/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz డీఎస్సీకి అభ్య‌ర్థులు ఏకాగ్రతతో ప్రిపేర్ కావాలి: మంత్రి సబిత ఇంద్రారెడ్డి! Yadagiri Goud
డీఎస్సీకి అభ్య‌ర్థులు ఏకాగ్రతతో ప్రిపేర్ కావాలి: మంత్రి సబిత ఇంద్రారెడ్డి!

త్వ‌ర‌లో విడుద‌ల కాబోయే డీఎస్సీ నోటిఫికేష‌న్‌కు అభ్య‌ర్థులు ప్రిపేర్ కావాల‌ని, రాజ‌కీయ నేతల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి గురువారం అధికారుల సమావేశంలో స్ప‌ష్టం చేశారు.

ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే కొంత మంది వ్యక్తులు ఆటంకం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఉపాధ్యాయ ఖాళీల భర్తీని డీఎస్సీకి అప్పగించామని మంత్రి పేర్కొన్నారు.

ఉపాధ్యాయ ఖాళీల విషయంలో తప్పుడు ఆరోపణలతో రాజకీయ లబ్ది పొందేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి స‌బిత‌ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత విద్యా రంగానికి పెద్దపీట వేస్తుండటాన్నికాంగ్రెస్ నాయకులు సహించలేకపోతున్నారని పేర్కొన్నారు.

గడచిన తొమ్మిది సంవత్సరాల్లో విద్యా రంగం అభివృద్ధి కోసం రూ. 1,87,269 కోట్లు ఖర్చు చేశామంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్ధమవుతుందని తెలిపారు.తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత 2017లో మొదటిసారి 8,972 పోస్టులను భర్తీ చేయడం కోసం డీఎస్సీ నిర్వహించడం జరిగిందని వివరించారు.

ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయ ఖాళీల్లో గెజిటెడ్ హెడ్ మాస్టర్, ప్రైమ‌రీ స్కూల్ హెడ్‌మాస్టర్ పోస్టులను, స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 5,089 ఉపాధ్యాయ పోస్టులను, 1523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌ను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద‌న్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ, నూతన నియామకాలు పూర్తయిన తర్వాత ఖాళీలు ఏమైనా ఉంటే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రము ఆవిర్భవించిన తర్వాత గురుకులాల్లో 11 ,715 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశామని, 12 ,150 బోధన, బోధనేతర సిబ్బంది నియామకాల ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, ఈ సమయంలో అన్ని పార్టీలు, అన్ని వర్గాలు సహకరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయుల ఖాళీల భర్తీని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రక్రియను అడ్డుకొనే వారి మాటలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై అనుచిత విమర్శలు చేస్తున్న నాయకుల మాటలను విశ్వసించకుండా నిరుద్యోగులు డీఎస్సీకి సిద్దమై విజయం సాధించాలని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.......

హైదరాబాద్ పోలీసుల అదుపులో పాక్ యువకుడు

పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు అక్రమంగా హైదరాబాద్‌కు రావడం కలకలం రేపుతోంది. నేపాల్ మీదుగా అతడు భారత్‌లోకి ప్రవేశించి హైదరాబాద్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడిని మొహమ్మద్ ఫయాజ్‌గా గుర్తించారు.

దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ కొన్ని నెలల కిందట హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఆమె.. గర్భం దాల్చినట్లు అతడికి తెలిపింది. భార్యను కలుసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చినట్లు పోలీసులతో ఫయాజ్ చెప్పాడు.

వీసా లేకుండా భారత్‌లోకి ఫయాజ్ అక్రమంగా వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకొని ఫయాజ్ భార్య ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం పోలీసులు అతడిని విచారిస్తున్నారు. ఫయాజ్ చెప్పిన విషయాలు నిజమా, కాదా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది...

బండి సంజయ్ అమెరికా పర్యటన

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పాటు ఆయన యూఎస్‌లోనే ఉండనున్నారు.

సెప్టెంబర్ 1 శుక్రవారం తెల్లవారుజామున బండి సంజయ్ యూఎస్‌కు పయనం కానున్నారు. శనివారం సెప్టెంబర్ 2 అట్లాంటాలో జరిగే ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ 15వ వార్షికోత్సవంలో బీజేపీ ఎంపీ ప్రసంగించనున్నారు.

వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, డల్లాస్ సహా పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ పర్యటన ఖరారైంది.

అక్కడి తెలుగు ఎన్నారై సంఘాలతో ఆయన భేటీ అవుతారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ, కళా, సాహిత్య, నాటక, సేవా, వైద్య, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సమావేశాల్లో పొల్గొననున్నారు.

అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతిక ఈ రాఖీ పండుగ: ఎమ్మెల్సీ కవిత ట్విట్

రాఖీ పండుగ అంటేనే అనుబంధాల‌కు ప్ర‌తీక‌. త‌మ సోద‌రుల‌కు తోబుట్టువులు రాఖీ క‌ట్టి.. ఈ అనుబంధం క‌ల‌కాలం కొన‌సాగాల‌ని కోరుకుంటారు. ఒకరికొక‌రు ఆశీర్వాదం తీసుకుంటారు. అంత‌టి ప్ర‌త్యేక‌మైన రాఖీ పండుగ రోజు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.

అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే నా ‘అన్న’ అంటూ మంత్రి కేటీఆర్‌తో ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.

రాఖీ పండుగ నేప‌థ్యంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలసి హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు.

ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ ట్విట్టర్‌ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. అన్నాచెల్లెళ్ల‌ అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు......

వీఓఏలకు తెలంగాణ సర్కారు గౌరవ వేతనం పెంపు!!

వీఓఏలకు తెలంగాణ సర్కారు రాఖీ పండగ వేళ గుడ్ న్యూస్ చెప్పింది. వీఓఏలకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రూ.3,900 నుంచి రూ.5వేలకు వేతనాన్ని పెంచింది. అదనపు సాయం రూ.3వేలతో కలిపి నెలకు రూ.8వేలను వీఓఏలు అందుకోనున్నారు.

ఈ మేరకు గౌరవ వేతనం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలోని 17,608 మంది వీఓఏలకు లబ్ధి చేకూరనుంది...

ప్రతిపక్షాలు పొలిటికల్ టూరిస్టులాంటివారు :హరీష్‌రావు ఎద్దేవా

నకిలీ హామీలు, వెకిలి చేష్టలు చేయడమే ప్రతిపక్షాలు పని అంటూ మంత్రి హరీష్‌రావు విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..

తెలంగాణ కన్నా మెరుగైన పాలన ఎక్కడ ఉందో చెప్పాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొలిటికల్ టూరిస్టులు వస్తుంటారంటూ ఎద్దేవా చేశారు. మొన్న అమిత్ షా, నిన్న ఖర్గే వచ్చి పేపర్ పై రాసిచ్చిన హామీలు చదివి వెళ్లారన్నారు. వారికి రాష్ట్రం పైన ఎలాంటి అవగాహన లేదని తెలిపారు.

తెలంగాణ అభివృద్ధి విషయంలో మాటలు కాకుండా చర్చకు రావాలని సవాల్ విసిరారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే 3 వ స్థానంలో ఉన్నామన్నారు. తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్‌గా ఉన్నది తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రనికే కాదు దేశానికే అన్నం పెట్టె స్థాయికి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు.

ముచ్చటగా మూడోసారి బీఆర్‌ఎస్ పార్టీ వస్తుందని... హ్యాట్రిక్ కొట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మూడవ సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రానున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ స్లోగన్‌లు చేసే పార్టీ కాదు... సొల్యూషన్ ఇచ్చే పార్టీ అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.......

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది :రేపటి నుండి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ దాదాపు ప్రారంభమైంది. కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్, రెవెన్యూ అధికారులతో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలు జారీ చేస్తున్నారు. గత రెండు రోజులుగా జిల్లా కలెక్టర్లు ఎస్పీ లతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశాలు నిర్వహించింది.

తమిళనాడు, వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎన్నికల ప్రక్రియపై పలు సూచనలు ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు సూచనలు చేస్తున్నారు.

  

సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఇంటర్ స్టేట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో రేపటి నుండి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశించారు.

వికలాంగులు, వృద్ధులు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

పోలింగ్ తేదీ కంటే మూడు రోజుల ముందే పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులు, వికలాంగుల ఇంటికే ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకువెళ్లి వారికి ఓటు వేసే అవకాశం కల్పించాలని సూచించారు....

త్వరలో 2 వేల మంది బస్‌ ఆఫీసర్ల నియామకం

నష్టాల బాట నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీఎస్‌ఆర్టీసీ మరో కొత్త కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే పల్లె వెలుగు, గ్రామీణ ప్రాంత ప్రయాణికుల కోసం పలు ఆకర్షణీయ పథకాలు అమలులో ఉన్నాయి. అలాగే, నగర ప్రాంతాల్లోనూ టీ-24, టీ-9 వంటి రాయితీలతో కూడిన టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి.

తాజాగా, నగర, గ్రామీణ ప్రాంతాలలోని కాలనీల ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల వైపు ఆకర్శించే విధంగా త్వరలో 2 వేల మంది కాలనీ, బస్‌ ఆఫీసర్లను నియమించాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం త్వరలోనే అమలులోకి రానుంది.

బస్‌ ఆఫీసర్ల నియామకం, వారి విధులకు సంబంధించి టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశారు. కాగా, నగర ప్రాంతాలలో నియమితులయ్యే కాలనీ బస్‌ ఆఫీసర్లు ఆయా నగరాల్లోని వివిధ కాలనీలలో తిరిగి టీఎస్‌ ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాలు, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.

అలాగే, నగరంలో వాణిజ్య ప్రాంతాలతో పాటు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలకు షాపింగ్‌, వినోదం వంటి కారణాలతో ప్రజలకు ఎక్కువగా వస్తుంటారు..

ఎక్కువగా సిటీ బస్‌లు అందుబాటులో ఉండకపోవడం, బస్టాపులు వీటికి దూరంగా ఉండటంతో ప్రజలు క్యాబ్‌లు, ఆటోలు వంటి ప్రైవేటు రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నారు. ఆర్టీసీ నియమించే కాలనీ బస్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన కాలనీలలో తరచూ పర్యటించి ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు, మహిళలు, విద్యార్థులు షాపింగ్‌, వినోదం కోసం ఎక్కడికి వెళుతున్నారు ? ఏ రవాణా సౌకర్యాలను వినియోగిస్తున్నారు ? వంటి సమాచారరం తెలుసుకుని వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయిస్తారు.

అలాగే, కాలనీలలో జరిగే వివాహాలు, ఇతర శుభకార్యాల సమాచారాన్ని సైతం సేకరించి సంబంధిత వ్యక్తులకు తమ బస్సులను బుక్‌ చేసుకోవాలని సూచిస్తారు.

ఒకవేళ ఆ ప్రాంతం నుంచి ప్రజల డిమాండ్‌ను బట్టి అదనపు బస్సులు సైతం ఏర్పాటయ్యేలా చూస్తారు. అలాగే, అయితే, ఆయా కాలనీలలో నివసించే డ్రైవర్లు, కండక్టర్లనే కాలనీ బస్‌ ఆఫీసర్లుగా నియమిస్తారనీ, ఆ అధికారం ఆ ప్రాంత బస్‌ డిపోల మేనేజర్లకే అప్పగించనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

ఇక విలేజి బస్‌ ఆఫీసర్లు సైతం ఇవే అంశాల ప్రాతిపదికన విధులు నిర్వర్తించనున్నారు. తమ ప్రాంత పరిధిలోని గ్రామ పెద్దలు, అసోసియేషన్లు, ఇతర ప్రముఖులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు.

కాగా, నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక బస్సులను బుక్‌ చేసిన కాలనీ, బస్‌ ఆఫీసర్లను అవార్డుల రూపంలో సన్మానించాలని సైతం టీఎస్‌ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

కాగా, టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బస్సు సర్వీసులను నడిపిస్తున్నది. ఏ సీజన్‌లో ఆ సీజన్‌కు తగిన విధంగా టికెట్ల రేట్లను తగ్గించడం, ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకుంటున్నది. దీంతో పాటే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సు సర్వీసులను సైతం నడిపిస్తున్నది.....

రేవంత్ రెడ్డి ఇంట్లో రాఖీ పండుగ సందడి

ములుగు ఎమ్మెల్యే సీతక్క గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన స్టైళ్లో తెలుగు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తెలంగాణలోని ములుగు నియోజవవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆదర్శవంతంగా సేవ చేస్తున్నారు.

ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆమె రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తుంది. అయితే నేడు రాఖీ పండుగ కావడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌కు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు.

YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ..

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం దిల్లీలో ఆమె వారిని కలిశారు..

అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు..

రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని షర్మిల చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.