/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి హైకోర్టు షాక్ Raghu ram reddy
వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డికి హైకోర్టు షాక్

హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది..

సోమవారం కేసు విచారణలో భాగంగా భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు ఉదయ్ కుమార్ పిటిషన్ ను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసులో ఏప్రిల్ 16న అరెస్ట్ అయిన వైఎస్ భాస్కర్ రెడ్డి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. గజ్జల ఉదయ్ కుమార్ కూడా అదే జైలులో ఉన్నారు. వైఎస్ వివేకా హత్య కేసు విచారిస్తున్న సీబీఐ అధికారులు ఈ ఏడాది ఏప్రిల్ 16న వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

పులివెందులలోని భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు. అంతకుముందే గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు వారిద్దరినీ చంచల్ గూడ జైలుకు తరలించారు. దీంతో బెయిల్ కోసం భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ విడివిడిగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకోగా.. కింది కోర్టు తిరస్కరించింది. కింది కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. ఈ అప్పీల్ పై తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. ఇరువైపుల వాదనలు విన్నాక నిందితుల బెయిల్ పిటిషన్లను తిరస్కరించింది..

Nara Lokesh: జగన్‌ పాలనలో పూర్తిగా సంక్షోభంలోకి ఆక్వా రంగం: నారా లోకేశ్‌

ఉంగుటూరు: తమ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ఆక్వా రంగాన్ని ప్రోత్సహించామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఆక్వా ఎగుమతుల్లో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలిపామని చెప్పారు..

ఉంగుటూరు నియోజకవర్గం చిననిండ్రకొలను క్యాంప్‌ సైట్‌ నుంచి 'యువగళం' 203వ రోజు పాదయాత్రను లోకేశ్‌ ప్రారంభించారు. 

స్థానిక ఆక్వా రైతులు తమ గోడును ఆయన వద్ద వెళ్లబోసుకున్నారు. 15 ఏళ్లుగా చేపల సాగు చేస్తున్నానని.. గత మూడేళ్లుగా సరైన ధర లేక సుమారు రూ.3లక్షల నష్టం వస్తోందని అప్పారావు అనే రైతులు లోకేశ్‌ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని చెప్పారు. గిట్టుబాటు ధర కల్పించి.. అవసరమైన మేరకు కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తే రైతుకు మేలు జరుగుతుందన్నారు..

అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ.. జగన్‌ పాలనలో ఆక్వా రంగం పూర్తిగా సంక్షోభంలో పడిందని విమర్శించారు. తెదేపా హయాంలో విద్యుత్‌, ఆక్వా సాగులో వాడే పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రాసెసింగ్‌ యూనిట్లకు పెద్ద ఎత్తున రాయితీలు, సబ్సిడీలు అందించామని తెలిపారు. ఆక్వా రంగానికి రూ.1.50కే యూనిట్‌ విద్యుత్‌ అందిస్తామని చెప్పి రైతులను జగన్‌ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ఉన్న అన్ని సబ్సిడీలను రద్దు చేశారన్నారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రంగాన్ని ఆదుకుంటామని.. తక్కువ ధరకే విద్యుత్‌, ఆక్వా పరికరాలను అందిస్తామని హామీ ఇచ్చారు..