/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: సంక్రాంతి సందర్భంగా NG కళాశాలలో ముగ్గుల పోటీలు Mane Praveen
NLG: సంక్రాంతి సందర్భంగా NG కళాశాలలో ముగ్గుల పోటీలు

నల్గొండ టౌన్: నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో మహిళా సాధికారత విభాగం, ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో గురువారం విద్యార్థులకు, మహిళా అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది కి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళా సాధికారత విభాగం కన్వినర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మరియు కమిటీ మెంబర్స్ పోటీని పర్యవేక్షించారు. డాక్టర్ జోత్స్న, మనెమ్మ, లవేందర్ రెడ్డి జడ్జెస్ గా విజేతలను ఎంపిక చేసారు. విజేతలకు రిపబ్లిక్ డే రోజు బహుమతులను ప్రధానం‌ చేస్తామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్ ఉపేందర్ అధ్యక్షత వహించగా అధ్యాపకులు యాదగిరి రెడ్డి, నాగుల వేణు, మల్లేశ్, శివరాణి, మహేశ్వరి, శీలం యాదగిరి,దుర్గాప్రసాద్ సావిత్రి, స్రవంతి,శిరీష, సరిత, విద్యార్థులు పాల్గొన్నారు.

TS: ఘనంగా పిఆర్టియు టిఎస్ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ

యాదాద్రి జిల్లా:

నారాయణపూర్ మండలంలోని ఎంఆర్సి వద్ద పిఆర్టియు టిఎస్ 2024 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో జనగాం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కలిముద్దీన్, మండల శాఖ అధ్యక్షులు నంద్యాల చలపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి దోర్నాల రాము, సీనియర్ ప్రధానోపాధ్యాయులు అశోక్ రెడ్డి, రాష్ట్ర అసోసియేటివ్ అధ్యక్షులు శ్రీనివాస్, హరికిషన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శులు చొల్లేటి శ్రవణ్ కుమార్, యాదిరెడ్డి, వెంకన్న, మండల కార్యదర్శి పబ్బు దేవేందర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, కోటేశ్వర్ ఉన్నారు.

TS: టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్ తమిళిసై

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. ఈ రాజీనామాలపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అనంతరం న్యాయ సలహా తీసుకొని చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు ఐదుగురు సభ్యుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. 

సభ్యుల రాజీనామాల ఆమోదం నేపథ్యంలో త్వరలో కొత్త కమిషన్ ఏర్పాటు కానుంది. గత చైర్మన్, బోర్డు హయాంలో జరిగిన పేపర్ లీకేజీ, ఇతర అవకతవకలపై సమగ్ర విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి గవర్నర్ సూచించారు. నిరుద్యోగుల జీవితాలతో మున్ముందు ఎవరూ ఆటలాడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

TS: విద్యార్థులకు గమనిక.. ఓపెన్ డిగ్రీ లో చేరుటకు మరో అవకాశం

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో.. డిగ్రీ లో చేరుటకు మరొక అవకాశం. అడ్మిషన్లు ఈనెల 31 వరకు పొడిగించారు. రెగ్యులర్ ఇంటర్, ఓపెన్ ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటిఐ పూర్తి చేసిన వారు డిగ్రీలో చేరుటకు అర్హులు. మహిళలకు ప్రత్యేకంగా నల్లగొండలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల యందు ప్రత్యేక స్టడీ సెంటర్ కలదు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ డాక్టర్ రాజారామ్ తెలిపారు. 

పూర్తి వివరాలకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ సందర్శించవచ్చు.

అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భూకంపం.. రిక్టర్ స్కేలు పై 4.1 తీవ్రత

అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 7:53 గంటల ప్రాంతంలో రిక్టరు స్కేలుపై 4.1 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ వెల్లడించింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపారు.

HYD: ఖైదీ కడుపులో బ్లేడ్లు, మేకులు

హైదరాబాద్: చంచల్‌గూడ జైలు లో వందల మంది రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న వారు ఉంటారు.

అయితే మహ్మద్ సోహైల్ (21) ఖైదీ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. తాను పెయిన్ భరించలేకపోతున్నానంటూ కేకలు వేశాడు.

జైల్లోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో.. ఎస్కార్టు పోలీసులు మంగళవారం సాయంత్రం ఉస్మానియాకు తరలించారు. అయితే పరీక్షలు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు.

ఎక్స్ రే పరిశీలించిన డాక్టర్లు.. షేవింగ్ బ్లేడ్లు, రెండు మేకులు, రెండు చిన్న రబ్బరు బంతులు, రెండు ప్లాస్టిక్ ప్యాకెట్లు, ఇతర చిన్నపాటి వస్తువులు ఖైదీ కడుపులో ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉందనే అనుమానంతో వాటిని ల్యాబ్‌కు పంపించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ బి.రమేశ్‌కుమార్‌ ఎండోస్కోపీతో విజయవంతంగా బయటకు తీశారు.

అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపి ద్వారా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్టో ఎంట్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ బి.రమేశ్ బృందాన్ని సూపరింటెండెంట్‌ అభినందించారు.

అయితే ఆ వస్తువులను ఎప్పుడు, ఎందుకు మింగాడనే విషయాన్ని ఖైదీ వెల్లడించడం లేదు. రోగి కోలుకున్న తర్వాత విచారించి, అతనికి మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఆ తరహా చికిత్స సైతం అందించనున్నారు.

TS: చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

'చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు' ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.

స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో చాక్లెట్లు లభ్యం

విద్యార్థులకు చాక్లెట్లు ఉచితంగా పంచుతున్న ఒడిశా వ్యక్తులు

చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

ఉపాధ్యాయులు ఆరా తీయడంతో వెలుగులోనికి వచ్చిన విషయం

గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ధీరేందర్ బిహారా

పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు.

TS: జాతీయ యువజన ఉత్సవాలకు రాష్ట్ర బృందం నుండి డాక్టర్ బి.జ్యోతి నాయకత్వం

నల్లగొండ: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, నాసిక్ మహారాష్ట్రలో జరగనున్న 27వ యువజన ఉత్సవాలకు.. రాష్ట్రం నుంచి పాల్గొనే యువజన బృందానికి నాయకురాలిగా నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లోని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి జ్యోతి ఎంపికయ్యారు. 

ఈ బృందంలో వివిధ యూనివర్సిటీల నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 30 మంది పాల్గొంటున్నారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 

ఈ కార్యక్రమం లో రాష్ట్రం నుంచి పాల్గొనే యువకుల వాలంటీర్ల బృందానికి హైదరాబాద్ విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె.చిన్నబాబు నాయకత్వం వహిస్తారు. 

ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అయిన డాక్టర్ బి జ్యోతి ని కళాశాల నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన శ్యామ్ మరియు అధ్యాపక బృందం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

NLG: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రాములు నాయక్ జన్మదిన వేడుకలు

దేవరకొండ: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రాములు నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి, కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల నుండి గిరిజన డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని, వారి సేవలు కొలువలేనివని, ఆయన నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, పేదల బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడ్డ ప్రాంతానికి సేవ చేస్తున్నందుకు సంతోషకరమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి వెంకటయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అంబేద్కర్ అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న , సొల్లేటి భాస్కరాచారి, పున్న శీను, రాములు, యేసయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

TS: ఈ నెల 28 లోపు మేడారం జాతరకు అన్ని పనులు పూర్తి

HYD: మేడారం సమ్మక్క సారక్క జాతరపై ఎంసిహెచ్ఆర్డి లో మంగళవారం సాయంత్రం మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. జిల్లా కలెక్టర్, అధికారులకు మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తికావడానికి వర్క్ అసైన్ చేశారు.

28 లోపు అన్ని పనులు పూర్తి అవుతాయని, గతంలో అక్కడ పని చేసిన అధికారులకు ట్రాఫిక్ జామ్ రూట్ క్లియారెన్స్ కోసం నోడల్ ఆఫీసర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు.

కోట్లాది మంది భక్తులు వచ్చే జాతరలో.. ప్రధానంగా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క సారక్క జాతర విజయవంతానికి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయం తో కలిసి పని చేయాలని కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈసారి 6 వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు రచించిందన్నారు. అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకోసం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం, బస్సులు మరిన్ని అవసరమైనప్పుడు ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు ప్లాన్ చేసుకోవాలి, ఆర్టీసీ రవాణా అధికారులు సమన్వయం తో కలిసి పనిచేయాలి అని ఆయన వ్యాఖ్యానించారు.