/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: వీఆర్ఏ లకు తీపి కబురు తెలిపిన ప్రభుత్వం Mane Praveen
TS: వీఆర్ఏ లకు తీపి కబురు తెలిపిన ప్రభుత్వం

తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులకు వరుస తీపి కబుర్లు అందజేస్తుంది. ప్రతి నెల 05 లోపు జీతాలు అందజేస్తామని చెప్పినట్లే, ఈ నెల జీతాలు వారి ఖాతాల్లో వేసి వారిలో సంతోషం నింపింది. ప్రభుత్వం ఇప్పుడు వీఆర్ఏ లకు తీపి కబురు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగులో ఉన్న వీఆర్ఏ ల జీతాలకు క్లియరెన్స్ ఇచ్చింది. వివిధ శాఖల్లో విలీనమైన 15,560 మంది, రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరీ పోస్టుల ద్వారా పని చేస్తోన్న వారందరికీ.. పెండింగులో ఉన్న ఏడు నెలల వేతనాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్లను సీసీఎల్ఏ ఆదేశించారు.

బుధవారం ఇందుకు సంబంధించి మెమో జారీ చేశారు. జీవో నం. 81, 85 ల ద్వారా వివిధ శాఖల్లో గ్రేడ్ సర్వీసెస్/రికార్డు అసిస్టెంట్స్/ జూనియర్ అసిస్టెంట్లుగా పని చేస్తున్నారు. వారందరికీ రెగ్యులర్ పే స్కేల్‌ని అమలు చేయాలని నిర్ణయించారు. కొన్ని నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వీఆర్ఏలకు ఉపశమనం లభించింది.

TS: పాఠశాల లకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా పాఠశాల లకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు జనవరి 12 నుండి 17 వరకు ఉంటాయని తెలిపింది.

మిషనరీ స్కూల్స్ మినహా అన్ని పాఠశాలలకు ఈ సెలవులు ఉంటాయని పేర్కొంది. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి 16న కనుమ పండుగలు ఉన్నాయి.

NLG: ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు

నల్లగొండ: ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఆరు వార్డులలో ప్రజా సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం 25, 26, 27, 28, 29, 30 వార్డులలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు.

మున్సిపల్ కమిషనర్ కందుకూరి వెంకటేశ్వర్లు వార్డ్ నెం.25 అబ్బాసియా కాలనీలోని అంగన్వాడి సెంటర్ దగ్గర నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా వార్డ్ నెం. 26 గాంధీ పార్క్, వార్డ్ నెం.27 షేర్ బంగ్లా, వార్డ్ నెం.28 యాదవ సంఘం, వార్డ్ నెం. 29 లైన్ వాడి అర్బన్ హెల్ప్ సెంటర్ దగ్గర మరియు వార్డ్ నెం.30 కమ్యూనిటీ హాల్ లలో వార్డు సభ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఈరోజు ప్రజా పాలనలో 5565 దరఖాస్తులను ప్రజల వద్ద నుంచి స్వీకరించారు. ఇప్పటివరకు మొత్తం

26854 దరఖాస్తులు ప్రజల వద్ద నుండి స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వార్డ్ ఆఫీసర్లు దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. కొత్త రేషన్ కార్డుల గూర్చి ప్రభుత్వం వద్ద నుంచి ఎటువంటి ఫార్మేట్ రాలేదని, వాట్స్అప్ లలో వచ్చే ఫార్మేట్ ను ప్రజలు ఎవరు నమ్మొద్దని స్పష్టం చేశారు.

జిరాక్స్ సెంటర్లకు వెళ్లి ఇందుకు సంబంధించి ఎటువంటి దరఖాస్తు ఫారాలను తీసుకోవద్దని సూచించారు. అందుబాటులో కావలసినన్ని దరఖాస్తులను ఉంచామని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.  

6వ తేదీ వరకు ప్రజా పాలన కొనసాగుతుందని ప్రజలు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తో పాటు సంబంధిత వార్డు కౌన్సిలర్లు, వార్డు ఆఫీసర్లు, వార్డ్ ప్రజలు మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

NLG: YRP ఫౌండేషన్ - చత్రపతి శివాజీ క్రికెట్ క్లబ్ ప్రారంభోత్సవం

ఈరోజు నల్గొండ పట్టణంలోని YRP ఫౌండేషన్ కార్యాలయంలో నూతన క్రికెట్ క్లబ్ ను ప్రారంభించారు.

వై ఆర్ పి ఫౌండేషన్ మరియు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సంయుక్తంగా క్రికెట్ క్లబ్ ను ఆరంభించి, ఫ్రీడమ్ క్రికెట్ అసోసియేషన్ సహకారంతో గ్రాస్ రూట్ లెవెల్ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంత క్రికెట్ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడానికి కృషి చేయడానికే ఈ క్లబ్ ను ప్రారంభించడం జరిగింది.

