/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Yuvagalam: లోకేష్‌ పాదయాత్రకు రేపటితో 200 రోజులు.. Yadagiri Goud
Yuvagalam: లోకేష్‌ పాదయాత్రకు రేపటితో 200 రోజులు..

లోకేష్‌ పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. జన నీరాజనాల మధ్య విజయవంతంగా నడుస్తోంది. లోకేష్‌ పాదయాత్ర రేపటితో 200వ రోజుకు చేరుకుంటోంది. రికార్డులను బద్దలుకొడుతూ లోకేష్‌ పాదయాత్ర ముందుకెళ్తోంది..

లోకేష్‌ పాదయాత్ర డబుల్ సెంచరీ రోజున టీడీపీ భారీ కార్యక్రమాలు చేపడుతోంది. పార్టీ ముఖ్య నేతలు పాదయాత్రలో పాల్గొననున్నారు.

జనవరి 27న కుప్పంలో వరదరాజస్వామి ఆశీస్సులతో ప్రారంభమైన లోకేష్‌ పాదయాత్ర జైత్రయాత్రను తలపించేలా సాగుతోంది. ఇప్పటి వరకు 9 ఉమ్మడి జిల్లాల్లో పాదయాత్ర పూర్తయ్యింది. 77 నియోజకవర్గాల్లో 2 వేల 710 కిలోమీటర్ల మేర నారా లోకేష్‌ నడిచారు. ఎండ, వాన, అలసట ఇలాంటి వాటిని పట్టించుకోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా లోకేష్‌ యాత్ర కొనసాగిస్తున్నారు. అనివార్యమైన సందర్భాల్లో మినహా ఇప్పటివరకు విరామం లేకుండా పాదయాత్ర సాగుతోంది. అంచనాలను తలకిందులు చేస్తూ.. అధికార పార్టీకి కంటిమీద కునుకు లేకుండా లోకేష్‌ పాదయాత్ర ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు..

199 రోజుల పాదయాత్రలో 77 నియోజకవర్గాలు, 185 మండలాలు, 1675 గ్రామాల మీదుగా లోకేష్‌ పాదయాత్ర సాగింది. ఇప్పటివరకు 64 బహిరంగ సభలకు లోకేష్‌ హాజరయ్యారు. 132 ముఖాముఖి సమావేశాలు, 8రచ్చబండ సభలు, 10 ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు బలయిన బాధితులను ఓదారుస్తూ.. దగాపడ్డ ప్రజలకు భరోసా ఇస్తూ.. టీడీపీ చేసిన అభివృద్ధి వివరిస్తూ..అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ లోకేష్‌ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. కంటగింపుతో అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. సంయమనంతో అడ్డుకుంటూ ముందుకు సాగుతున్నారు. పదునైన మాటలతో.. ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ లోకేష్‌ ప్రసంగాలు ఉంటున్నాయి. విరామ సమయంలో నేతలు, కార్యకర్తలను కలుస్తున్నారు. పాదయాత్రలో లోకేష్‌లో సరికొత్త రాజకీయ నాయకుడు కనపడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు..

పక్కా ప్లాన్‌ ప్రకారమే కత్తితో దాడి: న్యాయవాది వెంకటేశ్వర్లు

ప్లాన్‌ ప్రకారమే సీఎం జగన్‌పై కత్తితో దాడి

హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం

ఎన్‌ఐఏకి రికార్డులు ఇవ్వని సిట్‌

నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర

విజయవాడ: విశాఖ ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కేసుపై సీఎం తరఫు న్యాయవాది వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వెల్లడించారు.

కాగా, సీఎం జగన్‌ తరఫు న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నంపై కేసులో ఎన్‌ఐఏ 39 మంది సాక్షులను విచారించారు. ఇప్పటివరకు ఎన్‌ఐఏకి సిట్‌ వివరాలు అప్పగించలేదు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉంది. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైంది. శ్రీనివాస్‌ పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసింది. నాటి డీజీపీ ఎన్‌ఐఏకి రికార్డ్‌ చేయవద్దని సిట్‌కి ఆదేశాలు ఇచ్చారు. రికార్డులు ఎన్‌ఐఏకి పోలీసులు మొదట అప్పగించలేదు..

ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌ ఎలా తిరిగాడు?..

ఎయిర్‌పోర్టు అథారిటీకి శ్రీనివాస్‌ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారు. శ్రీనివాస్‌ది ఎయిర్‌పోర్టులో ఇల్లీగల్‌ ఎంట్రీ. కత్తితో ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌ ఎలా తిరిగాడు?. శ్రీనివాస్‌పై కేసు ఉన్నందుకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడు. ఎయిర్‌పోర్టులో ఉద్యోగం చేసే నాటికి శ్రీనివాస్‌పై కేసు పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్‌ వేశారు.

ప్లాన్‌ ప్రకారమే దాడి..

సీఎం జగన్‌పై పక్కా ప్లాన్‌ ప్రకారమే దాడి జరిగింది. సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ కూడా చెప్పింది. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. హత్యాయత్నంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో శ్రీనివాస్‌ నేరాన్ని ఒప్పుకున్నాడు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు..

YSR Rythu Bharosa: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(గురువారం) కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు.

వివరాల ప్రకారం.. సీఎం జగన్‌ ఏపీలోని కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదును సీఎం జగన్‌ జమ చేయనున్నారు.

కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు..

