/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz 11062 వేల పోస్టులతో DSC నోటిఫికేషన్? Yadagiri Goud
11062 వేల పోస్టులతో DSC నోటిఫికేషన్?

•పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేకుండానే

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం.. గత ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రేవంత్ సర్కార్ రద్దు చేసింది.

అయితే.. 2023 సెప్టెం బర్‌లో 5089 ఉపాధాయ పోస్టులకు.. కేసీఆర్ సర్కార్ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే.. ఆ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేసిన రేవంత్ సర్కార్... పాత నోటిఫి కేషన్‌లో ఇచ్చిన 5089 పోస్టులకు అదనంగా మరో 5973 పోస్టులను కలిపి మొత్తంగా 11,062 పోస్టులతో రేపు మెగా డీఎస్సీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.

ఈ పోస్టుల్లో 6,500కు పైగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (SGT) పోస్టులు, 2,600 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, 700 పండిట్‌ పోస్టులు ఉండగా.. PET పోస్టులు 190 ఉన్నట్టు సమాచారం.

అయితే.. గత ప్రభుత్వం ఇచ్చిన 5089 పోస్టులకు గానూ.. రాష్ట్రవ్యాప్తంగా.. 1.77లక్షల మంది అభ్యర్థు లు దరఖాస్తు చేసుకొన్నారు. కాగా.. మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల వుతున్న నేపథ్యంలో.. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా..? అవసరం లేదా..? అన్న కన్ప్యూజన్ అభ్యర్థుల్లో నెలకొంది.

అయితే.. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. మళ్లీ ఈసారి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారు లు క్లారిటీ ఇచ్చేశారు.

అయితే.. తెలంగాణలో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబర్‌‌లో డీఎస్సీ నోటిఫి కేషన్ వేయగా.. అదే నెల 20 నుంచి అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరించారు. నవంబరు 20 నుంచి 30 వరకు టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌(టీఆర్‌టీ) పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అదే సమయంలో.. నవంబర్‌ 30న ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలు వాయిదా పడ్డాయి.

మార్చి 1 న చలో మేడిగడ్డ

మార్చి 1వ తేదీన బీఆర్ఎస్ పార్టీ త‌ల‌పెట్టిన చ‌లో మేడిగ‌డ్డ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి కోరుతూ డీజీపీ ర‌వి గుప్తాకు మాజీ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ నేతృ త్వంలోని బృందం విన‌తి ప‌త్రం అంద‌జేసింది.

ఈ సంద‌ర్భంగా మేడిగ‌డ్డ‌కు వెళ్లే రూట్ మ్యాప్‌ను కూడా డీజీపీకి అంద‌జేశారు. బీఆర్ఎస్ విన‌తిప‌త్రంపై డీజీపీ సానుకూలంగా స్పందించారు.

చ‌లో మేడిగ‌డ్డ ప‌ర్య‌ట‌న‌కు త‌గిన బందోబ‌స్తు క‌ల్పిస్తామ‌ని బీఆర్ఎస్ నేత‌ల‌కు డీజీపీ ర‌వి గుప్తా తెలిపారు...

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ టూర్‌.. మార్చి 4, 5 తేదీల్లో పర్యటన

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటన ఖరారైంది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు..

4న ఆదిలాబాద్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. అదే రోజు రాత్రి హైదరాబాద్‌ చేరుకుని రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు.

5న సంగారెడ్డి జిల్లా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని.. అక్కడ పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. మరోవైపు మార్చి 4న తెలంగాణలో జరగాల్సిన కేంద్రహోంమంత్రి అమిత్‌షా పర్యటన రద్దయింది..

YS Sharmila: తిరుపతి వేదికగా ప్రత్యేక హోదాపై డిక్లరేషన్‌ ప్రకటిస్తాం: వైఎస్‌ షర్మిల

విజయవాడ: తిరుపతిలో మార్చి 1న జరగనున్న బహిరంగ సభ ద్వారా ఏపీకి ప్రత్యేక హోదాపై డిక్లరేషన్ ఇస్తామని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. అధికార వైకాపా ప్రత్యేక హోదాపై మాటలు మాత్రమే చెప్పిందన్నారు..

విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు..

''ఏపీని హార్డ్ వేర్ హబ్‌గా మారుస్తామని, చమురు రిఫైనరీలు ఇస్తామని మోదీ చెప్పారు. వాటిలో ఒక్కమాటా నిలబెట్టుకోలేదు. పదేళ్లుగా ఏపీ ప్రజలను భాజపా మోసం చేసింది. ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలకు పరిశ్రమలు వస్తాయి.. తద్వారా ఉద్యోగాలు వస్తాయి. మరి ఏపీకి ఏం వచ్చాయి? కనీసం 10 పరిశ్రమలు కూడా రాలేదు.

ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. యువత లేని రాష్ట్రంగా ఏపీ తయారవుతోంది. మెగా డీఎస్సీ అని దగా చేశారు. జాబ్ క్యాలెండర్‌ అని జగన్‌.. యువతను మోసం చేశారు. ప్రత్యేక హోదా పేరు చెప్పి ఓట్లు దండుకున్నారే తప్ప.. ఎవరూ పోరాటం చేయలేదు. ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిలిపివేత లాంటి నిర్ణయాలు అమలు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి'' అని షర్మిల వెల్లడించారు..

Manipur: మణిపుర్‌లో అదనపు ఎస్పీ కిడ్నాప్‌.. ఆయుధాలు వదిలి పోలీసుల నిరసన

ఇంఫాల్‌: మణిపుర్‌ (Manipur) పోలీసు కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. ñబుధవారం ఉదయం కొద్దిసేపు ఆయుధాలను విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు. మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్‌ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతోపాటు మరొకరిని అపహరించుకుపోయారు..

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఏఎస్పీ అపహరణకు గురయ్యారనే సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టి గంటల వ్యవధిలోనే ఆయన్ను విడిపించినట్లు మణిపుర్‌ పోలీసులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనికి నిరసనగా బుధవారం పోలీసు కమాండోలు ఆయుధాలను విడిచిపెట్టి నిరసన తెలిపారు..

అంతకుముందు వాహనం దొంగిలించారనే ఆరోపణలతో అరంబై టెంగోల్‌ గ్రూప్‌నకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఏఎస్పీ అమిత్‌ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ వర్గం వారిని విడిచిపెట్టాలని డిమాండ్‌ చేస్తూ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు తెలిపారు.

మరోవైపు ఎస్పీ స్థాయి అధికారి అపహరణకు గురికావడంపై రాష్ట్ర హోంశాఖ అప్రమత్తమైంది. గతవారం రాష్ట్రంలో కుకీలు-మైతేయ్‌ల మధ్య వైరానికి కారణమైన పేరాను తొలగిస్తున్నట్లు మణిపుర్‌ హైకోర్టు ప్రకటించింది. మైతేయ్‌లకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించాలని గతేడాది మార్చి 27న కేంద్ర గిరిజన శాఖకు హైకోర్టు ప్రతిపాదన చేసింది. అయితే, వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని నాగా, కుకీ-జొమీ తెగలు డిమాండ్ చేశాయి. దీనిపై ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి..

రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి..

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు..

అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు..

రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్ 2022లో విడుదలయ్యాడు..

శ్రీలంకకు చెందిన ఇతడు LTTEలో పని చేసేవాడు..

తెలంగాణ భాష అంటేనే క్లాసిక్ గా ఉంటుంది: గవర్నర్ తమిళ్ సై

తెలంగాణ భాష,అంటేనే క్లాసిక్ భాష’ అని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. తెలంగాణ భాష మాట్లాడుతున్నప్పు డు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు.

తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాల న్నారు. రవీంద్ర భారతిలో నేడు జ‌రిగిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ పాల్గొన్నారు. పలు కోర్సుల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన వారికి పట్టాలు అంద జేశారు.

అనంత‌రం ఆమె మాట్లాడుతూ… తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలని పేర్కొన్నారు. ప్రగతి సాధించడానికి షార్ట్ కట్ ఏమీ ఉండదని, శ్రమనే ఆధారం అని చెప్పారు.

‘స్నాతకోత్సవం అనేది పెద్ద పండుగ. సమాజానికి కొత్తదనాన్ని అందించడం మన బాధ్యత. మాతృభాష మన జీవితంతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ భాష క్లాసిక్ భాష. మాట్లాడుతు న్నప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది.

ప్రపంచంలో అనేక దేశాల్లో ఎంతో మంది తెలుగు వాళ్లు ఉన్నారు. ఈ తెలుగు భాష, సంస్కృతి అంతటా వ్యాప్తి చెందాలి. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పినట్టు ఎన్ఈపీ విద్యాలయాలు ప్రారంభించాలి.

తెలుగులో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. పొట్టి శ్రీరాములు యూని వర్సిటీలో ఇలాంటి పండుగ జరగడం ఎంతో ఆనందం, ఇది కన్నుల పండగగా ఉంది’ అని తమిళిసై అన్నారు.

మాతృభాష మన జీవితంలో అవసరం. తెలుగు మాట్లాడే వాళ్లు ప్రపంచ దేశాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు. తెలుగు భాషను ఇతర భాషలు మాట్లాడే ప్రజలందరికీ నేర్పించాలి.

తక్కువ ఖర్చుతో తెలుగు భాష పుస్తకాలను ప్రచురించి.. సామాన్య ప్రజలు కొని చదివే విధంగా ఉండాలి. నా మాతృభాష తమిళ్. నేను మా సోదర భాష తెలుగు మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. ’ అని గవర్నర్ అన్నారు..

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టుల మృతి

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు..

డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి..

డీఆర్‌జీ పెట్రోలింగ్‌ బృందం చిన్న తుంగలీ అడవీ ప్రాంతంలో గాలిస్తుండగా.. మావోయిస్టులు తారసపడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో కాల్పులు చోటుచేసుకున్నాయని, ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు హతమైనట్లు వెల్లడించారు. కాల్పులు జరిగిన ప్రదేశం నుంచి మృతదేహాలతో పాటు కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు..

తెలంగాణ ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ?

తెలంగాణలో మరింత బలం పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. ఆ పార్టీ అగ్రనేతలను తెలంగాణ నుంచి పోలీ చేయించేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పటికే రాష్ట్రంలో సర్కార్ ఎప్పటి చేసిన కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అత్య ధిక ఎంపీ స్థానాలను గెలు చుకోవాలన్న పట్టు దలతో ఉంది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఎంపికపై అచితూచి అడుగులు వస్తోంది.

ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థుల విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం నుంచి పార్టీ అధినేతలను రంగంలో దింపాలని భావిస్తోంది.

ఇందులో భాగంగానే రాహుల్‌ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఇక్కడ పార్టీ మరింత ప్రభావం చూపుతుందని కాంగ్రెస్‌ వర్గాలు భావిస్తున్నాయి.

నేడు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ - 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభం..

ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం నేడు శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు..

చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్‌ రావడంతో సచివాలయంలో మొదలు పెట్టాలని నిర్ణయించారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన తెల్లరేషన్ కార్డుదారులకు ఈ రెండు పథకాలను అమలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సాయంత్రం జరిగే సభలో పార్టీ అగ్రనేత ప్రియాంక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మంగళవారం నుంచి మరో రెండు హామీలను అమలు చేసేందుకు నడుంబిగించింది. ఇందుకోసం ఆహ్వాన పత్రికను కూడా ముద్రించింది. రూ.500కే వంట గ్యాస్ సిలిండర్, అర్హులైన ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను మంగళవారం నుంచి ప్రారంభించనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన పత్రికను ముద్రించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, విశిష్ట అతిథిగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు హాజరవుతారు..

ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కాలేజీలో జరుగనుందని ఆహ్వాన పత్రికలో ముద్రించారు. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వాన లేఖలను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవహరించనున్నట్టు ఆ పత్రికలో పేర్కొంది..