/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz NLG: కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి: పల్లా దేవేందర్ రెడ్డి Mane Praveen
NLG: కాంటాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని వెంటనే పర్మినెంట్ చేయాలని, రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీలు తమ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని AITUC మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి రాజకీయ పార్టీలను డిమాండ్ చేశారు. శుక్రవారం నల్లగొండలో జరిగిన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పాలకులు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంట్రాక్ట్ కార్మికులకు తీరని అన్యాయం చేసారని ఆరోపించారు. రాబోయే ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు కాంట్రాక్టర్ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపే విధంగా వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో లో చేర్చి అమలు చేయాలని ఆయన కోరారు. కనీస వేతన చట్టాలు అమలు చేయకుండా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పేరుతో రాష్ట్రంలో కార్మికుల శ్రమ దోపిడి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ధరలకు అనుగునంగా కాంటాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సమావేశంలో ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి విశ్వనాధుల, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి ఎల్లమ్మ భాగ్యమ్మ, ఏ.పద్మ, సబిత, ఉషమ్మ, ఇంద్రమ్మ, శ్యామల, జీవిత, వీరమ్మ, మంగమ్మ, జాన్ బి, టి.పద్మ పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మర్రిగూడ: 12వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, 12వ రోజు ఆశా వర్కర్ల సమ్మె కొనసాగుతూ ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఫిక్స్డ్ వేతనం రూ. 18000/- ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్లను చిన్నచూపు చూడకుండా వారికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, కాలం సుజాత, జాజాల అనిత, కోయ మంజుల, పందుల పద్మ, ఎస్ కే సైదా బేగం, దుర్గమ్మ పల్లె కౌసల్య, బాలమణి, ఐతరాజు సునీత, వెంకటమ్మ, యాదమ్మ, పొగాకు అలివేలుమంగ, తదితరులు పాల్గొన్నారు

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
మర్రిగూడ: 12వ రోజుకు చేరిన ఆశా వర్కర్ల సమ్మె
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు, 12వ రోజు ఆశా వర్కర్ల సమ్మె కొనసాగుతూ ఉంది. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం ఆగదని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వారికి ఫిక్స్డ్ వేతనం రూ. 18000/- ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, హెల్త్ కార్డులు వారి న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం ఇకనైనా ఆలోచించి ఆశా వర్కర్లను చిన్నచూపు చూడకుండా వారికి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి జీవో విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు జంపాల వసంత, కాలం సుజాత, జాజాల అనిత, కోయ మంజుల, పందుల పద్మ, ఎస్ కే సైదా బేగం, దుర్గమ్మ పల్లె కౌసల్య, బాలమణి, ఐతరాజు సునీత, వెంకటమ్మ, యాదమ్మ, పొగాకు అలివేలుమంగ, తదితరులు పాల్గొన్నారు

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: ఎన్జీ కళాశాలకు నూతన ప్రిన్సిపాల్ గా డాక్టర్ సముద్రాల ఉపేందర్ 
నల్గొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపల్ గా పదోన్నతిపై డాక్టర్ సముద్రాల ఉపేందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. డాక్టర్ సముద్రాల ఉపేందర్  మ్యాథమెటిక్స్ అధ్యాపకుడిగా తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డిలో పనిచేశారు. డాక్టర్ ఘన శ్యామ్ ఎన్జీ కళాశాలకు ఇన్చార్జి ప్రిన్సిపల్ గా ఇప్పటివరకు కొనసాగారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మునీర్ మరియు డాక్టర్ అంతటి శ్రీనివాసులు , స్టాఫ్ క్లబ్ సెక్రటరీ చంద్రశేఖర్, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది కొత్త ప్రిన్సిపల్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్జీ కళాశాల నూతన ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ను శాలువాతో సత్కరించి సన్మానించారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