అంతర్జాతీయ గ్లోబల్ సంస్థ నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం శుభపరిణామం: ఎమ్మెల్సీ కవిత

అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ నిజామాబాదులో కంపెనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.ఐటీ అభివృద్ధి ప్రారంభిం చిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు.

ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటి హబ్ లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా..తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3,000 మంది పనిచేస్తున్నారు.

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఈనెల మొదటి వారంలో ఆ సంస్థ ప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలుసుకుని చర్చలు జరిపారు.పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటి హబ్ ను ఇటీవల సందర్శించారు.

అనంతరం కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలిఫోర్నియాలోని వారి ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది. కల్వకుంట్ల కవితతో సమావేశమైన కేవలం 29 రోజుల్లోనే సంస్థ ఏర్పాటు కావడం విశేషం.

ఆదిత్య L-1 మిషన్ కు సర్వం సిద్దం !

శ్రీహరికోట ;

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఊపుమీద కనిపిస్తోంది. అదే ఊపులో సూర్యుడిపై ఆదిత్య ఎల్1 మిషన్ కూడా ప్రయోగించేందుకు ముహుర్తం సిద్ధం చేసేసింది. వచ్చే నెల 2వ తేదీన సూర్యుడిపైకి ఆదిత్య ఎల్ 1 నౌకను పంపేందుకు సిద్దమవుతున్నట్లు ఇస్రో ఇవాళ ప్రకటించింది. ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

ఆదిత్య-L1 వ్యోమనౌక భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 (సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్) వద్ద సూర్యుడి కేంద్రం కరోనా అధ్యయనం, సూర్యుడిపై వీచే గాలిపై పరిశోధనలు చేయడానికి అందించడానికి రూపొందించారు.ఇది సూర్యుడిపై పరిశోధనలపై చేస్తున్న తొలి భారతీయ అంతరిక్ష ప్రయోగం కూడా కానుంది. ఇస్రో తన సోషల్ మీడియా పోస్ట్‌లో అంతరిక్ష నౌక సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత మొదటి భారతీయ అబ్జర్వేటరీ - PSLV-C57 రాకెట్ ద్వారా ప్రయోగించబడుతుందని తెలిపింది.

ఆదిత్య-L1 మిషన్, L1గా పేర్కొంటున్న పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేసే లక్ష్యంతో ప్రయోగిస్తున్నారు. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని యొక్క బయటి పొరలను, కరోనాను వేర్వేరు వేవ్‌బ్యాండ్‌లో పరిశీలించడానికి ఏడు పేలోడ్‌లను ఇది తీసుకువెళుతుంది. ఆదిత్య-ఎల్1 అనేది జాతీయ సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్న పూర్తి స్వదేశీ ప్రయత్నమని ఇస్రో వెల్లడించింది.

చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించిన భారత్ ఇప్పుడు సూర్యుడిపైనా విజయవంతంగా కాలు మోపగలిగితే అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగిపోవడం ఖాయం. ఇందుకోసం ఇస్రో తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో ఇస్రో ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2న జరిగే ఈ తొలి సౌర ప్రయోగంపై దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టీచర్ బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లను హైకోర్టు తప్పు పట్టింది. యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని హైకోర్టు తెలిపింది.

తుది తీర్పుకు లోబడే బదిలీలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది...

CBI Court: జగన్‌, విజయసాయి విదేశీ పర్యటనలకు అనుమతిపై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌: యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ వేశారు..

దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఇవాళ వాదనలు వినిపించిన సీబీఐ.. జగన్ విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ఈ నెల 31కి వాయిదా వేసింది..

మరోవైపు, యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిందే. విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా ఇవాళ వాదనలు ముగిశాయి. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ.. కోర్టును దృష్టికి తీసుకెళ్లింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది..

AP: ఎస్‌ఐ ఫైనల్‌ ఎగ్జామ్‌ డేట్‌ ఖరారు.. ఎప్పుడంటే?

అమరావతి: ఏపీలో ఎస్‌ఐ పోస్టులకు ఫైనల్‌ రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో ఎస్‌ఐ ఫైనల్ రాత పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక, ఏపీలో సివిల్‌, ఏపీఎస్పీ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Chandrababu: మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు: చంద్రబాబు

అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా మహిళా నేతలు వంగలపూడి అనిత, పీతల సుజాత తదితరులు చంద్రబాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.

''తెదేపా అధికారంలోకి రాగానే.. తల్లికి వందనం పేరుతో పిల్లలందరి చదువుకు ఆర్థిక చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏటా రూ.15వేలు ఇస్తాం. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం ప్రకటించాం. పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. అవసరమైతే మరో సిలిండర్‌ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పీ-4 పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తాం. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అన్నీ చేయొచ్చు. ప్రస్తుత విధానాల వల్ల ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడు. పేదవారికి అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపడతాం. మనకు ఏమేం కావాలో ఇచ్చేందుకు చాట్‌ జీపీటీ వచ్చింది'' అని చంద్రబాబు అన్నారు..

Hyderabad: దారుణం.. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారం

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

వివరాల్లోకి వెళితే.. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని బండ్లగూడలోని ఓ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు బాబా గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అతడు పరారయ్యాడు. దీనిపై అత్తమామలకు చెప్పినా వారు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. దెయ్యం పట్టిందంటూ యువతిని వారు ఇంట్లోనే బంధించారు..

ఆ తర్వాత తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్‌ పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందంటూ భవానీనగర్‌ పోలీసులు వారిని అక్కడికే పంపించారు. పోలీసులు కూడా తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది..