/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz TS: ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు Mane Praveen
TS: ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు
హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు బోనస్‌ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో సింగరేణిలో పనిచేస్తున్న ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల బోనస్‌ ఇవ్వనున్నట్టు యాజమాన్యం వెల్లడించింది. ఈ నిర్ణయంతో సింగరేణి కాలరీస్ లో పనిచేస్తున్న 42వేల మంది కార్మికులకు రూ.1.53 లక్షల చొప్పున బోనస్‌ అందనుంది. ఒకటి రెండు రోజుల్లో పండుగ అడ్వాన్స్‌ కూడా చెల్లించనున్నట్టు అధికారులు తెలిపారు.

SB NEWS TELANGANA
TS: కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీతో జేఏసీ నాయకులు కోదండరాం భేటీ
కరీంనగర్ జిల్లా:  కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీతో టీజేఎస్ అధ్యక్షులు కోదండరాం భేటీ అయ్యారు. ఇవ్వాళ ఉదయం కరీంనగర్‌ వీపార్క్‌ హోటల్‌కు చేరుకున్న కోదండరాం.. రాహుల్‌ గాంధీ తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ను రాహుల్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరాంను రాహుల్ కోరగా.. పోటీకి ఆసక్తి లేదని తేల్చి ప్రొఫెసర్ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో అవగాహన, బీఆర్ఎస్‌ ను ఎదుర్కునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రయోజనల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని కోదండరాం అన్నారు. తెలంగాణ ప్రయోజనల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని జన సమితి నిర్ణయించింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ నియంత పాలన దించడానికే టీజేఎస్ ఏర్పడిందని కోదండరాం వెల్లడించారు. ఈ భేటీలో కేసీ వేణు గోపాల్, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

SB NEWS TELANGANA
బీఎస్పీ సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తాం: పోలెపల్లి రాజేష్
NLG: సాగర్ నియోజకవర్గం, హాలియా పట్టణ కేంద్రంలో ఉన్న బీఎస్పీ పార్టీ కార్యాలయంలో శుక్రవారం  నియోజకవర్గ సమీక్ష సమావేశానికి, నియోజకవర్గ అధ్యక్షుడు ముదిగొండ వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా నియోజకవర్గ ఇన్చార్జ్ పోలె పల్లి రాజేష్ హాజరై మాట్లాడుతూ..  వచ్చే సాధారణ ఎన్నికలలో సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామని అందుకుగాను నియోజకవర్గం లో 6 మండలాలలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీ అగ్రకుల పేద ప్రజలు ప్రస్తుతం ఉన్న అగ్రకుల పార్టీ ల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రమావత్ రమేష్ రాథోడ్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి కుక్కముడి ముత్యాలు , నియోజకవర్గ మహిళా కన్వీనర్ బైరాగి విజయ, అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు , గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్ , సోషల్ మీడియా ఇన్చార్జ్ మామిడి నరేందర్ , నిడమానూరు మండల మహిళా అధ్యక్షురాలు దుబ్బ జ్యోతి, బహుజన సింగర్ నగేష్ నాయక్ , వలికి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
RR: యువతకు ఉపాది కల్పనలో ప్రభుత్వం విఫలం: మల్ రెడ్డి రంగారెడ్డి
యాచారం మండలం, నందివనపర్తి గ్రామానికి చెందిన 30 మంది యువకులు వివిధ పార్టీల నుండి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. టిపిపిసి వైస్ ప్రెసిడెంట్ మల్ రెడ్డి రంగారెడ్డి, వారికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలనుండి కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిన విషయాన్నీ యువత తెలుసుకున్నదని, కాబట్టి కాంగ్రెస్ లోకి వలసలు గా వస్తున్నారని అన్నారు. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం లో యువత కు తప్పకుండా న్యాయం చేయడం జరుగుతుందని, కోరుకొని తెచ్చుకున్న తెలంగాణ లో యువతకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమం లో ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఎదుళ్ల పాండు రంగారెడ్డి, మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, ఓబీసి సెల్ చైర్మన్ సుబ్బురు పాండు, మండల పార్టీ ప్రెసిడెంట్ మస్కు నర్సింహా, సీనియర్ నాయకులు, అమృత కేసరి సాగర్, గుండ్లపల్లి ధనరాజ్ గౌడ్, కౌన్సిలర్ కాకుమాను సునీల్,మేతరి దర్శన్, గులాం అక్బర్, మోటే శ్రీశైలం,బిక్షపతి, రామ్ నాథ్ రెడ్డి, మొహమ్మద్ గౌస్, శ్రీశైలం, శ్యామ్ లాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు
NLG: చర్లగూడెం,కిష్టరాంపల్లి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలి: సిపిఎం డిమాండ్
మర్రిగూడ: పాలకులు వాగ్దానాలు తప్ప పనులు పూర్తి చేయడంలో విఫలం చెందారని, సంవత్సరాల తరబడి చర్లగూడెం కిష్టరాంపల్లి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో విఫలం చెందారని, వెంటనే భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి, ప్రాజెక్టులను పూర్తి చేయాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్ చేశారు.

