/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: బట్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిఆర్డిఏ పీడి నాగిరెడ్డి Mane Praveen
NLG: బట్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన డిఆర్డిఏ పీడి నాగిరెడ్డి

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం: బట్లపల్లి గ్రామంలో, ఉపాధి హామీ పనిని డిఆర్డిఏ పీడి నాగిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న కందకాల పనిని పరిశీలించి మస్టర్ను తనిఖీ చేశారు. ఉపాధి హామీ కూలీలతో పీడి మాట్లాడారు. కూలీలు తమకు రూ.190 వస్తున్నాయని చెప్పగా, రూ. 272 వచ్చే విధంగా పనిచేయాలని వారికి సూచించారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించడం జరుగుతుందని సూచించారు.

ఈ సందర్భంగా పిడి నాగిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 844 గ్రామపంచాయతీ లలో రోజు వంద మంది చొప్పున కూలీలు రావాలని, అందుకు అనుగుణంగా ప్రతి గ్రామంలో 300% పనులను గుర్తించి సాంక్షన్ తీసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. వేసవికాలం ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున, గ్రామపంచాయతీ నుండి మంచినీటి వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఇట్టి మంచినీటి వసతికి సంబంధించిన డబ్బులు గ్రామపంచాయతీ కి చెల్లింపులు చేస్తామన్నారు. ప్రతి కూలీకి ఆధార్ అనుసంధానం చేసి ఆధార్ బేస్డ్ పేమెంట్ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది.

ప్రతి గ్రామంలో నర్సరీ ను ఏర్పాటు చేసి 100% మొక్కల జర్మనేషన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రతి నర్సరీ షేర్ నెట్ ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. వీరి వెంట అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నవీన్, ఎంపీడీవో మునయ్య, ఏపీవో వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి అక్షిత, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షమయ్య, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

NLG: గాంధీజీ విద్యా సంస్థల వార్షికోత్సవంలో పాల్గొననున్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

నాంపల్లి మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థల 3వ వార్షికోత్సవ సంబరాలను శనివారం నిర్వహించనున్నట్లు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు వారు తెలిపారు.

NLG: గుంటుక కుమార స్వామి కి ఓయూ డాక్టరేట్

నల్లగొండ జిల్లా:

మునుగోడు మండలం, సింగారం గ్రామానికి చెందిన గుంటుక కుమార స్వామి కి, హైదరాబాదు ఓయూ డాక్టరేట్ లభించింది. ఆయన లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ లో అసోసియేట్ ప్రొఫెసర్ డా. ఎస్. యాదగిరి గైడ్ షిప్ లో 'తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసీ కళాశాలల గ్రంథాలయాల పై అధ్యయనం' అనే అంశంపై పరిశోధన గ్రంథం సమర్పించినందుకు గాను పిహెచ్డీ డాక్టరేట్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గ్రంథపాలకులు రవికుమార్, దుర్గాప్రసాద్ లు ఆయనను అభినందించారు.

HYD: మోడ్రన్ కబడ్డీ క్రీడను ప్రారంభించిన ఎమ్మెల్సీ

ఈరోజు హైదరాబాద్ దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ లో ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా మోడ్రన్ కబడ్డీ క్రీడను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ కుంభం రామ్ రెడ్డి.. మోడ్రన్ కబడ్డీ క్రీడ ను అమర్, సంజీవిని, జెమిని ఫార్మాట్లతో క్రోడీకరించి కొత్త రూల్స్ మరియు గ్రౌండ్ మెజర్మెంట్స్ ను ఏర్పాటుచేసి, వెలుగులోకి తీసుకోవడానికి ఎంతో కృషి చేయడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో ప్రతి పాఠశాలలో, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు యువతీ యువకులు ఆడే విధంగా ఈ క్రీడను ప్రాచుర్యం లభించడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బైకాని శ్రీశైలం యాదవ్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి ని కలిసిన జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా

నల్గొండ పట్టణం, మన్నెంచెలకలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జైళ్లశాఖ కు చెందిన స్థలాన్ని ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి జైళ్ల శాఖ అంగీకారం తెలిపింది. సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గురువారం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా కలిసి పీహెచ్సీ ఏర్పాటుకు కావల్సిన స్థలానికి సంబంధించిన అంశాలపై మంత్రితో చర్చించారు. 

నల్గొండ కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేసి స్థలాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని మంత్రికి వివరించారు.

ఈ సమావేశంలో జైళ్లశాఖ డీఐజీ డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.

NLG: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నల్లగొండ: ఈ నెల 28 నుంచి మార్చి 19 వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇంటర్మీడియట్ కు సంబంధించి జిల్లాలో 50 పరీక్షా కేంద్రాల్లో 32,895 మంది విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 473 పరీక్షా కేంద్రాల్లో 19,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రతతో పాటు, తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమీషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.  

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా ఉండేలా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అనుమతించరాదని తెలిపారు. అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రు నాయక్, జిల్లా విద్యాధికారి భిక్షపతి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ యూసఫ్ షరీఫ్ ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి.. న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా

కనగల్: ప్రధాన రహదారిపై ఇవాళ సాయంత్రం గం. 4 నుండి సుమారు గం. 7 వరకు ధర్నా నిర్వహించారు. కనగల్ బ్రిడ్జి వద్ద నిన్న రోడ్డు ప్రమాదంలో బైకును, కారు ఢీకొనగా ఓ మహిళ మృతి చెందింది. ఒక రోజంతా వేచి చూసిన మహిళ బంధువులు, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ, ఈ సాయంత్రం మూడు గంటల పాటు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: *జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సినిమా ప్రదర్శన*

పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను మోటివేట్ చేయడానికి గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్..12th Fail సినిమాను థియేటర్లలో ఫ్రీగా ప్రదర్శించారు. మనోజ్‌ కుమార్‌ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ రియల్‌ స్టోరీతో రూపొందిన 12th Fail చిత్రాన్ని, నల్గొండ పట్టణంలోని నాలుగు థియేటర్లలో రెండు షోలను విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా చూపించారు. ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీలకు చెందిన దాదాపు 2500 మంది స్టూడెంట్స్ ఈ సినిమాను చూశారు. 

విద్యార్థులతో కలిసి సినిమా వీక్షించిన గుత్తా అమిత్ రెడ్డి... 12th Fail చిత్రం ఇన్‌స్పైరింగ్‌ జర్నీ అని అన్నారు. స్టూడెండ్స్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయ్యే వారికి బాగా కనెక్ట్ అవుతుందన్నారు. విద్యార్థుల్లో ఇన్సిపిరేషన్ నింపేందుకు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించినట్టు చెప్పారు.

12th Fail సినిమా చూసిన విద్యార్థులు ఏమోషనల్ అయ్యారు. ఇన్సిపిరేషన్ తీసుకొచ్చే ఈ సినిమాను తమకు చూపించిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుంకరి రాజారామ్ కృతజ్ఞతలు తెలిపారు.

NLG: ట్రైనీ కానిస్టేబుల్స్ కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ చందాన దీప్తి

నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో, నూతనంగా ఎంపికైన ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ నిమిత్తం సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండి వచ్చిన ఏఆర్ విభాగానికి చెందిన, 203 మంది పురుష అభ్యర్థుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చందాన దీప్తి ముఖ్య అతిదిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వల చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌, డిఎస్పీ విఠల్ రెడ్డి, యస్బి డీఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మి నారాయణ, సిఐలు గోపి, సత్యనారాయణ, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NLG: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా, ఈనెల 24వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ.. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 24 నుండి మార్చి 14 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 

అనంతరము ఏప్రిల్ 4న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. పట్టబద్రుల ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో కూడిన జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమావేశంలో అందజేశారు. పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుపగా అట్టి పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈసీఐకి పంపనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 4 లక్షల 27 వేల 302 మంది ఓటర్లుగా నమోదు అయినట్లు ఆమె తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 600 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. 

 ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గుమ్మల మోహన్ రెడ్డి (కాంగ్రెస్), పోతేపాక లింగస్వామి (బిజెపి), బక్క పిచ్చయ్య (టిఆర్ఎస్), బి.మల్లికార్జున్ (టిడిపి), తదితరులు పాల్గొన్నారు.