/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేద్దాం Yadagiri Goud
కాంగ్రెస్ విజయభేరి సభను విజయవంతం చేద్దాం

•టిపిసిసి ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ బైకాని లింగం యాదవ్

మునుగోడు: టిపిసిసి ఆధ్వర్యంలో ఈనెల 17న తుక్కుగూడలో నిర్వహించే కాంగ్రెస్ పార్టీ విజయభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని టిపిసిసి అధికార ప్రతినిధి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ మెంబర్ డాక్టర్ బైకాని లింగం యాదవ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా బుధవారం డాక్టర్ లింగం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా విజయభేరి బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలంతా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేస్తున్నారని రానున్న సెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్నారు.

విజయభేరి బహిరంగ సభకు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ హాజరవుతున్నారని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు బహుమానంగా ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలపై ఉందన్నారు. విజయభేరి బహిరంగ సభలో తెలంగాణలోని ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు భరోసా కల్పించేందుకు డిక్లరేషన్ ను ప్రకటించడం జరుగుతుందన్నారు.

గందరగోళంలో ఉపాధ్యాయ బదిలీలు

స్కూల్‌ అసిస్టెంట్‌ ఎస్‌ఏ, నుంచి ప్రధానోపాధ్యాయుడు హెచ్‌ఎం,గా పదోన్నతి కల్పించే విషయంలో సీనియారిటీ తారుమారవుతోందని పలువురు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ విధానంలో తప్పులు దొర్లుతున్నాయని పలు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభమైంది. ఈ ఏడాది జనవరిలో బదిలీల కోసం 78 వేల మంది అప్లై చేసుకున్నారు. ఫిబ్రవరి 1న కాకుండా సెప్టెంబర్‌ 1కి కటాఫ్‌ పెంచడంతో మరో ఏడు వేలు వచ్చాయి. పదోన్నతుల ప్రక్రియను ఎంఈవోలు, డీఈవోల పరిధిలో నిర్వహిస్తూ, వాళ్లే సీనియారిటీని రూపొందిస్తున్నారు.

జాబితాల్లో పొరపాట్లు

జోనల్ విధానం ప్రధాన సమస్య కాగా, సీనియారిటీ జాబితాలో పొరపాట్లు దొర్లుతున్నాయని పలువురు టీచర్ల ద్వారా డీఈవోలకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. మల్టీజోన్ల పరిధిలో మాదిరి సీనియారిటీ జాబితాలను విడుదల చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్లు టీచర్లు చెబుతున్నారు.

రెండు మల్టీజోన్ల పరిధిలో 1,974 హెచ్‌ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. మూడేళ్ల సర్వీస్‌లోపు ఉన్న వారు దాదాపు వెయ్యి మందికిపైగా ఉన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల సీనియారిటీ ఉంటే బదిలీకి అవకాశం ఉండదు. కానీ ప్రమోషన్‌కు ఈ నిబంధన వర్తించదు. ప్రమోషన్‌ వచ్చాక మల్టీజోనల్‌ పరిధిలో ఉండే జిల్లాలోని పోస్టు ఎంత దూరం ఉన్నా వారువెళ్లి జాయిన్ కావాల్సిందే. ఈ కారణంగా సర్వీసు తక్కువగా ఉన్నా దాదాపు 800 మంది వరకు పదోన్నతిని తిరస్కరించే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు పాత చోటే పోస్టు ఇస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

రిటైర్‌ మెంట్ వయసులో హెచ్‌ఎం ప్రమోషన్‌ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఈ కారణంగా 1,974 పోస్టులు పూర్తిస్థాయిలో ప్రమోషన్లతో భర్తీ అయ్యే అవకాశం లేదు.

జోనల్‌ సమస్య

2022లో జోనల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు మల్టీజోనల్‌ పరిధిలోకి వస్తారు. రెండు జోన్‌లుగా విభజించి, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్‌తో పాటు కామారెడ్డి:సిద్దిపేటను మల్టీజోన్‌–1లో చేర్చారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌ ఉమ్మడి జిల్లాలతో పాటు సంగారెడ్డిని మల్టీజోన్‌–2 పరిధిలోకి తెచ్చారు.

