/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆత్మహత్య కాదు ఇద్దరు విద్యార్థులను చంపేశారు Yadagiri Goud
ఆత్మహత్య కాదు ఇద్దరు విద్యార్థులను చంపేశారు

భువనగిరి ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థినులు ఆత్మహత్య కారణాల అన్వేషణలో… అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుల తల్లిదండ్రులు సరికొత్త ఆరోపణల నేపథ్యంలో ఈ అను మానాలు బలపడు తున్నాయి. వార్డెన్ శైలజకు ఓ ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం ఉందని.. ఆ విషయం భవ్య, వైష్ణవికి తెలియటంతో వార్డెన్ వేధించారనే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది.

అందుకే పిల్లలిద్దరినీ హత్య చేసే ముందు తప్పుడు సూసైడ్ లెటర్‌ రాయించారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మా మేడం శైలజ మంచిది.. ఆమెను ఒక్క మాట కూడా అనకండి అని విద్యార్థినులు రాసినట్టు చెబుతున్న సూసైడ్ లెటర్‌తో ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈ స్థితిలో వార్డెన్ శైలజ, ఆటో డ్రైవర్ ఆంజనేయు లుని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరినీ ప్రశ్నిస్తున్నారు.

ఆరుగురిపై కేసు న‌మోదు..

మరోవైపు భువనగిరి హాస్టల్‌లో బాలికల ఆత్మహత్య కేసులో ఆరుగురిపై కేసు నమోదైంది. హాస్టల్‌ వార్డెన్‌ శైలజ, ఆటోడ్రైవర్‌ ఆంజనేయులు, వంట మనుషులు సుజాత, సులోచనపై కేసు నమోదు కాగా.

అటు పీఈటీ ప్రతిభ, టీచర్‌ భువనేశ్వరిపై కేసు నమోదు చేశారు. పోలీసులు. ఇప్పటికే హాస్టల్‌ వార్డెన్‌, ఆటో డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకున్నారు..అటు వార్డెన్‌ శైలజ, ఆంజనేయు లును విచారిస్తున్నారు.

పోలీసులు. దోషులను శిక్షించాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి..మరోవైపు విద్యార్థినుల ఆత్మహత్యతో హాస్టల్‌ ఖాళీ అయ్యింది.

ఆర్థిక స్థితిపై భర్తను భార్య వేదించడం క్రూరత్వమే : హైకోర్టు

ఆర్థిక స్థితి గురించి భర్తను భార్య తరచుగా ఎత్తిపొడ వడం, అవహేళన చేయడం కూడా మానసిక క్రూరత్వ మేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.

ఇటువంటి క్రూరత్వాన్ని ఎదుర్కొన్న సందర్భాల్లో విడాకులను కోరే హక్కు భర్తకు లభిస్తుందని తెలిపింది. ఆర్థిక స్థోమతకు మించిన కలలను నెరవేర్చమని భర్తపై భార్య ఒత్తిడి చేయడం సరికాదని న్యాయమూర్తులు సురేష్ కుమార్ కైత్ , నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది.

అనవసర అంశాలపై రాద్ధాంతం చేస్తూ భర్తపై భార్య ఒత్తిడిని పెంచడం సరికాదు. దీనివల్ల జీవితంలో సంతృప్తి, ప్రశాంతతలకు చోటులేకుండా పోతుంది. భర్తపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది.

వైవాహిక జీవితంలో ఉన్నవారు తమ అవసరాలు, కోరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి’’ అని ధర్మాసనం సూచించింది.

భార్య టార్చర్‌ను భరించలేక విడాకుల కోసం ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌కు ఫ్యామిలీ కోర్టు అనుమ తించింది. దీన్ని సవాల్ చేస్తూ సదరు మహిళ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారిస్తూ ఢిల్లీ హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది.

విడాకులను పొందేందుకు బాధిత భర్తకు అనుమతి ఇస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్ధించింది.తన తల్లిదండ్రుల నుంచి రూ.8వేలు అప్పు తీసుకున్న విషయాన్ని పదేపదే చెప్పి భర్తను భార్య టార్చర్ చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

హర్యానా నుంచి ఢిల్లీకి కుటుంబాన్ని షిఫ్ట్ చేయాలని భర్తను ఆమె బలవంత పెట్టడాన్ని కూడా న్యాయస్థానం తప్పు పట్టింది.....

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) 'ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు..

''ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే 'జయ జయహే తెలంగాణ'ను అధికారిక గీతంగా, సగటు రాష్ట్ర ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా, రాచరికపోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా, వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ సమయంలో ప్రజలు నినదించిన TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం'' అని పేర్కొన్నారు..

బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?: జగన్‌ను ప్రశ్నించిన చంద్రబాబు

మాడుగుల: రానున్న ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ కోసమని తెదేపా అధినేత చంద్రబాబు (chandrababu) అన్నారు. 64 రోజుల్లో తమ ప్రభుత్వం రాబోతోందని చెప్పారు..

అనకాపల్లి జిల్లా మాడుగులలో నిర్వహించిన 'రా.. కదలి రా' సభలో ఆయన మాట్లాడారు. బటన్‌ నొక్కుతున్నానని సీఎం జగన్‌ గొప్పలు చెబుతున్నారన్నారు. ''బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?'' అని ప్రశ్నించారు. ఆయన పుణ్యం వల్లే చెత్తపన్ను వచ్చిందని ఎద్దేవా చేశారు..

''ఈ ఎన్నికల్లో రాష్ట్రం.. ప్రజలు గెలవాలి. సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్‌ లేదు. ఇలాంటి సీఎంను నా జీవితంలో చూడలేదు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్‌మోహన్‌రెడ్డి. కరెంటు ఛార్జీలు పెంచి రూ.64వేల కోట్ల భారం మోపారు. జగన్‌ బటన్‌ నొక్కుడుతో ఒక్కో కుటుంబం రూ.8లక్షలు నష్టపోయింది. జాబ్‌ క్యాలెండర్‌, మద్య నిషేధం, సీపీఎస్‌ రద్దు, రైతు ఆత్మహత్యలు ఆపేందుకు ఎందుకు బటన్‌ నొక్కలేదు? ఈ విషయాలను ప్రజలు తెలుసుకోవాలి. జగన్‌ది ఉత్తుత్తి బటన్‌ అని గమనించాలి. జాబు రావాలంటే బాబు రావాల్సిందే'' అని చెప్పారు..

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది..

అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది..

''ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్‌ 41ఏ నోటీసు ఇవ్వాలి. అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు? అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తాం.

ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదు'' అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం..

సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది..

మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది..

రైతుల, యువత, నేత కార్మికులు, వృద్ధులు, మహిళలు ఆర్థికంగా లబ్ధిపొందారు..

అధికారంలోకి రాగానే విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించాం..

ఏపీలో మానవాభివృద్ధి సూచిక ప్రమాణాలను పెంచేందుకు నవరత్నాలు ప్రారంభించాం.

పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం.

-అసెంబ్లీలో గవర్నర్.

Revanth Reddy: పద్మ అవార్డులకు ఎంపికైన వారికి రూ.25 లక్షలిస్తాం..దీంతోపాటు పింఛన్ కూడా

రాష్ట్రంలో ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల నగదు బహుమతి అందజేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) వెల్లడించారు..

అంతేకాదు ప్రతినెల వారి ఖర్చుల కోసం రూ.25 వేల పింఛన్ కూడా ఇస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న కవులు, కళాకారులు ఒకానొక పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే దుర్భర పరిస్థితులు ఉంటున్నాయని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వివిధ రంగాల్లో రాణించిన వారిని గుర్తించాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు..

ఈ క్రమంలోనే తెలుగోళ్లు ఎక్కడ ఉన్నా కూడా మనోళ్లేనని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడుకునే భాష తెలుగు అని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాంటి క్రమంలో మన తెలుగు భాష, మన కలలు, సంప్రదాయాలను గౌరవించుకోవాలని అన్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా నిర్వహించిన కార్యక్రమమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా స్థానిక కలలను వృత్తిగా మార్చుకుని అందులోనే జీవించేవారిని గౌరవించాలని రేవంత్ రెడ్డి చెప్పారు..

చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కొనసాగుతున్న కీలక భేటీ..

అమరావతి: సీట్ల సర్దుబాటు, ఇతర అంశాలపై చర్చించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో వీరిద్దరి మధ్య అత్యంత కీలకమైన భేటీ జరుగుతోంది..

ప్రధానంగా మూడు అంశాలపై ఇరువురి మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీ జాబితాలు ప్రకటిస్తుండటంతో టీడీపీ-జనసేన నేతలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఇరువురు అధినేతలు సమావేశమయ్యారు. సంక్రాంతి సందర్భంగా జరగిన డిన్నర్ మీట్‌లో స్థానాలు సంఖ్య, సర్దుబాటు చర్చలు ప్రాథమికంగా ఒక అవగాహనకు వచ్చారు. అయితే ఆశావహుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో సీట్ల సంఖ్యను పెంచాలని జనసేన కోరుతోంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న సమావేశంలో సీట్ల సర్దుబాటుపై అధినేతలు తుదిమెరుగులు దిద్దనున్నారు.

కాగా సిట్టింగ్ స్థానాలను ఎమ్మెల్యేలకు కేటాయిస్తామని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఇరుపక్షాల అధినేతలు కలిసి సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చిస్తున్నట్టుగా సమాచారం. ఇప్పటికే రెండు పక్షాల నేతలు మధ్య మేనిఫెస్టోపై చర్చలు ముగియడంతో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన ఎప్పుడు చేయాలనే అంశంపై కూడా తుది నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. తొలుత ఇరుపక్షాల అధినేతలు కలిసి ఉమ్మడి మానిఫెస్టో ప్రకటించాలని నిర్ణయించారు. అయితే టీడీపీ సూపర్ సిక్స్, జనసేన 'షణ్ముఖ వ్యూహం' రెండింటిని కలిపి ఉమ్మడి మానిఫెస్టోగా రూపొందించనున్నారు. ఇక ఇరుపక్షాల నేతలు కలిపి ఉమ్మడి సభల్లో పాల్గొనడంపై కూడా సంప్రదింపులు జరపనున్నారని తెలుస్తోంది. ఇరుపక్షాల అధినేతలు తాడేపల్లిగూడెంలో పాదయాత్ర నిర్వహించి భారీ బహిరంగసభ నిర్వహణ, సర్దుబాటు పూర్తయిన స్థానాల్లో అభ్యర్థులపై కూడా ఇరుపక్షాల నేతలు మధ్య చర్చలు జరగనున్నాయి..

కాగా వైసీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించుకుంటూ పోతున్న వేళ టీడీపీ, జనసేన అధినేతల భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది. ఏయే అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటారు?, ఏవైనా ప్రకటనలు ఉంటాయా ? అనేది అనేది ఏపీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది..

Telangana Cabinet: ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్..

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది..

ఇందిరమ్మ ఇళ్ల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్‌ల కోసం అర్హులైన అభ్యర్థులను ఎలా ఎంచుకోవాలి? ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలనే దానిపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మరి ఈ భేటీలో రెండు హామీలకు ఆమోదం లభిస్తుందా.. లేక ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి.

టీఎస్ బదులు టీజీ నంబర్ ప్లేట్లను మార్చే అంశంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కేబినెట్ సమావేశానికి దాదాపు 20 నుంచి 25 అంశాలతో ఎజెండా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు అన్ని శాఖల నుంచి సమాచారం అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కార్యదర్శులను ఆదేశించారు..

నంది ఆవార్డుల స్థానంలో గద్దర్ పేరుతొ సినీ అవార్డులు

ప్ర‌జాగాయ‌కుడు గద్ద‌ర్ పేరుతో సినీ అవార్డులు ప్ర‌దానం చేస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించ‌డం త‌న‌కు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

నంది అవార్డుల ప్రోత్సహం అనేది చాలా ఏళ్ళు అవుతోందని.. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులను ఇవ్వనుండటం శుభపరిణామమన్నారు.

ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతు న్నానని ఆయన అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహితలందరిని తెలంగాణ ప్రభుత్వం సన్మానించింది. పుర‌స్కార గ్ర‌హీత‌ల‌కు రూ.25 ల‌క్ష‌లు న‌గ‌దు రివార్డ్ అంద‌జేసింది.

ఈ సంద‌ర్భ‌గా చిరంజీవి మాట్లాడుతూ, పద్మ విభూషణ్ అవార్డు రావడం ఆనందంగా ఉందని.. గత వారం రోజులుగా అందరు వచ్చి అభిమానం చూపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు

మెగాస్టార్ చిరంజీవి. పద్మ అవార్డుల గ్రహితలను గౌరవిస్తూ.. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మనవాళ్లలను మనం గౌరవించకోకపోతే ఎలా అని అనుకోవడం గొప్ప విషయమన్నారు.

అవార్డులు ప్రకటించిన తర్వాత.. వెంటనే ఇలా సన్మానించడం ఇదే తొలిసారని.. అవార్డులు కళాకారులకు ఎంతో ప్రొత్సహాన్ని ఇస్తాయని చిరంజీవి అన్నారు. పద్మభూషణ్ వచ్చినప్పుడు ఉన్నంత సంతోషం.. పద్మవిభూషణ్ వచ్చినప్పుడు అంత ఉత్సాహం లేదన్నారు

చిరంజీవి. తాను అవార్డుల కోసం ఎప్పుడూ ఎదురు చూడను.. అవార్డులు రావాలని కోరుకోనన్నారు. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి చేరాయన్నారు.. సభ ఇంత నిండుగా ఉందంటే.. దానికి కారణం వెంకయ్య నాయుడు.. ఆయన తెలుగుతనానికి నిలువెత్తు నిదర్శనమని.. తెలుగు భాషను గొప్పగా నిలబెట్టిన వాళ్ళలో వెంకయ్య నాయుడు ఒకరని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.