/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz త్వరలో 2 వేల మంది బస్‌ ఆఫీసర్ల నియామకం Yadagiri Goud
త్వరలో 2 వేల మంది బస్‌ ఆఫీసర్ల నియామకం

నష్టాల బాట నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న టీఎస్‌ఆర్టీసీ మరో కొత్త కార్యాచరణకు సిద్ధమైంది. ఇప్పటికే పల్లె వెలుగు, గ్రామీణ ప్రాంత ప్రయాణికుల కోసం పలు ఆకర్షణీయ పథకాలు అమలులో ఉన్నాయి. అలాగే, నగర ప్రాంతాల్లోనూ టీ-24, టీ-9 వంటి రాయితీలతో కూడిన టికెట్ల విక్రయాలు జరుగుతున్నాయి.

తాజాగా, నగర, గ్రామీణ ప్రాంతాలలోని కాలనీల ప్రయాణికులను ఆర్టీసీ బస్సుల వైపు ఆకర్శించే విధంగా త్వరలో 2 వేల మంది కాలనీ, బస్‌ ఆఫీసర్లను నియమించాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నిర్ణయం త్వరలోనే అమలులోకి రానుంది.

బస్‌ ఆఫీసర్ల నియామకం, వారి విధులకు సంబంధించి టీఎస్‌ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేశారు. కాగా, నగర ప్రాంతాలలో నియమితులయ్యే కాలనీ బస్‌ ఆఫీసర్లు ఆయా నగరాల్లోని వివిధ కాలనీలలో తిరిగి టీఎస్‌ ఆర్టీసీ బస్సులలో ప్రయాణిస్తే కలిగే ప్రయోజనాలు, సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించనున్నారు.

అలాగే, నగరంలో వాణిజ్య ప్రాంతాలతో పాటు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాంతాలకు షాపింగ్‌, వినోదం వంటి కారణాలతో ప్రజలకు ఎక్కువగా వస్తుంటారు..

ఎక్కువగా సిటీ బస్‌లు అందుబాటులో ఉండకపోవడం, బస్టాపులు వీటికి దూరంగా ఉండటంతో ప్రజలు క్యాబ్‌లు, ఆటోలు వంటి ప్రైవేటు రవాణా వ్యవస్థపై ఆధారపడుతున్నారు. ఆర్టీసీ నియమించే కాలనీ బస్‌ ఆఫీసర్లు తమకు కేటాయించిన కాలనీలలో తరచూ పర్యటించి ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు, మహిళలు, విద్యార్థులు షాపింగ్‌, వినోదం కోసం ఎక్కడికి వెళుతున్నారు ? ఏ రవాణా సౌకర్యాలను వినియోగిస్తున్నారు ? వంటి సమాచారరం తెలుసుకుని వారికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయిస్తారు.

అలాగే, కాలనీలలో జరిగే వివాహాలు, ఇతర శుభకార్యాల సమాచారాన్ని సైతం సేకరించి సంబంధిత వ్యక్తులకు తమ బస్సులను బుక్‌ చేసుకోవాలని సూచిస్తారు.

ఒకవేళ ఆ ప్రాంతం నుంచి ప్రజల డిమాండ్‌ను బట్టి అదనపు బస్సులు సైతం ఏర్పాటయ్యేలా చూస్తారు. అలాగే, అయితే, ఆయా కాలనీలలో నివసించే డ్రైవర్లు, కండక్టర్లనే కాలనీ బస్‌ ఆఫీసర్లుగా నియమిస్తారనీ, ఆ అధికారం ఆ ప్రాంత బస్‌ డిపోల మేనేజర్లకే అప్పగించనున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

ఇక విలేజి బస్‌ ఆఫీసర్లు సైతం ఇవే అంశాల ప్రాతిపదికన విధులు నిర్వర్తించనున్నారు. తమ ప్రాంత పరిధిలోని గ్రామ పెద్దలు, అసోసియేషన్లు, ఇతర ప్రముఖులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ వారి అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నారు.

కాగా, నగర, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రత్యేక బస్సులను బుక్‌ చేసిన కాలనీ, బస్‌ ఆఫీసర్లను అవార్డుల రూపంలో సన్మానించాలని సైతం టీఎస్‌ ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు.

కాగా, టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల గ్రామాల్లో బస్సు సర్వీసులను నడిపిస్తున్నది. ఏ సీజన్‌లో ఆ సీజన్‌కు తగిన విధంగా టికెట్ల రేట్లను తగ్గించడం, ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి ఆదాయం పెంచుకుంటున్నది. దీంతో పాటే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సు సర్వీసులను సైతం నడిపిస్తున్నది.....

రేవంత్ రెడ్డి ఇంట్లో రాఖీ పండుగ సందడి

ములుగు ఎమ్మెల్యే సీతక్క గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన స్టైళ్లో తెలుగు రాజకీయాల్లో రాణిస్తున్నారు. తెలంగాణలోని ములుగు నియోజవవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఆదర్శవంతంగా సేవ చేస్తున్నారు.

ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే నియోజకవర్గ ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని పలువురు అభిప్రాయపడుతుంటారు. ఆమె రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపారు.

ప్రస్తుతం కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలిగా వ్యవహరిస్తుంది. అయితే నేడు రాఖీ పండుగ కావడంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంట్లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌కు రాఖీ కట్టి స్వీట్స్ తినిపించారు.

YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్‌ షర్మిల భేటీ..

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతో వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల భేటీ అయ్యారు. గురువారం ఉదయం దిల్లీలో ఆమె వారిని కలిశారు..

అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సంబంధించిన అంశాలపైనే సోనియా, రాహుల్‌తో తాను చర్చించినట్లు తెలిపారు..

రాష్ట్ర ప్రజలకు మేలు చేసే దిశగా తాను నిరంతరం పనిచేస్తుంటానని షర్మిల చెప్పారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వైతెపాను కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే ప్రచారం నేపథ్యంలో సోనియా, రాహుల్‌తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

కాంగ్రెస్ చేతిలోకి వైఎస్ఆర్ టీపీ పార్టీ ❓️

షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీతో ఆమె గురువారం ఢిల్లీలో భేటీ కానున్నారు.

అనంతరం విలీనంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ అగ్ర నేతలతో చర్చలు జరిపేందుకు బుధవారం ఆమె తన భర్త అనిల్‌తో కలిసి హస్తిన చేరుకున్నారు. వైఎ్‌సఆర్‌టీపీ నేతలకు గానీ, భద్రతాసిబ్బందికి గానీ సమాచారం ఇవ్వకుండా వెళ్లినట్లు సమాచారం. సెప్టెంబరు 2న వైఎస్‌ వర్ధంతి ఉన్నందున ఈలోపే విలీనంపై కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తుందని ఆమె ఆశిస్తున్నట్లు తెలిసింది.

సోనియాతో భేటీ తర్వాత విలీనం ఖరారవుతుందని.. ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగిస్తారని విశ్వసనీయ వర్గాలు కూడా తెలిపాయి. జగనన్న వదిలిన బాణాన్ని జగన్‌పైనే ప్రయోగించబోతున్నారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తొలుత తెలంగాణలో ఆమె సేవలు వినియోగించుకోవాలని కాంగ్రెస్‌ భావించినా.. ఆంధ్రప్రదేశ్‌లో అయితేనే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని, ఆమె ద్వారా జగన్‌ను కట్టడి చేయొచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో బీజేపీ కూడా బలహీనంగా ఉన్నందున కాంగ్రెస్‌ పుంజుకోవడానికి షర్మిల చేరిక లాభిస్తుందని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, అన్న జగన్‌ జైలులో ఉండగా.. ఆయన వదిలిన బాణంగా రాష్ట్రమంతటా తిరిగి వైసీపీని బలోపేతం చేసిన షర్మిల.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాలుపంచుకున్నారు.

అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచాక తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. ఆస్తిలో వాటా ఇచ్చేందుకూ జగన్‌ నిరాకరించడంతో.. ప్రత్యామ్నాయం వైపు మళ్లారు.

తెలంగాణలో వైఎస్ఆర్‌ టీపీ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర కూడా చేపట్టారు. తొలుత తెలంగాణకే పరిమితమైన ఆమె.. తల్లి విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్షురాలు పదవి నుంచి జగన్‌ నిర్దాక్షిణ్యంగా తొలగించిన దరిమిలా ఏపీ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలిసింది.

ఇదే సమయంలో వైఎస్‌ కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ద్వారా ఆమెను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయనతోను, ఆ పార్టీ నేతలతోను పలు దఫాలు చర్చలు జరిపిన ఆమె.. రాహుల్‌గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. కాంగ్రెస్‌లో పార్టీ విలీనానికి ఇది సంకేతమని ఆనాడే వార్త లు వెలువడ్డాయి.

గురువారం సోనియాతో సమావేశం తర్వా త విలీన ప్రక్రియ పూర్తిగా కొలిక్కి వస్తుందని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి.......

తెలంగాణ ప్రజలకు అలర్ట్.. పెరుగనున్న ఉష్ణోగ్రతలు !

తెలంగాణ మరింత ఉష్ణోగ్రతలు పెరుగనున్నాయి. తెలంగాణలో గత కొన్ని రోజులుగా వరుణుడి జాడ కనిపించడం లేదు. ఈసారి నైరుతి రుతుపవనాల రాకే ఆలస్యం కాగా, జూన్ నెలలో సరిగ్గా వర్షాలు కురవలేదు..

దీంతో ఆ నెల లోటు వర్షపాతం నమోదయింది. ఇక జూలై చివరి వారంలో వర్షాలు దంచి కొట్టాయి.

తెలంగాణ రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. భారీ వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయారు. జూలై నెలలో రికార్డు వర్షపాతం నమోదయింది. ఇక ఆగస్టు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగాయి. వేడి గాలులు, విపరీతమైన ఉక్కపోత ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. వర్షాలు లేక అన్నదాతలు తలలు పట్టుకుం టున్నారు. అయితే… మరో రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పెరుగనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది..

Srisailam: శ్రీశైలంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 15 దుకాణాలు!

నంద్యాల: శ్రీశైలంలోని లలితాంబికా దుకాణంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం అర్ధరాత్రి దాటాక ఎల్‌ బ్లాక్‌ సముదాయంలో మంటలు వ్యాపించాయి. ప్రమాదం కారణంగా సుమారు 15 దుకాణాలు కాలిబూడిదయ్యాయి..

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకొస్తున్నారు.

శ్రీశైలం దేవస్థానం ఈవో లవన్న ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. షార్ట్‌ సర్య్కూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు సమాచారం..

Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి రేవ్‌ పార్టీ భగ్నం..

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో రేవ్‌ పార్టీని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) అధికారులు భగ్నం చేశారు. మాదాపూర్‌ విఠల్‌రావు నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో రేవ్‌ పార్టీని నిర్వహిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించారు..

ఇద్దరు యువతులు, ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పార్టీలో పాల్గొన్న వారి నుంచి టీఎస్‌ న్యాబ్‌ అధికారులు భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అనంతరం నిందితులను మాదాపూర్‌ పోలీసులకు అప్పగించారు..

తెలంగాణ ప్రజలకురాఖీ పండుగ శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్య‌మంత్రి కేసీఆర్

తోడబుట్టిన అన్నాచెల్లెళ్లు, అక్కాత‌మ్ముళ్ల‌ నడుమ అనురాగ బంధానికి ప్రతీకగా నిలిచే ర‌క్షా బంధన్రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

కుటుంబ బంధాలు, రక్త సంబంధాల్లోని ఔన్నత్యాన్ని, మానవ సంబంధాల్లోని పరమార్థాన్ని రాఖీ పండుగ తెలియజేస్తుంద‌న్నారు. భారతీయ సంస్కృతికి, జీవనతాత్వికతకు రాఖీ పండుగ వేదికగా నిలుస్తుందని సీఎం పేర్కొన్నారు.

రాఖీని రక్షా బంధంగా భావించే ప్రత్యేక సంస్కృతి మనదని తెలిపారు. అన్నాదమ్ముళ్లకు రాఖీలు కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలువాలని అక్కాచెల్లెళ్లు ఆకాంక్షిస్తారని సీఎం పేర్కొన్నారు.

మానవ సంబంధాలను, కుటుంబ అనుబంధాలను మరింతగా బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ కొనసాగుతున్నదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. మానవీయ పాలనే లక్ష్యంగా అమలు చేస్తున్న పలు పథకాలు వృద్దులు తదితర రక్షణ అవసరమైన వర్గాలకు భరోసాను అందిస్తున్నాయన్నారు.

సంపదను సృష్టించి సకలజనులకు పంచుతూ కొనసాగుతున్న ప్రగతి ప్రస్థానం రాష్ట్ర ప్రజల నడుమ సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తూ, సహోదర భావాన్ని పెంచుతున్నదని సీఎం అన్నారు .

అనేక పథకాలను అమలు చేస్తూ, మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భరోసానందిస్తూ, పెద్దన్నలా రక్షణగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు.

ఫలితంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోని మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ, విజయ ప్రస్థానాన్ని సాగిస్తూ, దేశానికే దిక్సూచిగా నిలిచారని అన్నారు. రాఖీ పండుగను ప్రజలంతా ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు........

Amitabh Bachchan: అమితాబ్‌ ఇంటికి వెళ్లి రాఖీ కట్టిన సీఎం మమత..

ముంబయి: పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముంబయికి చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో జరగనున్న విపక్ష కూటమి 'ఇండియా' కీలక భేటీలో పాల్గొనేందుకు బుధవారం నగరానికి చేరుకున్న ఆమె..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ను కలిశారు. రక్షాబంధన్‌ పర్వదినం వేళ జుహూలో ఉన్న ఆయన నివాసానికి వెళ్లిన దీదీ.. అమితాబ్‌కు రాఖీ కట్టారు. ముంబయి పర్యటన నేపథ్యంలో దీదీని అమితాబ్‌ తేనీటి విందుకు ఆహ్వానించినట్టు సమాచారం. అమితాబ్‌ కుటుంబ సభ్యులతో కాసేపు ముచ్చటించిన అనంతరం దీదీ మీడియాతో మాట్లాడారు..

అమితాబ్‌ నివాసానికి రావడం తనకు చాలా సంతోషంగా ఉందని సీఎం మమత అన్నారు. ఆయను రాఖీ కట్టినట్టు వెల్లడించారు. అమితాబ్‌ కుటుంబం అంటే తనకు అమితమైన ఇష్టమన్న దీదీ.. ఆ కుటుంబం దేశానికి ఎంతో సేవ చేసిందని, దేశంలోనే నంబర్‌ వన్‌ అని వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో దుర్గా పూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి వారిని ఆహ్వానించినట్టు తెలిపారు. గతేడాది కోల్‌కతా అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్‌ ప్రారంభోత్సవానికి అమితాబ్‌ హాజరు కాగా.. సినీ పరిశ్రమలో ఆయన అందించిన సేవలను గుర్తించి కేంద్రం ఆయనకు భారతరత్న అవార్డుతో సత్కరించాలని దీదీ డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే..

టీఎస్ సెట్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర అర్హ‌త ప‌రీక్షకు ద‌ర‌ఖాస్తుల గ‌డువును పొడిగిస్తున్న‌ట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్ల‌డించారు. టీఎస్ సెట్ ద‌ర‌ఖాస్తుల ప్ర‌క్రియ ఆగ‌స్టు 29తో ముగియ‌గా, అభ్య‌ర్థుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును సెప్టెంబ‌ర్ 4వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, డిగ్రీ కాలేజీ లెక్చ‌ర‌ర్ల ఉద్యోగాల‌కు అర్హ‌త కోసం టీఎస్ సెట్ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

రూ. 1500 ఆల‌స్య రుసుంతో సెప్టెంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు, రూ. 2 వేల ఆల‌స్య రుసుంతో సెప్టెంబ‌ర్ 18 వ‌ర‌కు, రూ. 3 వేల ఆల‌స్య రుసుంతో సెప్టెంబ‌ర్ 24వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రిజిస్ట్రేష‌న్ ఫీజు ఆల‌స్య రుసుంకు అద‌నం. సెప్టెంబ‌ర్ 26, 27 తేదీల్లో ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

అక్టోబ‌ర్ 20 నుంచి అభ్య‌ర్థులు త‌మ హాల్ టికెట్ల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చు. అక్టోబ‌ర్ 28, 29, 30 తేదీల్లో ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్, వ‌రంగ‌ల్, క‌ర్నూల్, క‌రీంన‌గ‌ర్, తిరుప‌తి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, మెద‌క్, వైజాగ్, న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి జిల్లాల్లో ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల కోసం www.telanganaset.org అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు...