కలుగుతుందని తెలియజేశారు.. అనుభవజ్ఞుడైన ఆకునూరి మురళి (ఐఏఎస్) లాంటి వారిని కాదని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డిజిపి మహేందర్ రెడ్డి కి టీఎస్పీఎస్సీ చైర్మన్గా నియమించడం దేనికి నిదర్శనం అన్నారు.. పాత నియామకాలే తప్ప కొత్త నోటిఫికేషన్లు ప్రభుత్వంలో కరువైనాయన్నారు.

సోషల్ జస్టిస్ జాక్ చైర్మన్ ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ , ఉదయపూర్ డెకరేషన్ ప్రకారం ప్రతి పార్లమెంటు నియోజకవర్గం లో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయిస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని దాసు సురేశ్ ప్రశ్నించారు.. పార్లమెంటు సీట్ల పంపకంలో నైనా బీసీలకు పది సీట్లు కేటాయించాలన్నారు..

ఈ కార్యక్రమంలో ఓబీసీ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ చైర్మన్ ఆళ్ల రామకృష్ణా ,బిసి రాజ్యాధికార సమితి సెక్రటరీ సుధాకర్ , వై బాలకృష్ణ , మహిళా అధ్యక్షురాలు బోనం ఊర్మిళ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు బండారు పద్మావతి ప్రధాన కార్యదర్శి గోశిక స్వప్న , ప్యారసాని దుర్గేష్, వైద్యనాథ్, సికిందరాబాద్ నియోజక వర్గ కన్వీనర్ బొమ్మ నరేందర్ , వరంగల్ జిల్లా కన్వీనర్ పొదిల రాజు , పన్నీరు కృష్ణ కొండా యాదగిరి, దాసు బలరాం తదితరులు పాల్గొన్నారు ..

జర్నలిస్ట్ శంకర్ ను పరామర్శించిన బి.ఆర్.ఎస్ నేత ధనుంజయ నేత

జర్నలిస్టు శంకరుని పరామర్శించిన బిఆర్ఎస్ నేత పెండెం ధనుంజయ నేత

దాడికి గురైన జర్నలిస్ట్ శంకర్ని హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో డిశ్చార్జ్ సమయంలో కలిసి పరామర్శించిన పెండెం ధనంజయ నేత. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

సమాజంలో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల అభివృద్ధి కొరకు పనిచేసే ఇలాంటి జర్నలిస్టులు దాడికి గురి కావడం విచారకరమని ఆయన తెలియజేశారు, తెలంగాణ ప్రభుత్వం లో మరొకసారి ఇలాంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు..

ఆమ్ ఆద్మీ పార్టీ నేతల సంచలన ఆరోపణలు..

2, 3 రోజుల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తారంటున్న ఆప్.. ఇండియా కూటమి నుంచి వైదొలగాలని బెదిరింపులు వస్తున్నాయన్న ఆప్ నేతలు.. సీఆర్పీ 41 కింద నోటీసులిచ్చి.. సీబీఐ, ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఆమ్ ఆద్మీ.. ఇప్పటికే కేజ్రీవాల్ కు 7వ సారి నోటీసులు ఇచ్చిన ఈడీ.. ఈ నెల 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న ఈడీ.. అదే రోజు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ అనుమానం..