/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz హామీలు నెరవేర్చని నాయకులను నిడదీయండి:సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్ Miryala Kiran Kumar
హామీలు నెరవేర్చని నాయకులను నిడదీయండి:సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్

సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్

చర్ల :భూర్జవ,పాలక పార్టీలను ఓడించండి.

గత హామీలను అమలు చేయని పాలకులను నిలదీయండి.న్యూడెమోక్రసీ.

బూర్ జవా పాలక పార్టీలను ఓడించాలని గతంలో హామీలను ఇచ్చి విస్మరించిన పాలకులను ఇప్పుడు నిడదీయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,డివిజన్ నాయకులు ముసలి సతీష్* లు పీలుపు నిచ్చారు.

గతంలో పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని విచ్చలవిడి హామీలను ఇచ్చి ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా విస్మరించిన పార్టీలను గ్రామాలకు వస్తే నిలదీయాలని భూర్జవ పార్టీలను ఓడించాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను విస్మరించి పెట్టుబడి కార్పొరేట్ శక్తులకి ప్రజల ఆస్తులను చేస్తున్నారని అందులో భాగమే నూతన అటవీ సంరక్షణ నియమాలను తీసుకొస్తున్నారని అడవుల నుండి ఆదివాసీలను గెంటివేయడం కోసం ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని వారన్నారు. పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పి ప్రగల్బాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం సాగు చేసుకుంటున్న భూములను హరితహారం పేరుతో గుంజుకొని ప్రజలని మోసం చేసిందని వారన్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వకపోగా అడిగిన ప్రశ్నించిన గొంతుకలపై ఊపా పిడి యాక్ట్ లాంటి కేసులను నమోదు చేసి జైలవనిర్బంధిస్తున్నారని వారన్నారు.ఎన్నికలే శాశ్వతంగా బతికే పాలక బూర్జవ పార్టీలను ఎండగట్టాలని,విప్లవ పార్టీలను ప్రజాస్వామిక వాదులను గెలిపించుకుంటే ప్రజా సమస్యలను పరిష్కరించుకోవచ్చని వారు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రోడ్లెక్కి అనేక ఆందోళన చేసిన పట్టించుకోని నాయకులు ఈరోజు ఎన్నికలు రాగానే రంగురంగుల జండాలతో రంగురంగు వేషాలతో వచ్చి ప్రజల దగ్గర కొత్త కొత్త హామీలతో ముందుకు వస్తున్నారని ఇవి ఎవరు కూడా నమ్మొద్దని ఆ పార్టీలో ఆ వేషాలు అన్నీ కూడా ప్రజల్ని మోసం చేయడం కోసమేనని వారన్నారు. తొమ్మిదేళ్ల కాలంలో పేదలకు చేసింది ఏమీ లేదని పైగా గ్యాస్,విద్య,విద్యుత్తు, వైద్యం అందని ద్రాక్షగా మార్చాలని వారన్నారు.ఇప్పటికీ అనేక గ్రామాలలో రోడ్లు,రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అనేకసార్లు అధికారులకు పాలకులకు విన్నవించిన ఫలితం లేదని వారు అన్నారు.అందుకే ప్రజలందరూ ఆలోచించి ఓటేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.బిజెపి ప్రభుత్వం హిందూ మతం మతోన్మాదం పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టి ఐక్యంగా ఉన్న గ్రామాలలో విచ్ఛిన్న చర్యలు చేపట్టి విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటిస్తుందని వారన్నారు.బిజెపి, కాంగ్రెస్,బి ఆర్ ఎస్ అన్ని ఒక్క తాను గుడ్డలేనని అధికారం కోసమే వేరు ఆరాటపడుతున్నారు.తప్పితే ప్రజా సమస్యల కోసం కాదని ఇది ప్రజలందరూ గమనించాలని వారు పిలుపునిచ్చారు.ఈ క్రమంలో ప్రజల కోసం పని చేసే వారిని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని,ప్రశ్నించే గొంతుకలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్,భాను,నరసింహారావు,సీతారాములు,సరోజ,కోటమ్మ,కృష్ణ,తదితరులు పాల్గొన్నారు.

క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డికి మద్దతు తెలిపిన నల్గొండ క్రిస్టియన్స్

క్రైస్తవులంతా బిఆర్ యస్. అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి మద్దతు ప్రకటించారు.

నల్గొండ పట్టణంలో మిర్యాలగూడ రోడ్ లో ఉన్న బిలీవర్స్ చర్చ్ లో నల్గొండ నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్, మరియు క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, ఆధ్వర్యంలో నిర్వహించిన పాస్టర్ల సదస్సులో నల్గొండ శాసనసభ్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు మరియు తెలంగాణ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ డి రాజేశ్వరరావు పాల్గొని మాట్లాడినారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ కో- ఆప్షన్ మెంబర్ శ్రీ తీగల జాన్ శాస్త్రి గారు అధ్యక్షత వహించనారు. వారి అధ్యక్షుతన జరిగిన ఈ కార్యక్రమంలో నల్గొండ నియోజకవర్గాలో ఉన్న పాస్టర్లు మరియు పాస్టర్ అమ్మలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేసినారు, ముఖ్య అతిధులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రైస్తవ సమాజాన్ని ఎంతగానో అభివృద్ధి పథకంలో నడిపిస్తుందని తెలియజేశారు, చర్చి నిర్మాణాలకు పర్మిషన్, క్రిస్మస్ పండుగను ప్రభుత్వమే ఘనంగా నిర్వహిస్తూ, క్రిస్మస్ పండుగకు రెండు రోజుల సెలవు, నిరుపేదలకు బట్టలు పంపిణీ చేస్తుందని, క్రిస్మస్ విందు ఇస్తుందని తెలియజేశారు.గెలిచిన తర్వాత క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ మరియు క్రైస్తవ భవన్ ఇస్తానని వాగ్దానం చేశారు . నల్గొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిలో క్రైస్తవులు ముందంజలో ఉండి మరొకసారి గెలిపించాలని కోరినారు,గనుక నవంబర్ 30 వ తారీఖు జరిగే ఎలక్షన్ లో క్రైస్తవులు భారీ ఎత్తున పాల్గొని కారు గుర్తు మీద ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్థని గెలిపించాలని కోరినారు. అధ్యక్షులు కార్యదర్శులు మరియు ఇతర పాస్టర్లు పాల్గొని విజయవంతం చేసినారు. పాస్టర్ ఐజక్ రామ్, కన్నడ డేవిడ్, విజయ్, ప్రసాద్ కుమార్ , నా లాజరస్ , జాన్ బాబు,రాజ్ కుమార్, కట్ట మోజేష్, జయ చందు, అనిల్ కుమార్, జక్కయ్య పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. తదితరులు పాల్గొన్నారు

నలగొండలో BRSకు జై కొట్టిన రాష్ట్ర మాల సంఘాల JAC

BRSకు జై కొట్టిన రాష్ట్ర మాల సంఘాల JAC

అభివృద్ధి అంటేనే కంచర్ల ... కంచర్ల అంటేనే అభివృద్ధి..

మాలల సమస్యలను పరిష్కరించే సత్తా BRSకే ఉందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల JAC ఛైర్మన్ చెరుకు రాంచందర్ అన్నారు.

VT కాలనీలోని MLA గారి క్యాంప్ అఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంచందర్ మాట్లాడుతూ.. 

20 ఏళ్ళు MLAగా ఉండి కోమటిరెడ్డి నల్గొండకు ఏం అభివృద్ధి చేశారో చెప్పకుండా.. స్కీములంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. 

నల్గొండ అభివృద్ధి అంటేనే కంచర్ల భూపాల్ రెడ్డి గారని.. అంచలా నల్గొండను అభివృద్ధి చేశారని, ఇది ఎవరో చెప్పడం కాదూ.. నల్గొండను చూస్తేనే తెలుస్తుందని అన్నారు. అందుకే రెండో దఫా కంచర్ల భూపాల్ రెడ్డి గారు MLAగా 50 వేల మెజారిటీతో గెలుస్తారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమాభివృద్ది కోసం CM KCR గారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని, దళిత బంధు ద్వారా దళితులను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు KCR గారు తీసుకున్న చొరవ అద్వితీయమైనదని ఆయన కొనియాడారు.  

125 అడుగుల అంబెడ్కర్ విగ్రహంతో పాటు సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం హర్షనీయమన్నారు

ఆడపడుచుల పెళ్ళిళ్ళ కొరకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు..

ఈ కార్యక్రమంలో వర్కింగ్ ఛైర్మన్ తాళ్ళపల్లి రవి , కన్వీనర్ నల్లాల కనకరాజు , వినోద్ కుమార్, నరసింహ, మేక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి: జగదీశ్వర్ రెడ్డి

మీరు వేసిన ఓటుతోనే సూర్యాపేట ఎంతో అభివృద్ధి

ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి జగదీష్ రెడ్డి

అభివృద్ధి చేసే వారికి మళ్లీ పట్టం కట్టండి

మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి వద్ద గల తేజ హైస్కూల్లో ఆర్యవైశ్య సంఘం నాయకులు బిక్కు మల్ల కృష్ణ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ మీరు వేసిన ఓటుతోనే గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు. గతంలో హైదరాబాద్ మూసి నీరు తాగే పరిస్థితి ఉండేదని నేడు మిషన్ భగీరథ ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంటింటికి మంచినీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అని అన్నారు. గతంలో దీపాల వెలుతురుతో చదువుకునే పరిస్థితులు ఉండేయని, నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డాక 24 గంటల కరెంటు తో పాటు దేశం లో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని కొనియాడారు. నరేంద్ర మోడీ రాష్ట్రమైన గుజరాత్ లో సైతం 

ఇప్పటికి ప్రతిరోజు ఆరు గంటలే కరెంటు ఇస్తున్నారని తెలిపారు. 2014 ముందు ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని బెరీజు వేసుకొని తమ ఓటును వెయ్యాలన్నారు. వ్యాపారస్తులను గతం లో చందాల పేరుతో దందాలు నిర్వహించి బెదిరించే వారని,నేడు శాంతి భద్రతలతో ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలు చేసుకుంటున్నారని తెలిపారు. స్మశానవాటికలను రూపుదిద్ది వైకుంఠధామాలుగా మార్చడంతో పాటు పెళ్ళికాని అమ్మాయిలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వారింట్లో వెలుగులు నింపిన మహనీయుడు కేసీఆర్ అన్నారు. నేడు ఏ గ్రామం వెళ్లిన కాలేశ్వరం జలాలతో పంట పొలాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయని కొనియాడారు. సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందడంతో కార్పొరేట్ సంస్థలు తమ వ్యాపారాలను స్థాపించుకొని నిరుద్యోగులకు ఉపాధి కల్పించారన్నారు.ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని మీ ఓటును అభివృద్ధి చేసే వారికే వేసి మళ్లీ గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉప్పల ఆనంద్, మొరిశెట్టి శ్రీనివాస్, కాచం సత్యనారాయణ, బండారు రాజా, తోట శ్యాం ప్రసాద్, చల్లా లక్ష్మీకాంత్, మీలా వంశీ, బెలిదే శ్రీనివాస్, నల్లపాటి శ్రీనివాస్, బిక్కుమళ్ళ సోమేశ్వర్, దారం వెంకన్న, కక్కిరేణి చంద్రశేఖర్, రాచకొండ శ్రీనివాస్, ముప్పారపు నాగేశ్వరరావు , బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీను వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన ఎస్ కె అష్రాఫ్

కాంగ్రెస్ పార్టీను వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన ఎస్ కె అష్రాఫ్.

నల్లగొండ పట్టణం మున్సిపాలిటీ 22వ వార్డు నుంచి ఎస్కే అష్రాఫ్ కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 22 వార్డు నూరుద్దీన్ నేతృత్వంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. అనంతరం ఎస్కే అష్రాఫ్ మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా అభివృద్ధి ని నోచుకోని నల్లగొండ కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల లోనే అభివృద్ధి చెందిందని సబండ వర్గాలకు కేసిఆర్ గారి ప్రభుత్వమే అన్ని రకాల హామీలను నెరవేస్తుందని రాబోయే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ కంచర్ల భూపాల్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

200 మంది యువకులతో కలిసి BRS లో చేరిన మునుగోడు BSP రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ నేత

BSP పార్టీ నుండి BRS లో చేరిన 200 మంది యువకులు 

బీఎస్పీ రాష్ట్ర నాయకులు పెండెం ధనుంజయ గారి నేతృత్వంలో చేరిక

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మునుగోడు ప్రగతి ప్రదాత శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 

 మునుగోడు నియోజకవర్గంలో BRS లోకి భారీ చేరికలు కొనసాగుతున్నాయి....

 ఎవరు ఊహించని విధంగా సబ్బండ వర్గాల నుండి భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి....

 అదే క్రమంలో ఈరోజు చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి సమక్షంలో పెండం ధనుంజయ గారి ఆధ్వర్యంలో దాదాపు 200 మంది యువకులు బిఆర్ఎస్ లో చేరారు...

 అనంతరం వారు మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి కొమ్ముకాస్తూ అతనితో భేరసారాలు జరిపి మోసం చేశాడని, కాంట్రాక్టు రాజకీయాలు చేస్తూ రాజకీయ విలువలను దిగజార్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని ప్రభాకర్ రెడ్డి గారి హయం లోని మునుగోడు సస్యశ్యామలమైందని ప్రతి ఇంటికి త్రాగునీరు వ్యవసాయానికి సాగునీరు వచ్చాయని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి గెలుపుతో మునుగోడు ప్రగతికి మర

మాదిగల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం నల్గొండ ఎమ్మెల్యే అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారికి పూర్తి మద్దతు తెలిపిన నల్లగొండ MRPS అధ్యక్షులు

మాదిగల అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం

 కంచర్ల భూపాల్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా కమిటీ

కంచర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించి మాదిగల సత్తా చూపించాలి

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాదిగల ద్రోహి

 బిజెపి కాంగ్రెస్ లు మాదిగల ప్రథమ శత్రువులు

 నల్లగొండ నియోజక అభివృద్ధి, ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కంచర్ల భూపాల్ రెడ్డి తోనే సాధ్యం

 దళిత బంధు నిరంతరం జరిగే ప్రక్రియని ప్రతి దళిత కుటుంబానికి అందుతుంది

ఎస్సీ ల వర్గీకరణకు.. కెసిఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉండటం హర్షణీయం 

----- మారపాక నరేందర్ మాదిగ

 ఎమ్మార్పీఎస్ టీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు.

నేడు..వీటీ కాలనీ లోని నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో... ఎమ్మార్పీఎస్... టిఎస్.. జిల్లా శాఖ అధ్యక్షులు.. మారపాక నరేందర్... ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో... వారు మాట్లాడుతూ..మాదిగల అభివృద్ధి.. ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని.. వారి నాయకత్వంలోనే అనేక సంక్షేమ ఫలాలు మాదిగలు అనుభవిస్తున్నారన్నారు.. ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో.. నల్గొండ నుండి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న.. కంచర్ల భూపాల్ రెడ్డి గారికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని.. ఈ ఎన్నికల్లో భూపాల్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మాదిగల సత్తా ఏంటో నిరూపించుకోవాలన్నారు..

 బిజెపి కాంగ్రెస్ పార్టీలు మాదిగల ప్రధాన శత్రువు అని ఆ పార్టీలను భూస్థాపితం చేయాలని మాదిగలకు పిలుపునిచ్చారు. ఎన్నికలప్పుడే మోదీకి, కిషన్ రెడ్డికి.. వర్గీకరణ గుర్తుకొస్తదని అన్నారు... నల్లగొండ అభివృద్ధి కంచర్ల భూపాల్ రెడ్డి గారితోనే సాధ్యమని.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కంచర్ల భూపాల్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని... నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటు వారి సమస్యలు పరిష్కరిస్తున్నారని .. అందుకే తాము వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు..

 కోమటిరెడ్డి వెంకటరెడ్డి దళిత ద్రోహి అని... కాంగ్రెస్ పార్టీ స్కాముల పార్టీ అని బిజెపి మతతత్వ పార్టీ అని.. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీలకు తమ మద్దతు ఉండదన్నారు... దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని.. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఈ పథకం అందుతుందని కెసిఆర్ ప్రకటించడం హర్షినియమని.. ఈ ఎన్నికల్లో మాదిగలంతా కూడా బిఆర్ఎస్ పార్టీకి.. తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి విజయం కోసం కృషి చేస్తామని తెలియజేశారు.. 

 ఈ ప్రెస్ మీట్ లో ... పుల్లెంల ఏడుకొండలు మాదిగ ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, పుల్లెంల యాదయ్య మాదిగ,..

 బొస్క శ్రీను మాదిగ తిప్పర్తి మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు,

 బరిగల యాదయ్య మాదిగ నల్లగొండ మండల అధ్యక్షులు.

పెరిక వెంకటేశ్వర్లు కనగల్ మండల అధ్యక్షులు... లింగయ్య మాదిగ మాడుగుల రమేష్ మాదిగ జానయ్య మాదిగ కొమ్ము సుదర్శన్ మాదిగ నరేందర్, కొత్తపల్లి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు...

ప్రస్తుతం దేశం ఉల్లి ధరల్లో గణనీయమైన పెరుగుదలను ఎదుర్కొంటోంది. గతంలో కిలో ఉల్లి ధర రూ. 30 నుంచి రూ. 40గా మాత్రమే ఉండేది. అయితే, ప్రస్తుతం, ఉల్లిపాయలను చాలా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఒక కిలో ఉల్లిపాయలను రూ. 80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు.

పెరుగుతున్న ఉల్లి ధరలు సామాన్య ప్రజల ఆర్థిక భారాన్ని గణనీయంగా పెంచుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ క్రమంలోనే ఉల్లి ధరల పెరుగుదలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు, బఫర్ స్టాక్ నుండి లక్ష టన్నుల ఉల్లిపాయలను విడుదల చేసి రిటైల్ మార్కెట్‌లలో అందుబాటులో ఉంచ్చనున్నట్లు తెలిపారు.


ఇంకా, ఉల్లి ధరల పెరుగుదలను అరికట్టడానికి ఇప్పటికే ఎగుమతి ఆంక్షలను కూడా ప్రభుత్వం అమలు చేసింది. మరింత సహాయం అందించడానికి, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కిలో ఉల్లిని రూ.25 సబ్సిడీపై విక్రయించడం ప్రారంభించింది. అంతేకాదు బఫర్ స్టాక్ నుంచి ఈ నెలలో అదనంగా లక్ష టన్నుల ఉల్లిని మార్కెట్‌లోకి విడుదల చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండిలో హోల్‌సేల్ ఉల్లి ధరలు రూ.30కి పడిపోయినట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టి సామాన్యులకు ఊరటనిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

మైనార్టీలకు ఎన్నో పథకాలతో చేయూతనిచ్చిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ నల్గొండలో తమ మద్దతు బిఆర్ఎస్ పార్టీకేనని తెలిపిన నల్లగొండ MIM ప్రెసిడెంట్

BRS కంచర్ల భూపాల్ రెడ్డి గారికి MIM మద్దతు .. 

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే 0.8% ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని MIM జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అన్నారు.

కంచర్ల భూపాల్ రెడ్డి హయాంలో కరోనా సమయాన్ని మినహాయిస్తే మిగిలిన రెండుమూడు సంవత్సరాల్లోనే ఇంతలా అభివృద్ధి చెందిందంటే.. మరోదఫా ఎమ్మెల్యేగా పంపిస్తే మరింత అభివృద్ధి చెందుతుంది. అందుకే మైనారిటీల మద్దతు BRSకు ఇస్తున్నామని MIM జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్ అన్నారు

కోమటిరెడ్డి 20 ఏండ్లు MLA, ఒకసారి మంత్రిగా ఉండి కూడా నల్గొండ అభివృద్ధిని విస్మరించి హైదరాబాద్ లో దాక్కున్నారని, ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి అభివృద్ధి చేస్తా... అవకాశం ఇవ్వాలని కోరడం ఎంత వరకు సబబు అని అన్నారు.

MLA కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ.. CM KCR ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనారిటీ గురుకుల పాఠశాలల ద్వారా 1,20,000 మంది విద్యార్థులకు విద్య అందించడంతో పాటు షాదీముబారక్, రంజాన్ తోఫా లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

CM KCRగారు మూడోసారి అధికారంలోకి వస్తే

మైనారిటీ సంక్షేమం కోసం మరింత ఎక్కువగా కృషి చేస్తామని అన్నారు

2014లో కూడా ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు, 2018లో మళ్ళీ ఇప్పుడు నాకు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు.

జిల్లా పరిషత్ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చకిలం అనిల్ కుమార్ గారలు మాట్లాడుతూ.. BRSకు MIM మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.. 2014 నుంచి BRS, MIM పార్టీల మైత్రీ కొనసాగుతోందని, మరోసారి భూపాల్ రెడ్డిని గెలిపిస్తే మైనారిటీలు మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు.

కులమతాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధి లో ముందుకు పోతున్నదని.. అందుకే MIM మద్దత్తు ఇచ్చిందని , వారికి మరోసారి ధన్యవాదాలు అని అన్నారు.

 ఇంకా ఈ కార్యక్రమంలో.... మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్ బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి.. రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, సీనియర్ నాయకులు ఫరీదోద్దీన్ బక్క పిచ్చయ్య, జమాల్ ఖాద్రి అన్వర్ పాషా, బిఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, ఎంఐఎం పట్టణ పార్టీ అధ్యక్షులు హజీ,బిఆరెస్ పట్టణ కార్యదర్శి, జాఫర్,సంధినేని జనార్దన్ రావు... ఎమ్ఐఎం జిల్లా ట్రెజరర్ గౌస్ మహమ్మద్ జాయింట్ సెక్రెటరీ అబ్దుల్ మల్లిక్, సిరాదుద్దీన్, టౌన్ కమిటీ కార్యదర్శి నదీమ్ టౌన్ కమిటీ జాయింట్ సెక్రెటరీ ముదసిర్ తదితరులు పాల్గొన్నారు

కృష్ణారెడ్డి గారి సమక్షంలో బొల్లెద్దు రఘు నాయకత్వంలో 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ లో చేరిక

నేడు... బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి గారి సమక్షంలో... నల్గొండ పట్టణంలోని ఆరో వార్డు, శాంతి నగర్ కు చెందిన బొల్లెద్దు రఘు నాయకత్వంలో 100 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు... బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. ఈ సందర్భంగా వారికి..కృష్ణారెడ్డి గారు వారికి గులాబీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు... నల్లగొండ అభివృద్ధి పట్ల ఆసక్తితో.. వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని.. నల్లగొండ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా వారిని కోరారు... 365 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే.. ప్రజల కోసం పనిచేసే..ఫైటర్.... భూపాల్ రెడ్డి అన్నారు...

 బొల్లెద్దు రఘు తో పాటు.. సుంకిరెడ్డి వీరేందర్ రెడ్డి బొమ్మరబోయిన ముత్యాలు బొల్లెద్దు నరేందర్, దుస్స వెంకన్న బరుసు సురేష్ కుమార్ కర్నాటి లింగారెడ్డి, ఇమ్రాన్, గోలి నాగరాజు తో పాటు వందమందికి పైగా పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.