ఈరోజు మర్రిగూడ మండలం సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం నీలకంఠం రాములు అధ్యక్షతన మర్రిగూడ  మండల సిపిఎం ఆఫీసులో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన పాలడుగు నాగార్జున మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు         ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చి వెంటనే పరిహారం అందించాలని కోరారు.  ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలైన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, దళిత బంధు, గృహ లక్ష్మీ లాంటి పథకాలు అమలు చేయడంలో విఫలం చెందారని ఆరోపించారు. దళిత బంధు పేర్లు ప్రతిపాదన చేయడంలో గోరంగా విఫలం చెందారని విమర్శించారు. దేశ రాజకీయాలలో బిజెపి, ప్రజలను వంచించడానికి మరొకసారి మునుగోడులో ప్రయోగం చేయ చూస్తున్నదని, ప్రజలు తిప్పికొట్టాలని విమర్శించారు.  ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలలో సిపిఎం తన సత్తా ఏమిటో చూపించనున్నట్లు తెలిపారు.

రాబోయే ఎన్నికల్లో గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేస్తూ.. ఈనెల 28న మర్రిగూడ మండల కేంద్రంలో విస్తృత స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, కొట్టం యాదయ్య, చల్లం ముత్యాలు, సత్తయ్య, చొప్పరి హనుమంతు, ఉప్పునూతల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
NLG: SVEEP పై ఆర్పీ లకు, వార్డు ఆఫీసర్లకు శిక్షణ కార్యక్రమం
నల్లగొండ: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో  మున్సిపల్ కమిషనర్ కేవీ రమణాచారి మరియు జిల్లా పరిషత్ సీఈవో ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించి, సిస్టమాటిక్ ఓటర్స్  ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం SVEEP పై ఆర్పీ లకు, వార్డు ఆఫీసర్లకు  శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణ ప్రాంతంలో ఓటు నమోదు శాతాన్ని పెంచాలని, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని, ఓటు నమోదు శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలని సందర్శించి ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, ఓటు నమోదు శాతాన్ని పెంచాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
తెలంగాణలో అన్ని అధికారాలు ఒక కుటుంబానికే పరిమితం: రాహుల్ గాంధీ
భూపాలపల్లి: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో.. రాహుల్ గాంధీ మూడు రోజులు బస్సు యాత్రలో భాగంగా రెండో రోజైన ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మీదుగా విజయభేరి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. మేడిపల్లి వద్ద పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బైక్ ర్యాలీ ద్వార కాటారం కార్నర్ సెంటర్ కి రాహుల్‌ గాంధీ చేరుకొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే అవినీతి ప్రభుత్వము ఒక తెలంగాణలోనే ఉందని, తెలంగాణలో అన్ని అధికారాలు ఒక్క కుటుంబానికే పరిమితమైందని ఆరోపించారు. ఈ ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య ఈ ఎన్నికలు జరగనున్నాయన్నారు. కెసిఆర్ అవినీతిపై ఈడి, సిబిఐ, విచారణ ఎందుకు జరపడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కెసిఆర్ అవినీతి పాలన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారని విమర్శించారు. తెలంగాణలో పేదల, రైతుల, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఏర్పాటు చేస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి మహిళలే వెన్నుముక అన్నారు.కాటారంలో ఈ జన ప్రభంజనం చూస్తుంటే కెసిఆర్ ఓటమి ఖాయమన్నారు. అంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ కే.టి.పీ.పీ గోదావరి గెస్ట్ హౌస్ లో నేడు రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు మరికొంతమంది రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

అనంతరం బస్సు యాత్ర కేటీకే 5వ గని నుండి బాంబులగడ్డ వరకు బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. కేటికే 1.వ గని వద్ద సింగరేణి కార్మికులతో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గేట్ మీటింగ్ నిర్వహించారు.అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రజలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. సింగరేణి ఒకటో గని గేట్ మీటింగ్ కి రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంతో చర్చనీయాంశంగా మారింది.
నేడు మహా చండి దేవి అలంకారంలో  విజయవాడ కనకదుర్గమ్మ
విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా.. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఈ రోజు మహా చండి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఐతే ప్రతి ఏటా 5వ రోజున స్వర్ణకవచాలంకృత దుర్గ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చేవారు. ఈ సారి మాత్రం వైదిక కమిటీ నిర్ణయం మేరకు చండి అలంకారానికి మార్చారు. దీనికి ప్రత్యేక కారణం కూడా ఉంది. ఈ ఏడాది అధిక శ్రవణం, తిథిలో హెచ్చుతగ్గుల తేడా రావటంతో ఈ ఏడాది అమ్మవారి అలంకారాలలో కూడా మార్పులు చేయాల్సి వచ్చిందని పండితులు అంటున్నారు. 70 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా, సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

దేవతల కార్యసిధ్ది, దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి , మహాకాళీ, మహా సరస్వతి, త్రిశక్తి రూపిణీగా శ్రీ మహాచండీ ఉద్బవించింది. చండీ అమ్మవారిలో అనేకమంది దేవతలు కొలువైఉన్నారు. శ్రీ మహా చండీ అమ్మవారిని ప్రార్ధిస్తే సర్వ దేవతలను ప్రార్ధించినట్లే అని పండింతులు తెలుపుతున్నారు. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభించి.. శత్రువులు మిత్రులు గా మారడం, ఏ కోర్కెల కోసం అయితే ప్రార్ధిస్తామో అవి సత్వరమే నెరవేరతాయనేది భక్తుల విశ్వాసం

నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. మొదటి మూడు రోజుల్లోనే రెండు లక్షల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇవాళ ప్రత్యేక అలంకారం కావడంతో భారీస్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.



TS: వారంలో రూ.101 కోట్లకు పైగా స్వాధీనం
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల కోడ్ విధించిన కారణంగా.. రాష్ట్రంలో వారం రోజుల్లో  నగదు, మద్యం, బంగారం స్వాధీనం విలువ.. రూ. 101 కోట్లు దాటిందని తెలంగాణ పోలీస్ అధికారులు తెలిపారు. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన ఎన్నికల నియమావళి నుండి నేడు 17వ తేదీ వరకు రూ.101 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఐతే 2018 సంవత్సరానికి గాను మొత్తం ఎలక్షన్స్ టైంలో  103 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈసారి వారం రోజుల్లోనే 2018 ఎలక్షన్ సమయంలో స్వాధీనం చేసుకున్న మొత్తానికి దాదాపుగా సమానంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగదు, విలువైన  ఆభరణాలు, మద్యం, మాదకద్రవ్యాలు  మొదలైన వాటితో సహా అన్ని సీజ్‌ లు కలిపి ఈ 8 రోజుల స్వల్ప కాలానికి రూ.101,18,17,299/- దాటాయి. కాగా అసెంబ్లీ ఎన్నికలు-2018లో మొత్తం రూ. 103 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికలు సజావుగా జరగడానికి అన్ని రాజకీయ పార్టీలు, భారత ఎన్నికల సంఘం జారీచేసిన ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని డిజిపి సూచించారు.

TS: అమరవీరుల స్థూపం వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్: నేడు మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీకి వచ్చిన రేవంత్‌ రెడ్డి అక్కడి నుండి ఒంటి గంటకు అమరవీరుల స్థూపం వద్దకు బయల్దేరారు. రేవంత్ రెడ్డి గన్‌పార్క్‌ కు చేరక ముందే పోలీసులు గన్ పార్క్ వద్ద మోహరించారు. రెండు రోజుల క్రితం కేసీఆర్‌ కు రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అందుకు అనుగుణంగా మధ్యాహ్నం ఒంటిగంటకు అమరవీరుల స్థూపం వద్దకు అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి వచ్చారు. డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా.. అని కేసీఆర్ కు.. రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. గన్ పార్క్ వద్ద ఉన్న అమర వీరుల స్థూపం వద్దకు భారీగా కార్యకర్తలతో కలిసి రావడంతో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. దాదాపు పావు గంటకు పైగా పోలీసులతో రేవంత్ రెడ్డి,  వాగ్వాదానికి దిగారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమాలను అనుమతించలేమని పోలీసులు వివరించారు. గన్‌పార్క్‌ వద్దకు వెళ్లి తీరుతామని చెప్పడంతో అందుకు పోలీసులు అంగీకరించలేదు. చివరకు పోలీసుల వాహనంలో రేవంత్‌ రెడ్డిని తరలించారు.

SB NEWS TELANGANA