/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు.. Miryala Kiran Kumar
అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు..

అమరావతి: సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు..

సీఎంవోకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్.. మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు 

గడికోట శ్రీకాంత్ రెడ్డి, బియ్యపు మధుసూధన్, శ్రీనివాసులు.

జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి అమానుషం.. పెండెం ధనుంజయ్ నేత

జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి అమానుషం.. పెండెం ధనుంజయ్ నేత 

హాస్పిటల్ వెళ్లి పరామర్శించిన  

 పెండెం ధనుంజయ్ నేత

పంజాగుట్టలో జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై జరిగిన దాడిని బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ్ త్రీవంగా ఖండించారు ప్రజాస్వామ్యం లో పత్రిక స్వేచ్ఛను హరించడం అంటే ప్రజల గొంతు నొక్కడమేనన్నారు ఓ వైపు ప్రజాపాలన అని ప్రచారం చేసుకుంటూ.. మరోవైపు ప్రశ్నించే జర్నలిస్టులను బెదిరించడం నీచమైన చర్యగా అభివర్ణించారు. ప్రభుత్వం స్పందించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోని, మరోసారి పునవురావృతం కాకుండా చూడాలని కోరారు, ప్రశ్నించే గొంతుకలకు BRS పార్టీ అండగా ఉంటుందని, చిలుక ప్రవీణ్ పై దాడి జరిగిన వెంటనే మాజీ మంత్రులు హరీష్ రావు మరియు జగదీశ్ రెడ్డి గార్లు చిలుక ప్రవీణ్ ను పరామర్శించారని వారికి అండగా ఉంటామని వారు తెలిపినట్లు ధనుంజయ్ తెలియజేశారు.

నేడు వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు

నేడు వైయస్ షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు 

వైఎస్ షర్మిల తనయుడు వైఎస్ రాజా రెడ్డి ఎంగేజ్మెంట్ వేడుక నేడు హైదరాబాద్‎లో జరుగనుంది.

గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ వైఎస్ రాజా రెడ్డి, అట్లూరి ప్రియల నిశ్చితార్థ మహోత్సవానికి వేదికైంది. సాయంత్రం 7 గంటలకు జరిగే ఈ మంగళకార్యానికి వైఎస్ షర్మిల అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన సతీమణి భారతి హాజరుకానున్నారు.

ఈమధ్యనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితుల య్యారు. దీంతో అటు కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ శుభకార్యానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ లను కలిసి వివాహానికి హాజరు కావల్సిందిగా శుభలేఖ అందజేశారు

వైఎస్ షర్మిల. ఈ కార్యక్రమానికి కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

ఈనెల 21న ఏపీసీసీ ప్రెసిడెంట్‎గా బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ఈ శుభకార్యం జరగడంతో చాలా మంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.

పాత పరిచయాలన్నింటికీ కుమారుడి ఎంగేజ్మెంట్ వేదిక కానుంది...

బాలకృష్ణలు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు

బాలకృష్ణలు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏం చేయలేరు

 

కొడాలి నాని

టిడిపి జాతీయ కార్య‌దర్శి లోకేష్‌ కోసం జూనియర్‌ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి అంటూ వ్యాఖ్యానించారు.

  

వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఏం చేయలేర‌ని తేల్చి చెప్పారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేర‌ని అంటూ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్‌ వర్ధంతి చేస్తారా?” అంటూ కొడాలి నాని ఎద్దేవా చేశారు.

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్‌ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.

ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీలను తొలగించారు.

బ్రేకింగ్ న్యూస్:NTR ఘాట్‌ దగ్గర జూ. ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు..

NTR ఘాట్‌ దగ్గర జూ. ఎన్టీఆర్‌ ఫ్లెక్సీల తొలగింపు

బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీల తొలగింపు

బాలకృష్ణ వచ్చివెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీల తొలగింపు

తీయించండి ఇప్పుడే అని అనుచరులకు చెప్పిన బాలకృష్ణ

హైదరాబాద్‌: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించిన కేంద్రమంత్రి ..

హైదరాబాద్‌: బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌లో వింగ్స్ ఇండియా 2024ను ప్రారంభించిన కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా..

పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏవియేషన్ రంగ నిపుణులు.. 4 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌కి దేశ విదేశాల ప్రతినిధులు హాజరు.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం బోయింగ్ 777-9 విమానంతో పాటు అనేక విమానాల ప్రదర్శన

నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..

నేడు దావోస్ నుండి లండన్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి నేడు దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు లండన్‌లో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు.

వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు.

ఇదిలా ఉండ‌గా బుధ‌వారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు ఎంవోయూ కుదుర్చుకొన్నాయి.

అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,600 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు: మంత్రి బట్టి విక్రమార్క

రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు నిర్వహిం చనుంది.

ఇందులో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఇవాళ్టి నుంచి ఆయా శాఖల మంత్రులు, అధికారులతో సమావేశమవుతారు.

మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన శాఖల ప్రతిపాదనలను భట్టి సమీక్షిస్తారు. 19వ తేదీన సీతక్క, దామోదర రాజనర్సింహలకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది.

20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు.. 22వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ.. 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25, 27వ తేదీల్లో జరగనున్నాయి.

మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క

మేడారం వెళ్లే మహిళ భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ : మంత్రి సీతక్క

 

తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మల జాతర మహా కుంభమేళను తలపిస్తుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు తెలంగాణలోని అన్ని జిల్లాలతో పాటు యావత్ దేశం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు.

ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్ ల సౌకర్యం ఉంటుందని మంత్రి సీతక్క వెల్లడించారు.

అలాగే ఈ సారీ మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచామన్నారు.

ఇప్పటికే తెలంగాణలోని బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలదు. అయితే జాతర సమయంలో ఈ ఫ్రీ బస్ సర్వీస్ వర్తిస్తుందో లేదో అని సందేహం నెలకొంది.

దీంతో మేడారం లో జరుగుతున్న పనులను పరిశీలించిన తర్వాత మంత్రి క్లారిటీ ఇచ్చారు.

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్..

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

 

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని అన్నారు.

ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవు తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రచార సమయం లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహి ళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.