/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: దేశవ్యాప్త కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ కు సిద్ధం కావాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ Mane Praveen
NLG: దేశవ్యాప్త కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ కు సిద్ధం కావాలి: సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ

నల్లగొండ జిల్లా: 

చండూరు: కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్పొరేటు అనుకూల విధానాలు, మతతత్వ విధానాలను ప్రతిఘటిస్తూ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16న కార్మికుల సమ్మె - గ్రామీణ భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, రైతు సంఘం రాష్ట్ర నాయకులు బండ శ్రీశైలం లు పిలుపునిచ్చారు. 

సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య అధ్యక్షతన జరిగిన మునుగోడు నియోజక వర్గ స్థాయి విస్తృత సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నా, రైతులు కార్మికుల సమస్యలు ఏమాత్రం పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అవినీతి నల్లధనాన్ని తెచ్చి ప్రజలకు 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తామని మాటలు నీటి మూటలు గానే మిగిలాయని అన్నారు. భారతదేశంలోని సహజ వనరులన్నీ కార్పొరేట్ శక్తుల పరం చేస్తుంది. వ్యూహాత్మకంగా ప్రభుత్వ రంగ సంస్థలలో వందశాతం అమ్మకాల పేరుతో కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు.

కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తుందని ఆరోపించారు.12 గంటల పని విధానం అమల్లోకి తెస్తుంది, కాంట్రాక్టు విధానం తీసుకువచ్చి కార్మికులను మరింత దోపిడీకి గురిచేస్తుంది. కనీస వేతనం 26వేలు ఇవ్వడానికి ముందుకు రావడంలేదని ఆరోపించారు. కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బిజెపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.

 

ఫిబ్రవరి 16 దేశవ్యాప్తంగా కార్మికుల సమ్మె- గ్రామీణ భారత్ బంద్ జయప్రదం కోసం దశలవారీగా కార్యక్రమాలలో భాగంగా జనవరి 26న జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో బైక్, ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహించాలని, 27 నుండి 30 వరకు అన్ని యూనియన్ల జనరల్ బాడీ లు నిర్వహించి యజమానులకు ప్రభుత్వ అధికారులకు సమ్మె నోటీసులు అందజేయాలని అన్నారు. ఫిబ్రవరి 16 సమ్మె జయ ప్రధానికి ఇంటింటికి కరపత్రాలు, ప్రజలతో సంతకాల సేకరణ గ్రామ మండల స్థాయిలో రైతులు వ్యవసాయ కార్మికులు కార్మికులతో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు

ఈ సమావేశంలో ప్రజానాట్య మండల జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి,సిఐటియు నాయకులు వరికుప్పల ముత్యాలు,జెర్రిపోతుల ధనంజయ్, మోగుదాల వెంకటేశం, కక్కునూరి నగేష్, వివిధ యూనియన్ల నాయకులు రమావత్ కవిత, అన్నే పర్తి వెంకన్న, కత్తుల సైదులు, పాశం లింగయ్య, లింగస్వామి,ముంత వెంకటేశ్వర్లు, మరియమ్మ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

NLG: బాల సదనం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డులో ఒక కోటి 35 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన బాల సదనం మరియు 50 లక్షల వ్యయంతో నిర్మించనున్న వయో వృద్ధుల వసతి గృహానికి శనివారం రాష్ట్ర ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరిచందన, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

TS: నేడు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

ఖమ్మం: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క , నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గం లోని మధిర, చింతకాని మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

మధిర మండలం బయ్యారంలో గ్రామ పంచాయతీ భవనం, చిలుకూరులో పాఠశాల భవనం, నిదానపురం , మాటూరులో ఆరోగ్య ఉపకేంద్రాలు , చింతకాని మండలం నాగులవంచల రైతు వేదిక, చిన్నమండవలో ఆరోగ్య కేంద్రం వాటర్‌ ప్లాంట్‌, డైనింగ్‌ హాల్‌ను భట్టి విక్రమార్క ప్రారంభించ నున్నారు.

నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో కోడుమూరులోని గ్రామ పంచాయతీ భవనం, విద్యుత్ సబ్ సెంటర్లలో. అలాగే సాయంత్రం చింతకానిలో జరిగే అభినందన సభలో భట్టి పాల్గొంటారు.

TSPSC బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మహేందర్ రెడ్డి

TSPSC బోర్డు ఛైర్మన్‌గా నియమితులైన మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. 

TSPSC కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. 

ఆయనతో పాటు బోర్డు సభ్యులు అనితా రాజేంద్ర, పాల్వాయి రజని కూడా డ్యూటీ ఎక్కారు.

NLG: లెంకలపల్లి ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రధానం

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం

లెంకలపల్లి: ప్రాథమికోన్నత పాఠశాలలో ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలాపించారు.

అనంతరం ఏఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఏర్పుల నగేష్ ఆధ్వర్యంలో.. వివిధ పోటీలలో గెలుపొందిన బాల బాలికలకు సర్పంచ్ పాక నగేష్ యాదవ్,ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం, హెడ్మాస్టర్ యాదగిరి, ఫౌండేషన్ సభ్యుడు ఏర్పుల చంద్రశేఖర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

నల్లగొండ జిల్లా: మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా, గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారతదేశం 1950 జనవరి 26న స్వతంత్ర ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

TS: తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే: సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్‌: కార్యకర్తల శ్రమ వల్లే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో జరిగిన బూత్‌స్థాయి కన్వీనర్ ల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.

రాహుల్‌గాంధీ పాదయాత్ర తోనే కర్ణాటకలో, తెలంగాణలో అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాలేదు.. హామీలు అమలు ఎక్కడ అని భారాస నేతలు అడుగుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో మరో రెండు హామీలు అమలు చేస్తాం. ఫిబ్రవరి ఆఖరు వరకు రైతు భరోసా నగదు అందిస్తాం. భారాస అమలు చేశారా? పదేళ్లలో కేసీఆర్‌ చేసిన విధ్వంసాన్ని సరిదిద్దాలి. కొందరు నన్ను మేస్త్రి అని విమర్శిస్తున్నారు. అవును తెలంగాణను పునర్‌నిర్మించే మేస్త్రీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అవినీతిపరులు, కోటీశ్వరులను కేసీఆర్‌ రాజ్యసభకు పంపించారని రేవంత్ రెడ్డి విమర్శించారు. బలహీన వర్గాల బిడ్డలు మందుల శామ్యూల్‌, వెడ్మ బొజ్జుకి కాంగ్రెస్‌ పార్టీ టికెట్లు ఇచ్చి గెలిపించింది. రైతు బిడ్డనైన నేను కాంగ్రెస్‌లో సీఎం అయ్యాను. కాంగ్రెస్ పార్టీలో అందరికీ అవకాశాలు ఉంటాయి. లోక్‌సభ ఎన్నికలు అత్యంత కీలకం. భారాసను మొన్న ఎన్నికల్లో ఓడించాం, పార్లమెంట్‌ ఎన్నికల్లో తరిమికొడదాం. పులి వస్తుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పులి వస్తే బోనులో పెట్టి బొందపెడతాం. మోదీ, కేసీఆర్‌ వేరువేరు కాదు. అభ్యర్థులను మారిస్తే గెలిచే వాళ్లమని భారాస నేతలు అంటున్నారు. మార్చాల్సింది అభ్యర్థులను కాదు.. కేసీఆర్‌ కుటుంబాన్ని అని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

YBD: యాదాద్రి జిల్లాలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా వ్యక్తులు.. విలేఖరి పై దాడి

యాదాద్రి భువనగిరి జిల్లా:

వలిగొండ మండల కేంద్రంలో ఓ విలేకరి పైన అక్రమ ఇసుక మాఫియా దారులు కత్తులు, గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. 

వలిగొండ పట్టణ పోలీసులు రెండు రోజుల క్రితం అక్రమ ఇసుక ట్రాక్టర్లు సీజ్ చేయడంతో, క్రిస్టఫర్ అనే విలేకరి ఆ టాక్టర్ ని పట్టించాడనే ఉద్దేశంతో అతనిపై ఇసుక మాఫియా వ్యక్తులు దాడి చేశారు. దాడిలో తలకు తీవ్ర గాయాలైన క్రిస్టఫర్ ను భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

NLG: 'గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి'

దేవరకొండ: గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు రాజ్యాంగ ప్రతిని తప్పకుండా ఉంచి జాతీయ జెండా ఎగర వేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ లో మెమోరండం సమర్పించారు

1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు ను పురస్కరించుకొని స్వతంత్ర భారతదేశం సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించిన ఆరోజును మనం ప్రతి ఏటా భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని బుర్రి వెంకన్న అన్నారు.

కావున జనవరి 26 న నిర్వహించే గణతంత్ర వేడుకల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు రాజ్యాంగ ప్రతిని తప్పకుండా ఉంచి జాతీయ జెండా ఎగరేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కంబాలపల్లి వెంకటయ్య, రాములు, రాజ్ కుమార్, పెద్దయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

NLG: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 29 చలో కలెక్టరేట్: SFI

నల్లగొండ జిల్లా

దేవరకొండ: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ, నల్లగొండ జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం SFI జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. 

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా SFI రాష్ట్ర కార్యదర్శి తాళ్ళ నాగరాజు హాజరై మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా SC,ST,BC సంక్షేమ హాస్టల్ ‌విద్యార్థుల మెస్ చార్జీలు ‌విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈనెల 29చలో కలెక్టరేట్ ఎదుట ‌ఆందోళనకు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందని తెలిపారు.

జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్ లో వుండే SC,ST,BC సంక్షేమ ‌వసతి గృహాల్లో వుంటు చదువుకుంటున్న ‌పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వం గత సంవత్సరం మార్చి నుంచి విద్యా సంవత్సరం 2023 - 2024 జనవరి వరకు ఒక్క పైసా కూడా విడుదల చేయకుండా వుండడం వల్ల ‌సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు సరైన పౌష్టికాహారం అందడం లేదని అన్నారు.

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి గత సంవత్సరం బకాయి లో వున్న మెస్ చార్జీలు, స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ రమావత్ లక్ష్మణ్,బుడిగ వేంకటేష్, కుర్ర సైదా నాయక్, కోరె రమేష్, రవీందర్, జగదీష్, తదితరులు పాల్గొన్నారు.