/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి Mane Praveen
NLG: ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

నల్లగొండ: భారత స్వాతంత్ర్య పోరాటంలో నేతాజి సుభాష్ చంద్రబోస్ పాత్ర వెలకట్టలేనిదని జనగణమన ఉత్సవ సమితి అద్యక్షుడు కర్నాటి విజయ్ కుమార్, ఆర్డిఓ రవి అన్నారు. మంగళవారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆజాద్ హిందు ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను అని చెప్పి ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమం వైపు నడిపారు అని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఆజాద్ హిందు ఫౌజ్ పేరుతో సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటీష్ ప్రభుత్వంపై ప్రత్యక్ష యుద్దం ప్రకటించారని అన్నారు. 

దేశాన్ని కాపాడుకోవాలంటే అహింస ఒక్కటే మార్గం కాదు, పోరాటాలు కూడా చేయాలి అంటూ గాంధీకి వ్యతిరేకంగా పోరుబాట పట్టి ఎంతోమంది దేశ భక్తులకు దిశా నిర్దేశం చేశారని అన్నారు. చివరి వరకు దేశం కోసమే బతికిన సుభాష్ చంద్రబోస్ మరణం మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్, అదనపు ఎస్పి విఠల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అబ్బగోని రమేష్, జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్, సహాయ అద్యక్షులు దోసపాటి శ్రీనివాస్, చందా శ్రీనివాస్, పోలా జనార్దన్, నాగేందర్, శ్యాంసుందర్ రెడ్డి, ప్రదీప్, మరియు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్, గంధపాలకులు డాక్టర్ రాజారాం, తదితరులు పాల్గొన్నారు.

AP: గ్రూప్‌-1 దరఖాస్తు గడువు పొడిగింపు.. ఈనెల 28 వరకు అవకాశం

అమరావతి: గ్రూప్ -1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏపీపీఎస్సీ,ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్‌-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపింది.

కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్‌ వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో మొత్తం 81 గ్రూప్‌- 1 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ఈనెల 21తో ముగిసింది. అయితే n గ్రూప్‌-1 ఆశావహుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు దరఖాస్తుల గడువును పొడిగించాలని APPSC నిర్ణయించింది.

ఇక.. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించ నున్నట్టు ఏపీపీఎస్సీ సర్వీస్‌ కమిషన్‌ పేర్కొంది.

ఇందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టంచేసింది. కమిషన్‌ ప్రకటించిన గ్రూప్‌-1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్‌ ట్యాక్స్‌ కమిషనర్స్‌ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్‌ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్‌ విధానంలోనే నిర్వహించనున్న విషయం తెలిసిందే. అభ్యర్థులు పూర్తి వివరాలను అధికారక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్‌ విధానంలో https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఓ ప్రకటనలో పేర్కొంది.

TS: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

హైదరాబాద్: ఎమ్మెల్సీ గా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ ను, మంగళవారం తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్ గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ కోసం పని చేసిన ఆయన ఎమ్మెల్సీ గా ఎంపికకావడం అభినందనీయమని అన్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ రేష్మ హుస్సేన్.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో, ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసిపడిన సమయంలో విద్యార్థి నాయకురాలు గా బుల్లెట్ గాయాల పాలైనా.. ఒక్క అడుగు కూడా వెనుకకు వేయకుండా ముందుకెళ్ళింది. ఆ విధంగా ఆమె బుల్లెట్ రాణిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులకు, పార్టీ కోసం పనిచేసిన వారందరికీ సముచిత న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

NLG: బీఎస్పీ జిల్లా సంయుక్త కార్యదర్శి గా తక్కెలపల్లి శ్రీనివాస్

నల్గొండ: బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా కార్యాలయంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యేకుల రాజారావు సోమవారం అనుముల గ్రామానికి చెందిన తక్కెలపల్లి శ్రీనివాస్ ను జిల్లా సంయుక్త కార్యదర్శి గా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కల్పించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజారావుకు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు అని తెలిపారు. తన వంతు బాధ్యతగా పార్టీ ని సాగర్ నియోజకవర్గం లో బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. సాగర్ నియోజకవర్గ అధ్యక్షులు ముదిగొండ వేంకటేశ్వర్లు, సాగర్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు బత్తుల ప్రసాద్, పలువురు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయనను ఈ సందర్భంగా అభినందించారు.

