/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిటీలను ప్రకటించిన AICC Yadagiri Goud
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కమిటీలను ప్రకటించిన AICC

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ శనివారం కమిటీలను ప్రకటించింది. ఎన్నికల నిర్వహణ కమిటీచైర్మన్ గా దామోదర రాజనర్సింహను నియమించారు.

వంశీ చంద్ రెడ్డి, E, కొమురయ్య , జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నమిడ్ల శ్రీనివాస్ , జగన్లాల్ నాయక్, సుప్రభాత్ రావు, భారత్ చవాన్, ఫక్రుద్దీన్‌ను నియమించినట్లు ఏఐసీసీ పేర్కొంది.

మేనిఫెస్టో కమిటీ

మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మేనిఫెస్టో వైస్ చైర్మన్ గా గడ్డం ప్రసాద్‌ను నియమించారు

దామోదర రాజనర్సింహ,

పూనాల లక్ష్మై, బలరాం నాయక్,

ఆర్ దామోధర్ రెడ్డి,

జి. చిన్నా రెడ్డి,

సంభాని చంద్రశేఖర్,

పోట్ల నాగేశ్వరరావు,

రమేష్ ముదిరాజ్,

ఒబైదుల్లా కొత్వాల్,

తాహెర్ బిన్ హమ్దాన్, యర్రా శేఖర్,

జి నాగయ్యా,

జి. సుజాత,

రవళి రెడ్డి,

కె. వెంకట స్వామి,

మర్రి ఆదిత్య రెడ్డిని ఎంపిక చేశారు..

గంగులకు అసమ్మతిసెగ ❓️

కరీంనగర్‌లో వరుసగా నాలుగోసారి విజయం కోసం కష్టపడుతున్న మంత్రి గంగుల కమలాకర్‌కు సొంత పార్టీ లీడర్ల నుంచే సహాయ నిరాకరణ ఎదురవుతున్నది.

ఈసారి ఎన్నికల్లో ఆయనకు ఇదే అతి పెద్ద సమస్యగా మారుతున్నది. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ప్రస్తుత మేయర్ సునీల్ రావు వర్గం.. మంత్రి విజయం కోసం పనిచేస్తారా? అని ఓపెన్‌గానే డిస్కర్షన్ జరుగుతున్నాయి. ఒక్క పార్టీకి చెందినవారే కావడంతో స్వయంగా వారి నుంచి ఎలాంటి నెగెటివ్ రావడంలేదు.

కానీ చాపకింద నీరులా గ్రౌండ్ వర్క్ మాత్రం గంగులకు వ్యతిరేకంగా జరుగుతున్నదని టాక్. మంత్రికి సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్లు స్థానికంగా చేసిన పలు అభివృద్ది పనుల్లో నాణ్యత లేవనేది ఓపెన్ టాక్. మంత్రికి ఈ సంగతి తెలిసినా నివారణ చర్యలు తీసుకోలేదన్న విమర్శలున్నాయి. నిఘా వర్గాలు దీన్ని గుర్తించాయి.....

కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ గౌడ్ అరెస్ట్..?

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌ను శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మినార్ వద్ద తోడుదొంగలు’అనే పోస్టర్ ప్రచారం సందర్భంగా ఆయనను అరెస్టు చేసినట్లు తెలుస్తోన్నది.

గోడలకు పోస్టర్లు అతికించే సమయంలో అనుమతి లేదంటూ అక్రమంగా అరెస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా తోడు దొంగలు అనే పోస్టర్‌ను ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, డీసీసీ సమీరుల్లా తదితరులు పాల్గొన్నారు.......

కాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టుకు చంద్రబాబు

ఎన్టీఆర్ జిల్లా: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన ప్రధాన నిందితుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కాసేపట్లో ఏపీ సీఐడీ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనుంది..

ఈ నేపథ్యంలో.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం విజయవాడ సివిల్‌ కోర్టు వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

టీడీపీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో సివిల్‌ కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. దాదాపు 200 మంది పోలీస్‌ సిబ్బందిని కోర్టు వద్ద మోహరించారు. ఇప్పటికే కోర్టు బయట ఆందోళన చేస్తున్న పలువురు టీడీపీ కార్యకర్తల్ని అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుని 3వ అదనపు జిల్లా, ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి వద్ద హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది..

మహిళల భద్రతకోసం "షీ టీం"కొత్త ఫోన్ నెంబర్లు

తెలంగాణలో విద్యార్థినులు, మహిళల భద్రతకోసం ప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేపట్టింది. షి-టీమ్స్ ద్వారా ఈవ్ టీజింగ్ ని అరికట్టే ప్రయత్నాలు చేస్తోంది.

ఆ దిశగా తెలంగాణ పోలీస్ యంత్రాంగం చాలా వరకు సక్సెస్ అయింది. ఇప్పుడు కొత్తగా మరో రెండు నెెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. వీటిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని, ఫోన్ లో ఫీడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీస్ అధికారులు.

తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్‌ నెంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్‌ ద్వారా నూతన నెంబర్లను వెల్లడించింది.

ఫోన్ ద్వారా 8712656858

వాట్సప్ ద్వారా 8712656856

TS News: తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరం: కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపకపోవడం దురదృష్టకరమని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు..

ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని భాజపా 25 ఏళ్లుగా పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ, నేటి భారాస ప్రభుత్వంగానీ.. ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపారు. ఈ విషయంలో భాజపా రాజీ పడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.

గతేడాది సెప్టెంబర్ 17న 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌'లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా 'తెలంగాణ విమోచన ఉత్సవాలను' నిర్వహించామని కిషన్‌రెడ్డి తెలిపారు. 75 ఏళ్ల క్రితం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ తెలంగాణలో త్రివర్ణ పతాకం ఎగరేస్తే.. గత ఏడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్లలో ఎందుకు జరపలేదో కేసీఆర్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. మజ్లిస్ పార్టీని సంతృప్తి పరిచేందుకే కేసీఆర్ ప్రభుత్వం ఉత్సవాలను నిర్వహించడం లేదని ఆరోపించారు..

నేటి నుంచి ఆన్‌లైన్‌లో టెట్‌ హాల్‌టికెట్లు.. ఈ నెల 15న పరీక్ష

టీఎస్‌ టెట్‌ హాల్‌టికెట్లు నేడు విడుదల కానున్నాయి. నేటి నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచనున్నది. ఈనెల 15న టెట్‌ పరీక్ష జరుగునుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష నిర్వహిస్తారు.

ఫలితాలను ఈ నెల 27న వెల్లడించనున్నారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://tstet.cgg.gov.inలో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీని నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

టీఎస్‌ టెట్‌-2023 నోటిఫికేషన్‌ ఆగస్టు 1న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు జరిగింది. మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

టెట్‌కు 20 శాతం వెయిటీ ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌కు 30 మార్కులు, జనరల్‌ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్‌ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు...

G20 Summit: భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా చేసిన మోడీ

G20 Summit: జీ20 సదస్సు భారతదేశంలోని ఢిల్లీలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే కాకుండా చారిత్రాత్మకంగా మార్చేందుకు ప్రత్యేక సన్నాహాలు చేశారు..

ఢిల్లీని అలంకరించిన తీరు, వచ్చే ప్రపంచంలోని పెద్ద నాయకులందరూ భారతదేశ సంస్కృతిని గుర్తుంచుకోవాలని ప్రయత్నించారు. విదేశీ అతిథులు వచ్చే చోట భారతీయ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈవెంట్ అందాన్ని మరింత పెంచాయి. భారతదేశం గొప్ప సంస్కృతి, చారిత్రక వారసత్వం గురించి ప్రపంచానికి తెలియజేసే అవకాశం కూడా లభిస్తుంది. భారతదేశం తన సంస్కృతిని ప్రదర్శించడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదు..

వేదికైన భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. ఆ సందర్భంలో ఒడిశాకు చెందిన కోణార్క్ చక్రాన్ని ప్రదర్శించారు. ఈ కోణార్క్ చక్రం 13వ శతాబ్దంలో రాజు నరసింహదేవ్-I పాలనలో రూపొందించడింది. ఈ చక్రం భారతదేశ ప్రాచీన జ్ఞానం, నాగరికత, వాస్తుశిల్పం ఔన్నత్యానికి చిహ్నం. కోణార్క్ చక్రం భ్రమణం కాలచక్రంలో నిరంతర పురోగతి, మార్పును సూచిస్తుంది. ఇది ప్రజాస్వామ్య చక్రానికి శక్తివంతమైన చిహ్నంగా కూడా పనిచేస్తుంది. ఇది ప్రజాస్వామ్య ఆదర్శాలకు, సమాజంలో పురోగతికి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

Revanth : ఎరువుల కోసం రైతులు క్యూలో చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది..

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ఇచ్చిన ఉచిత ఎరువుల హామీ గాలికి పోయిందన్నారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలలాగే మాట ఇచ్చి వదిలేశారన్నారు..

కేసీఆర్ మాట ఇచ్చి నిలబడరని మరోసారి రుజువైందన్నారు. పైసలిచ్చి కొనుగోలు చేద్దామన్నా ఎరువులు దొరకడం లేదన్నారు. ఎరువుల కోసం రైతులు బారులు తీరారని రేవంత్ పేర్కొన్నారు.

ఎరువుల కోసం రైతులు క్యూ లో చెప్పులు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం సొంత జిల్లా లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు.యూరియా నిల్వలు పెట్టాలనే సోయి ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం ఎరువులను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురావాలని రేవంత్ కోరారు..

AP News: ఏపీలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..

విశాఖ: అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలను నిలిపివేశారు..

తెల్లవారుజామునే పలు ప్రాంతాల్లో డిపోలు, బస్టాండ్ల వద్దకు వెళ్లిన పోలీసులు.. ఆర్టీసీ బస్సులు తిరగకుండా నిలిపివేశారు. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తిరిగే అన్ని బస్సులూ నిలిచిపోయాయి. విజయవాడ నగరంలో తిరిగే సిటీ బస్సులు కదల్లేదు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నట్టుండి బస్సులను ఆపడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పోలీసుల ఆదేశాలు, సూచనల మేరకే బస్సులు రాకపోకలపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

విశాఖ ద్వారకానగర్‌ బస్ స్టేషన్‌లో ప్రయాణికులను కిందకు దించేసి బస్సులను డిపోలకు తరలించారు. టికెట్లు తీసుకున్నా ప్రయాణికులకు డబ్బులు వాపస్ ఇచ్చారు. రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులను వేచి ఉండాలని సూచిస్తున్నారు. దీంతో ఉదయాన్నే దూర ప్రాంతాలకు వెళ్లడానికి వచ్చిన వారంతా వెనుతిరిగారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు డిపోల నుంచి ఒక్క బస్సు కదలలేదు. విశాఖలో సిటీ సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కడప ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సులు ఎక్కడకక్కడ నిలిచిపోయాయి. ఉదయం ఆరు గంటల నుంచి ఒక్క బస్సును కూడా పోలీసులు బయటికి పంపలేదు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు కదల్లేదు.