/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జిల్లా శంకర్ Miryala Kiran Kumar
తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జిల్లా శంకర్

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా జిల్లా శంకర్

తెలంగాణ ఉద్యమకారుడికి దక్కిన గౌరవం.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో శంకర్ ది కీలకపాత్ర.

 

నల్గొండ జిల్లా కనగల్లు మండలం రేగట్ట గ్రామానికి చెందిన జిల్లా శంకర్ కు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

ఉద్యమ నాయకుని గుర్తించిన సీఎం కేసీఆర్ కు, మంత్రి జగదీశ్వర్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి నల్గొండ జిల్లా శాసనసభ్యులందరికీ, కృతజ్ఞతలు తెలిపిన శంకర్.

Sb news

Sb news telangana

Sb news are national news

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్

కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇండ్లు నిర్మించాయా?: మంత్రి కేటీఆర్  

హైదరాబాద్:సెప్టెంబర్ 21

ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లను అందిస్తున్నామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

దుండిగల్ లో గురువారం రెండో విడత డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్ పాల్గొని 2,100మంది అర్హులైన పేద లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ..ఇళ్లు కట్టి చూడు.. పెళ్ళి చేసి చూడు అని పెద్దలు అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ ఇళ్లు కట్టిస్తున్నాడు..పెళ్లి చేస్తున్నాడు. ఒక్క రూపాయి చెల్లించే అవసరం లేకుండా పేదలకు ఇళ్లు అందిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక జరిగింది. కాంగ్రెస్, బిజెపి పార్టీల కార్యకర్తలకు సైతం రెండు పడకల గదుల ఇళ్లు అందిస్తున్నాం.

రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 13,300 ఇళ్లను అబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తున్నాం. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఇళ్లు నిర్మించారా అని ప్రశ్నించారు.

SB NEWS

SB NEWS TELANGANA

చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు: మంత్రి గంగుల కమలాకర్

చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు

ఉన్నత వర్గాల వారికే పరిమితమైన విద్యను నేడు బీసీలకు ఉచితంగా అందిస్తున్నాం

తల్లిదండ్రుల కలలు నెరవేర్చి...రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలి

దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోంది

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు భాగం కావాలని...శారీరకంగా బాగుంటేనే పిల్లలు మానసికంగా రాణిస్తారని స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రము లోని మహాత్మా జ్యోతి బాపులే పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేజీ నుండి పీజీ వరకు విద్యను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో కెసిఆర్ గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. తాము చదువుకునే రోజుల్లో ఎటువంటి వసతులు ఉండేవి కావని..చదవాలని తపన ఉన్నా చదివించే ప్రభుత్వాలు ఉండేవి కావని అన్నారు. ఆనాడు చదువు అంటే కేవలం ఉన్నత వర్గాల వారికే పరిమితం అనే పరిస్థితి ఉండేదని..బీసీలు కేవలం కుల వృత్తులు చేసుకొని బతకాలని అనే వారని... కానీ నేడు ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో బీసీలు అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని అన్ని వసతులు కల్పించి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. తెలంగాణ రాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 19 పాఠశాలలు మాత్రమే ఉంటే... నేడు స్వరాష్ట్రంలో కెసిఆర్ గారు 337 పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే ఉన్న కళాశాలలో పాటు మరో 33 డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్య అంటే బీసీ బిడ్డలు వెనుకబడిన పరిస్థితి నుండి ఉన్నత వర్గాల వారిని మించి ఫలితాలు వచ్చే పరిస్థితి కి రావడాన్ని చూసి బీసీ బిడ్డగా గర్విస్తున్నాను అని అన్నారు. దేశం మొత్తం నేడు తెలంగాణ వైపు చూస్తోందని, కష్టపడి చదివి తల్లి దండ్రుల కలలు నిజం చేయాలని, రాష్ట్రానికి తల్లిదండ్రులకు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మనకొండుర్ శాసన సభ్యులు రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ గోపి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డ వేణి మధు, ఎం.జే.పీ స్కూల్స్ డిప్యూటీ కమిషనర్ తిరుపతి, ఎంపిపి కేతిరెడ్డి వనిత, ప్రిన్సిపల్ విమల తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు

ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో గాంధీనగర్ లో యాదవ భవన్ లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి మాట్లాడుతూ..

