/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్ Mane Praveen
NLG: ప్రజావాణిలో దరఖాస్తులు స్వీకరించిన అడిషనల్ కలెక్టర్

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు, వారి సమస్యలను పరిష్కరించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షులు కర్నాటి యాదగిరి, జిల్లా కార్యదర్శి, లింగయ్య యాదవ్, వివిధ ప్రజాసంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. 

కాగా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు సంబంధించి సమస్యలు పరిష్కరించారా ?పరిష్కరించలేదా? దరఖాస్తుదారానికి నెల రోజుల లోపు అధికారులు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని, రాతపూర్వకంగా ఇచ్చిన దరఖాస్తులకు రాతపూర్వకమైన సమాధానం ఇవ్వాలని పలువురు ప్రజావాణి కి వచ్చిన దరఖాస్తుదారులు అంటున్నారు.

NLG: వసతి గృహం అధికారిణిని సస్పెండ్

నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ లోని ప్రీ మెట్రిక్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం అధికారిణి ఎం. అహల్యను జిల్లా కలెక్టర్ హరిచందన సోమవారం సస్పెండ్ చేశారు. సోమవారం సంక్షేమ శాఖల అధికారులతో వసతి గృహాల నిర్వహణ, సంక్షేమ శాఖల పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.. సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ దాసరి అధికారులను ఆదేశించారు. 

మిర్యాలగూడ ప్రీ మెట్రిక్ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహం అధికారిణి ఎం.అహల్య హాస్టల్లో ఉండకపోవడమే కాకుండా, విద్యార్థినులకు భోజనం సరిగా పెట్టకపోవడంతో ఆమెను సస్పెండ్ చేసినట్టు వివరించారు. హాస్టల్ ను తనిఖీ చేసిన అనంతరం ఈ చర్య తీసుకున్నట్లు ఆమె తెలిపారు. హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే తగు చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.

NLG: అనుమానాస్పదంగా ఉన్న విద్యార్థుల మరణాలను హైకోర్టు సిట్టింగ్ జడ్జ్ ద్వారా న్యాయ విచారణ జరిపించాలి: ఏఐఎస్ఎస్డి

దేవరకొండ: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ నియోజకవర్గ కన్వీనర్ వస్కుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హాస్టల్ విద్యార్థుల అనుమానస్పద మృతులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్డీవోకు మెమోరండం అందజేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ బుర్రి వెంకన్న మాట్లాడుతూ.. గురుకులాల విద్యార్థుల సూసైడ్ మరణాలు రోజురోజుకు పెరుగుతున్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర విచారణ జరిపించి, మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా ప్రతి గురుకులాల హాస్టల్ కు ఒక సైకాలజిస్ట్ను నియమించాలని,

ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ప్రభుత్వం చాలా పకడ్బందీగా గురుకులాల హాస్టల్స్ విద్యార్థులు భయభ్రాంతులకు గురికాకుండా, వారు ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగే విధంగా, భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా, గురుకులాల హాస్టల్లో మనో ధైర్యంతో చదివే విధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేత స్థాపించబడిన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అందుగుల గిరి, చేపూరి రాజేష్, యాదగిరి, నాగరాజు, తదితర సభ్యులు పాల్గొన్నారు.

NLG: ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినీలకు మీడియా, సినిమాటోగ్రఫీ పై ప్రత్యేక శిక్షణ

నల్లగొండ: ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచనల మేరకు, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల నందు నీలగిరి నిపుణ సౌజన్యంతో.. మీడియా, సినిమాటోగ్రఫీ సంబంధిత 30 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఎర్పాటు చేశారు. అందుకు సంబందించిన పోస్టర్ ను ఈ రోజు ఆవిష్కరణ చేశారు. ప్రభుత్వ మహిళ కళాశాల విద్యార్థులకు 30 రోజులపాటు డిజిటల్ సినిమాటోగ్రఫీ, డబ్బింగ్ మరియు వాయిస్ ఓవర్ స్కిల్స్, ఆడియో ప్రొడక్షన్, నాన్ లీనియర్ ఎడిటింగ్, ప్లే బ్యాక్ లైవ్ సింగింగ్ స్కిల్స్, డిజిటల్ డిజైనింగ్ మరియు సోషల్ మీడియా మేనేజ్మెంట్ డిస్క్ జాకీ మరియు లైవ్ సౌండ్ తదితర అంశాలపై శిక్షణ కల్పిస్తామని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో స్పేస్ సీఈఓ శశి ప్రీతం , టీవీ సీరియల్ మరియు సినిమా నటుడు లోహిత్ కుమార్, మాట్లాడుతూ.. ఈ రంగాలలో విద్యార్థులకు ఉచితంగా నైపుణ్యం కల్పించడం జరుగుతుందని కళాశాల విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమం లో పాల్గొని, ఈ రంగాలలో తమ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కోరారు. 

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. అందరూ ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేరు కాబట్టి, ఇటువంటి రంగాలలో నైపుణ్యత సాధించి జీవితంలో స్థిరపడాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ నాయక్, హౌసింగ్ బోర్డ్ పిడి రాజకుమార్ కళాశాల ప్లేస్మెంట్ ఆఫీసర్ నరసింహారాజు, మెంబర్స్ డాక్టర్ సుంకరి రాజారామ్, జి. యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

NLG: ఫిబ్రవరి 16 న జరిగే దేశ వ్యాప్త కార్మికుల సమ్మె ను జయప్రదం చేయండి: చాపల శ్రీను

మునుగోడు: కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటియుసి నల్లగొండ జిల్లా గౌరవ అధ్యక్షులు చాపల శ్రీను పిలుపునిచ్చారు. సీపీఐ కార్యాలయం లో ఏఐటీయూసీ నాయకులతో కలిసి సమ్మె వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కేంద్రం గత 10 సం.ల పాలనలో దేశంలో కార్మిక, రైతు సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలం చెందారని ఆరోపించారు. 

బిజెపి అధికారంలోకి వస్తే 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని అమలు చేయలేదని అన్నారు. కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ, పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనలో జరిగిన రైతు, కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల వలన జరుగుతున్న నష్టంపై ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు, రైతులు సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షకార్యదర్షులు బెల్లం శివయ్య, దుబ్బ వెంకన్న , భవన నిర్మాణ సంఘం అధ్యక్షుడు ఈద యాదయ్య ఇతర రంగాల కార్మిక నాయకులు దొమ్మటి గిరి, బోల్లు సైదులు, మద్ది అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

NLG: కెసిఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలి: గుత్త అమిత్ రెడ్డి

ఈ నెల 13 న నల్గొండ లో కేసీఆర్ హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి అన్నారు. నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కె ఆర్ ఎం బి లో జరిగిన మీటింగ్స్ లలో కృష్ణా ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ అప్పనంగా కేంద్రానికి అప్పజెప్పారని,కృష్ణా నది మన జిల్లాకు వరప్రదాయిని 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని అలాంటి కృష్ణా జలాలను కేంద్రానికి అప్పజెప్పారు అని విమర్శించారు.


  

కె ఆర్ ఎం బి కి కృష్ణా ప్రాజెక్టులు పోతే తాగు నీటికి కూడా కటకట ఏర్పడుతుందని, మన అధీనంలో ఉంటే ఎప్పుడంటే అప్పుడు నీటిని విడుదల చేసుకున్నాం అని,ఇక నుంచి ఈ వెసులుబాటు ఉండదు అన్నారు. విద్యుత్ ఉత్పత్తి కి కూడా ఆటంకం ఏర్పడుతుంది. రాష్ట్ర హక్కులను కేంద్రానికి అప్పజెప్పడం దుర్మార్గపు చర్య, చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే అవాస్తవాలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్లు టిఆర్ఎస్ పై పై బురద జల్లుతున్నారు అని, పదేళ్లు ఎంత ఒత్తిడి చేసిన కేసీఆర్ కేంద్రానికి తలొగ్గలేదన్నారు.

పార్టీ ఆదేశిస్తే నల్గొండ, భువనగిరి నియోజకవర్గ లాలల్లో ఎక్కడినుంచైన పోటీ చేస్తాను, పార్టీ నిర్ణయమె ఫైనల్..

 ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యం. ప్రజల్లో ఉండటమే నాకు ఇష్టం అన్నారు. ఈ కార్యక్రమములో జడ్పీటీసీ కనగల్ చిట్ల వెంకటేశం, అయితగాని స్వామి గౌడ్,శ్రీరామదాసు హరి కృష్ణ,నాగులవంచ వెంకటేశ్వర రావు,కంచరకుంట్ల గోపాల్ రెడ్డి ,పజ్జుర్ సర్పంచ్ మోయిజ్, మాజి జడ్పీటీసీ సంజీవ, చిలకరాజు శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

NLG: నల్లగొండ జిల్లాకు కెసిఆర్ చేసింది ఏమీ లేదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నల్లగొండ: జిల్లాకు కేసీఆర్ చేసింది ఏమీ లేదని రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్ ఎల్ బి సి ని కుర్చీ వేసుకుని పూర్తి చేస్తానన్న కెసిఆర్ మాట తప్పాడని, సభలో నల్లగొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కెసిఆర్ ప్రసంగించాలని, కెసిఆర్ మాట తప్పడంపై నల్లగొండ పట్టణంలో సభ రోజు వినూత్న నిరసన చేస్తామని అన్నారు.

