/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz భద్రాచలం: చర్ల: ఈ నెల 16న జరిగే గ్రామీణ బంధును విజయవంతం చెయ్యాలని MEO కు వినతి పత్రం సమర్పించిన PYL Miryala Kiran Kumar
భద్రాచలం: చర్ల: ఈ నెల 16న జరిగే గ్రామీణ బంధును విజయవంతం చెయ్యాలని MEO కు వినతి పత్రం సమర్పించిన PYL

భద్రాచలం: చర్ల: ఈ నెల 16న జరిగే గ్రామీణ బంధును విజయవంతం చెయ్యాలని MEO కు వినతి పత్రం సమర్పించిన PYL

పారిశ్రామిక సమ్మెకు పి డి ఎస్ యు పివైఎల్ సంపూర్ణ మద్దతు.తెలియజేస్తుంది 

ఈనెల 16న దేశవ్యాప్తంగా జరిగే గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మెకు మద్దతుగా ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU),ప్రగతిశీల యువజన సంఘం (పి వై ఎల్) సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామము దానిలో భాగంగానే విద్యాసంస్థల బంద్ కు సహకరించాలని స్థానిక మండల విద్యాధికారి MEO గారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది.

అనంతరం చిరిగిడి నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పిఓఎల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు ముసలి సతీష్ మాట్లాడుతూ రైతుల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 14 నెలలు ఢిల్లీలో వీరోచిత పోరాటం చేసి రైతుల వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టిన ఘనత రైతులకు ఉన్నదని తిరిగి నరేంద్ర మోడీ మళ్ళీ ఆ చట్టాలను తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాడని, కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబరు కోడ్లను రద్దు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మహిళలను రక్షించాలని నూతన విద్య విధానం 2020 ను రద్దు చేయాలని యువకులని పక్కదోవ పట్టించే మద్యపానంపై కట్టడి చర్యలు చేయాలని కులం మతం పేరుతో నరేంద్ర మోడీ ప్రభుత్వం హిందూ మతోన్మాదం ని పెంచి పోషించడాని వ్యతిరేకించాలని దానిలో భాగంగానే విద్యార్థి యువకులు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిరిగిడి నరేష్ రాజు రమేష్ బాలరాజు రాజేష్ సమ్మయ్య సతీష్ తదితరులు పాల్గొన్నారు

ఎస్సీ ఎస్టీ బ్యాంకింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆల్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ని సత్కరించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఎస్సీ ఎస్టీ బ్యాంకింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ఆల్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ 

శ్రీ e రఘుపతి సార్ ని sc st విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి అంబేద్కర్ జ్ఞాపికని బహుకరించడం జరిగింది. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ sbi ఆర్ సి టి డైరెక్టర్ నల్గొండ బాధ్యతలు నిర్వహిస్తూ వేలాదిమంది నిరుపేద గ్రామీణ విద్యార్థులకు స్వయం శిక్షణ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ వేలాది కుటుంబాలకు సాయం చేస్తున్నారని తెలపడం జరిగింది .

ఈ కార్యక్రమంలో ఆఫీస్ సిబ్బంది సెల్వనాయక్ సంఘం సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వంగూరి సునీల్ కుమార్ దుర్గయ్య గంట సుమంత్ తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్‌: ఈ సెట్, లా సెట్, పీజీ లా సెట్ షెడ్యూల్ విడుదల...

హైదరాబాద్‌: ఈ సెట్, లా సెట్, పీజీ లా సెట్ షెడ్యూల్ విడుదల..

ఈ నెల 14న ఈ సెట్ నోటిఫికేషన్, ఈ నెల 15 నుండి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తుల స్వీకరణ.. మే 6న ప్రవేశ పరీక్ష.. ఈ నెల 28 లా సెట్‌, పీజీ లా సెట్ నోటిఫికేషన్.. మార్చి ఒకటి నుండి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ.. జూన్‌ 3న ప్రవేశ పరీక్ష

TS: నల్లగొండ:35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన

35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల కు ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన ..

35వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఈ రోజు పట్టణంలోని యన్.జి కళాశాల,పుల్లారెడ్డి స్వీట్స్ హౌస్,కోర్టు చౌరస్తా మీదిగా క్లాక్ టవర్ వరకు సుమారు 100 మంది ఆటో డ్రైవర్ల తో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఇంఛార్జి డిఎస్పీ లక్ష్మినారయణ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి, సురక్షితంగా గమ్య స్థానాలను చేరుకోవాలని సూచించారు.ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించకూడదని ఏదైన ప్రమాదం జరిగిన నప్పుడు ఎంతో రక్షణ కల్పిస్తుందని అన్నారు. ట్రిపుల్ రైడింగ్,ఓవర్ స్పీడ్,సీట్ బెల్ట్ దరించాలని పలు సూచనలు ఇస్తూ ట్రాఫిక్ నిబంధనల పైన అవగాహన కల్పించారు.

 ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ డానియల్, టు టౌన్ సిఐ కొండల్ రెడ్డి, ఏ.యస్.ఐ ఫరీద్,ట్రాఫిక్ సిబ్బంది మరియు ఆటో డైవర్లు తదితరులు పాల్గొన్నారు.

