/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కేసీఆర్ ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్ Yadagiri Goud
కేసీఆర్ ప్రమాణ స్వీకారం డేట్ ఫిక్స్

తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికల్లో గజ్వేల్ నియోజ వర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

గత కొద్ది రోజుల క్రితం ఫామ్ హౌస్ లో కాలుజారి కింద పడడం తో ప్రమాణ స్వీకారం చేయలేక పోయారు. వచ్చేనెల ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

119 సీట్లున్న అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇటీవల జరిగిన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కేసీఆర్ ను శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు.

తెలంగాణలో అమిత్ షా పర్యటన రద్దు

అమిత్‌షా తెలంగాణ ప‌ర్య‌ట‌న ర‌ద్దు… అత్యవసర పనుల వల్ల వాయిదా

రేపు తెలంగాణ‌లో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. బీహార్‌లో రాజకీయ పరిణామాలతో పర్యటన రద్దు చేసుకున్నారు.

అమిత్ షా పర్యటన రద్దు విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

వీగిపోయిన సూర్యాపేట చైర్ ప‌ర్స‌న్ పై అవిశ్వాసం తీర్మానం

సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పై 32 మంది వార్డ్ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది.

మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై నిఖిల దిలిప్ రెడ్డి వర్గం పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది….

అవిశ్వాస‌ తీర్మానం నోటీస్ పై సంతకం పెట్టిన 32 మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో అవిశ్వాసం వీగిపోయింది.

కాగా కొండపల్లి నిఖిల దిలిప్ రెడ్డి శిబిరంలో ఉన్న 32 మందిలో 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ కనిపించక పోవడంతో కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి శిబిరంలో ఉన్న 31 మంది అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు.

దీంతో అవిశ్వాసం వీగిపోయిందని కలెక్టర్ ప్రకటించారు..

TS Politics: ఎమ్మెల్సీలుగా కోదండరాం, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌.. అధికారిక ఉత్తర్వులు జారీ..

హైదరాబాద్‌: గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. తెలంగాణ జన సమితి వ్యవస్థాపకుడు, ప్రొఫెసర్‌ కోదండరాం (Kodandaram ), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించారు..

వీరిద్దర్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు..

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది..

Hyderabad: హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..

హైదరాబాద్‌: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసి భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించింది..

బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించగా.. వాటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా. వాటితోపాటు సోదాల్లో రూ.99 లక్షల నగదు, నాలుగు కార్లు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, వెండి, వాచ్‌లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్‌ చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో అధికారులు పేర్కొన్నారు..

పలు ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. ''155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్‌ సాప్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నాం. ఇందుకు సంబంధించి బినామీలను విచారించాలి.

ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది. పీర్జాదిగూడలో రమాదేవి, జూబ్లీహిల్స్‌లో ప్రమోద్ కుమార్, మాదాపూర్‌లో సందీప్‌ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి ఇళ్లు సహా మొత్తం 18 చోట్ల సోదాలు చేశాం'' అని రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ వివరించింది..

Vijayawada: జగనన్నా.. మెగా డీఎస్సీ ఎక్కడ?.. విజయవాడలో నిరుద్యోగుల దీక్ష

విజయవాడ: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను తక్షణమే విడుదల చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్‌ వద్ద నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో 36 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు..

10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లలో నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంపై మండిపడ్డారు. జగనన్నా మెగా డీఎస్సీ ఎక్కడ? అంటూ ప్రశ్నించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాటలు ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని ధ్వజమెత్తారు..

Chandrababu: పీలేరు సభలో జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు

తిరుపతి : ''రా.. కదలిరా'' పేరుతో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో సీఎం జగన్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) తీవ్రంగా విరుచుకుపడుతున్నారు..

వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పీలేరులో ''రా..కదలి రా'' బహిరంగ సభలోనూ జగన్‌పై చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. విశాఖలో వైసీపీ నిర్వహిస్తున్న ''సిద్ధం'' సభను ఇక్కడ ప్రస్తావిస్తూ.. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

యుద్ధం మొదలు.. మేమూ సిద్ధమే..

జగన్‌కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. జగన్‌ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు. ''యుద్ధం ప్రారంభమైంది. యుద్ధానికి మేము సిద్ధం'' అని తేల్చిచెప్పారు. కురుక్షేత్ర ధర్మ యుద్ధానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు. ఒక్క అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదని మండిపడ్డారు.

రతనాల సీమ కోసం...

''నేను రాయలసీమ బిడ్డను, నాలో ఉన్నది రాయలసీమ రక్తం. రాయలసీమను రతనాల సీమ చేయాలంటే ఏం చేయాలో అన్ని ఆలోచన చేశాను. హంద్రీనివాపై మేము రూ.4200 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ ఒక రూపాయి కూడా పెట్టలేదు. పీలేరు పుంగనూరులకు నీళ్లు రాలేదు. గాలేరు నగిరిపై రూ.1550 కోట్లు మేము ఖర్చు పెట్టాం'' అని చంద్రబాబు వెల్లడించారు.

బీహార్ ముఖ్యమంత్రి రాజీనామా❓️

బీహార్ పాలిటిక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ శనివారం తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంది.

పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనతో వెళతారని తెలుస్తోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది.

లాలూ యాదవ్ నేతృత్వం లోని ఆర్‌జెడితో కూడిన మహాఘటబంధన్ మహాకూటమి ప్రభుత్వం నుండి నితీష్ కుమార్ విడిపోయి బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో తిరిగి చేరడంపై ఊహా గానాలు చెలరేగుతు న్నాయి.

జెడి(యు)-బిజెపి కూటమికి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయవచ్చని, బిజెపి నాయకుడు సుశీల్ కుమార్ మోడీ తిరిగి డిప్యూటీగా వస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి...

కుటుంబ కలహాలతో భార్య భర్తల ఆత్మహత్య?

ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి ముందు పురుగుల మందు తాగింది. భార్యమరణం తట్టుకోలేక భర్త విజయ్ కూడా పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే విజయ్ మరణించాడు.

గతేడాది మేలో పల్లవి, విజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.....

YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను పట్టించుకోరా?..వైసీపీ సర్కార్‌పై షర్మిల విమర్శలు

ప్రకాశం : గుండ్లకమ్మ ప్రాజెక్టును (Gundlakamma Project) ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) శనివారం ఉదయం పరిశీలించారు..

ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ (YCP Government)నిర్లక్ష్యంపట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ మంత్రికి డ్యాన్సులు తప్ప.. ఏమీ పట్టించుకోరు...

జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ (YSR) గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారన్నారు. లక్ష ఎకరాలకు సాగు నీటితో పాటు 12 మండలాలకు తాగు నీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు. 16 నెలల క్రితం ఒక గేటు, మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయిందని.. మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు.

ఐదు సంవత్సరాల నుండి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు కొట్టుపోయేవి కాదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.

ప్రాజెక్టు మెయింటెనెన్స్ చెయ్యని తమరు.. వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారు జగనన్న అని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేశారు తప్ప... ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. ఈపాపం వైసీపీ నాయకులది కాదా అని నిలదీశారు. కొట్టుకుపోయిన గేటు పైకి తేలుతూ కనిపిస్తుందంటే వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకి తట్ట మట్టి కూడా వైసీపీ వెయ్యలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తాయని షర్మిల పేర్కొన్నారు.

అసలేం జరిగిందంటే..

వరద ప్రవాహానికి ఏడాది క్రితం ప్రాజెక్టు 6వ నంబర్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఏడాది గడిచినప్పటికీ గేటు ఏర్పాటు చేయడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తాజాగా రెండు నెలలు క్రితం మూడో నెంబర్ గేట్ సైతం కొట్టుకుపోయింది. రెండు టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఖాళీ కావడంతో నీళ్ళు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు. ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుకి కొత్త గేట్లు ఏర్పాటు చేయటంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ వైఎస్ షర్మిల ప్రాజెక్టును సందర్శించారు..