నూతన క్రికెట్ క్లబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైఆర్పి ఫౌండేషన్ నల్గొండ జిల్లా కన్వీనర్ యామ దయాకర్ పాల్గొని లోగో ను ఆవిష్కరించి, క్రీడాకారుల మధ్యన కేక్ కట్ చేసి క్రికెట్ క్లబ్ ను ఆరంభించి, అనంతరం మాట్లాడుతూ.. మా యొక్క వైఆర్పి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మరియు గ్రామీణ నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకై ఆర్థిక సహాయం, అనారోగ్యం బారినబడిన నిరుపేద వారికి హాస్పటల్ ఖర్చులకు చేయూత నివ్వడమే, కాకుండా ఫుట్బాల్, కబడ్డీ క్రీడాకారులకు గత 5 సంవత్సరాలుగా సహకారం అందిస్తున్నామని, ఆ క్రమంలోనే ఈరోజు క్రికెట్ క్లబ్ ను ప్రారంభించామని తెలిపారు.

నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా హరిచందన ఐఏఎస్

నల్లగొండ జిల్లాకు కలెక్టర్ గా దాసరి హరిచందన, ఐఏఎస్ ను ప్రభుత్వం నియమించింది. గతంలో జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన ఆర్ వి కర్ణన్ ఐఏఎస్ ను రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ కు డైరెక్టర్ గా బదిలీ చేసింది. ఈయన స్థానంలో జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ గా హేమంత్ కేశవ్ పాటిల్, ఐఏఎస్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

ఇటీవల జిల్లా ఎస్పీగా చందనా దీప్తి, ఐపీఎస్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. బుధవారం 2010 ఐఏఎస్ బ్యాచ్ చెందిన దాసరి హరిచందన ను జిల్లా కలెక్టర్ గా ప్రభుత్వం నియమించింది. నల్లగొండ జిల్లాకు కలెక్టర్ మరియు ఎస్పీ ఇద్దరూ మహిళలు కావడం విశేషం.

NLG:వేళకు రాని నాన్ స్టాప్ బస్సులు.. క్యూ లైన్లో వేచి ఉన్న ప్రయాణికులు

నల్లగొండ: పట్టణంలోని బస్టాండ్ లో హైదరాబాద్ కు వెళ్లే నాన్ స్టాప్ బస్సుల కోసం జనం భారీగా క్యూలైన్లు కట్టారు. దాదాపు ఒక్కొక్క లైన్ లో 60 నుంచి 70 మంది ప్రయాణికులు రెండు క్యూలైన్లలో టికెట్ల కోసం క్యూ కట్టారు. నాన్ స్టాప్ బస్సులు సరిగా అందుబాటులో లేవని సరియైన వేళలలో బస్సులు రావట్లేదని ప్రయాణికులు వాపోతున్నారు.

ఈ పరిస్థితి ఇంతకుముందు లేదని, గత పది రోజులుగా ఉందని, ఇకనైనా ఆర్టీసీ అధికారులు స్పందించి నాన్ స్టాప్ బస్సులను సరైన వేళలకు నడిపించాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరుతున్నారు.

AP: నేడు సీఎం జగన్ ను కలవనున్న వైయస్ షర్మిల

అమరావతి: వైఎస్ షర్మిల ఇవాళ సీఎం జగన్‌ను కలవనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిలా రెడ్డి కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకొని, సాయంత్రం తాడేపల్లి లోని సీఎం జగన్ నివాసానికి వెళ్లనున్నారు.

కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను జగన్ మోహన్ రెడ్డికి షర్మిలా రెడ్డి అందించ నున్నారు.

వైఎస్ షర్మిల వెంట తల్లి విజయమ్మ, కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియ అట్లూరి, కుమార్తె, కోడలి తరపు కుటుంబ సభ్యులు కూడా జగన్ వద్దకు వెళ్లనున్నారు.

NLG: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో న్యూ ఇయర్ వేడుకలు

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల లో నూతన సంవత్సర వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ ఘన శ్యామ్ ఆధ్వర్యంలో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని చేత కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. కళాశాలకు నాక్ ఏ గ్రేడ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యా సంవత్సరం ఇదే అని, విద్యార్థులంతా కళాశాలలో ఉన్న అన్ని సౌకర్యాలను వినియోగించుకొని, మంచి ర్యాంకు లతో ఉత్తీర్ణులు కావాలని విద్యార్థినులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి, దేవవాని, నరేష్, వెంకటకృష్ణ, హసేన, స్వామి, శ్రీనివాస్ రెడ్డి, మల్లికార్జున్, ధర్మేందర్, జ్యోతి , మంజుల, యాదగిరి మరియు కళాశాల గ్రంథాలయ అధ్యాపకులు సుంకరి రాజారామ్ తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.

NLG: లెంకలపల్లి లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం,

లెంకలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో, ప్రజాపాలన గ్రామసభ కార్యక్రమాన్ని మంగళ వారం గ్రామ సర్పంచ్ పాక నగేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాపాలన కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ప్రజా పాలన గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుండి అధికారులు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారు. 

అధికారులు దరఖాస్తులను పరిశీలించి రసీదులు అందజేశారు. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ వెంకటేశం, ఏపీఎమ్ హరి, పంచాయతీ సెక్రెటరీ ఉమాదేవి తదితర అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

TS: శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.2.9కోట్ల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.2.9కోట్ల విలువైన బంగారం పట్టివేత

శంషాబాద్‌లోని రాజీవ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న

బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.

విమానాల్లో దుబాయి నుంచి వచ్చిన నలుగురి నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.