/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: లెంకలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బాలికల దినోత్సవం Mane Praveen
NLG: లెంకలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా బాలికల దినోత్సవం

నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికలను పుట్టనిద్దాం.. చదవనిద్దాం.. ఎదగనిద్దాం.. అని ప్రతిజ్ఞ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపోలు యాదగిరి మాట్లాడుతూ.. బాలికలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని అన్నారు. వారికి సరి అయిన పోషకాహారాన్ని అందించాలని, విద్యను అందించాలని, 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే బాలికలకు వివాహం చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వెంకటేష్ యాదయ్య శ్యామల అపర్ణ స్వర్ణలత జానకమ్మ, అంగన్వాడీ టీచర్ చాపల పద్మ, ఆరోగ్య కార్యకర్తలు ఏర్పుల పద్మ, సైదాబీ, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి అంగన్వాడి కేంద్రంలో ఘనంగా బాలికల దినోత్సవం

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో బాలికల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ చాపల పద్మ మాట్లాడుతూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఆడపిల్లలకు మంచి పోషకాహారాన్ని అందించి, చదువుని అందించి వారి ఎదుగుదలకు తోడ్పడేలా చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మండల ఎమ్ ఎల్ హెచ్ పీ గోపీనాథ్, ఏఎన్ఎం జ్యోతి, ఆరోగ్య కార్యకర్తలు సైదాబీ, ఏర్పుల పద్మ, విద్యార్థులు పాల్గొన్నారు.

TS: భూమి సునీల్ కుమార్ ను కలిసిన ఆల్ ఇండియా బంజారా సంఘం నాయకులు

నల్లగొండ: ఆల్ ఇండియా బంజారా సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులో రాష్ట్ర ధరణి కమిటీ సభ్యులు భూమి సునీల్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో వారికి తలపాగా చుట్టి, శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ధరణి కమిటీ సభ్యులుగా వారు ఎంపికైన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూమి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారానికి ఇటీవల ధరణి కమిటీ ఏర్పడిందని, సమస్యల పరిష్కారానికి భూ సమస్యలను అధ్యయనం చేసి ఈ కమిటీ మార్గం చూస్తుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షుడు ప్రవీణ్ నాయక్, నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్ మాట్లాడుతూ.. భూ చట్టాల న్యాయ నిపుణులు ఎం.సునీల్ కుమార్ నల్సార్ లా యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ, పేదల కోసం భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించారని, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంలో ధరణి సమస్యల పరిష్కారానికి ఏర్పడిన ధరణి కమిటీ సభ్యులుగా భూమి సునీల్ కుమార్ కొనసాగుతున్నారని వారిని సత్కరించడం తమకు ఆనందకరమైన విషయమని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సంఘం అధ్యక్షులు రిటైర్డ్ ఆర్డీవో ప్రవీణ్ నాయక్,నల్లగొండ కార్మిక సంఘం అధ్యక్షుడు కేలావత్ నగేష్ నాయక్, నరసింహ నాయక్, నాగార్జున నాయక్ పాల్గొన్నారు.

NLG: కొండమల్లేపల్లి గురుకుల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని తల్లిదండ్రుల సంఘం వినతి

నల్లగొండ జిల్లా: రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం, స్టూడెంట్ యూనియన్, స్కూల్ పేరెంట్స్ నాయకులు మంగళవారం రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రెటరీ నవీన్ నికోలస్ ను హైదరాబాద్లో కలిసి.. కొండమల్లేపల్లి గురుకుల విద్యార్దిని భార్గవి మృతి చెందిన ఘటనను, పాఠశాలలోని 640 మంది పిల్లలు ఎదుర్కునే ఇబ్బందుల గురించి వివరించి మెమొరాండం ఇచ్చారు. స్పందించిన గురుకులాల సెక్రెటరీ సంబంధిత ప్రిన్సిపాల్ కు నోటీసులు జారీ చేసి, తదుపరి చర్యలు చేపట్టి సస్పెండ్ చేస్తామని రాష్ట్ర తల్లిదండ్రుల సంఘం కు తెలిపినట్లు సంఘ సభ్యులు చెప్పారు.

NLG: నేడు లెంకలపల్లి గ్రామానికి రానున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ జిల్లా:

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేడు సాయంత్రం 4 గంటలకు మర్రిగూడెం మండలం లెంకలపల్లి గ్రామానికి విచ్చేయుచున్నట్లు, లెంకలపల్లి గ్రామ సర్పంచ్ పాక నగేష్ యాదవ్ తెలిపారు. సుమారు 20 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మాణానికి మంజూరు అయినటువంటి 'ప్రైమరీ హెల్త్ సబ్ సెంటర్' ను ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

NLG: మునుగోడు ఎమ్మేల్యే రాజ గోపాల్ రెడ్డి.. బుధవారం పర్యటన వివరాలు

నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గం:

ఈనెల 24న బుధవారం, మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.. నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మునుగోడు మండలంలో ఉదయం 09:00 గంటలకు కొంపల్లి గ్రామంలో, 10:30 గంటలకు ఊకొండి గ్రామంలో, మర్రిగూడెం మండలంలో మధ్యాహ్నం 12:00 లకు కొట్టాల, 2:00 గంటలకు మేటి చందాపురం (ఇందుర్తి), సాయంత్రం 4:00 గంటలకు లెంకలపల్లి గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.

NLG: కేంద్రంలో బిజెపి దే అధికారం: బిజెపి నాయకులు బూర నర్సయ్య గౌడ్

నల్లగొండ: కేంద్రంలో మళ్లీ బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందని, దేశవ్యాప్తంగా సుమారు 360 ఎంపీ సీట్ల నుండి 400 సీట్ల వరకు బిజెపి గెలుచుకుంటుందని బిజెపి జాతీయ నాయకులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. మంగళవారం బిజెపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో 10 నుండి 12 సీట్ల వరకు బిజెపి గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.

అయోధ్యలో న భూతో, న భవిష్యత్తు, అన్నట్లుగా రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన జరిగిందని దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలను తిలకించిన ప్రజలు సంబరాలు ఘనంగా నిర్వహించారని.. భవ్య దివ్య రామాలయాన్ని దర్శించడానికి ప్రజలు ఉత్సాహ పడుతున్నారన్నారు. 

హిందూ ధర్మాన్ని ప్రధానమంత్రి మోడీ విశ్వధర్మంగా వ్యాప్తి చెందడానికి కృషి చేస్తున్నారన్నారు. శ్రీరామనవమి, దీపావళి పండుగలు రెండు ఒకేసారిగా జరుపుకున్నట్లుగా ఉందన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జాతీయ రహదారులు. పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, కేంద్రీయ విద్యాలయాలు వంటి అనేక అభివృద్ధి పనులు చేసిందన్నారు.

అయోధ్యలోని రామాలయం సందర్శించడానికి భువనగిరి నల్లగొండ నుండి బిజెపి పార్టీ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కేవలం 1900 రూపాయలతో రైలు చార్జీలతో పాటు అయోధ్యలో అకామిడేషన్ దర్శనము భోజన వసతి కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ రెడ్డి, చింతా ముత్యాల రావు, ముని కుమార్, తదితరులు పాల్గొన్నారు.

NLG: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

నల్లగొండ: భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజి సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదని జనగణమన ఉత్సవ సమితి అద్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, ఆర్డిఓ రవి అన్నారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆజాద్ హిందు ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని చెప్పి ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపారు అని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఆజాద్ హిందు ఫౌజ్ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించారని అన్నారు. 

దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒక్కటే మార్గం కాదు, పోరాటాలు కూడా చేయాలి అంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి ఎంతోమంది దేశ భక్తులకు దిశా నిర్దేశం చేశారని అన్నారు. చివరి వరకు దేశం కోసమే బతికిన సుభాష్ చంద్రబోస్ మరణం మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్, అదనపు ఎస్పి విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్, జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్, సహాయ అద్యక్షులు దోసపాటి శ్రీనివాస్, చందా శ్రీనివాస్, పోలా జనార్దన్, నాగేందర్, శ్యాంసుందర్ రెడ్డి, ప్రదీప్, మరియు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్, గంధపాలకులు డాక్టర్ రాజారాం, తదితరులు పాల్గొన్నారు.

AP: గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం

అమరావతి: గ్రూప్ -1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది.

కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసింది. అయితే n గ్రూప్‌-1 ఆశావహుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది.

ఇక.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించ నున్నట్టు ఏపీపీఎస్సీ సర్వీస్‌ కమిషన్‌ పేర్కొంది.

ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేసింది. కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌-1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్‌ ట్యాక్స్‌ కమిషనర్స్‌ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలోనే నిర్వహించనున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌ విధానంలో https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.

TS: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్: ఎమ్మెల్సీ గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ ను, మంగళవారం తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్ గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసిన ఆయన ఎమ్మెల్సీ గా ఎంపికకావడం అభినందనీయమని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ రేష్మ హుస్సేన్.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడిన సమయంలో విద్యార్థి నాయకురాలు గా బుల్లెట్ గాయాల పాలైనా.. ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా ముందుకెళ్ళింది. ఆ విధంగా ఆమె బుల్లెట్ రాణిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ కోసం పనిచేసిన వారందరికీ సముచిత న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.