కొండా లక్ష్మణ్ బాబూజీ ఐదు శతాబ్దాల తెలంగాణ ఉద్యమ యోధుడు రజాకార్ల ఉద్యమంలో క్విటీ ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకుడు వారు ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ నియోజకవర్గం లో మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా 1952 లో ఎన్నిక కాబడి తర్వాత అది ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల హైదరాబాదులో ఉంటూ మొత్తం మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రివర్యులు గా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నో సేవలు అందించిన గొప్ప నాయకుడు వారు న్యాయవాద వృత్తిలో బడుగు బలహీన వర్గాలకు ఉద్యమ నాయకులకు ఉచితంగా వాదించినటువంటి గొప్ప నాయకుడు 1969 లో తెలంగాణ కోసం ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీకి తన మంత్రి పదవిని సైతం ఇచ్చినా నాయకుడు కొండా లక్ష్మణ్ బాబుజి తెలంగాణ వచ్చేంతవరకు ఎలాంటి పదవులు తీసుకోకుండా మలిదశ ఉద్యమంలో కేసీఆర్ గారికి తన ఇంటిని నుండే ఉద్యమాన్ని ప్రారంభించిన నాయకుడు వారు బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలనే దిశగా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలు కుల సంఘాలు కు ఎంతో మందిని నాయక నాయకత్వం అందించినటువంటి గొప్ప నాయకులు.

వారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ మొత్తం పది జిల్లాలు బస్సుయాత్ర చేసి ఢిల్లీలో చలిలో నిరాహారదీక్ష చేసినటువంటి గొప్ప మహానీయుడు  కొండా లక్ష్మణ్ బాబూజీ .

అంతే కాకుండా చేనేత కుటుంబంలో జన్మించి చేనేత పితామహుడుగా పేరుపొందినటువంటి గొప్ప నాయకుడు వారి సేవలు ఎంతో ముందు చూపుతున్నటువంటి నాయకుడు కొండా లక్ష్మణ్ వారి ఆశయాల కోసం ముందుకు తీసుక పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొని ఆడారు.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అఖిల భారతీయ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు జెల్లా బిక్షం మాజీ పద్మశాలి రాష్ట్ర కార్యదర్శి ఉపాధ్యక్షులు దత్త గణేష్ పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నాటి యాదగిరి యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల వెంకన్న యాదవ్ మాజీ కౌన్సిలర్ అల్లివేణు యాదవ్ జిల్లా యువజన సంఘం అధ్యక్షులు మునాస్ ప్రసన్న జిల్లా ఉపాధ్యక్షులు బక్కతట్ల వెంకన్న యాదవ్ జిల్లా కార్యదర్శి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పగిళ్ల కృష్ణ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన సతీష్ యాదవ్ పద్మశాలి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చిలుకూరి శ్రీనివాస్ పగిళ్ల ఉజ్వల్ వల్ల కీర్తి శ్రీనివాస్ చల్లేటి రవీంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS TELANGANA

పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారు.. ఆ విషయాలను తొందరలోనే సీఎం చెబుతారు మంత్రి కేటీఆర్‌

పేదలను బ్రహ్మాండంగా ఆదుకోవాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారు.. ఆ విషయాలను తొందరలోనే సీఎం చెబుతారు మంత్రి కేటీఆర్‌

ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. దుండిగల్‌లో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

 ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. దుండిగల్‌లో రెండో విడత డబుల్‌ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. పనితో గెలవలేక.. ఇదివరకు ఏం చేసిండ్రో చెప్పలేక.. కొత్త రూపాల్లో వస్తున్నారని.. ఇష్టమొచ్చిన హామీలు ఇస్తున్నారని తెలిపారు. వాళ్లు ఇచ్చి హామీలు నమ్మి మోసపోదామా? అని ప్రశ్నించారు. ప్రజలు తొందరపడొద్దని.. ప్రజలు, రైతులపై కేసీఆర్‌ కంటే ఎక్కువ ప్రేమ ఉన్న నాయకులు భారతదేశంలో ఎవరైనా ఉన్నారా అని ఆలోచించుకోవాలని సూచించారు.

వాళ్లు చెప్పినదానికంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని కేసీఆర్‌కు కూడా ఉందని అన్నారు. తప్పకుండా వాళ్లు చెప్పినదానికంటే బ్రహ్మాండగా పేదలను ఆదుకోవాలని కేసీఆర్‌ ఆలోచన చేస్తున్నారని తెలిపారు.

ఆ విషయాలను తొందరలోనే సీఎం కేసీఆర్‌ చెబుతారని పేర్కొన్నారు. కొత్తగా రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ ఈ తొమ్మిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమంలో జోడెద్దుల మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ప్రగతి బాటలో ముందుకెళ్తున్నదని అన్నారు. ‘ ఒకప్పుడు హైదరాబాద్‌లో ఏ బస్తీకి పోయినా మంచి నీళ్ల కోసం లొల్లి. ఖైరతాబాద్‌ జలమండలి ముందు నుంచి వెళ్దామంటే భయం. ఎప్పుడు చూసినా ఖాళీ బిందెలు, ఖాళీ కుండలు పెట్టి ధర్నాలు చేసేవాళ్లు. కరెంటు గోస చెప్పక్కర్లేదు. అపార్ట్‌మెంట్‌ కిందకు వెళ్తే డీజిల్‌ కంపుతో ముక్కులు పగిలిపోయేవి. ఇన్వర్టర్లు, జనరేటర్లు లేకపోతే జ్యూస్‌ స్టాల్‌, జిరాక్స్‌ సెంటర్లు నడుపుకోలేని అవస్థ. గణేశ్‌ పండగ వచ్చిందంటే వారం రోజులు కర్ఫ్యూ కంపల్సరీ.’ ఉండేవని గుర్తుచేశారు.

ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని.. మంచినీళ్ల సవులత్‌ మంచిగైందని.. రోడ్లు బాగైనయని.. పేదలకు కడుపు నిండా పింఛన్‌ వస్తున్నదని.. డబుల్‌ బెడ్రూం ఇండ్లు వస్తున్నాయని తెలిపారు. ఇన్ని పనులు చేసుకుంటూ ముందుకుపోతున్న ఈ ప్రగతి చక్రాలను ఆపేందుకు.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల ముందు కొంతమంది వస్తున్నారని తెలిపారు. సంక్రాంతికి గంగిరెద్దు వచ్చినట్టుగా ఎన్నికల ముందు ఇష్టమొచ్చినట్టు మాటలు చెప్పే వాళ్లు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

అలాంటి వాళ్ల మాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అర్హులందరికీ డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇచ్చే బాధ్యత మాదే.. ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్‌

జీనోమ్‌ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తాం : మంత్రి కేటీఆర్‌

దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారులోని జీనోమ్‌ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ సందర్భంగా ప్రకటించారు. 

దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ శివారులోని జీనోమ్‌ వ్యాలీలో బీఎస్‌వీ కంపెనీ కొత్త యూనిట్‌కు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. భారత్‌ సీరం సంస్థకు అన్నిరకాల సహకారం అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం జీనోమ్‌ వ్యాలీలో ఫేజ్‌-3లో ఉన్నామని.. దీన్ని మరో 250 ఎకరాల్లో విస్తరిస్తామని మంత్రి కేటీఆర్‌ సందర్భంగా ప్రకటించారు.

దేశంలో ఎక్కడా లేని అనుకూలతలు తెలంగాణలో ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు.. ఎక్కడా లేనంత వేగంగా పారిశ్రామికీకరణ, ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందనడం నిర్వివాదమని పేర్కొన్నారు. మాకు కేంద్ర ప్రభుత్వానికి పడదు.. తెల్లారిలేస్తే మేమూ, వాళ్లూ తిట్టుకుంటాం.. విమర్శలు చేసుకుంటాం. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఎప్పుడు ఏదో పంచాయితీ నడుస్తూనే ఉంటుంది.. అయినప్పటికీ ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో నంబర్‌వన్‌ ఎవరని అడిగితే తెలంగాణ అని వాళ్లు కూడా ఒప్పుకునే పరిస్థితిని సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చారని అన్నారు. తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం 1,49,000 ఉండగా.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,000గా ఉందన్నారు.

సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచానికి వ్యాక్సిన్‌ రాజధానిగా హైదరాబాద్‌ మారిందని ప్రపంచంలో ఎక్కడికెళ్లినా గర్వంగా చెప్పగలనని పేర్కొన్నారు. ప్రపంచంలో తయారయ్యే వ్యాక్సిన్లలో 33 శాతం హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఏడాదికి 900 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. వచ్చే ఏడాది నుంచి 1400 కోట్ల వ్యాక్సిన్లు ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 50 శాతం మనదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి నిపుణులైన యువకులు ఉండటం, వాళ్లను చూసి కంపెనీలు ఇక్కడికి రావడం, వారికి ప్రభుత్వం సహకరించడమే కారణమని అన్నారు.

SB NEWS

SB NEWS TELANGANA

ఈ చెట్లను అస్సలు ఇంట్లో పెట్టోద్దు.. పొరపాటున పెడితే పాములకు వెల్ కమ్ చెప్పినట్లే..

ఈ చెట్లను అస్సలు ఇంట్లో పెట్టోద్దు.. పొరపాటున పెడితే పాములకు వెల్ కమ్ చెప్పినట్లే..

కొన్నిరకాల మొక్కలు , చెట్లు పాములను ఆకర్శిస్తుంటాయి. ఇవి ఇంట్లో ఉండే వీటి నుంచి వెలువడే వాసనలు పాములను ఆకర్శిస్తాయని అంటుంటారు..

 

సాధారణంగా మనలో ప్రతి ఒక్కరికి పాములంటే చచ్చేంత భయం ఉంటుంది. ఇక వర్షాకాలంలో లేదా అడవులకు దగ్గరగా ఉన్న ప్రదేశాలలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి.. వర్షంపడ్డాక చెరువులు, కుంటలు నిండుతుంటాయి. అలాంటి సమయంలో ఇళ్లలోనికి నీరు వచ్చి చేరుతుంది.

 

అప్పుడు పాములు మనన ఇళ్లలోనికి వచ్చి చేరుతుంటాయి. కొందరైతే పాముల పేర్లను ఎత్తడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూయించరు. మరికొందరు పాము అనగానే.. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంటారు.. ఇవి ముఖ్యంగా మన ఇళ్లలో ఎలుకలు, మొదలైన వాటిని తినడానికి వస్తుంటాయి.

 

ఈ క్రమంలో కొన్నిసార్లు అవి మనుషులను కాటు వేయడం జరుగుతుంది. మరికొందరు మాత్రం పాములు కన్పించగానే స్నేక్ హెల్ప్ సోసైటివారికి సమాచారం అందిస్తారు..అయితే.. ఈకింద ఇచ్చిన చెట్లను ఇంట్లో పెంచవద్దని అంటుంటారు..

 

పొరపాటున కూడా ఇంటి బయట ఈ 6 మొక్కలు నాటాడు అంటే పామును ఆహ్వానించాడని అర్ధం చేసుకోండి..కొన్ని పూల మొక్కలు పాములను ఆకర్షిస్తాయి. కాబట్టి అలాంటి మొక్కలను ఇంటి చుట్టూ నాటకూడదు. పాములను ఆకర్షించే మొక్కల జాబితా ఇక్కడ ఉంది.

 1. జాస్మిన్- ఇండియాటుడే వార్తల ప్రకారం, జాస్మిన్ వైన్స్ కుటుంబానికి చెందిన మొక్కల దగ్గర పాములు ఎక్కువగా నివసిస్తాయి. ఎందుకంటే మల్లె మొక్క చాలా దట్టమైనది మరియు పాములు దాని రంగులో తమను తాము కప్పుకుంటాయి. దాక్కున్న తర్వాత, పాము తన ఎరను సులభంగా బంధిస్తుంది. మల్లె మొక్కల దగ్గర పాములు నివసించే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

1. జాస్మిన్- ఇండియాటుడే వార్తల ప్రకారం, జాస్మిన్ వైన్స్ కుటుంబానికి చెందిన మొక్కల దగ్గర పాములు ఎక్కువగా నివసిస్తాయి. ఎందుకంటే మల్లె మొక్క చాలా దట్టమైనది మరియు పాములు దాని రంగులో తమను తాము కప్పుకుంటాయి. దాక్కున్న తర్వాత, పాము తన ఎరను సులభంగా బంధిస్తుంది. మల్లె మొక్కల దగ్గర పాములు నివసించే ప్రమాదం ఎక్కువగా ఉండటానికి ఇదే కారణం.

2. సైప్రస్ లేదా సైప్రస్ - తమ ఇంటి దగ్గర యార్డ్ ఉన్నవారు సైప్రస్ మొక్కను నాటుతారు. ఇది అలంకారమైన మొక్క. ఇది చాలా అందంగా కనిపిస్తుంది. కానీ అది కూడా చాలా దట్టమైనది. దట్టంగా ఉండడం వల్ల పాములు దాక్కుని కీటకాలను వేటాడతాయి.

3. క్లోవర్ మొక్కలు- క్లోవర్ మొక్కలు కూడా అలంకారమైన మొక్కలు. దీని ఆకులు మందంగా మరియు దట్టంగా ఉంటాయి. అవి భూమిని పూర్తిగా కప్పేస్తాయి. పాములు ఈ ఆకుల కింద హాయిగా కూర్చుని తమ ఆహారం కోసం రహస్యంగా వెతకడానికి ఇదే కారణం. కాబట్టి అనుకోకుండా ఇంట్లో క్లోవర్ ఆకులను నాటకండి.(Image credit:Pixabay.com)

4. నిమ్మ చెట్టు- నిమ్మ చెట్టు లేదా ఏదైనా సిట్రస్ చెట్టు ఎలుకలు మరియు చిన్న పక్షులకు నిలయం. ఎందుకంటే చిన్న కీటకాలు మరియు పక్షులు దాని పండ్లను తింటాయి. నిమ్మ చెట్ల చుట్టూ పాములు తిరగడానికి ఇదే కారణం. కాబట్టి మీ ఇంటి దగ్గర నిమ్మకాయను నాటకండి.(Image credit:Pixabay.com)

5. దేవదారు చెట్లు - దేవదారు వృక్షాలు ఎత్తైన ప్రదేశాలలో పెరిగినప్పటికీ, అవి మైదాన ప్రాంతాల్లో కూడా కొన్ని సంవత్సరాలు జీవించగలవు. అందుకే కొందరు తమ మైదానాల్లో దేవదారు చెట్లను నాటారు. కానీ గంధపు చెట్టులా, పాము దేవదారు చెట్టులో చుట్టుకొని ఆనందిస్తుంది. కాబట్టి ఇంటి చుట్టూ దేవదారు చెట్లను నాటకండి.

(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. SB NEWS దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)

నల్లగొండ టౌన్ లో వినాయకులను దర్శిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి జన నీరాజనాలు...

నల్లగొండ టౌన్ లో వినాయకులను దర్శిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి జన నీరాజనాలు...

నల్గొండలో గత రెండు రోజుల నుంచి ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మరియు కౌన్సిలర్లు కలిసి నల్గొండ టౌన్ లోని వినాయకులను దర్శించడం, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది.

అడుగడుగునా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి అన్ని వినాయక మండపాల దగ్గరికి ప్రజలు కుటుంబ సమేతంగా వచ్చి మహిళలు బొట్టుపెట్టి మరీ హారతిస్తున్నారు, చిన్నపిల్లలు, మహిళలు, యువకులు ఎమ్మెల్యే గారితో సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ తనకు అడుగడుగునా ప్రజలు తనపై చూపించే ప్రేమకు బానిసని అయిపోయానని, వారి ప్రేమకు దాసోహం అయిపోయానని, వారి ముఖంలో సంతోషాన్ని చూడడం కోసం మళ్లీ ఎమ్మెల్యేగా తానే గెలుస్తానని నల్గొండ మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని తెలియజేశారు.

SB NEWS

Street buzz news

Street buzz news are national news

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు భారీగా దసరా సెలవులు... ఎన్ని రోజులంటే...

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు భారీగా దసరా

సెలవులు.. ఎన్ని రోజులంటే..

ఏపీ, తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఈ సారి భారీ సంఖ్యలో రానున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

 సెలవులు.. విద్యార్థులకు ఎంతో ఆనందాన్నిచ్చే పదం. ఎక్కువగా పండగలకు సెలవులు వస్తుంటాయి. దానిలో వరుస సెలవులు వస్తే.. విద్యార్థులు ఎగిరి గంతేస్తారు. అలాంటి సందర్భం అక్టోబర్ నెలలో వచ్చేస్తోంది. ఏ తేదీన సెలవు వస్తున్నాయో పూర్తి వివరాలు తెలుసుకోండి. 

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సెలవు దినాలనేవి.. ప్రభుత్వ పాఠశాలలు, CBSE పాఠశాలలు, ICSE పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, సంబంధిత ఉపాధ్యాయులు, లెక్చరర్లు, అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది, విద్యార్థులకు అనుగుణంగా ఉంటాయి.

 తెలంగాణ ప్రభుత్వం 2023 ఏడాదికి సంబంధించిన సెలవులను ఇప్పటికే ప్రకటించింది. ఆ లెక్క ప్రకారం.. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయానికి 28 సాధారణ సెలవులు, 24 ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది.

 ఆదివారం, రెండో శనివారాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు ఎలాగో మూతపడతాయి. ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ హాలిడేస్ తోపాటుగా ఉన్నతాధికారుల అనుమతితో 5 ఆప్షనల్ సెలవులు పొందే అవకాశం కూడా ఉందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

 జూన్ 12 నుంచి ప్రారంభమైన 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి.. 1 నుంచి 10వ తరగతులకు సంబంధించిన అకడమిక్‌ క్యాలెండర్‌ను తెలంగాణ ప్రభుత్వం జూన్​ 6న విడుదల చేసిన విషయం తెలిసిందే.  

 ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేస్తాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 23, 2024న ముగియనున్నాయి. అంటే.. ఈ అకాడమిక్​ ఇయర్​లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయాల్సి ఉందన్నమాట. (ప్రతీకాత్మక చిత్రం)6/ 8

ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 229 రోజులు స్కూళ్లు పని చేస్తాయి. స్కూళ్లు జూన్‌ 12న ప్రారంభమై.. ఏప్రిల్‌ 23, 2024న ముగియనున్నాయి. అంటే.. ఈ అకాడమిక్​ ఇయర్​లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయాల్సి ఉందన్నమాట.

 2024 ఏప్రిల్‌ 24 నుంచి 2024 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఇక ఈ ఏడాది (2023) దసరా సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  ఏపీలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 17వ తేదీ ఆదివారం కావడంతో 18వ తేదీన పునఃప్రారంభమవుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)7/ 8

2024 ఏప్రిల్‌ 24 నుంచి 2024 జూన్‌ 11 వరకు అంటే 49 రోజులు వేసవి సెలవులు ఉంటాయి. ఇక ఈ ఏడాది (2023) దసరా సెలవుల విషయానికి వస్తే.. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు 13 రోజుల పాటు ఉంటాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.  ఏపీలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 16 వరకు దసరా సెలవులు ప్రకటించారు. 17వ తేదీ ఆదివారం కావడంతో 18వ తేదీన పునఃప్రారంభమవుతాయి.

 

అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ నెలలోనే ఆదివారాలు మినహా 28-09-2023 గురువారం-మిలాద్ ఉన్ నబీ(మహ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)8/ 8

అలాగే సంక్రాంతి సెలవులు 2024 జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు మొత్తం 6 రోజులు ఉంటాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. ఈ నెలలోనే ఆదివారాలు మినహా 28-09-2023 గురువారం-మిలాద్ ఉన్ నబీ(మహ్మద్ ప్రవక్త జన్మదినం) సందర్భంగా పాఠశాలలకు సెలవు ప్రకటించనున్నారు.

పారా లీగల్ వాలంటీర్ ను ప్రశంసించిన DLSA సెక్రెటరీ

పారా లీగల్ వాలంటీర్ ను ప్రశంసించిన DLSA సెక్రెటరీ

వరుస కథనాలతో కొన్ని న్యూస్ పేపర్ లో వస్తున్న వార్తలను గమనించి, స్పందించి, వారికి అండగా నిలిచింది పారా లీగల్ వాలంటీర్.

ఖమ్మం జిల్లా పెద్దమండవ గ్రామానికి చెందిన 84 సంవత్సరాల ఒక వృద్ధ మహిళ 20 సంవత్సరాల నుండి కండరాల వ్యాధితో దివ్యాంగులు మారన తన కుమారుల పోషణ కోసం పడుతున్న బాధను పత్రికలో వస్తున్న కథనాలను చూసి వారి ఇంటికి వెళ్లి వారి తరపున ఒక వినతిపత్రం రాసి దివ్యాంగుల శాఖకు వారి సమస్యలను తెలియజేసి వినతి పత్రాలు సమర్పించింది.

వారు చేసిన పనికి గాను ఖమ్మం డిస్టిక్ సివిల్ లీగల్ అత్తారింటికి సెక్రెటరీ గారు ప్రశంసించారు.

sb news

street buzz news

street buzz news are national wide news