/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: రేపటి భవిష్య భారత్ కు మోదీ నాయకత్వం కావాలి: బూర నర్సయ్య గౌడ్ Mane Praveen
NLG: రేపటి భవిష్య భారత్ కు మోదీ నాయకత్వం కావాలి: బూర నర్సయ్య గౌడ్

నల్లగొండ జిల్లా: 

చిట్యాల మండలం, నేరేడ గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ, కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, యూత్ ఐకాన్ నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని, రేపటి భవిష్య భారత్ కు మోదీ నాయకత్వం కావాలని, బంగారు భవిష్యత్ కు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి దేశ అభివృధికి తోడ్పడుదాం అన్నారు.

NLG: కష్టజీవుల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులు: నెల్లికంటి సత్యం

కష్టజీవుల కార్మికుల పక్షాన నిరంతరం పోరాటాలు చేసేది కమ్యూనిస్టులేనని, వారి పక్షాన పేద ప్రజలు నిలబడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం కోరారు. ఆదివారం సిపిఐ కార్యాలయంలో జరిగిన మునుగోడు పట్టణ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసింగించారు. 

పాలకులు ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, ఉపాధి రంగాలను మెరుగుపరచకుండా ఎన్నికల్లో ప్రలోభాల పేరుతో ప్రజలను మోసగిస్తున్నారని ఆరోపించారు. ఎస్ ఎల్ బి సి అంతర్భాగంలోని దిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని అన్నారు.  

వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నిషేధాన్ని సిపిఐ స్వాగతిస్తూ. ఆ పోరాటంలో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారు. మునుగోడు పట్టణంలోని పేదలకు ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణాల కోసం ఐదు లక్షల రూపాయల గృహలక్ష్మి పథకాన్ని అమలు పరచాలని కోరారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు,పెన్షన్లు, తదితర సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, పట్టణ కేంద్రంలో సులబ్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు.

ఈ సమావేశానికి రేవెల్లి అంజయ్య అధ్యక్షత వహించగా, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి టి. వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శ్రీను, మండల కార్యవర్గ సభ్యులు దుబ్బ వెంకన్న, ఎం.డి జానీ, బెల్లం శివయ్య, పట్టణ కార్యదర్శి కురుమర్తి ముత్తయ్య, చాపల విప్లవ్, ఎల్ల స్వామి, సైదులు, లక్ష్మయ్య, అండాలు, ప్రేమలత, రేణుక, దీప్తి, కలమ్మ, సరిత, తదితరులు పాల్గొన్నారు.

NLG: తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షురాలు గా నాగుల జ్యోతి

నల్లగొండ: తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం మహిళా విభాగం నూతన కమిటీ ఎన్నిక.. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పోలేపల్లి నాగమణి మాదిగ ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఉపాధ్యక్షురాలు గా నాగుల జ్యోతి, మిర్యాలగూడ నియోజకవర్గ ఇన్చార్జిగా సరళ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. 

ఎన్నికైన నాయకులకు అంబేద్కర్ భవనంలో ఘన సన్మానం నిర్వహించారు. 

ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద పద్మ, పోలేపల్లి నాగమణి, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు కత్తుల రవి, తదితరులు పాల్గొన్నారు.

NLG: దేశవ్యాప్త కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ కు సిద్ధం కావాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ

నల్లగొండ జిల్లా: 

చండూరు: కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేటు అనుకూల విధానాలు, మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె - గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం లు పిలుపునిచ్చారు. 

సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య అధ్యక్షతన జరిగిన మునుగోడు నియోజక వర్గ స్థాయి విస్తృత సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నా, రైతులు కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అవినీతి నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామని మాటలు నీటి మూటలు గానే మిగిలాయని అన్నారు. భారతదేశంలోని సహజ వనరులన్నీ కార్పొరేట్ శక్తుల పరం చేస్తుంది. వ్యూహాత్మకంగా ప్రభుత్వ రంగ సంస్థలలో వందశాతం అమ్మకాల పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు.12 గంటల పని విధానం అమల్లోకి తెస్తుంది, కాంట్రాక్టు విధానం తీసుకువచ్చి కార్మికులను మరింత దోపిడీకి గురిచేస్తుంది. కనీస వేతనం 26వేలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని ఆరోపించారు. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

 

ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కోసం దశలవారీగా కార్యక్రమాలలో భాగంగా జనవరి 26న జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించాలని, 27 నుండి 30 వరకు అన్ని యూనియన్ల జనరల్ బాడీ లు నిర్వహించి యజమానులకు ప్రభుత్వ అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని అన్నారు. ఫిబ్రవరి 16 సమ్మె జయ ప్రధానికి ఇంటింటికి కరపత్రాలు, ప్రజలతో సంతకాల సేకరణ గ్రామ మండల స్థాయిలో రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు

ఈ సమావేశంలో ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి,సిఐటియు నాయకులు వరికుప్పల ముత్యాలు,జెర్రిపోతుల ధనంజయ్, మోగుదాల వెంకటేశం, కక్కునూరి నగేష్, వివిధ యూనియన్ల నాయకులు రమావత్ కవిత, అన్నే పర్తి వెంకన్న, కత్తుల సైదులు, పాశం లింగయ్య, లింగస్వామి,ముంత వెంకటేశ్వర్లు, మరియమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

NLG: బాల సదనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో ఒక కోటి 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన బాల సదనం మరియు 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న వయో వృద్ధుల వసతి గృహానికి శనివారం రాష్ట్ర ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

TS: నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

ఖమ్మం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గం లోని మధిర, చింతకాని మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

మధిర మండలం బయ్యారంలో గ్రామ పంచాయతీ భవనం, చిలుకూరులో పాఠశాల భవనం, నిదానపురం , మాటూరులో ఆరోగ్య ఉపకేంద్రాలు , చింతకాని మండలం నాగులవంచల రైతు వేదిక, చిన్నమండవలో ఆరోగ్య కేంద్రం వాటర్‌ ప్లాంట్‌, డైనింగ్‌ హాల్‌ను భట్టి విక్రమార్క ప్రారంభించ నున్నారు.

నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో కోడుమూరులోని గ్రామ పంచాయతీ భవనం, విద్యుత్ సబ్ సెంటర్లలో. అలాగే సాయంత్రం చింతకానిలో జరిగే అభినందన సభలో భట్టి పాల్గొంటారు.

TSPSC బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి

TSPSC బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. 

TSPSC కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. 

ఆయనతో పాటు బోర్డు సభ్యులు అనితా రాజేంద్ర, పాల్వాయి రజని కూడా డ్యూటీ ఎక్కారు.

NLG: లెంకలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రధానం

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం

లెంకలపల్లి: ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలాపించారు.

అనంతరం ఏఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఏర్పుల నగేష్ ఆధ్వర్యంలో.. వివిధ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు సర్పంచ్ పాక నగేష్ యాదవ్,ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, హెడ్మాస్టర్ యాదగిరి, ఫౌండేషన్ సభ్యుడు ఏర్పుల చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

నల్లగొండ జిల్లా: మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా, గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశం 1950 జనవరి 26న స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

TS: తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌: కార్యకర్తల శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రాహుల్‌గాంధీ పాదయాత్ర తోనే కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు.. హామీలు అమలు ఎక్కడ అని భారాస నేతలు అడుగుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా నగదు అందిస్తాం. భారాస అమలు చేశారా? పదేళ్లలో కేసీఆర్‌ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలి. కొందరు నన్ను మేస్త్రి అని విమర్శిస్తున్నారు. అవును తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అవినీతిపరులు, కోటీశ్వరులను కేసీఆర్‌ రాజ్యసభకు పంపించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బలహీన వర్గాల బిడ్డలు మందుల శామ్యూల్‌, వెడ్మ బొజ్జుకి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించింది. రైతు బిడ్డనైన నేను కాంగ్రెస్‌లో సీఎం అయ్యాను. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకం. భారాసను మొన్న ఎన్నికల్లో ఓడించాం, పార్లమెంట్‌ ఎన్నికల్లో తరిమికొడదాం. పులి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పులి వస్తే బోనులో పెట్టి బొందపెడతాం. మోదీ, కేసీఆర్‌ వేరువేరు కాదు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్లమని భారాస నేతలు అంటున్నారు. మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. కేసీఆర్‌ కుటుంబాన్ని అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.