TS: పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి

నవంబర్ 1, 2020 వరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో ఫాం 18 నింపి మీ పట్టభద్రుల ఓటు నమోదు చేసుకోండి.. అని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు.

వెబ్ సైట్

https://ceotserms2.telangana.gov.in/mlc/form18.aspx

గమనిక: గతం లో ఓటు ఉన్నవారు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాలి.

చివరి తేదీ ఫిబ్రవరి 06.*

కిక్కు కోసం కల్లులో అల్ఫాజోలం.. కొకైన్ కంటే ప్రమాదం అంటున్న నిపుణులు

TS: కల్తీ కల్లు తయారీ కోసం డేంజరస్ డ్రగ్ అయిన అల్ఫాజోలం వాడుతున్నట్లు యాంటీ నార్కోటిక్ బ్యూరో(ఎన్ఏబీ) గుర్తించింది. అల్ఫాజోలం కలిపిన కల్లు వల్ల వేలాది మంది క్రమంగా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఏబీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించింది. అల్ఫాజోలం రాష్ట్రానికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు సరఫరా చేస్తున్నారు? అనే విషయాలపై ఫోకస్ పెట్టేందుకు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, ఎక్సయిజ్ శాఖలతో సమన్వయాన్ని ఏర్పరచుకుంటున్నారు.

గంజాయి తర్వాత ఇదే..

రాష్ట్రంలో గంజాయి తర్వాత అల్ఫాజోలం వాడకమే అధికమని అధికారులు చెబుతున్నారు. గడచిన రెండేళ్లలో 293 కిలోల అల్ఫాజోలం ను అధికారులు స్వాధీనం చేసుకున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వేర్వేరు మార్గాల్లో రాష్ట్రానికి చేరుతున్న ఆల్ఫాజోలెంను ప్రధానంగా కల్తీ కల్లు తయారీలో ఉపయోగిస్తున్నారు. సాధారణంగా దీనిని నిద్రలేమి, యాంగ్జయిటీ సమస్యలతో బాధపడుతున్న వారికి మెడిసిన్గా ఉపయోగిస్తారు. ఒక రోగికి ఒకసారి 0.25 గ్రాముల డోసును మాత్రమే ఇస్తారు. దీనికి కారణం అల్ఫాజోలం అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ కావడమే.

ఎక్కువ మత్తు కోసం..

కల్లు ఎక్కువ కిక్ ఎక్కేందుకు విక్రయదారులు అల్ఫాజోలంను వినియోగిస్తున్నారని తెలంగాణ ఎన్ఏబీ చీఫ్ సందీప్శాండిల్య చెప్పారు. పదేళ్ల క్రితం వరకు కల్తీ కల్లు కోసం డైజోఫాం, క్లోరల్ హైడ్రేట్‌లను వాడేవారన్నారు. ప్రస్తుతం వీటితో పోలిస్తే వెయ్యి రెట్లు మత్తు కలిగించే అల్ఫాజోలం వాడుతున్నారు. దీని ధర 10 గ్రాములకు రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిమాణంతో కనీసం 30 వేల సీసాల కల్లును తయారు చేస్తున్నారు. ఒక్కో సీసా రూ.50 ఉండగా.. సుమారు రూ.13.50 లక్షలు వ్యాపారులు సంపాదిస్తున్నారు. ఇటీవల ఎన్ఏబీ అధికారులు హైదరాబాద్లో దాడులు జరపగా 66 కాంపౌండ్‌లో కల్తీ కల్లు విక్రయిస్తున్నట్టుగా నిర్ధారణ కావడం ఈ దందా ఏ స్థాయిలో జరుగుతోందో స్పష్టం చేస్తోంది.

ముంబయి నుంచి ఎక్కువగా..

రాష్ట్రానికి ముంబయి నుంచి ఈ డ్రగ్ వస్తోందని ఎన్‌ఏబీకి చెందిన ఓ అధికారి తెలిపారు. నగర శివార్లలోనూ తయారవుతోందనే అనుమానాలు ఉన్నాయన్నారు. ఈ డ్రగ్‌కు ఒకసారి అలవాటు పడితే బానిసలు అవుతారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో ఈ డ్రగ్ కలిపిన కల్లు దొరక్క చాలా మంది విచిత్రంగా ప్రవర్తించటంతో పాటు కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

సిండికేట్‌కు పొలిటికల్ అండ..