నల్లగొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఅర్..

కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలి..

కేసీఆర్ కోసం కుర్చీ ,పింక్ టవల్ ఎల్ ఈడి స్క్రిన్ ను పోలీసు పర్మిషన్ తో పెడతాం..

రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైంది..

కేఆర్ఎంబి ఫైళ్ల పై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు..

బిఆర్ఎస్ ప్రభుత్వ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించాం..

కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలని అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

  

SRPT: అనుమానాస్పద స్థితిలో ఇంటర్ గురుకుల పాఠశాల విద్యార్థిని మృతి

సూర్యాపేట: మండలంలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల/ కళాశాలలో శనివారం రాత్రి ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పట్టణానికి చెందిన వెంకన్న, భాగ్యమ్మ ల కుమార్తె దగ్గుపాటి వైష్ణవి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. శనివారం సాయంత్రం ఫేర్వెల్ డే లో పాల్గొన్నది. అయితే ఈ కార్యక్రమం జరుగుతుండగానే వైష్ణవి గదిలోకి వెళ్ళిపోయింది. గంట తర్వాత తోటి విద్యార్థులు వెళ్లి చూడగా వైష్ణవి అపస్మారక స్థితిలో ఉంది. సూర్యాపేట జనరల్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా పలు అనుమానాలు ఉన్నాయని మృతురాలి తల్లిదండ్రులు అంటున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: 18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహానికి ఘనంగా అభిషేకాలు

నల్గొండ: పట్టణంలోని హనుమాన్ నగర్ పాత బస్తి శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో 4వ రోజు పూజా కార్యక్రమాల్లో భాగంగా, ఈ రోజు ఉదయం మండప దేవత పూజలు, హోమాలు చేయడం జరిగింది.

18 అడుగుల అభయాంజనేయ స్వామి ఏకశిలా విగ్రహానికి మహాస్నాపనము అని 36 జలాలతోని, ధాన్యాలతోని స్వామివారికి అభిషేకము మహాస్నాపనము చేయడం జరిగింది.

*కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి మానుకోవాలి* : *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం*

కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు..

       శుక్రవారం సిపిఎం చండూరు మండల కమిటీ సమావేశం సిపిఎం సీనియర్ నాయకులు చిట్టి మల్ల లింగయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ ప్రభుత్వం పై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అణిచివేత ధోరణి అవలంబిస్తుందని అన్నారు. కేరళలో విపత్తులు, కష్టకాలంలో కూడా సహాయం చేయకుండా కేంద్రం మొండి చేయి చూపిందన్నారు. ఎల్ డి ఎఫ్ ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆటంకాలు కలిగిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటుందని ఆరోపించారు. కేరళ ప్రభుత్వం ఆదాయం ఉత్పత్తి లో ముందంజలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన సంక్షోభం ఏర్పడిందన్నారు. 2021- 22 లో కేరళ రుణ పరిమితి తగ్గించిందని అన్నారు.

జీఎస్టీ వంటి ఆదాయ వనరును తగ్గించిందని అన్నారు. ప్రతిపక్ష నేతలపై ఈడి ,సిబిఐ ,ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లను ఉపయోగించడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాలలో కేంద్రం జోక్యం చేసుకొని దుర్వినియోగం చేయడం, ప్రభుత్వ వ్యవహారాలలో గవర్నర్ జోక్యం చేసుకొని మితిమీరి వ్యవహరించడం ,ప్రభుత్వ పని విధానం పై ప్రభావం పడుతుందని అన్నారు. విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం విద్విశ్ పూరిత వైఖరి అవలంబించడం సరికాదని ఇది మేధావులు, ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఖండించాలని వారన్నారు..

 

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మొగుదాల వెంకటేశం, సిపిఎం మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ గౌడ్, సిపిఎం మండల కమిటీ సభ్యులుకొత్తపల్లి నరసింహ, సిపిఎం నాయకులుకంచర్ల రవి, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు