/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz YBD: గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రెషర్స్ డే సెలబ్రేషన్ లో పాల్గొన్న  వెన్ రెడ్డి రాజు Mane Praveen
YBD: గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రెషర్స్ డే సెలబ్రేషన్ లో పాల్గొన్న  వెన్ రెడ్డి రాజు
యాదాద్రి జిల్లా:
చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రెషర్స్ డే సెలబ్రేషన్, తంగడిపల్లి రోడ్డు గల కలాశ్రీ ఫంక్షన్ లో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్  వెన్ రెడ్డి రాజు పాల్గొని మాట్లాడుతూ.. త్వరలోనే చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయించడం కోసం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయిస్తానని  హామీ ఇచ్చారు. జూనియర్ కళాశాలను చౌటుప్పల్ పట్టణంలోని బెస్ట్ కళాశాల గా తీర్చిదిద్దడానికి కావలసిన వసతులు కల్పించడం జరిగిందని తెలిపారు. ప్రహరీ గోడ నిర్మాణం పూర్తి చేసి, అధేవిధంగా CSR ఫండ్ కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చించి సెకండ్ ఫ్లోర్ నిర్మాణం ఏర్పాటు చేయించడం జరిగిందని తెలిపారు. పేదవారికి ఉన్నత చదువును అందించాలని ఉద్దేశంతో ప్రైవేట్ కళాశాలకు ధీటుగా జూనియర్ కళాశాలను తీర్చిదిద్ది, విద్యార్థులకు ఉన్నత చదువు అందించడంలో ఫ్యాకల్టీ కొరత ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి  ప్రతి సబ్జెక్టు కు లెక్చరర్స్ కొరత లేకుండా చర్యలు చేపట్టి, విద్యను అందించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తో మరియు జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తో మాట్లాడి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేపించి, విద్యార్థులకు ఉన్నత చదువు అందించడంలో ముఖ్యపాత్ర వహిస్తానని తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి వాళ్లకి షీల్డ్ బహుమతి అందజేశారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండమీది మల్లేష్, కొయ్యడ సైదులు, కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, తదితర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
NLG: దేవరకొండలో సెప్టెంబర్ 10న ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ సహన్నాక సమావేశం
దేవరకొండ: అక్టోబర్ 15న హైదరాబాదులో జరిగే ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ 10 వ రాష్ట్ర మహాసభలు సన్నాహాక సమావేశం విజయవంతం చేయాలని AISSD జిల్లా కన్వీనర్ మద్దిమడుగు బిక్షపతి, దేవరకొండ నియోజకవర్గ కన్వీనర్ చిట్యాల గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర కార్యవర్గం మరియు జిల్లా కార్యవర్గం  ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న ఆదివారం దేవరకొండ పట్టణంలోని ఐబి ఆఫీస్ దగ్గర గల అంబేద్కర్ గ్రంథాలయంలో  ఉదయం 10 గంటలకు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుందని మండల, గ్రామ కార్యవర్గం మరియు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ  సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.   
NLG: 'ఇద్దరు యువతుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి'
నల్గొండ: ఇద్దరు యువతుల మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్  జిల్లా అధ్యక్షుడు నజీర్ అన్నారు. పట్టణ కేంద్రంలో నజీర్ మాట్లాడుతూ.. నల్గొండ లోని మహిళ డిగ్రీ కళాశాలలో బి జెడ్ సి ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎనుగుదుల మనీషా, దంతబోయిన శివాని  పట్టణంలోని రాంనగర్ రాజీవ్ పార్కులో నిన్న గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతూ.. ఈరోజు ఇద్దరు యువతులు మృతి చెందారని, సామాజిక మాధ్యమాల్లో వారి అశ్లీల ఫోటోలు పెట్టినట్లు తెలుస్తోంది అని, దీంతో మనస్థాపం చెంది ఈ దుర్ఘటన కి పాల్పడ్డారని, వీరి మృతికి  కారణమైన వారిపై పూర్తి విచారణ చేసి కఠినంగా శిక్షించాలని  తమ సంస్థ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండీ జావిద్ అలి, రియాజ్, అబ్దుల్ మాజిద్ తదితరులు పాల్గొన్నారు.
NLG: చండూరులో కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
నల్గొండ జిల్లా: మునుగోడు నియోజకవర్గం లోని 'చండూరు' పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 'రెవెన్యూ డివిజన్' గా ప్రకటించినందుకు.. భారాసా యువజన నాయకుడు భూతరాజు మురళీ ఆధ్వర్యంలో, బుధవారం చండూరు పట్టణంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భూతరాజు మురళి మాట్లాడుతూ.. చండూరు ను రెవిన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోడి వెంకన్న, చండూరు పట్టణ అధ్యక్షుడు భూతరాజు దశరథ, యూత్ అధ్యక్షుడు వెంకన్న, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఆశా లకు కనీస వేతనం రూ. 18000 అందజేయాలని వినతిపత్రం
మర్రిగూడ: ఆశా వర్కర్స్ కు కనీస వేతనం రూ.18000/- ఇవ్వాలని, మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివిధ డిమాండ్ల పరిష్కరించాలని ఆశాలు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈసందర్బంగా ఆశా వర్కర్స్ కు కనీస వేతనం రూ.18000/- నిర్ణయించి అర్హులైన వారికి సెకండ్ ఏఎన్ఎం గా ప్రమోషన్లు కల్పించాలని సిఐటియు నల్లగొండ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య డిమాండ్ చేశారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇస్తున్న పారితోషికాలు 18,000/- లకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్వహించాలని,  అదనపు పనులు ఆశా లతో చేయించకూడదని, ఆశా ల పని భారం తగ్గించాలని, పెండింగ్లో ఉన్న కరోనా రిస్క్ అలవెన్స్ బకాయి డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ప్రమాద బీమా, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 11న ఆశ వర్కర్లు వారి సమస్యలను పరిష్కరించాలని చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు, దీనిలో ఆశా వర్కర్లు అందరు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన ఆశ వర్కర్లను కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ మర్రిగూడ మండల అధ్యక్షులు కార్యదర్శి మట్టం భాగ్యమ్మ, జంపాల వసంత, ఏర్పుల పద్మ, సైదా బేగం తదితరులు పాల్గొన్నారు.
NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపకులకు 'ఉత్తమ అధ్యాపకుల అవార్డు'
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో,  సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి మరియు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్న అధ్యాపకులు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికైనారు. హైదరాబాదులో ఈరోజు  రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, మరియు రాష్ట్ర హోం శాఖ మంత్రి అహ్మద్ అలీ ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు ప్రధానం చేశారు. నల్లగొండ లోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు డాక్టర్ అంతటి శ్రీనివాసులు (రశాయన శాస్త్రం), డాక్టర్ ఎన్. దీపిక (తెలుగు)  ఉత్తమ అధ్యాపకులు అవార్డ్ -2023 మంత్రుల చేతుల మీదుగా అవార్డులు  స్వీకరించారు. ఈ సందర్భంగా కళాశాల  ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మునీర్, ఇతర అధ్యాపకులు అవార్డులు పొందిన  అధ్యాపకులను అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు.
NLG: గురుకులంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
నల్లగొండ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల మరియు కళాశాల నిడమనూరు నందు మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రిన్సిపల్ అరుణ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి జీవితం పాఠశాల నుండే ప్రారంభమవుతుందని, పాఠశాలలో కష్టపడి చదువుకోవాలని ప్రతి ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు కోరుకుంటారని, తమ విద్యార్థులు అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలలో ఉన్నప్పుడు మా విద్యార్ది అని గొప్పగా చెప్పుకుంటారు. ఉపాధ్యాయులకు అంతకుమించిన ఆస్తి మరేమి ఉండదని అన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అవరోదించాలని, తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా  సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థలో నల్లగొండ రీజియన్ నుండి ఇంగ్లీష్ సబ్జెక్టు నందు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికై  శివరాణి ని ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు.
NLG: ఉపాధ్యాయులను సన్మానించిన తల్లిదండ్రుల సంఘం
నల్లగొండ: ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని, చండూరు గురుకుల పాఠశాల/ కళాశాలలో తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులను శాలువల తో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల సంఘం కమిటీ సభ్యులు గ్యార యాదగిరి జనరల్ సెక్రెటరీ, సుష్మ, నాగన్న, అద్దంకి కిరణ్, రాజు, శ్రీను, సత్తయ్య, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు
చండూర్ రెవిన్యూ డివిజన్ ఏర్పాటును స్వాగతించిన సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య
నల్లగొండ జిల్లా, మర్రిగూడ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చండూరు మండలాన్ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనల నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేసినందుకు సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య స్వాగతిస్తూ వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మంగళవారం మాట్లాడుతూ..  మర్రిగూడ, నాంపల్లి మండలాలు దేవరకొండ రెవెన్యూ డివిజన్ లో ఉన్నందున  రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం, తదితర ఇబ్బందులు ఏర్పడేవని, చండూరు రెవిన్యూ డివిజన్ అయితే స్థానిక ప్రజలకు దగ్గరగా ఉండి రాకపోకలకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. 

చండూరు, మునుగోడు, గట్టుప్పల్ మండలాలకు నల్గొండ రెవెన్యూ డివిజన్ గా ఉండే, ఇప్పుడు చండూరు రెవెన్యూ డివిజన్ 5 మండలాలకు అతి దగ్గర అయినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. వెనువెంటనే ఆర్డిఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, నూతన భవనాన్ని ఏర్పాటు చేసి అధికారులను, సిబ్బందిని కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన పెయింటర్ అసోసియేషన్ సభ్యులు
మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మరియు నారాయణపురం మండలాలకు చెందిన పెయింటర్ అసోసియేషన్ కు చెందిన దాదాపు150 మంది సభ్యులు,  మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.