TS:భద్రాచలం:చర్ల:దళిత బంధు సాధన కమిటీ పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు

 దళిత బంధు సాధన కమిటీ పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు 

 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు ముసలి సతీష్ 

చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద దళిత బంధు సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ హాజరై సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటం చేస్తే ఏ సమస్య అయినా పరిష్కారం కాక తప్పదని దళిత బంధు సాధన కోసం పోరాట రూపాన్ని ఎంచుకున్న కమిటీ నాయకత్వానికి విప్లవ అభినందనలు తెలియజేశారు అనగారిన వర్గాల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేసిందని మొదటి దఫగా అర్హులను ఎంపిక చేసి దళిత బంధుని మంజూరు చేసిందని అన్నారు అనంతరం ఈ ప్రాంతంలోని ప్రజలు అందరికీ దళిత బందు వస్తుందని భావించి నమ్మారు మా జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డారు ఈ ఆశను అదునుగా చేసుకొని ప్రభుత్వ పదకమైన దళిత బందును ఇప్పిస్తామంటూ కొంతమంది ఈ నిరుపేదలైన దళితుల దగ్గర నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి ప్రభుత్వం మారేసరికి దళిత బంధు వస్తుందో రాదో అనేటువంటి భయాందోళనకి ప్రజలు గురయ్యారు రెక్కల కష్టంతో తిని తినక సంపాదించుకున్న డబ్బులను అప్పు సప్పు చేసి వడ్డీలకు తెచ్చిన డబ్బులను దళిత బందు కోసం వెచ్చించి మోసపోయామని బాధతో రాష్ట్రంలో అక్కడక్కడ దళిత బందు కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వ పథకమైన దళిత బంధు పై డబ్బులు దండుకున్న విషయంపై తక్షణమే అధికారులు విచారణ జరిపి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలి తీసుకున్న డబ్బులను వారి నుంచి ప్రజలకు ఇప్పించాలి ఇలాంటి దందాలను పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు నూతన ప్రభుత్వంలో పరిపాలనలో దళితుల ఆశలు ఆకాంక్షలు మరింత చిగురించాలి తప్ప చిదిమి వేయకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు ప్రభుత్వంపై దళితులకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు కచ్చితంగా ఇవ్వాలని తద్వారా దళిత సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరోసాని ఇవ్వాలని ప్రజల్లో ఉన్న భయాందోళనలను చెరిపి ఆత్మహత్యలను ఆపాలని దళితులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాలని కోరారు లేనియెడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఈ పోరాటానికి నిరంతరం అండగా ఉంటుందని భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత బందు సాధన కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు

Ts:తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్‌ల బాగోతం..

తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్‌ల బాగోతం. మొన్న సోమేష్‌కుమార్, నిన్న అరవింద్‌కుమార్.. నేడు రజత్‌కుమార్‌ ఆస్తులపై వివాదం. మహబూబ్‌నగర్‌జిల్లా హేమాజీపూర్‌లో 52ఎకరాలు కొనుగోలు.. 15 ఎకరాలను ఇతరుల పేర్లు మీద మార్చడానికి.. స్లాట్‌ బుక్‌ చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్ రజత్‌కుమార్. వరుసగా పలువురు ఐఏఎస్‌లపై ఆరోపణలు.

TS: మేడారం సమ్మక్క సారక్క జాతరకు రండి..

మేడారం జాతరకు రండి..

గవర్నర్ ను ఆహ్వానించిన మంత్రి సీతక్క.

రాజ్‌భవన్‌లో గురువారం గవర్నర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి

తెలంగాణ ప్రభుత్వం తరుపున మేడారం సమ్మక్క-సారక్కల పండుగకు తప్పకుండా రావాలని ఆహ్వానించిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ నాయకురాలు శిల్ప, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్.

సానుకూలంగా స్పందించిన గవర్నర్ తమిళసై.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి:తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల, పేద విద్యార్థులు డబ్బులు పెట్టి ప్రైవేటు కళాశాలలో చదవలేక విద్యకు దూరమైతున్నారని తెలియజేశారు. జిల్లాలో 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కానీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు, ప్రభుత్వ పీజీ కళాశాల, అన్ని సబ్జెక్టులతో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో, ఇంటర్మీడియట్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, మెడికల్ కళాశాలలో, పీజీ కళాశాలలో, యూనివర్సిటీలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి, నాణ్యమైన విద్య అందించాలి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విద్యార్థిని, విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే మంచి విద్యావంతుడిని విద్యాశాఖ మంత్రిగా నియమించాలని, విద్యాశాఖ బడ్జెట్ 25 శాతం ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు గుద్దేటి శ్యామ్, లింగంపల్లి మధుకర్, మల్లేష్, రవి, మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం:ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు అనంతపురం సతీష్ మాట్లాడుతూ . మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను మోడీ పరిష్కరించలేదు. కార్పొరేటు మతతత్వ విధానాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాదం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించింది . రైతులు పండించిన పంటకు MSP ఇస్తామన్న హామీని తుంగలో తొక్కింది , నిరుద్యోగం ధరల పెరుగుదల పేదరికం ఆకలి మొదలైన కీలక అంశాలను పరిష్కరించకుండా దీని నుంచి తప్పించడానికి ప్రజలను పక్క దారి పట్టించే వైఖరిని చేపట్టింది.ఇందులో భాగమే రామ మందిరం .2024 పార్లమెంట్ ఎన్నికలలో ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజల సిద్ధం కావాలని ముసలి సతీష్ పిలుపునిచ్చారు ఈ నెల 16న జరిగే భారత్ బంద్ లో రైతులు వ్యవసాయ కార్మికులు లక్షలాదిగా పాల్గొనాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో నరేష్ సమ్మక్క నాగరాజు రాజు బాయమ్మ బీమా లక్ష్మి సారయ్య సంజయ్ కమల సరిత నాగేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు..

హైదరాబాద్‌: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు.. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ తమిళిసై..