/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz HYD: మోడ్రన్ కబడ్డీ క్రీడను ప్రారంభించిన ఎమ్మెల్సీ Mane Praveen
HYD: మోడ్రన్ కబడ్డీ క్రీడను ప్రారంభించిన ఎమ్మెల్సీ

ఈరోజు హైదరాబాద్ దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ లో ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నూతనంగా మోడ్రన్ కబడ్డీ క్రీడను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన డాక్టర్ కుంభం రామ్ రెడ్డి.. మోడ్రన్ కబడ్డీ క్రీడ ను అమర్, సంజీవిని, జెమిని ఫార్మాట్లతో క్రోడీకరించి కొత్త రూల్స్ మరియు గ్రౌండ్ మెజర్మెంట్స్ ను ఏర్పాటుచేసి, వెలుగులోకి తీసుకోవడానికి ఎంతో కృషి చేయడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో ప్రతి పాఠశాలలో, గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు యువతీ యువకులు ఆడే విధంగా ఈ క్రీడను ప్రాచుర్యం లభించడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బైకాని శ్రీశైలం యాదవ్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

మంత్రి కోమటిరెడ్డి ని కలిసిన జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా

నల్గొండ పట్టణం, మన్నెంచెలకలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జైళ్లశాఖ కు చెందిన స్థలాన్ని ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి జైళ్ల శాఖ అంగీకారం తెలిపింది. సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని గురువారం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా కలిసి పీహెచ్సీ ఏర్పాటుకు కావల్సిన స్థలానికి సంబంధించిన అంశాలపై మంత్రితో చర్చించారు. 

నల్గొండ కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేసి స్థలాన్ని ప్రభుత్వానికి అందజేస్తామని మంత్రికి వివరించారు.

ఈ సమావేశంలో జైళ్లశాఖ డీఐజీ డా. శ్రీనివాస్ పాల్గొన్నారు.

NLG: ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నల్లగొండ: ఈ నెల 28 నుంచి మార్చి 19 వ తేదీ వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు, మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఇంటర్మీడియట్, పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇంటర్మీడియట్ కు సంబంధించి జిల్లాలో 50 పరీక్షా కేంద్రాల్లో 32,895 మంది విద్యార్థులు, 10వ తరగతికి సంబంధించి 473 పరీక్షా కేంద్రాల్లో 19,715 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పరిశుభ్రతతో పాటు, తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ కమీషనర్లు, గ్రామ పంచాయతీ అధికారులకు సూచించారు.

ప్రతి పరీక్షా కేంద్రంలో అత్యవసర మందులతో ప్రథమ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను, పరీక్ష సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.  

విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు అనుకూలంగా ఉండేలా అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ కేంద్రాలను మూసేయాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, అనుమతించరాదని తెలిపారు. అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి దస్రు నాయక్, జిల్లా విద్యాధికారి భిక్షపతి, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ యూసఫ్ షరీఫ్ ఉన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహిళ కుటుంబానికి.. న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నా

కనగల్: ప్రధాన రహదారిపై ఇవాళ సాయంత్రం గం. 4 నుండి సుమారు గం. 7 వరకు ధర్నా నిర్వహించారు. కనగల్ బ్రిడ్జి వద్ద నిన్న రోడ్డు ప్రమాదంలో బైకును, కారు ఢీకొనగా ఓ మహిళ మృతి చెందింది. ఒక రోజంతా వేచి చూసిన మహిళ బంధువులు, మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ, ఈ సాయంత్రం మూడు గంటల పాటు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: *జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా సినిమా ప్రదర్శన*

పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను మోటివేట్ చేయడానికి గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్..12th Fail సినిమాను థియేటర్లలో ఫ్రీగా ప్రదర్శించారు. మనోజ్‌ కుమార్‌ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ రియల్‌ స్టోరీతో రూపొందిన 12th Fail చిత్రాన్ని, నల్గొండ పట్టణంలోని నాలుగు థియేటర్లలో రెండు షోలను విద్యార్థినీ, విద్యార్థులకు ఉచితంగా చూపించారు. ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ కాలేజీలకు చెందిన దాదాపు 2500 మంది స్టూడెంట్స్ ఈ సినిమాను చూశారు. 

విద్యార్థులతో కలిసి సినిమా వీక్షించిన గుత్తా అమిత్ రెడ్డి... 12th Fail చిత్రం ఇన్‌స్పైరింగ్‌ జర్నీ అని అన్నారు. స్టూడెండ్స్, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్‌ అయ్యే వారికి బాగా కనెక్ట్ అవుతుందన్నారు. విద్యార్థుల్లో ఇన్సిపిరేషన్ నింపేందుకు ఈ చిత్రాన్ని ఉచితంగా చూపించినట్టు చెప్పారు.

12th Fail సినిమా చూసిన విద్యార్థులు ఏమోషనల్ అయ్యారు. ఇన్సిపిరేషన్ తీసుకొచ్చే ఈ సినిమాను తమకు చూపించిన గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుంకరి రాజారామ్ కృతజ్ఞతలు తెలిపారు.

NLG: ట్రైనీ కానిస్టేబుల్స్ కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎస్పీ చందాన దీప్తి

నల్లగొండ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో, నూతనంగా ఎంపికైన ట్రైనీ కానిస్టేబుల్స్ కు 9 నెలల శిక్షణ నిమిత్తం సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల నుండి వచ్చిన ఏఆర్ విభాగానికి చెందిన, 203 మంది పురుష అభ్యర్థుల శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ చందాన దీప్తి ముఖ్య అతిదిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వల చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమములో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్‌, డిఎస్పీ విఠల్ రెడ్డి, యస్బి డీఎస్పీ రమేష్, సైబర్ క్రైమ్ డిఎస్పీ లక్ష్మి నారాయణ, సిఐలు గోపి, సత్యనారాయణ, కొండల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

NLG: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియలో భాగంగా, ఈనెల 24వ తేదీన ముసాయిదా ఓటర్ జాబితా ప్రకటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆమె మాట్లాడుతూ.. మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు ఉన్నట్లయితే ఈ నెల 24 నుండి మార్చి 14 వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 

అనంతరము ఏప్రిల్ 4న పట్టభద్రుల ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. పట్టబద్రుల ఓటింగ్ కోసం జిల్లా వ్యాప్తంగా 95 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారంతో కూడిన జాబితాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు సమావేశంలో అందజేశారు. పోలింగ్ స్టేషన్ల జాబితా పరిశీలించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలుపగా అట్టి పోలింగ్ స్టేషన్ల జాబితాను ఈసీఐకి పంపనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 

వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో 4 లక్షల 27 వేల 302 మంది ఓటర్లుగా నమోదు అయినట్లు ఆమె తెలిపారు. మొత్తం నియోజకవర్గంలో 600 పోలింగ్ కేంద్రాలు ఉంటాయన్నారు. 

 ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, గుమ్మల మోహన్ రెడ్డి (కాంగ్రెస్), పోతేపాక లింగస్వామి (బిజెపి), బక్క పిచ్చయ్య (టిఆర్ఎస్), బి.మల్లికార్జున్ (టిడిపి), తదితరులు పాల్గొన్నారు.

TS: నేటి నుంచి పోలీస్ కానిస్టేబుల్ లకు శిక్షణ

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే పరీక్షలు జరిగిన తరువాత అభ్యర్థులు ఎంపిక చేశారు.

కొంత మంది ఎంపిక కానీ అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు. తమకు మార్కులు కలపాలని కోర్టులో కేసు వేయడంతో కానిస్టేబుల్ ఉద్యోగులను నియమించేందుకు కాస్త ఆలస్యం అయింది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానిస్టేబుల్ కి ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నేటి నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. మొదటి విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 28 కేంద్రాల్లో 9,333 మంది కానిస్టేబుళ్లకు ట్రైనింగ్ ఇవ్వనుండగా.. రెండో విడుతలో 4,725 మంది TSSP కానిస్టేబుళ్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. రెండో విడుత ట్రైనింగ్ సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

TS: పెద్దల సభకు పంపించినందుకు సోనియా గాంధీకి ధన్యవాదాలు: అనిల్ కుమార్ యాదవ్

HYD: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ మంగళవారం తన అనుచరులతో కలిసి హైదరాబాదులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆదర్శనగర్ నుండి నేరుగా అమరవీరుల స్థూపం వద్ద కు చేరుకుని అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయన తండ్రి అంజన్ కుమార్ యాదవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. 

అనంతరం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ బిడ్డ అయిన తనను చిన్న వయస్సు లోని పెద్దల సభకు పంపించి ఆశీర్వదించిన సోనియా గాంధీకి, రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సిఎం రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ ముఖ్య నాయకులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు అంటూ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

  

NLG: యూత్ ఫర్ సేవ కాంపిటీషన్ లో బహుమతులు పొందిన జేబీఎస్ హైస్కూల్ విద్యార్థులు

నల్గొండ పట్టణంలో యూత్ ఫర్ సేవ సంస్థ ఆధ్వర్యంలో, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో విద్యార్థిని విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికితీయడంలో భాగంగా ఇటీవల నిర్వహించిన, పలు పోటీలలో మాధవ్ నగర్ జేబీఎస్ ఉన్నత పాఠశాల లోని విద్యార్థిని విద్యార్థులు ఆటపాటల్లో, డ్రాయింగ్, రన్నింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచి షీల్డ్స్ మరియు ప్రత్యేకమైన బహుమతులు సాధించి, పలువురి చేత ప్రశంసలు అందుకున్నందుకు గాను, సోమవారం పాఠశాల ప్రార్థన సమయంలో ప్రధానోపాధ్యాయులు నిమ్మల నిర్మల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల బృందం స్టూడెంట్స్ ను వారికి సహకరించిన ఉపాధ్యాయురాలు ప్రతిమ ను ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.