ఈ కల్తీ కల్లు సిండికేట్కు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీల నేతలను తమ వైపుకు తిప్పుకుంటారు. మహబూబ్నగర్లో కల్తీ కల్లు తాగి కొందరు చనిపోతే అప్పటి ఎక్సయిజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. అనారోగ్య మరణాలని ప్రకటించారు. అయితే, విషయం పెద్దది కావడంతో కొన్ని శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. అయితే, వాటి ఫలితాలు ఇప్పటికీ తెలియరాలేదు.

TS:నూతన జాతీయ విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 3న ఛలో ఢిల్లీ

నల్లగొండ జిల్లా:

మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం - 2020 ఉపసంహరించుకోవలని PDSU ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3న ఛలో ఢిల్లీ కార్యక్రమాన్నీ నిర్వహిస్తున్నామని PDSU జిల్లా కార్యదర్శి పోలె పవన్ అన్నారు. అందుకు సంబంధించిన కరపత్రాలు నకిరేకల్ పట్టణంలో ఆవిష్కరించారు. పోలె పవన్, మాట్లాడుతూ.. విద్య వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ,కార్పోరేటికరణని అమలు చేయడం మోడీ ప్రభుత్వం చేస్తున్నదని విమర్శించారు.

ఇందులో భాగంగా ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు ఇచ్చే స్కాలర్షిప్లు, స్టైఫండ్లు ఆపివేశారని.. ఎయిడెడ్ కాలేజీలకు, పాఠశాలకు ప్రభుత్వ నిధులను ఆపివేశారని అన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు మెజారిటీ మత ఉన్మాద విద్యాసంస్థలకు 'ప్రభుత్వ- దాతృత్వ- భాగస్వామ్యం' పేరుతో ప్రభుత్వ నిధులను కేటాయించడం జరుగుతున్నదని, విద్యా రంగంలో వ్యాపార విస్తరణ కోసం ప్రభుత్వం పని చేస్తుందని ఆరోపించారు.

కాలేజీలలో,యూనివర్సిటీలలో పరిశోధనా సంస్థలలో స్వయం ప్రతిపత్తిని తొలగించి, విద్యార్థుల, ఉపాధ్యాయుల, అధ్యాపకుల, ప్రజాస్వామిక హక్కులను కాలరాచి వేయడం కొనసాగుతున్నదని దుయ్యబట్టారు..

విశ్వవిద్యాలయాల లో బోర్డ్ ఆఫ్ గవర్నర్లు, ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్, పాఠశాల విద్యలో వాలంటీర్లు, కౌన్సిలర్ల పేరు మీద సంఘ పరివార్ తమ కార్యకర్తలని చొప్పించడానికి ప్రాతిపదికలుగా మారుతున్నాయని అన్నారు.

విద్యారంగంలో అమలు జరుగుతున్న ఫాసిస్ట్ దాడులకు అడ్డుకట్టలు వేయడానికి ఫిబ్రవరి 1నుండి 3 వ తారీకు న్యూ ఢిల్లీలో అఖిల భారత నిరసన ర్యాలీ జరగబోతున్నదని, 3న జంతర్ మంతర్ వద్ద వేలాది మందితో మహాధర్నా ఉంటుందని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు,అధ్యాపకులు ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో PDSU నాయకులు హర్షకేతన్, సాత్విక్, ప్రవీణ్, రాజు, మధు, లోకేష్, కుమార స్వామి, హసృత్, సురేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

NLG: గురుకుల పాఠశాల విద్యార్థిని దాసరి భార్గవి మృతి పై విచారణ జరిపి న్యాయం చేయాలి: ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్

దేవరకొండ: డివిజన్ పరిధిలోని కొండ మల్లేపల్లిలోని ఎస్సీ గురుకుల బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న దాసరి భార్గవి మృతిపై విచారణ చేసి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ డిమాండ్ చేశారు. సోమవారం ఎస్సీ గురుకుల ఆర్సిఓ అరుణ కుమార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆకారపు నరేష్ మాట్లాడుతూ.. మల్లేపల్లి‌ ఎస్సీ బాలికల ‌గురుకుల పాఠశాల విద్యార్థిని దాసరి భార్గవి మృతి పై విచారణ జరిపి న్యాయం చేయాలని, భార్గవి మృతి గల కారణాల పైన సమగ్ర విచారణ జరపాలన్నారు. ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. 

నల్గొండ జిల్లాలో వరుసగా గురుకులాల్లో విద్యార్థులు పిట్టలలా రాలిపోతున్నారు. వీటన్నిటిపై ప్రధానమైన కారణాలు తెలియజేసి కారకులైన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్, మహి, పాషా, శివ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

NLG: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో నల్లగొండకు అన్యాయం - ఎస్ఎల్బిసి అంతర్భాగంలో డిండి ఎత్తిపోతల డిపిఆర్ లను మార్చాలి: నెల్లికంటి సత్యం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నల్లగొండ జిల్లా కు సాగునీరు అందిస్తామనటం అన్యాయమని ఎస్ ఎల్ బి సి అంతర్భాగం లోని డిండి ఎత్తిపోతల పథకం ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించాలని అందుకు అవసరమైన డిపిఆర్లను మార్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరుతో 10 సంవత్సరాలు నల్లగొండ జిల్లాకు సాగు తాగునీరు అందించకుండా కాలయాపన చేసిందని అన్నారు. గత ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలు సాగు త్రాగునీరు నోచుకోక పోయాయని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిని రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని పూర్తిచేసి నక్కల గండి ద్వారా దిండి ప్రాజెక్టులోకి లిఫ్ట్ చేసి చర్లగూడెం రిజర్వాయర్ నింపాలని అన్నారు. బ్రాహ్మణ వెల్లం ల ప్రాజెక్టును కిష్టాపురం వరకు పొడిగించాలని కోరారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో బెల్ట్ షాపుల నిషేధాన్ని సిపిఐ స్వాగతిస్తూ ఆ పోరాటంలో సిపిఐ శ్రేణులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కోరారు.

బిఆర్ఎస్ నుండి సిపిఐ లో చేరిన రేవెల్లి అంజయ్య

మునుగోడు పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రేవెల్లి అంజయ్య సోమవారం సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం సమక్షంలో సిపిఐ లో చేరారు. ఈ సమావేశానికి సురిగి చలపతి అధ్యక్షత వహించగా జిల్లా కార్యవర్గ సభ్యులు బోలుగూరి నరసింహ, గురుజ రామచంద్రం, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి చాపల శ్రీను, సహాయ కార్యదర్శి బండమీది యాదయ్య, మాజీ జెడ్పిటిసి గోస్కొండ లింగయ్య, ఈదులకంటి కైలాసం, దుబ్బ వెంకన్న బండారు శంకర్, దయాకర్, ముత్తయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

NLG: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి దరఖాస్తుదారులకు రిప్లై పంపాలి: మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: ప్రజా వాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చేయనున్నట్లు రాష్ట్ర రహదారులు, భవనాలు శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ప్రజా వాణి కార్యక్రమం లో మంత్రి కోమటి రెడ్డి, జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ తో కలిసి ప్రజల నుండి వినతులు స్వీకరించారు. ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించి దరఖాస్తు దారులకు రిప్లై పంపాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ప్రజల గుండె చప్పుడు వినే కార్యక్రమం ప్రజా వాణి కార్య క్రమం అని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రజా భవన్ లో సామాన్యుల సమస్యలు వినేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు వినతులు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఒక కోటి 50లక్షలు దరఖాస్తులు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.

ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీ లు అమలు చేయటానికి కట్టు బడి వుందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నట్లు, 200 యూనిట్ ల ఉచిత కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, 500 రూ.లకు గ్యాస్ సిలిండర్, పెన్షన్లు అమలు చేస్తామని తెలిపారు .

20 కోట్ల రూ.ల తో ITI వద్ద నిరుద్యోగ యువతకు శిక్షణనందించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు, ఈ నెల 26 న శంఖుస్థాపన వేయనున్నట్లు తెలిపారు.

జిల్లాలో సాగు నీటి పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తామని అన్నారు. జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ కి కలెక్టరేట్ వద్ద 10 ఎకరాలు స్థలం లో లే అవుట్, రోడ్లు పూర్తి చేసి జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని అన్నారు.

ఏ.యం.అర్.పి.ప్రాజెక్ట్ రూ. 510 కోట్ల లతో లైనింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని, రూ. 350 కోట్ల లతో రిపేర్ లు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఎస్.ఎల్.బి.సి కెనాల్ పనులు వ్యయం పెరిగినందున ప్రభుత్వ ఆమోదం తో పనులు చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ హరి చందన, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, మున్సిపల్ ఛైర్మెన్ అబ్బగోని రమేష్, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.