/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz TS:భద్రాచలం:చర్ల:దళిత బంధు సాధన కమిటీ పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు Miryala Kiran Kumar
TS:భద్రాచలం:చర్ల:దళిత బంధు సాధన కమిటీ పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు

 దళిత బంధు సాధన కమిటీ పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ సంపూర్ణ మద్దతు 

 సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ నాయకులు ముసలి సతీష్ 

చర్ల మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద దళిత బంధు సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ నాయకులు కామ్రేడ్ ముసలి సతీష్ హాజరై సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటం చేస్తే ఏ సమస్య అయినా పరిష్కారం కాక తప్పదని దళిత బంధు సాధన కోసం పోరాట రూపాన్ని ఎంచుకున్న కమిటీ నాయకత్వానికి విప్లవ అభినందనలు తెలియజేశారు అనగారిన వర్గాల అభ్యున్నత కోసం అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా మాజీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దళిత బంధు పథకాన్ని ఏర్పాటు చేసిందని మొదటి దఫగా అర్హులను ఎంపిక చేసి దళిత బంధుని మంజూరు చేసిందని అన్నారు అనంతరం ఈ ప్రాంతంలోని ప్రజలు అందరికీ దళిత బందు వస్తుందని భావించి నమ్మారు మా జీవితాలు బాగుపడతాయని ఆశపడ్డారు ఈ ఆశను అదునుగా చేసుకొని ప్రభుత్వ పదకమైన దళిత బందును ఇప్పిస్తామంటూ కొంతమంది ఈ నిరుపేదలైన దళితుల దగ్గర నుంచి లక్షల రూపాయలు దండుకున్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేసరికి ప్రభుత్వం మారేసరికి దళిత బంధు వస్తుందో రాదో అనేటువంటి భయాందోళనకి ప్రజలు గురయ్యారు రెక్కల కష్టంతో తిని తినక సంపాదించుకున్న డబ్బులను అప్పు సప్పు చేసి వడ్డీలకు తెచ్చిన డబ్బులను దళిత బందు కోసం వెచ్చించి మోసపోయామని బాధతో రాష్ట్రంలో అక్కడక్కడ దళిత బందు కారణంగా ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభుత్వ పథకమైన దళిత బంధు పై డబ్బులు దండుకున్న విషయంపై తక్షణమే అధికారులు విచారణ జరిపి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవాలి తీసుకున్న డబ్బులను వారి నుంచి ప్రజలకు ఇప్పించాలి ఇలాంటి దందాలను పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు నూతన ప్రభుత్వంలో పరిపాలనలో దళితుల ఆశలు ఆకాంక్షలు మరింత చిగురించాలి తప్ప చిదిమి వేయకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు ప్రభుత్వంపై దళితులకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు కచ్చితంగా ఇవ్వాలని తద్వారా దళిత సమాజానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరోసాని ఇవ్వాలని ప్రజల్లో ఉన్న భయాందోళనలను చెరిపి ఆత్మహత్యలను ఆపాలని దళితులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాలని కోరారు లేనియెడల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అగ్రహానికి గురికావాల్సి వస్తుందని ఈ పోరాటానికి నిరంతరం అండగా ఉంటుందని భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత బందు సాధన కమిటీ సభ్యులు ప్రజలు పాల్గొన్నారు

Ts:తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్‌ల బాగోతం..

తెలంగాణలో బయటపడుతున్న పలువురు ఐఏఎస్‌ల బాగోతం. మొన్న సోమేష్‌కుమార్, నిన్న అరవింద్‌కుమార్.. నేడు రజత్‌కుమార్‌ ఆస్తులపై వివాదం. మహబూబ్‌నగర్‌జిల్లా హేమాజీపూర్‌లో 52ఎకరాలు కొనుగోలు.. 15 ఎకరాలను ఇతరుల పేర్లు మీద మార్చడానికి.. స్లాట్‌ బుక్‌ చేసిన రిటైర్డ్‌ ఐఏఎస్ రజత్‌కుమార్. వరుసగా పలువురు ఐఏఎస్‌లపై ఆరోపణలు.

TS: మేడారం సమ్మక్క సారక్క జాతరకు రండి..

మేడారం జాతరకు రండి..

గవర్నర్ ను ఆహ్వానించిన మంత్రి సీతక్క.

రాజ్‌భవన్‌లో గురువారం గవర్నర్‌ని మర్యాదపూర్వకంగా కలిసి

తెలంగాణ ప్రభుత్వం తరుపున మేడారం సమ్మక్క-సారక్కల పండుగకు తప్పకుండా రావాలని ఆహ్వానించిన మంత్రి సీతక్క, కాంగ్రెస్ నాయకురాలు శిల్ప, ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్.

సానుకూలంగా స్పందించిన గవర్నర్ తమిళసై.

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి:తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి

తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని తగుళ్ళ జనార్దన్ యాదవ్ జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం వల్ల, పేద విద్యార్థులు డబ్బులు పెట్టి ప్రైవేటు కళాశాలలో చదవలేక విద్యకు దూరమైతున్నారని తెలియజేశారు. జిల్లాలో 2 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కానీ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల తో పాటు, ప్రభుత్వ పీజీ కళాశాల, అన్ని సబ్జెక్టులతో ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో, ఇంటర్మీడియట్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో, మెడికల్ కళాశాలలో, పీజీ కళాశాలలో, యూనివర్సిటీలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలి, నాణ్యమైన విద్య అందించాలి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి అని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి తెలియజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విద్యార్థిని, విద్యార్థుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తక్షణమే మంచి విద్యావంతుడిని విద్యాశాఖ మంత్రిగా నియమించాలని, విద్యాశాఖ బడ్జెట్ 25 శాతం ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన నాయకులు గుద్దేటి శ్యామ్, లింగంపల్లి మధుకర్, మల్లేష్, రవి, మధు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

భద్రాచలం:ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

ఫిబ్రవరి 16న జరిగే గ్రామీణ భారత్ బందును విజయవంతం చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో రైతు కార్మికుల ఆవేదన

కేంద్ర బిజెపి కార్పొరేట్ మతతత్వ విధానాలను నిరసిస్తూ ఈనెల 16న దేశవ్యాప్త కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ అన్నారు అనంతపురం సతీష్ మాట్లాడుతూ . మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తయింది అయినా రైతాంగ కార్మిక వర్గ ప్రజల సమస్యలను మోడీ పరిష్కరించలేదు. కార్పొరేటు మతతత్వ విధానాలను అనుసరిస్తూ సామ్రాజ్యవాదం కార్పొరేట్ పెట్టుబడిదారులకు అనుగుణంగా వ్యవహరించింది . రైతులు పండించిన పంటకు MSP ఇస్తామన్న హామీని తుంగలో తొక్కింది , నిరుద్యోగం ధరల పెరుగుదల పేదరికం ఆకలి మొదలైన కీలక అంశాలను పరిష్కరించకుండా దీని నుంచి తప్పించడానికి ప్రజలను పక్క దారి పట్టించే వైఖరిని చేపట్టింది.ఇందులో భాగమే రామ మందిరం .2024 పార్లమెంట్ ఎన్నికలలో ప్రజా వ్యతిరేక బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజల సిద్ధం కావాలని ముసలి సతీష్ పిలుపునిచ్చారు ఈ నెల 16న జరిగే భారత్ బంద్ లో రైతులు వ్యవసాయ కార్మికులు లక్షలాదిగా పాల్గొనాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో నరేష్ సమ్మక్క నాగరాజు రాజు బాయమ్మ బీమా లక్ష్మి సారయ్య సంజయ్ కమల సరిత నాగేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు..

హైదరాబాద్‌: నేటి నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు.. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్‌ తమిళిసై..

తిరుమల: శ్రీవారి దర్శనానికి నాలుగు గంటల సమయం...

తిరుమల: 3 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 65,683 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,177 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.59 కోట్లు

హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..

హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం

మొదటి అంతస్తు ల్యాబ్ లో చెలరేగిన మంటలు 

ఆస్పత్రిలో ఎక్కువగా చిన్న పిల్లలు

ఇప్పటికే దట్టంగా కమ్ముకున్న పొగలు 

భయాందోళనల్లో తల్లితండ్రులు 

ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది

ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ..

ఉత్తరాది, దక్షణాది రాష్ట్రాలకు నిధుల పంపిణీ వివాదంపై స్పందించిన ప్రధాని మోడీ..

కొందరు కావాలనే దేశాన్ని ఇలా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రతి రాష్ట్రానికి న్యాయంగా అందాల్సిన నిధులు అందుతున్నాయి.. నిధుల కేటాయింపును సంకుచితంగా చూడకూడదు.. రాష్ట్రాలపై వివక్ష లేదు.. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తాం.. పేదరికంలో ఉన్న రాష్ట్రాలకు కొన్ని ఎక్కువ నిధులు అవసరం.. మా రాష్ట్రం.. మా ట్యాక్స్‌ అంటున్నారు.. ఇదేం వితండవాదం..? నది మా రాష్ట్రంలో ప్రవహిస్తుంది కాబట్టి నీళ్లన్నీ మాకే కావాలంటే ఎలా?.. మా రాష్ట్రంలో బొగ్గు ఉంది.. మేమే వాడుకుంటామంటే కుదురుతుందా?-ప్రధాని నరేంద్ర మోడీ

ఏపీ:2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,86, 389 కోట్లతో బడ్జెట్‌..

2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,86, 389 కోట్లతో బడ్జెట్‌..

రూ. 2,30,110 కోట్లు రెవెన్యూ వ్యయం.. రూ. 30, 530 కోట్ల మూలధన వ్యయం.. రూ.24, 758 కోట్ల రెవెన్యూ లోటు .. రూ. 55,817 కోట్ల ద్రవ్యలోటు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం ద్రవ్యలోటు.. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 1.56 శాతం.