/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్ Yadagiri Goud
R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై ఏపీ హైకోర్టు సీరియస్

గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ వేసిన కాంట్రాక్టర్లు..

ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని, లేనట్లయితే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు..

బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపోవడం పై కోర్టు ఆగ్రహం..

పిటిషనర్ తరపున వాదనలు వినిపించిన లాయర్ వీవీ లక్ష్మీనారాయణ..

మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు..తెలిపిన గవర్నర్ తమిళ సై..

మెగాస్టార్ చిరంజీవికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం గౌరవ పురస్కారమైన పద్మవిభూషణ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే..

గతంలో పద్మ భూషణ్ పురస్కారం అందుకున్న చిరు ఇప్పుడు పద్మ విభూషణ్ కు ఎంపికయ్యారు. చాలా మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఆయనను కలిసి అభినందించారు..

 తాజాగా రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై ను సతీసమేతంగా కలిశారు చిరంజీవి. పద్మవిభూషణ్ ను ఎంపికైన సందర్భగా మెగాస్టార్ ను అభినందించారు గవర్నర్..

అనంతరం గవర్నర్ తో చిరంజీవి భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి చిరంజీవి చేసిన సేవలకు గాను పద్మవిభూషణ్ ను ప్రకటించింది..

 కేంద్రప్రభుత్వం. తనకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి చిరు కృతజ్ఞతలు తెలిపారు..

వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న..

వ్యవసాయ శాస్త్రవేత్త, డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్‌కు భారతరత్న వరించింది. వ్యవసాయం, రైతుల సంక్షేమంలో ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది.

దీంతో ఆయనకు భారత రత్న ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. డాక్టర్ MS స్వామినాథ జీకి భారతరత్న ప్రదానం చేయడం చాలా సంతోషంగా ఉందని మోడీ తెలిపారు. ఎన్నో సవాళ్ల సమయంలో వ్యవసాయ రంగంలో భారతదేశం స్వావలంబన సాధించడంలో ఎమ్మెస్ స్వామినాథన్ కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు.

భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా స్వామినాథన్ అద్భుతమైన ప్రయత్నాలు చేశారన్నారు. అందుకే ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. వ్యవసాయంపై విద్యార్థుల్లో అభ్యాసం, పరిశోధనలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. డాక్టర్ స్వామినాథన్ గొప్ప దార్శనికుడని మోడీ ప్రశంసలు కురిపించారు..

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ సమావేశం

ప్రధాని నరేంద్ర మోదీతో పార్లమెంట్ లోని పీఎం కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం ముగిసింది. సుమారు గంట సేపు భేటీ కొనసాగింది.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పలు అభివృద్ధి అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో మరిన్ని విషయాలు చర్చించినట్లు సమాచారం.

చంద్రబాబు బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత జగన్ భేటీ కావడంతో ఏపీ రాజకీయా ల్లో ఉత్కంఠ నెలకొంది. భేటీకి సంబంధించి చర్చించిన విషయాలు తెలియాల్సిఉంది.

సిలిండర్లలో గంజాయి తరలింపు..

హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు ఆగ్రాకు కార్లలో ఎలాంటి అనుమానం రాకుండా గ్యాస్ సిలిండర్ లలో గంజాయి నింపి తరలిస్తుండగా మేడ్చల్ నేషనల్ హైవేపై తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డారు..

నలుగురు నిందితులు అభిషేక్ తోమర్, అరవింద్ చౌదరి, ఆశిష్ కుష్వాన, ఆకాష్ సోలంకిని అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గరి నుంచి 65 కేజీల గంజాయి, రెండు కార్లు, ఆరు సెల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 40 లక్షలు ఉంటుందని చెప్పారుపోలీసులు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు..

కేటీఆర్ ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీని కెసిఆర్ కోరారా లేదా: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ దద్దరి ల్లింది. అసెంబ్లీ వేదికగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య ఆరుగ్యారెంటీలు, రాజకీయ అంశాలపై వాడీవేడి చర్చ జరిగింది. అసెంబ్లీలో గవర్నర్‌కు ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య స్నేహం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు.

దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించారు. తమకు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని.. ఎంఐఎం ఒక్కటే తమకు ఫ్రెండ్లీ పార్టీ అని అన్నారు. అయితే పోచారం వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

బీజేపీ, బీఆర్‌ఎస్‌ది ఫెవికాల్ బంధమని ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ తీసుకొచ్చిన అనేక బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. కేటీఆర్‌ను సీఎం చేసేందుకు సహకరించాలని ప్రధాని మోదీని కేసీఆర్ కోరారని.. ఈ విషయాన్ని మోదీ స్వయంగా చెప్పారని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పోచారం శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ ఓడించిందని గుర్తు చేశారు. ఒకవేళ గతంలో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటే.. తామే వందమంది ఉన్నామని చెప్పారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన గ్యారంటీల్లో ఏ ఒక్కటి సరిగ్గా అమలు కావడంలేదని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అసెంబ్లీలో ఫ్రీ బస్సు, ఆటోడ్రైవర్ల ఇష్యూపై ప్రభుత్వాన్ని నిలదీశారు. దానికి అదే స్థాయిలో కౌంటరిచ్చారు

మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌.. కాంగ్రెస్‌ది ప్రచారం తప్ప..హామీల అమలు ఊసేలేదని మండిపడ్డారు BRS ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ప్రచారం తప్ప..హామీల అమలు లేదని మండి పడ్డారు. ఫ్రీ బస్సుతో మహి ళలఇబ్బంది పడుతున్నా రని, మరిన్ని బస్సులు పెంచాలని కోరారు...

ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్న ఘర్షణలో :ఒకరు మృతి

నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి బి గ్రామం వద్ద గల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఇద్దరు టెన్త్ విద్యార్థుల మధ్య గురువారం రాత్రి ఘర్షణ జరిగింది.

ఇద్దరు విద్యార్థులు గొడవ పడడంతో అర్బాజ్ (15) అనే విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యార్థి మృతదేహాన్ని ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించారు.ఈ విషయం తెలుసుకున్న మృతుని బంధువులు, స్నేహితులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, తమ కుటుంబంలో ఇద్దరు పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలని, రూ.25 లక్షల పరిహారంతో పాటు నిందితున్ని కఠినంగా శిక్షించే వరకు వెళ్లేది లేదని ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు.

దీంతో నిర్మల్ ఆర్డీవో ప్రభుత్వ ఏరియా ఆసు పత్రికి చేరుకొని బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. ఈవిషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చేస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు...

మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు భారతరత్న

భారత మాజీ ప్రధాని, తెలుగు తేజం పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించింది.

మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌లకు సైతం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

కాగా ఇటీవలే.. ఎల్ కే అడ్వాణీ, కర్పూరీ ఠాకూర్‌కు కూడా కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం ఐదుగురికి ఈ ఏడాది 5 భారతరత్న అవార్డులు ప్రకటించినట్టయ్యింది.

సాధారణంగా ఏడాదికి 3 భారతరత్న అవార్డులు ఇస్తారు. కానీ ఈ ఏడాది ప్రభుత్వం ఐదుగురికి ప్రకటించడం విశేషం.

చౌదరి చరణ్ సింగ్ జూలై 28, 1979 నుంచి జనవరి 14, 1980 మధ్యకాలంలో, పీవీ నరసింహారావు జూన్ 21, 1991 నుంచి మే 16, 1996 వరకు దేశ ప్రధాన మంత్రులుగా సేవలు అందించారు.

ఇక హరితవిప్లవ పితామ హుడైన ఎంఎస్ స్వామినా థన్ దేశానికి ఎనలేని సేవలు అందించారు. న్యాయవాదిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా కూడా ఆయన పనిచేశాడు....

అసెంబ్లీ ఆవరణలో నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమాన పరిచారని, వెంటనే ఆయన క్షమా పణలు చెప్పాలన్నారు.

సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూ డదన్నారు. అయితే సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు కౌన్సిల్ చైర్మన్ చెప్పారు.

శాసనసభ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటుపై శాసనమండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాయిదా తీర్మానం ఇచ్చారు.

విగ్రహం ఏర్పాటు ఆవశ్యకతపై సభలో చర్చించాలని ఆమె కోరారు. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలను వేసుకొని శాసన మండలికి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

దీంతో ఎమ్మెల్సీలు వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలు వేసుకొని రావద్దని పోలీసులు సూచించారు. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్‌, శోభన్‌ రెడ్డి, తాతా మధు, మహమూద్‌ అలీ తదితరులు సభలోకి వెళ్లిపోయారు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు హెచ్చరిక...

నెల ముందే వచ్చేసిన వేసవి కాలం...

ఫిబ్రవరి రెండో వారం ఇంకా రానే లేదు..అప్పుడే భానుడి ప్రతాపం కనిపిస్తుంది. గడిచిన రెండు, మూడు రోజుల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సారి ఎండలు ముందే రానున్నాయి అని.. గత ఏడాది కంటే కూడా ఎండల ఎక్కువగా ఉండనున్నాయి అని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అంతేకాదు వాతావరణ శాఖ ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేసుకోమంటూ కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.ఈ ఏడాది ఎండలు బాబోయ్ అనేలా ఉంటాయని అంటుంది వాతావరణ శాఖ. ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం చలికాలం కూడా చాలా వేడిగా గడుస్తుంది. చలి కాలం కంప్లీట్ అవ్వడానికి ఇంకా నెల రోజుల సమయం ఉన్నప్పటికీ వాతావరణం మాత్రం వేడి గా మారుతుంది. గత సంవత్సరం తో పోల్చితే చలి కాలం లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ఫిబ్రవరి చివరి నుండి వేసవి కాలం మొదలు అవుతుంది అని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అంతేకాదు గతం కంటే ఎక్కువ ఎండ ప్రభావం ఈ వేసవి లో ఉండ నుంది అని అంటున్నారు నిపుణులు.

మామూలుగా మార్చి నెల మధ్య నుండి సమ్మర్ ఎఫెక్ట్ మొదలు అవుతుంది. కానీ ఈ సంవత్సరం నెల ముందు నుండే అంటే ఫిబ్రవరి ఎండింగ్ నుండి సమ్మర్ సుర్రు మనడానికి రెడీ అవుతుంది అని వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఇందుకు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. దీనంతటికీ కారణం వాతావరణ లో ఏర్పడిన ఎల్ నినో ఎఫెక్ట్ అని అంటున్నారు నిపుణులు. దీని వల్ల భూ తాపం ఎప్పటికప్పుడు పెరుగుతుంది అని అంటున్నారు. అయితే ఈ వేసవి లో వడ గాల్పుల ప్రభావం చూపనుంది అని.. సమ్మర్ మొత్తం లో హీట్ వేవ్స్ కొన్ని సార్లు ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటున్నారు నిపుణులు. అయితే తగిన జాగ్రతలు తప్పనిసరి అని అంటున్నారు.