జోనల్‌ వ్యవస్థ లేనప్పుడు జిల్లా సీనియారిటీ ప్రాతిపదికగానే పదోన్నతులు కల్పించారు. అక్కడి పోస్టులు, ఖాళీలకు అనుగుణంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ కారణంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ సర్వీసు ఉన్నవారికి పదోన్నతులు రాలేదు. కొన్ని జిల్లాల్లో తక్కువ సర్వీసు ఉన్నా హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు వచ్చాయి. ఇప్పుడు మల్టీజోన్‌ వారీగా సీనియారిటీని నమోదు చేయాలంటే పెద్ద సమస్య అవుతుంది....

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామివారి దర్శనం కోసం 22 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

మంగళవారం స్వామివారిని 70,055 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.32 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

కాగా.. ఈ నెల 17 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ అంకురార్పణ చేయనుంది...

కిమ్స్‌లో తొమ్మిదేండ్ల బాలికకు అరుదైన శాస్త్ర చికిత్స

పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్‌ బాలిక (9)కు సికింద్రాబాద్‌ కిమ్స్‌ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పించారు. వైద్య పరిభాషలో ‘కోజెనిటల్‌ డోర్సల్‌ కైఫోసిస్‌’గా పిలిచే ఈ సమస్యను సుదీర్ఘ శస్త్రచికిత్సతో విజయవంతంగా పరిష్కరించారు.

వెన్నెముకలోని ఎముకలు అసంపూర్తిగా ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని, ఎంతో సంక్లిష్టమైన ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆ బాలికకు పక్షవాతం వచ్చే ముప్పు ఉన్నదని వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్ట్‌ల అభిప్రాయాలను తీసుకుని దాదాపు 6 గంటలపాటు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో మానిటరింగ్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రోగి త్వరగా కోలుకోగలిగేలా చేసినట్టు తెలిపారు...

SBI లో 2 వేల పీవో పోస్టులు

దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎస్‌బీఐలో డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీని ద్వారా 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు.

వీటిలో ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్‌-200, జనరల్‌- 810 ఖాళీలు ఉన్నాయి. పీహెచ్‌సీ కోటాలో వీఐ-20, హెచ్‌ఐ-36, ఎల్‌డీ-20, డీ అండ్‌ ఈఈ-36 పోస్టులను కేటాయించారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

ప్రారంభ వేతనం రూ.41,960,నాలుగు అడ్వాన్స్‌ ఇంక్రిమెంట్స్‌తో ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు రాయనున్నవారు, మెడికల్‌, ఇంజినీరింగ్‌, సీఏ, కాస్ట్‌ అకౌంటెంట్‌ తదితర డిగ్రీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు 2023, ఏప్రిల్‌ 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌లో సెప్టెంబర్‌ 27లోగా దరఖాస్తు చేసుకోవాలి.

నేడే జగిత్యాల కు ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం జగిత్యాలకు రానున్నారు. చల్‌గల్‌ మామిడి మార్కెట్‌లో నిర్వహించే జగిత్యాల నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదే వేదికగా కాంగ్రెస్‌ నుంచి ముఖ్య నాయకులు గులాబీ పార్టీలో చేరనుండగా, వారికి కండువాలు కప్పి ఆహ్వానించనున్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన తర్వాత మొదటిసారిగా జిల్లాకు వస్తున్న కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నాయకులు అంతా సిద్ధం చేశారు.

ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఏర్పాట్లను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పరిశీలించి, సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు....

అంగన్‌వాడీ టీచర్ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం

రాష్ట్రంలోని అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీలు, సహాయకులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల డిమాండ్లపై కేసీఆర్‌ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్‌వాడీలకు సంబంధించి ఇప్పటికే పలు జీవోలు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం తాజా మరో జీవో జారీ చేసింది.

దేశంలో ఎక్కడాలేనివిధంగా పదవీ విమరణ సమయంలో అంగన్‌వాడీల సేవలకు గుర్తింపుగా ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ టీచర్లు, సహాయకుల్లో 50 ఏండ్లలోపు వారికి రూ.2 లక్షలు బీమా సదుపాయం, 50 ఏండ్లు దాటిన వారికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగ విరమణ వయసును 65 ఏండ్లుగా నిర్ణయించిన ప్రభుత్వం.. పదవీ విరమణ సమయంలో అంగన్‌వాడీ టీచర్లకు రూ.లక్ష, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ హెల్పర్లకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేవిధంగా ఉత్తర్వులు జారీ చేసింది.

దురదృష్టవశాత్తు సర్వీస్‌లో ఉన్న అంగన్‌వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయం కింద రూ.20 వేలు, హెల్పర్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నది. అంగన్‌వాడీల డిమాండ్లను మానవీయ దృష్టిలో పరిష్కరించిన సీఎం కేసీఆర్‌కు స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌తోపాటు యూనియన్ల ప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు...

ప్రపంచ పటంపై జీ 20 శిఖరాగ్ర సదస్సు భారత ఖ్యాతిని మరింత పెంచిందా?

గత ఏడాది జీ-20 ప్రెసిడెన్సీ బాధ్యతలను ఇండోనేషియా నుంచి భారత్ అందుకున్నప్పుడు దేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. ఇది భారత్‌కు లభించిన సువర్ణావకాశం అని కొందరు, రొటేషన్‌ ప్రకారం భారత్‌కు అధ్యక్ష బాధ్యతలు వచ్చాయి తప్ప అందులో ఏముంది గొప్ప అంటూ పెదవి విరిచినవారు మరికొందరు. ఇలా అందరూ విభిన్నరీతుల్లో తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం మాత్రం ఎవరి మాటలను లెక్కచేయకుండా.. ప్రెసిడెన్సీ ఎలా వచ్చిందన్నది కాదు.. ఆ అధ్యక్ష బాధ్యతల్లో మనం ఏం చేశామన్నదే లోకం గుర్తు పెట్టుకుంటుంది అన్నట్టుగా పనిచేసింది. దేశంలోని 60 నగరాల్లో సుమారు 200 సమావేశాలను నిర్వహించింది.

జీ-20 సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాల ప్రతినిధులకు భారత్‌లోని సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయాన్ని కలిగిన నేల ఇది అని ప్రపంచ దేశాలకు గుర్తుచేసింది. మిగతా ఖండాల్లో నాగరికత ఇంకా అభివృద్ధి చెందక ముందే ఎంతో పక్కాగా అభివృద్ధి చెందిన పట్టణ నాగరికత కల్గిన దేశం భారత్ అని వారికి తెలియజెప్పింది. ఇదంతా ఒకెత్తయితే.. వర్తమాన ప్రపంచంలో భారత్ శక్తి, సామర్థ్యాలు ఏంటన్నది ఈ జీ-20 అధ్యక్ష బాధ్యతల ద్వారా చాటి చెప్పింది. వాటిలో మచ్చుకు ఓ 5 కీలకాంశాలను గమనిస్తే..

ప్రపంచ వేదికపై పెరిగిన ఆదరణ..

ఇండియా.. భారతదేశం.. అంటే పేదరికం, వెనుకబాటుతనం, అవిద్య, అనారోగ్యం.. ఇన్నాళ్లుగా అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాలకు మన దేశంపై ఉన్న అభిప్రాయం ఇది. కానీ గత దశాబ్ద కాలంలో ఆ అభిప్రాయం పూర్తిగా మారుతూ వస్తోంది. అలాగని దేశంలో పేదరికం, వెనుక బాటుతనం నిర్మూలించేశామని అర్థం కానే కాదు. ప్రపంచానికి మన దేశంలోని బలహీనతలు మాత్రమే తెలిసే పరిస్థితి నుంచి బలాలను కూడా చాటుకునే స్థితికి చేరుకున్నాం. భారత్ ప్రపంచంలోనే అత్యధిక యువశక్తితో తొణకిసలాడుతున్న దేశం. ప్రపంచ మానవ వనరుల అవసరాలను తీర్చుతున్న దేశం. గణితం, సైన్స్, వైద్యం వంటి రంగాల్లో ప్రపంచంలో ఎక్కడ చూసినా భారతీయులే కనిపిస్తున్నారు.

కేవలం ఉద్యోగులుగానే కాదు, అసామాన్య నాయకత్వ లక్షణాలను చూపుతూ అనేక మల్టీ నేషనల్ కంపెనీలకు సీఈవోలుగా, అధిపతులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో దేశంలో అమలు చేసిన సంస్కరణలు, కొత్త పన్ను విధానాల కారణంగా ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడింది. ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా భారత్ చేరింది. కోవిడ్-19 చైనా సహా ప్రపంచ దేశాలకు శాపంగా మారితే, భారత్ అందులో నుంచి కూడా వరాన్ని వెతుక్కుంది. అప్పటి వరకు ఎన్-95 మాస్కులు, పీపీఈ కిట్ల కోసం కూడా దిగుమతులపైనే ఆధారపడ్డ పరిస్థితి నుంచి అతి తక్కువ కాలంలో దేశీయ అవసరాలు తీరిపోను ఎగుమతులు చేసే స్థితికి చేరుకుంది.

అలాగే మన కంటే వెనుకబడిన దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్లను పంపిణీ చేస్తూ ఆయా దేశాల ఆదారాభిమానాలు చూరగొంది. అనేక ప్రపంచ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే, సరిగ్గా ఇదే సమయంలో జీ-20 ప్రెసిడెన్సీ భారత్‌కు దక్కడం మరో ఎత్తు. అందివచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడంతో పాటు భారత్ తన సత్తాను చాటేందుకు అత్యుత్తమ ప్రపంచ వేదికగా మార్చుకుంది.

ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భారీ స్థాయి వేడుకలు, కార్యక్రమాలు నిర్వహించగలిగే సామర్థ్యంతో నిర్మించిన కొత్త ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ‘భారత మండపం’లో శిఖరాగ్ర సదస్సు నిర్వహించడం ఒకెత్తు.. అక్కడ యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడం మరో ఎత్తు. శిఖరాగ్ర సదస్సుకు కొద్ది రోజుల ముందే ప్రపంచంలో ఏ దేశమూ అడుగుపెట్టని చంద్రుడి దక్షిణ ధృవంపై భారత్ కాలుమోపడం ప్రపంచ పటంపై భారత ఖ్యాతిని మరింత పెంచింది....

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా టిడిపి నిరాహార దీక్షలు

రేపటి నుంచి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు చెయ్యాలని అధిష్టానం నిర్ణయించింది . రోజుకు ఒక మండలం చొప్పున అన్ని మండలాల నాయకులతో ఒక చోట నిరాహారదీక్ష శిబిరం ఏర్పాటు చేయాలని సూచించింది..

ఈ రిలే నిరాహారదీక్షలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని అనుబంధ సంఘాల వారు పాల్గొనాలి. టీడీపీలో ఉన్న వివిధ విభాగాల వారీగా పాల్గొనేలా ప్రణాళికలు. నిరాహారదీక్ష జరిగే శిబిరం వద్ద తీర్మానాల బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు, ప్రజల అభిప్రాయాలు రాయించాలి.

అన్ని మండలాల గ్రామ స్థాయి నాయకుల నుంచి ముఖ్య నాయకులందరూ పాల్గొనాలి." అని నేతలకు టీడీపీ పిలుపునిచ్చింది.........

Chandrababu Arrest: సత్యాన్ని చంపి.. ధర్మాన్ని చెరపట్టామని సంబరాలు చేసుకుంటున్నారు: లోకేశ్‌

రాజమహేంద్రవరం: సత్యాన్ని చంపేసి.. ధర్మాన్ని చెరపట్టామని వైకాపా కాలకేయులు సంబరాలు చేసుకుంటున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు..

అంతిమంగా గెలిచేది సత్యమేనన్నారు. మనం కాపాడిన ధర్మమే మనల్ని కాపాడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రగతి ప్రదాత చంద్రబాబు అక్రమ అరెస్టుని నిరసిస్తూ చేపట్టిన సామూహిక నిరాహారదీక్షలపై సైకో జగన్‌ సర్కారు విరుచుకుపడిందని మండిపడ్డారు..

శ్రీకాళహస్తిలో శాంతియుతంగా దీక్ష చేపట్టిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం నియంతృత్వమని దుయ్యబట్టారు. కుప్పం, గుడిపల్లిలోనూ తెదేపా కేడర్‌పై తప్పుడు కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా అధినేత చంద్రబాబుకి సంఘీభావం ప్రకటిస్తున్నవారిపై సైకో జగన్‌ సర్కార్‌ అప్రకటిత యుద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాదిమంది ప్రజల ఆశీస్సులతో చంద్రబాబును కడిగిన ముత్యంలా బయటకు వస్తారన్నారు. కోపతాపాలు వద్దు సంయమనం పాటించండి.. తెలుగుదేశం పార్టీ మీ వెనుక ఉందని శ్రేణులకు భరోసా ఇచ్చారు..