బిజెపి పార్టీని వీడుతున్నట్టు మీడియాలో   వస్తున్న వార్తల పై మునుగోడు మాజీ ఎమ్మెల్యే బిజెపి నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. పార్టీ మార్పు అనేది అవాస్తవం అని దీనిని ఖండిస్తున్నా అని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ..నా వ్యక్తిగత స్వార్థం కోసం సిద్ధాంతాలను మార్చే వ్యక్తిని కాదు. నా చుట్టూ ఉన్న సమాజం కోసం నా వంతు మంచి చేయాలనే లక్ష్యం తో రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నా. తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు ఎంపీ పదవికి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సాధనలో నా వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాను. సబ్బండ వర్గాలు  కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు నన్నెంతో కలచివేశాయి. ప్రజా తెలంగాణ బదులు ఒక కుటుంబం కోసమే తెలంగాణ అన్నట్లు పరిస్థితి దాపురించిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షలను ముందుకు నడిపించే సత్తా నరేంద్ర మోడీ, అమిత్ షా లకు ఉందని విశ్వసించి దేశ సౌభాగ్యం లో నేను కూడా భాగస్వామి కావాలని అడుగు వేశానని తెలిపారు. నేనే కాదు ఇతర బిజెపి ముఖ్య నాయకులు ఎవరు బిజెపిని వీడరని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబ పాలన అంతమొందించే దిశగా భారతీయ జనతా పార్టీ సైనికులమై ముందుకు కదులుతున్నామని అన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
Mane Praveen

హైదరాబాద్: సెకండ్ ఏఎన్ఎం లు తమను పర్మినెంట్ చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద ఏఎన్ఎం లు ధర్నా చేస్తున్న సందర్భంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమ

TS: సెకండ్ ఏఎన్ఎం లను నిర్బంధించిన పోలీసులు (వీడియో)
హైదరాబాద్: సెకండ్ ఏఎన్ఎం లు తమను పర్మినెంట్ చేయాలంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయం వద్ద ఏఎన్ఎం లు ధర్నా చేస్తున్న సందర్భంలో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు తమను అక్రమంగా నిర్బంధిస్తున్నారని ఏఎన్ఎం లు వాపోయారు. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇకనైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు.
NLG: జాతీయ స్థాయి బాలికల జూనియర్ ఫుట్బాల్ పోటీలకు ఎంపికైన 6 గురు విద్యార్థినులు
నల్గొండ: ఈనెల 6 వ తేదీ నుండి 13వ తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో జరిగే జాతీయస్థాయి జూనియర్ బాలికల ఫుట్బాల్ పోటీలకు ఉమ్మడి జిల్లా పక్షాన దివ్య, యశస్విని, శైలు, రాజేశ్వరి, సిరి, నందిని లు ఎంపికయ్యారని ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన 6 గురు క్రీడాకారినులను అసోసియేషన్ చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, అధ్యక్షులు బండారు ప్రసాద్, మరియు అసోసియేషన్ సభ్యులందరూ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ..గత 15 రోజుల నుండి తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, నిజామాబాద్ లో జరిగిన రాష్ట్ర స్థాయి సెలక్షన్లలో అత్యుత్తమ ప్రతిభను కనబరచడం ద్వారా 6 గురు క్రీడాకారినులు తెలంగాణ రాష్ట్ర ఫుట్బాల్ జట్టుకు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ జట్టులో ఉమ్మడి జిల్లా నుండి 6 గురు సెలెక్ట్ కావడం మన జిల్లాకే ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ, క్రీడాకారినులలో ఉన్న సహజ ఫుట్బాల్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి జాతీయస్థాయిలో అవకాశాలు కల్పిస్తూ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫుట్బాల్ క్రీడాకారినులకు మంచి క్రీడా భవిష్యత్తు ను అందిస్తున్న తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి మరియు TFA ప్రధాన కార్యదర్శి ఫల్గుణ కు మరియు వారి టీంకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
TS: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా: బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
NLG: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామాలకు అత్యధిక నిధులు కేటయించాలని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలివ్వడం అధికార దుర్వినియోగమేనని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గురువారం చౌటుప్పల్, నకిరేకల్ లలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మంత్రి వ్యాఖ్యలపై త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి  ఫిర్యాదు చేయనున్నట్లు ఆర్ఎస్పి తెలిపారు. పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యల వెనుక కేసీఆర్ హస్తం ఉన్నట్లు ఆరోపించారు. తక్షణమే ఎన్నికల సంఘం మంత్రిపై చర్యలు తీసుకొని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా నివారించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికార బీఆర్ఎస్ నేతలకు పోలీసులు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు కేసీఆర్ ప్రకటించే తాయిళాలకు ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని అన్నారు. మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించే చర్లగూడెం రిజర్వాయర్ భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం మీనామీషాలు లెక్కిస్తుందని, తక్షణమే రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ప్రాంతాలకు మిషన్ భగీరథ నీళ్లు అందడంలేదని ఆరోపించారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో భూసేకరణ జరుగలేదన్నారు. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ చేయలేదన్నారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువలు పట్టించుకోవడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. ఐటిపాముల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడంలో కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు. సూర్యాపేటలో వట్టే జానయ్య ను, నకిరేకల్ లో ఉన్నత విద్యావంతురాలైన మేడి ప్రియదర్శిని అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
దేవరకొండ: నియోజకవర్గ బీఎస్పీ ముఖ్య నాయకుల సమావేశం
నల్లగొండ జిల్లా, దేవరకొండ:  బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థి గా  నాన్ లోకల్ వ్యక్తి కి కేటాయించారని, నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం దయాకర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాల నుండి బహుజన్ సమాజ్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీని గ్రామ గ్రామాన తండ తండ ప్రతి గూడేలకు తీసుకెళ్లిన రామావత్ రమేష్ నాయక్ ను కాదు అని నాన్ లోకల్ వ్యక్తిని తీసుకువచ్చి ఇక్కడ టికెట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు విన్నవించుతూ..  సర్ దేవరకొండ నియోజకవర్గం లో ప్రతి ఒక్కరు కూడా నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ కేటాయించడానికి వ్యతిరేకిస్తున్నారు. గ్రామాలలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. వారి అభిప్రాయాలను, మా సూచనలను తీసుకొని మీరు పునరాలోచించి దేవరకొండ ప్రజలకు సుపరిచితుడు అయినటువంటి వ్యక్తి, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే వ్యక్తి ఎప్పుడు ప్రజలతో ఉన్నటువంటి వ్యక్తి సుమారు 2014, 2015 సం. నుండి స్వేరో నెట్వర్క్ లో కీలకంగా పనిచేసి తన మార్కును చూపించినటువంటి వ్యక్తి, కోవిడ్ టైంలో ఎందరినో అభాగ్యులను ఆదుకొన గొప్ప మానత్వం కలిగి వ్యక్తి రామావత్ రమేష్ నాయక్ కు బహుజన్ సమాజ్ పార్టీ దేవరకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నామని  వారు అన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమావత్ రమేష్ నాయక్ చింతపల్లి మండల అధ్యక్షులు ముదిగొండ మొగిలయ్య, కోండమల్లేపల్లి మండల అధ్యక్షులు గ్యార యాదగిరి, నేరేడుగొమ్ము మండల రావులపల్లి ఆంజనేయులు, చందంపేట మండల అధ్యక్షులు కేతావత్ మంగులాల్ నాయక్, పెద్దఅడిశర్లపల్లి మండల అధ్యక్షులు ధర్మాపురం శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్, కోశాధికారి మత్తంగి జాన్,నల్లా శ్రీకాంత్, గ్యార సమేల్, అనిల్, అంజి, వెంకట్, శ్రీరాములు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
లెంకలపల్లి: గ్రామపంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామ పంచాయతీ కార్మికుడు తిప్పర్తి లింగయ్య అనారోగ్యంతో బుధవారం మరణించడం జరిగింది.  గ్రామ పంచాయతీ కార్యదర్శి  గుర్రం ఉమాదేవి తో కలిసి గ్రామ సర్పంచ్ పాక నగేష్ గురువారం తిప్పర్తి లింగయ్య పార్థివ దేహాన్ని సందర్శించి, వారి సతీమణి తిప్పర్తి జయమ్మ కు ఆర్ధిక సహాయం అందజేశారు. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA