/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: మహిళను నీ అమ్మ అంటూ దూషించిన ఆర్టీసీ డ్రైవర్? Mane Praveen
Mane Praveen

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది నుంచి మహిళలకు సరైన గౌరవం లభించడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేజీల వద్ద

TS: మహిళను నీ అమ్మ అంటూ దూషించిన ఆర్టీసీ డ్రైవర్?
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మి పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఆర్టీసీ సిబ్బంది నుంచి మహిళలకు సరైన గౌరవం లభించడం లేదని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేజీల వద్ద మహిళలు కనబడితే బస్సులు ఆపడం లేదని పలువురు మహిళలు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం హైదరాబాద్ చెంగిచర్ల డిపో నుంచి వస్తున్న బస్ 18 సీ బస్ ఖాళీగా ఉండగా కొందరు మహిళలు ఆపారు. అయితే డ్రైవర్ బస్సు ఆపకుండా.. ఎందుకు ఆపాలని తనను నీ అమ్మ అంటూ దూషించాడని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
NLG: ఎన్జీ కళాశాల కు సుల్తాన్ చాంద్ ట్రస్ట్ వారిచే 568 పుస్తకాలు వితరణ

నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలకు.. సుల్తాన్ చాంద్ ట్రస్ట్ న్యూఢిల్లీ వారు 568 పుస్తకాలు భౌతిక, రసాయన, గణిత, గణాంక, వాణిజ్య, వ్యాపార, ఆర్థిక శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు ఉచితంగా వితరణ చేశారని, రూ.2,48,575/- విలువైన పుస్తకాలు అందజేశారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మునీర్, శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ వెంపటి శ్రీనివాసులు, కళాశాల గ్రంథ పాలకులు దుర్గాప్రసాద్, అధ్యాపకులు నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, నక్క నరసింహ తదితరులు పాల్గొన్నారు.

నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండషన్: పిన్నింటి నరేందర్ రెడ్డి

మునుగోడు: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 80 మంది పదవ తరగతి విద్యార్థులకు రాబోయే వార్షిక పరీక్షల దృష్ట్యా.. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీచరణ్ సహకారంతో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను నేడు ఫౌండేషన్ సభ్యులు విద్యార్థులకు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సభ్యులు పిన్నింటి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 8 సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలకు భవన మరమ్మత్తులు, పెయింట్స్,నోటు పుస్తకాలు, స్టడీ మెటీరియల్ పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల కోసమే కస్తూరి ఫౌండేషన్ పనిచేస్తుందని తెలిపారు.

కస్తూరి ఫౌండేషన్ సహకారంతో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రములోని కొన్ని వందల ప్రభుత్వ పాఠశాలల ను మరమ్మత్తులు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు పరిస్థితులకు అనుగుణంగా అనుగుణంగా దేనికైనా సర్దుకుపోయే మనస్తత్వం కలిగి ఉంటారని, భవిష్యత్తులో ఆ మనసత్త్వమే ఉత్తమ పౌరులుగా ఎదగడానికి దోహద పడుతుందని, అలాంటి విధ్యార్దుల యొక్క విద్యాభివృద్ధి కోసం కస్తూరి ఫౌండేషన్ నిరంతరం పని చేస్తుదని, పేదవారు విద్యకు దూరం కావొద్దనే లక్ష్యంతో కస్తూరి ఫౌండేషన్ ను స్థాపించామన్నారు. కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి శ్రీ చరణ్ కు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం రవీందర్, ఉపాధ్యాయులు చంద్రం, యాదయ్య, కళావతి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

NLG: సంక్రాంతి సెలవులు మరొక్క రోజు పొడగింపు

నల్గొండ జిల్లా: 

మహాత్మ గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ఈనెల 7 వ తేదీ నుండి 15 వరకు ఇచ్చారు. కానీ తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు సెలవులను మరొక్కరోజు పొడిగించారు. 

ఎంజియూ రిజిస్టార్ డా. అలువాల రవి సంక్రాంతి సెలవులు 16వ తేదీ వరకు పొడిగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ కళాశాల గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సుంకరి రాజారామ్, నల్గొండ జిల్లా అధ్యక్షులు మునీర్, సెక్రెటరీ రామరాజు, వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ రెడ్డి, కోశాధికారి గంజి భాగ్యలక్ష్మి, యూనివర్సిటీ కోఆర్డినేటర్ యాదగిరి రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

TGCTA నూతన సంవత్సర క్యాలెండర్ 2024 ను ఆవిష్కరించిన NG కళాశాల ప్రిన్సిపాల్

నల్లగొండ:

తెలంగాణ గెజిటెడ్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ TGCTA, నూతన సంవత్సర క్యాలెండర్ 2024 ను NG కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ చేతుల మీదుగా ఆవిష్కరించారని అసోసియేషన్ ఎంజియూ సెక్రెటరీ డాక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవలనే ప్రిన్సిపల్ గా వచ్చిన సముద్రాల ఉపేందర్, అధ్యాపకులు అసోసియేట్ ప్రొఫెసర్ గా ప్రదోన్నతి చెందిన లక్ష్మణ్ గౌడ్, దీపిక లను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ వైవి ప్రసన్నకుమార్, జిల్లా అధ్యక్షులు నాగరాజు, సెక్రెటరీ శ్రీధర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దీపిక, నాగిరెడ్డి,లక్ష్మణ్ గౌడ్, నారాయణ రావు, ముత్తయ్య, యాదగిరిరావు, మల్లేష్, నాగరాజు, రవి, బిక్షమయ్య, తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

NLG: నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి అందిస్తా: నిమ్మ స్రవంతి

నల్లగొండకు చెందిన స్రవంతి సోమవారం 'ట్రైన్ ద ట్రైనింగ్ వర్క్ షాప్' నందు మోటివేషనల్ స్పీకర్ గా నేడు సర్టిఫికెట్ పొందారు. 30 రోజుల శిక్షణ, 2 రోజుల ఆఫ్లైన్ క్లాసెస్ పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్ లో ఇంపాక్ట్ సంస్థ వ్యవస్థాపకులు గంప నాగేశ్వరరావు ఇంపాక్ట్ నామకరణం చేసిన డా. మహేష్ చేతులు మీదుగా స్రవంతి TTWS సర్టిఫికెట్ అందుకున్నారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి అందించడానికి, సామాజిక సేవ చేయడానికి అవకాశం కల్పించిన తమ మెంటర్ అయిన రాము కు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్, జానీ, నాగలక్ష్మి ,శ్రీధర్, శ్రీనివాస్, రమేష్, మధుమతి, సంతోష్, దస్తగిరి మెంటర్స్ ఉన్నారు.

*తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్లు పన్ను ఎగవేత*

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జీఎస్టీ బోర్డ్ ఇటీవల స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, భారీ పన్ను ఎగవేత కేసులు బయట పడ్డాయి. తెలుగు రాష్ట్రాల్లో 1301 కోట్ల పన్ను ఎగవేత ను గుర్తించాయి.

ఏపీలో 19 బోగస్ సంస్థలు 765 కోట్లు, తెలంగాణలో 117 బోగస్ కంపెనీలు 536 కోట్ల స్కాం చేశాయని తేలింది.

తెలంగాణలో 235 కోట్ల మేరకు రికవరీ చేసి ఒకరిని అరెస్ట్ చేసినట్లు ఆర్ధిక శాఖ వర్గాలు వెల్లడించాయి.

NLG: సాగర్ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో పాల్గొన్న బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజారావు

నల్గొండ బహుజన్ సమాజ్ పార్టీ నూతన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాజారావు, ఈ రోజు హాలియా పట్టణ కేంద్రంలో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయానికి ముఖ్య అతిథిగా విచ్చేసి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈనెల 15వ తేదీన బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బెహన్ జీ కుమారి మాయావతి జన్మదినం పురస్కరించుకొని.. ప్రతి మండల అధ్యక్షుడు, నియోజకవర్గ బాధ్యులకు పలు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

NLG: దరఖాస్తు గడువు పొడగింపు.. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలి: ప్రిన్సిపాల్ అరుణ

నల్లగొండ జిల్లా:

ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 5వ తరగతి లో ప్రవేశం కోసం గతంలో ప్రకటించిన గడువు తేదీని, ఈనెల 20వ తేదీ వరకు పోడగించిన్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల నిడమనూర్ ప్రిన్సిపాల్ అరుణ తెలిపారు.

ఫిబ్రవరి 11న ఉదయం 11 నుండి 1:00 వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవలన్నారు.

TS: నామినేటెడ్ పదవుల బరిలో ముస్లిం మైనారిటీ నుండి ఓయూ తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమ నాయకురాలు డాక్టర్ రేష్మ హుస్సేన్

HYD: తెలంగాణ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులలో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, తెలంగాణ మలిదశ విద్యార్థి ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో బుల్లెట్ గాయాల పాలైన ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

2010 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సందర్భంలో ఆమెకు ఉస్మానియా యూనివర్సిటీలో బుల్లెట్ గాయాలయ్యాయి. ఆవిధంగా ఆమె డేరింగ్, డాషింగ్ మహిళగా బుల్లెట్ రాణిగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. అయితే గత కొద్ది రోజులుగా నామినేటెడ్ పదవులు భర్తీ చేపట్టే దిశగా వార్తలు వస్తున్న నేపథ్యంలో, నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ రేష్మ హుస్సేన్.. ముస్లిం మైనార్టీ నుండి నామినేట్ పదవి ముస్లిం మైనారిటీ చైర్మన్, టీఎస్పీఎస్సీ చైర్మన్, టిఎస్పిఎస్సి బోర్డు మెంబర్ వంటి ఏదైనా ఒక పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తనకు ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు.

ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో స్థిరపడ్డారు. చిన్నప్పటి నుండి ఆమెకు చదువుల పట్ల ఉన్న ఆసక్తి తో కెమిస్ట్రీ లో ఎమ్మెస్సీ, తెలుగులో ఎంఏ, ఎంఈడి, రసాయన శాస్త్రంలో  పిహెచ్డి వంటి ఉన్నత విద్యలను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పూర్తిచేసింది. ఆమె గత ఐదు సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, ఐదు సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా మైనారిటీ గురుకుల విద్యా సంస్థలలో విధులు నిర్వహించి విద్యార్థులను ఉన్నత స్థాయిలలో స్థిరపడే విధంగా కృషి చేస్తున్నారు. ఇటీవల మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు లను రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకురావాలని మంత్రులను కోరినట్లు ఆమె తెలిపారు.

డా. రేష్మ హుస్సేన్ తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థిని గా ఉద్యమంలో కీలకంగా పని చేయడం, ఆ తర్వాత కూడా విద్యార్థుల కోసం గురుకులాలలో అధ్యాపకురాలుగా ప్రిన్సిపాల్ గా పనిచేయడం, పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం, ఉన్నత విద్యావంతురాలు కావడం, గత ప్రభుత్వం లో విద్యార్థులకు నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని పలు కార్యక్రమాల ద్వారా, మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఆమె పేరును నామినేటెడ్ పదవులకు పరిశీలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.