/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz HYD: ఖైదీ కడుపులో బ్లేడ్లు, మేకులు Mane Praveen
HYD: ఖైదీ కడుపులో బ్లేడ్లు, మేకులు

హైదరాబాద్: చంచల్‌గూడ జైలు లో వందల మంది రిమాండ్ ఖైదీలు, శిక్ష అనుభవిస్తున్న వారు ఉంటారు.

అయితే మహ్మద్ సోహైల్ (21) ఖైదీ ఇటీవల తీవ్ర కడుపునొప్పితో అల్లాడిపోయాడు. తాను పెయిన్ భరించలేకపోతున్నానంటూ కేకలు వేశాడు.

జైల్లోని వైద్యులు ప్రాథమిక చికిత్స చేసినా ఫలితం లేకపోవడంతో.. ఎస్కార్టు పోలీసులు మంగళవారం సాయంత్రం ఉస్మానియాకు తరలించారు. అయితే పరీక్షలు చేసిన డాక్టర్లు కంగుతిన్నారు.

ఎక్స్ రే పరిశీలించిన డాక్టర్లు.. షేవింగ్ బ్లేడ్లు, రెండు మేకులు, రెండు చిన్న రబ్బరు బంతులు, రెండు ప్లాస్టిక్ ప్యాకెట్లు, ఇతర చిన్నపాటి వస్తువులు ఖైదీ కడుపులో ఉన్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలో గంజాయి ఉందనే అనుమానంతో వాటిని ల్యాబ్‌కు పంపించారు. గ్యాస్ట్రో ఎంటరాలజీ డాక్టర్ బి.రమేశ్‌కుమార్‌ ఎండోస్కోపీతో విజయవంతంగా బయటకు తీశారు.

అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తెలిపారు. ఎలాంటి ఆపరేషన్ చేయకుండానే ఎండోస్కోపి ద్వారా రోగి ప్రాణాలను కాపాడిన గ్యాస్టో ఎంట్రాలజీ విభాగం హెచ్‌వోడీ డాక్టర్ బి.రమేశ్ బృందాన్ని సూపరింటెండెంట్‌ అభినందించారు.

అయితే ఆ వస్తువులను ఎప్పుడు, ఎందుకు మింగాడనే విషయాన్ని ఖైదీ వెల్లడించడం లేదు. రోగి కోలుకున్న తర్వాత విచారించి, అతనికి మానసికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఆ తరహా చికిత్స సైతం అందించనున్నారు.

TS: చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

'చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు' ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది.

స్కూల్ సమీపంలోని పాన్ డబ్బాలో చాక్లెట్లు లభ్యం

విద్యార్థులకు చాక్లెట్లు ఉచితంగా పంచుతున్న ఒడిశా వ్యక్తులు

చాక్లెట్లు తిని క్లాస్ రూమ్ లో వింతగా ప్రవర్తిస్తున్న విద్యార్థులు

ఉపాధ్యాయులు ఆరా తీయడంతో వెలుగులోనికి వచ్చిన విషయం

గంజాయి చాక్లెట్ విక్రయిస్తున్న ధీరేందర్ బిహారా

పోలీసులు వారిని అదుపులో తీసుకున్నారు.

TS: జాతీయ యువజన ఉత్సవాలకు రాష్ట్ర బృందం నుండి డాక్టర్ బి.జ్యోతి నాయకత్వం

నల్లగొండ: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా, నాసిక్ మహారాష్ట్రలో జరగనున్న 27వ యువజన ఉత్సవాలకు.. రాష్ట్రం నుంచి పాల్గొనే యువజన బృందానికి నాయకురాలిగా నల్లగొండలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లోని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి జ్యోతి ఎంపికయ్యారు. 

ఈ బృందంలో వివిధ యూనివర్సిటీల నుండి ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు 30 మంది పాల్గొంటున్నారు. ఈనెల 12 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 

ఈ కార్యక్రమం లో రాష్ట్రం నుంచి పాల్గొనే యువకుల వాలంటీర్ల బృందానికి హైదరాబాద్ విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె.చిన్నబాబు నాయకత్వం వహిస్తారు. 

ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ అయిన డాక్టర్ బి జ్యోతి ని కళాశాల నల్లగొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఘన శ్యామ్ మరియు అధ్యాపక బృందం అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

NLG: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రాములు నాయక్ జన్మదిన వేడుకలు

దేవరకొండ: ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ రాములు నాయక్ ను మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి, కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాల నుండి గిరిజన డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని, వారి సేవలు కొలువలేనివని, ఆయన నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని, పేదల బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడ్డ ప్రాంతానికి సేవ చేస్తున్నందుకు సంతోషకరమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు కంబాలపల్లి వెంకటయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అంబేద్కర్ అవార్డు గ్రహీత బుర్రి వెంకన్న , సొల్లేటి భాస్కరాచారి, పున్న శీను, రాములు, యేసయ్య, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

TS: ఈ నెల 28 లోపు మేడారం జాతరకు అన్ని పనులు పూర్తి

HYD: మేడారం సమ్మక్క సారక్క జాతరపై ఎంసిహెచ్ఆర్డి లో మంగళవారం సాయంత్రం మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. జిల్లా కలెక్టర్, అధికారులకు మేడారం జాతర పనులు త్వరితగతిన పూర్తికావడానికి వర్క్ అసైన్ చేశారు.

28 లోపు అన్ని పనులు పూర్తి అవుతాయని, గతంలో అక్కడ పని చేసిన అధికారులకు ట్రాఫిక్ జామ్ రూట్ క్లియారెన్స్ కోసం నోడల్ ఆఫీసర్ కి బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు.

కోట్లాది మంది భక్తులు వచ్చే జాతరలో.. ప్రధానంగా ట్రాఫిక్ కష్టాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమ్మక్క సారక్క జాతర విజయవంతానికి అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సమన్వయం తో కలిసి పని చేయాలని కోటి 50 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.

అంతేకాకుండా మహాలక్ష్మి పథకం ద్వారా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈసారి 6 వేల బస్సులు నడిపించడానికి ఆర్టీసీ ప్రణాళికలు రచించిందన్నారు. అదనంగా బస్సులు వేయడం వల్ల 3 రోజుల పాటు హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకోసం ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నాం, బస్సులు మరిన్ని అవసరమైనప్పుడు ప్రైవేట్ బస్సులు, స్కూల్ బస్సులు ఏర్పాటు చేసుకునేలా అధికారులు ప్లాన్ చేసుకోవాలి, ఆర్టీసీ రవాణా అధికారులు సమన్వయం తో కలిసి పనిచేయాలి అని ఆయన వ్యాఖ్యానించారు.

TS: ధరణి పోర్టల్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణలో ధరణి సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సీసీఎల్ఏ సభ్యుడు చైర్మన్ గా, ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ రేమండ్ పీటర్, భూ నిపుణులు అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్‌ లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కమిటీ ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారాలను రెడీ చేసి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ధరణి పోర్టల్‌లో చేయాల్సిన మార్పులను ప్రభుత్వానికి ఈ కమిటీ సిఫార్స్ చేయనుంది.

NLG: ఘనంగా ప్రియదర్శిని మేడి పుట్టినరోజు వేడుకలు

చిట్యాల: మండలం వట్టిమర్తి గ్రామంలో బిఎస్పి నాయకుల ఆధ్వర్యంలో నియోజకవర్గ బిఎస్పి ఇంచార్జి ప్రియదర్శిని మేడి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియదర్శిని, వట్టిమర్తి గ్రామంలో నిరుపేదలకు రూ. 5000 విలువ గల దుప్పట్లు పంపిణీ చేశారు.

అనంతరం క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ ను కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. నియోజకవర్గ అధ్యక్షులు గద్దపాటి రమేష్, చేరికల కమిటీ కన్వీనర్ మునుగోటి సత్తయ్య, మండల అధ్యక్షులు జోగు శేఖర్, జోగు యోగి, మహేష్, బిఎస్పి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

Mane Praveen

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది నుంచి మహిళలకు సరైన గౌరవం లభించడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేజీల వద్ద

TS: మహిళను నీ అమ్మ అంటూ దూషించిన ఆర్టీసీ డ్రైవర్?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది నుంచి మహిళలకు సరైన గౌరవం లభించడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేజీల వద్ద మహిళలు కనబడితే బస్సులు ఆపడం లేదని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్ చెంగిచర్ల డిపో నుంచి వస్తున్న బస్ 18 సీ బస్ ఖాళీగా ఉండగా కొందరు మహిళలు ఆపారు. అయితే డ్రైవర్ బస్సు ఆపకుండా.. ఎందుకు ఆపాలని తనను నీ అమ్మ అంటూ దూషించాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
NLG: ఎన్జీ కళాశాల కు సుల్తాన్ చాంద్ ట్రస్ట్ వారిచే 568 పుస్తకాలు వితరణ

నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలకు.. సుల్తాన్ చాంద్ ట్రస్ట్ న్యూఢిల్లీ వారు 568 పుస్తకాలు భౌతిక, రసాయన, గణిత, గణాంక, వాణిజ్య, వ్యాపార, ఆర్థిక శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు ఉచితంగా వితరణ చేశారని, రూ.2,48,575/- విలువైన పుస్తకాలు అందజేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మునీర్, శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, కళాశాల గ్రంథ పాలకులు దుర్గాప్రసాద్, అధ్యాపకులు నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, నక్క నరసింహ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండషన్: పిన్నింటి నరేందర్ రెడ్డి

మునుగోడు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 80 మంది పదవ తరగతి విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల దృష్ట్యా.. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సహకారంతో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను నేడు ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలకు భవన మరమ్మత్తులు, పెయింట్స్,నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు.

కస్తూరి ఫౌండేషన్ సహకారంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రములోని కొన్ని వందల ప్రభుత్వ పాఠశాలల ను మరమ్మత్తులు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పరిస్థితులకు అనుగుణంగా అనుగుణంగా దేనికైనా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారని, భవిష్యత్తులో ఆ మనసత్త్వమే ఉత్తమ పౌరులుగా ఎదగడానికి దోహద పడుతుందని, అలాంటి విధ్యార్దుల యొక్క విద్యాభివృద్ధి కోసం కస్తూరి ఫౌండేషన్ నిరంతరం పని చేస్తుదని, పేదవారు విద్యకు దూరం కావొద్దనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ ను స్థాపించామన్నారు. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం రవీందర్, ఉపాధ్యాయులు చంద్రం, యాదయ్య, కళావతి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.