/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య Yadagiri Goud
ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక పోయిన విద్యార్థి ఆత్మహత్య

ఒక్క నిమిషం ఆలస్యం నిబంధనతో పరీక్ష రాయలేక ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటుచేసుకుంది.

బుధవారం నుంచి తెలంగా ణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమ య్యాయి. ఒక్క నిమిషం కూడా అలస్యమైనా పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుతించబోమన్న నిబంధన పెట్టారు. అధికారులు.

ఈక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులు.. సమయానికి సెంటర్ దగ్గరకు రాకపోవ డంతో వారిని పరీక్ష రాసేందుకు అనుమ తించలేదు.

ఇందులో మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే విద్యార్థి కూడా ఉన్నాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివకుమార్.. గురువారం సాత్నాల ప్రాజెక్ట్ డ్యామ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

పరీక్ష రాయలేకపోయాననే మనోవేదనతో చనిపోతు న్నట్లు తన తండ్రికి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మార్చి 1న మేడిగడ్డకు వెళ్తున్నాం

మార్చి 1న మేడిగడ్డకు వెళ్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. మేడిగడ్డపై సీఎం రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు..

మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, వ్యవసాయ రంగ ప్రాజెక్టుల్లో..అవినీతి జరిగిందని విమర్శలు చేయడం సరికాదన్నారు. కాళేశ్వరంతో 90 వేల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చామని తెలిపారు.

మేడిగడ్డపై కాలయాపన చేయకుండా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టు కొట్టుకుపోవాలని చూస్తు న్నారని మండిపడ్డారు

కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం

కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలను బుధవారం సాయంత్రం ఆవిష్కరిం చారు.మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్క రించారు..

కేటీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రజలకు వివరిస్తూ సమర్థవంతంగా తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు.

కాళేశ్వరాన్ని బూచిగా చూపి ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు.

మార్చి 4 నుంచి తెలంగాణలో ప్రధాని ఎన్నికల శంఖారావం

రాష్ట్రంలో బిజెపి అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపి సీట్లు లక్షంగా ముందుస్తు ప్రచారానికి నడుం బిగించారు.

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ కంటే ముందుగా ప్రచారం చేపట్టి ప్రజలను ఆకట్టుకునేందుకు ఆపార్టీ నేతలు వ్యుహాలు రచిస్తు న్నారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందు ఆదిలాబాద్, సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన సభలకు ప్రధాని మోడీ హాజరై ఎన్నికల ప్రచారం ప్రారంభించ నున్నారు.

మార్చి 4, 5 తేదీల్లో బహిరంగసభలతో పాటు పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారని పార్టీ సీనియర్లు వెల్లడించారు. వచ్చే నెల 4న హైదరా బాద్‌లో అమిత్ షా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న సభ రద్దు అయినట్లు చెప్పారు.

ప్రధాని మోడీ షెడ్యూల్……

4వ తేదీన అదిలాబాద్, 5వ తేదీన సంగారెడ్డిలో పర్యటన

4వ తేదీ ఉదయం 10.30 నుండి 11 గంటల వరకు అదిలాబాద్ లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం.

ఉదయం 11.15 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అదిలాబా ద్‌లో బహిరంగ సభ రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస..

5వ తేదీన సంగారెడ్డిలో…..

ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలు దేరనున్న మోడీ

ఉదయం 10. 45 నుండి 11.15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.15 వరకు బహిరంగ సభ తరువాత ఒడిషాకు వెళ్లనున్న మోడీ

జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం

జార్ఖండ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 12 మంది దుర్మరణం చెందినట్లు సమాచారం.

రైల్లో మంటలు చెలరేగ డంతో భయాందోళనతో ప్రయాణికులు కిందకు దూకేశారు.అదే సమ యంలో ఝఝా-అసన్సోల్ రైలు ఎదురుగా వస్తోంది. దీంతో ఆ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయారు

ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అక్కడి పరిస్థితుల ఆధారంగా.. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు.

బుధవారం సాయంత్రం జంతారా జిల్లా కళా ఝారియా రైల్వే స్టేషన్‌ వద్ద ఈ ఘటన చోటుచేసు కుంది. అసాన్సోల్‌-ఝాఝా మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు వీళ్లను ఢీ కొట్టినట్లు తెలుస్తోంది.

ఘటనాస్థలానికి చేరుకున్న వైద్య బృందాలు, అంబు లెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది

11062 వేల పోస్టులతో DSC నోటిఫికేషన్?

•పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేకుండానే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం.. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ సర్కార్ రద్దు చేసింది.

అయితే.. 2023 సెప్టెం బర్‌లో 5089 ఉపాధాయ పోస్టులకు.. కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. ఆ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసిన రేవంత్ సర్కార్... పాత నోటిఫి కేషన్‌లో ఇచ్చిన 5089 పోస్టులకు అదనంగా మరో 5973 పోస్టులను కలిపి మొత్తంగా 11,062 పోస్టులతో రేపు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ పోస్టుల్లో 6,500కు పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 2,600 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 700 పండిట్‌ పోస్టులు ఉండగా.. PET పోస్టులు 190 ఉన్నట్టు సమాచారం.

అయితే.. గత ప్రభుత్వం ఇచ్చిన 5089 పోస్టులకు గానూ.. రాష్ట్రవ్యాప్తంగా.. 1.77లక్షల మంది అభ్యర్థు లు దరఖాస్తు చేసుకొన్నారు. కాగా.. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల వుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా..? అవసరం లేదా..? అన్న కన్ప్యూజన్ అభ్యర్థుల్లో నెలకొంది.

అయితే.. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. మళ్లీ ఈసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారు లు క్లారిటీ ఇచ్చేశారు.

అయితే.. తెలంగాణలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్‌‌లో డీఎస్సీ నోటిఫి కేషన్ వేయగా.. అదే నెల 20 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అదే సమయంలో.. నవంబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలు వాయిదా పడ్డాయి.

మార్చి 1 న చలో మేడిగడ్డ

మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ త‌ల‌పెట్టిన చ‌లో మేడిగ‌డ్డ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి కోరుతూ డీజీపీ ర‌వి గుప్తాకు మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ నేతృ త్వంలోని బృందం విన‌తి ప‌త్రం అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా మేడిగ‌డ్డ‌కు వెళ్లే రూట్ మ్యాప్‌ను కూడా డీజీపీకి అంద‌జేశారు. బీఆర్ఎస్ విన‌తిప‌త్రంపై డీజీపీ సానుకూలంగా స్పందించారు.

చ‌లో మేడిగ‌డ్డ ప‌ర్య‌ట‌న‌కు త‌గిన బందోబ‌స్తు క‌ల్పిస్తామ‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు డీజీపీ ర‌వి గుప్తా తెలిపారు...

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ టూర్‌.. మార్చి 4, 5 తేదీల్లో పర్యటన

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు..

4న ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి హైదరాబాద్‌ చేరుకుని రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.

5న సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని.. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మరోవైపు మార్చి 4న తెలంగాణలో జరగాల్సిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటన రద్దయింది..

YS Sharmila: తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: వైఎస్‌ షర్మిల

విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు..

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు..

''ఏపీని హార్డ్ వేర్ హబ్‌గా మారుస్తామని, చమురు రిఫైనరీలు ఇస్తామని మోదీ చెప్పారు. వాటిలో ఒక్కమాటా నిలబెట్టుకోలేదు. పదేళ్లుగా ఏపీ ప్రజలను భాజపా మోసం చేసింది. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఉద్యోగాలు వస్తాయి. మరి ఏపీకి ఏం వచ్చాయి? కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు.

ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతోంది. మెగా డీఎస్సీ అని దగా చేశారు. జాబ్ క్యాలెండర్‌ అని జగన్‌.. యువతను మోసం చేశారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప.. ఎవరూ పోరాటం చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'' అని షర్మిల వెల్లడించారు..

Manipur: మణిపుర్‌లో అదనపు ఎస్పీ కిడ్నాప్‌.. ఆయుధాలు వదిలి పోలీసుల నిరసన

ఇంఫాల్‌: మణిపుర్‌ (Manipur) పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. ñబుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతోపాటు మరొకరిని అపహరించుకుపోయారు..

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏఎస్పీ అపహరణకు గురయ్యారనే సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే ఆయన్ను విడిపించినట్లు మణిపుర్‌ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి నిరసనగా బుధవారం పోలీసు కమాండోలు ఆయుధాలను విడిచిపెట్టి నిరసన తెలిపారు..

అంతకుముందు వాహనం దొంగిలించారనే ఆరోపణలతో అరంబై టెంగోల్‌ గ్రూప్‌నకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఏఎస్పీ అమిత్‌ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ వర్గం వారిని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు ఎస్పీ స్థాయి అధికారి అపహరణకు గురికావడంపై రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. గతవారం రాష్ట్రంలో కుకీలు-మైతేయ్‌ల మధ్య వైరానికి కారణమైన పేరాను తొలగిస్తున్నట్లు మణిపుర్‌ హైకోర్టు ప్రకటించింది. మైతేయ్‌లకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని గతేడాది మార్చి 27న కేంద్ర గిరిజన శాఖకు హైకోర్టు ప్రతిపాదన చేసింది. అయితే, వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని నాగా, కుకీ-జొమీ తెగలు డిమాండ్ చేశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి..