/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz YBD: భువనగిరి మండలం లో దారుణ హత్య Mane Praveen
YBD: భువనగిరి మండలం లో దారుణ హత్య
యాదాద్రి జిల్లా, భువనగిరి మండలం తుక్కాపూర్‌ గ్రామంలో గురువారం తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది. గ్రామానికి చెందిన గుంటి బసవయ్య(65), తిరుపతమ్మ(50) దంపతులపై  రాసాల రాజమల్లు అనే వ్యక్తి చేతి కొడవలితో దాడి చేశాడు. భర్త బసవయ్య అక్కడికక్కడే ఘటన స్థలంలో మృతి చెందగా, భార్య తిరుపతమ్మ ను ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రాజమల్లు ను అదుపులోకి తీసుకున్నారు. రాజమల్లు సైకో అని, గతంలో భార్యపై దాడికి పాల్పడ్డాడని గ్రామస్థులు తెలిపారు.  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. SB NEWS YADADRI DIST

SB NEWS TELANGANA
యాదాద్రి జిల్లాలో మొత్తం ఓటర్లు 4,39,100 మంది
యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం 4 లక్షల 39 వేల 100 మంది ఓటర్లు ఉన్నట్లు  జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు
యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయి. 1)భువనగిరి, 2) ఆలేరు

• భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 1,05,404 మంది పురుషులు, 1,05,958 మంది స్త్రీలు కలిపి మొత్తం 2,11,362 మంది ఓటర్లు

• ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 1,14,388 మంది పురుషులు, 1,13,332 మంది స్త్రీలు, 18 మంది థర్డ్ జెండర్స్ కలిపి మొత్తం 2,27,738 మంది ఓటర్లు • వీరిలో 18 నుండి 19 సంవత్సరముల వయస్సు గల ఓటర్లు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 7338, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 7077. మొత్తం ఓటర్లు 14,415.

• 80 సంవత్సరములు పైబడిన ఓటర్లు భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 3208 మంది, ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 3870 మంది ఉన్నారు. మొత్తం 7078 మంది ఓటర్లు.

ఇక దివ్యాంగులు భువనగిరి నియోజక వర్గానికి సంబంధించి 5346 మంది ఓటర్లు • ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 5707 మంది ఉన్నారు. మొత్తం 11,053 మంది ఓటర్లు. థర్డ్ జెండర్స్ ఓటర్లు అలేరు నియోజకవర్గానికి సంబంధించి 18 మంది ఉన్నారు. జిల్లాలో ఇవిఎం, వివిప్యాట్ మొబైల్ వాహనాల ద్వారా 406 ప్రాంతాలలో ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించామని కలెక్టర్ తెలిపారు. రెండవ ఓటరు సవరణ ముసాయిదా జాబితా 21-8-2023 నుండి రెండవ ఓటరు సవరణ తుది జాబితా తేది. 04-10-2023 నాటికి మొత్తం 11,629 మంది ఓటర్లు.

• భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి 1663 మంది పురుషులు, 2866 మంది స్త్రీలు, మొత్తం 4529 ఓటర్లు. ఆలేరు నియోజక వర్గానికి సంబంధించి 3052 మంది పురుషులు, 4038 మంది స్త్రీలు, 10 మంది థర్డ్ జెండర్స్ కలిపి మొత్తం 7100 ఓటర్లు.
మొత్తంగా జిల్లా లో 2.65 శాతం ఓటర్లు పెరిగారని కలెక్టర్ తెలిపారు.
NLG: ఉమెన్స్ కాలేజీలో మన్మాద ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం
నల్లగొండ: స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మన్మాద ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. 1991- 95 మద్యకాలంలో స్థానిక ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పని చేసి పదవీవిరమణ పొందిన PSMK మన్మాద జ్ఞాపకార్థం వారి పిల్లలు ప్రతి సంవత్సరం ఈ అవార్డు ను బహుకరిస్తున్నారు. ఈ అవార్డు క్రింద డిగ్రీ ప్రధమ , ద్వితీయ , మరియు తృతీయ సంవత్సరం BZC గ్రూప్ లో ప్రధమ,ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినులకు వరుసగా రూ. 5000/-, 4000/-, ౩౦౦౦/- చొప్పున ప్రైజ్ మనీ మరియు ప్రశంసా పత్రాన్ని అందజేస్తున్నారు. ఈ అవార్డు ను 2006 -07 విద్యా సంవత్సరం నుండి ప్రదానం చేస్తున్నారు. 2019 -20, 2020 -21, మరియు 2021 -22 విద్యా సంవత్సరాలకు గాను మొత్తం 27 మంది విద్యార్థినులు అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఆర్. నరేష్ అధ్యక్షత వహించగా విశిష్ట అతిధి గా మన్మాద కూతురు సి. రాధా రమణి మరియు ముఖ్య అతిధి గా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన శ్యామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధా రమణి మాట్లాడుతూ.. మా అమ్మ పేరు మీద అవార్డు నివ్వడం చాల సంతృప్తిగా వున్నదని, విద్యార్థులు దీన్ని ప్రేరణగా తీసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు. డాక్టర్ ఘన శ్యామ్ మాట్లాడుతూ.. విద్యార్థినులు కష్టపడి పట్టుదల తో చదివి ఇలాంటి ఆర్థిక తోడ్పాటు ఆసరాగా చేసుకొని తాము అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జంతుశాస్త్ర అధ్యాపకులు జె. స్వామి , కే.వనజ, మిస్కీన్, సి హెచ్ సమత, వైస్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి , వృక్ష శాస్త్ర విభాగాధిపతి శ్రీనివాస్ రెడ్డి, మైక్రో బయాలజీ విభాగాధిపతి దేవవాణి, రసాయన శాస్త్ర విభాగాధిపతి బి. జ్యోతి, గణితశాస్త్ర విభాగాధిపతి నర్సింహా రాజు, BSSP రాజశేఖర్, IQAC కో ఆర్డినేటర్ రవిచంద్ర, అధ్యాపకులు హాసేన, యాదగిరి, రవి, నరేష్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

SB NEWS NALGONDA DIST
TS: 20 మంది అభ్యర్ధులతో బీఎస్పీ తొలి జాబితా విడుదల

HYD: ప్రజాబలం తో రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుస్తామని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో, మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కో-ఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు రాంజీ గౌతమ్, బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 20 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించారు.

1. సిర్పూర్ (జనరల్) - డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్

2. జహీరాబాద్ (ఎస్సీ) - జంగం గోపీ

3. పెద్దపల్లి (జనరల్) - దాసరి ఉష

4. తాండూరు (జనరల్) - చంద్రశేఖర్ ముదిరాజ్

5. దేవరకొండ (ఎస్టీ)- డా.ముడావత్ వెంకటేష్ చౌహాన్

6. చొప్పదండి (ఎస్సీ) - కొంకటి శేఖర్

7. పాలేరు (జనరల్) - అల్లిక వెంకటేశ్వర్ రావు

8. నకిరేకల్ (ఎస్సీ) - మేడి ప్రియదర్శిని

9. వైరా (ఎస్టీ)- బానోత్ రాంబాబు నాయక్

10. ధర్మపురి (ఎస్సీ) - నక్క విజయ్ కుమార్

11. వనపర్తి (జనరల్) - నాగమోని చెన్న రాములు

12. మనకొండూరు (ఎస్సీ) - నిషాని రామచందర్

13. కోదాడ (జనరల్) - పిల్లిట్ల శ్రీనివాస్

14. నాగర్ కర్నూల్ (జనరల్)- కొత్తపల్లి కుమార్

15. ఖానాపూర్ (ఎస్టీ)- - బాన్సీలాల్ రాథోడ్

16. అందోల్ (ఎస్సీ) - ముప్పారపు ప్రకాష్

17. సూర్యాపేట (జనరల్) - వట్టే జానయ్య యాదవ్

18. వికారాబాద్ (ఎస్సీ) - గోర్లకాడి క్రాంతి కుమార్

19. కొత్తగూడెం (జనరల్) - ఎర్ర కామేష్

20. జుక్కల్ (ఎస్సీ) - ప్రధ్న్య కుమార్ మాధవరావు

మిగిలిన స్థానాలకు అభ్యర్థులను మరికొద్ది రోజులలో ప్రకటిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.SB NEWS TELANGANA

STREETBUZZ NEWS APP TELANGANA

NLG: నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడి ప్రియదర్శిని
తెలంగాణ రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ మంద ప్రభాకర్ మంగళవారం.. రాష్ట్రంలో 20 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటిస్తూ మొదటి జాబితాను విడుదల చేశారు.
నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేడి ప్రియదర్శిని ని.. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. మేడి ప్రియదర్శిని నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీని విస్తరింప చేయడానికి కొంతకాలం నుండి విశేష కృషి చేస్తున్నారు. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి మండల కమిటీలను, గ్రామ కమిటీలను వేసి ప్రజల్లోకి వెళ్లి బహుజన్ సమాజ్ పార్టీలోకి రావాలని ప్రజలను ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు నియోజకవర్గంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. నియోజకవర్గంలో ఆమె బలమైన కేడర్ ను ఏర్పాటు చేసుకోవడానికి ప్రజల్లోకెళ్లి బహుజన సమాజ్ పార్టీ గురించి తెలుపుతూ ప్రజాధరణ పొందుతున్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశ్నించడానికి నకిరేకల్ నియోజకవర్గ బీఎస్పీ ఇంచార్జ్ మేడి ప్రియదర్శిని ముందుంటున్నారు. ప్రజలకు మేలు జరగడానికి అధికారులతో మాట్లాడి ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.. ఇప్పటికే ఆవిడ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పలు ఉద్యమాలు చేపట్టారు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాలు సైతం చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదివిన మేడి ప్రియదర్శిని ని బహుజన్ సమాజ్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం పట్ల పలువురు నియోజకవర్గ ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
TS: రేపటి నుండి బతుకమ్మ చీరలు పంపిణీ
హైదరాబాద్‌: బతుకమ్మ చీరలు బుధవారం నుండి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే 80% చీరలు పంపిణీ కేంద్రాలకు చేరాయి. ఈ ఏడాది రూ.354 కోట్ల వ్యయంతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో 1.02 కోట్ల చీరలను సిద్ధం చేశారు. జరీతో పాటు వివిధ రంగుల కాంబినేషన్‌తో 250 డిజైన్లలో ఆకర్షణీయంగా చీరలను తయారు చేయించారు. 2017 నుంచి 2022 వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు అందించారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవానికి బతుకమ్మ పండుగ వేడుకలు ప్రతీకగా నిలిచాయి. మహిళలు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగకు, ఆడబిడ్డలందరూ కొత్త చీరలు ధరించాలనే ఉద్దేశంతో.. సీఎం కేసీఆర్‌ 2017 నుండి బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల తదితర ప్రాంతాల్లోని నేతన్నల తో వీటిని తయారు చేయిస్తున్నారు. బతుకమ్మ పండుగ సమీపిస్తుండటంతో రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ఆడపడుచులకు ఈ నెల 4 నుంచి చీరలను పంపిణీ చేసేందుకు టెస్కో, తెలంగాణ హ్యాండ్లూమ్స్‌ శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఏటా సుమారు ఒక కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తుండగా, ఈ ఏడాది కూడా 1.02 కోట్ల చీరలను తయారు చేయించారు. చౌక ధర దుకాణాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

SB NEWS TELANGANA
NLG:అంగన్వాడీల డిమాండ్స్ న్యాయమైనవే: సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం: అంగన్వాడీల డిమాండ్స్ న్యాయమైనవే సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం అన్నారు, మండల కేంద్రంలోని అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ నిర్వహిస్తున్న సమ్మె 23వ రోజుకు చేరిన సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం వారికి సంఘీభావం తెలిపి, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంగన్వాడి కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని.. హరీష్ రావు కేటీఆర్ ఉద్యమాన్ని పక్కదో పట్టించి చేతులు దులుపుకోవడానికి మాటలు చెబుతున్నారని, తక్షణమే వారిని చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఆయన ఆశ వర్కర్లకు కూడా సంఘీభావం తెలిపారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని సత్యం అన్నారు. కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, తెలంగాణ ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి చేల్లం పాండురంగారావు, ఏవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బూడిద సురేష్, కాంగ్రెస్ పార్టీ మండల కోశాధికారి కొట్టం శ్రీనివాస్, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు ఆకుల రఘుమయ్య, వెంకటయ్య, అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ శోభ, రజిత, నిర్మల, శోభారాణి, విఘ్నేశ్వరి, సువర్ణ, లక్ష్మి, విజయశ్రీ, రమాదేవి, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: అమరుల కుటుంబాలకు పెద్ద కొడుకుగా కాంగ్రెస్: పాల్వాయి స్రవంతి
మునుగోడు: రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని టీపీసీసీ అధికార ప్రతినిధి, మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి అన్నారు. అమరుల కుటుంబాలకు పెద్ద కొడుకుగా కాంగ్రెస్ ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అమరుల తల్లిదండ్రులకు 25 వేల పెన్షన్, మరియు వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తాం అని పాల్వాయి స్రవంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA
NLG: రామగిరి కార్మిక అడ్డా ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి

నల్లగొండ: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా పట్టణంలోని రామగిరి కార్మిక అడ్డా ఆధ్వర్యంలో, సోమవారం స్థానిక రామగిరి గాంధీ పార్క్ లోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ..

స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీ పోరాటం, వారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం పట్టణ ప్రగతి, అన్ని వర్గాలకు సంక్షేమం దక్కిన నాడే కార్మికులకు నిజమైన గాంధీ జయంతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేలావత్ నాగేష్ నాయక్, అడ్డా రామగిరి అధ్యక్షులు శంబురెడ్డి, రుద్రాక్ష నరసింహ, తదితరులు ఉన్నారు.

SB NEWS NALGONDA DIST

SB NEWS TELANGANA

NIA: తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల సోదాలు.. ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఏ
HYD: తెలుగు రాష్ట్రాల్లో 62 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేసింది. ఏపీ, తెలంగాణలోని పౌరహక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకుల ఇళ్లలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు సంఘాలతో సంబంధాల కేసులో ఈ సోదాలు చేశారు. సోదాలకు సంబంధించిన వివరాలతో ఎన్‌ఐఏ ప్రకటన విడుదల చేసింది. ముచింగిపట్టు మావోయిస్టు కేసులో భాగంగా తనిఖీలు చేసినట్లు పేర్కొంది. ఒకరిని అరెస్టు చేయగా.. ఆయుధాలు, నగదు, విప్లవ సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ''తెలుగు రాష్ట్రాల్లో 62 చోట్ల తనిఖీలు చేశాం. ఏపీలోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకుడు చంద్ర నర్సింహులును అరెస్టు చేశాం. తుపాకీ, 14 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నాం అని ఎన్ఐఎ తెలిపింది. కడపలో రూ.13 లక్షల నగదు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నాం. ఏపీలో 53 చోట్ల, తెలంగాణలో 9 చోట్ల సోదాలు నిర్వహించాం అని NIA తెలిపింది.
తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, హనుమకొండ, ఆదిలాబాద్‌ జిల్లాల్లో సోదాలు చేశాం.
ఏపి లో గుంటూరు, విజయవాడ, రాజమహేంద్రవరం, ప్రకాశం, ఏలూరు, విశాఖ, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూల్‌లో సోదాలు జరిగాయి.

సీఎల్‌సీ, ఏబీఎంసీ, సీఎంఎస్, కేఎన్‌పీఎస్, పీడీఎం, పీకేఎస్, పీకేఎం, ఆర్‌డబ్ల్యూఏ, హెచ్‌ఆర్‌ఎఫ్, సీఆర్‌పీపీ, ఐఏపీఎల్ నాయకుల ఇళ్లల్లో సోదాలు జరిపాం. మావోయిస్టు అనుబంధ సంఘాల నాయకులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు ఆధారాలున్నాయని ఎన్‌ఐఏ ప్రకటనలో వెల్లడించింది.