/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz YSR Rythu Bharosa: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్‌ Yadagiri Goud
YSR Rythu Bharosa: కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్‌

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(గురువారం) కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు.

వివరాల ప్రకారం.. సీఎం జగన్‌ ఏపీలోని కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదును సీఎం జగన్‌ జమ చేయనున్నారు.

కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు..

అంతర్జాతీయ గ్లోబల్ సంస్థ నిజామాబాద్ లో ఏర్పాటు చేయడం శుభపరిణామం: ఎమ్మెల్సీ కవిత

అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ నిజామాబాదులో కంపెనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.ఐటీ అభివృద్ధి ప్రారంభిం చిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు.

ఇటీవల ప్రారంభమైన నిజామాబాద్ ఐటి హబ్ లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా..తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్ లో రెండు క్యాంపస్ లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3,000 మంది పనిచేస్తున్నారు.

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఈనెల మొదటి వారంలో ఆ సంస్థ ప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలుసుకుని చర్చలు జరిపారు.పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటి హబ్ ను ఇటీవల సందర్శించారు.

అనంతరం కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలిఫోర్నియాలోని వారి ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది. కల్వకుంట్ల కవితతో సమావేశమైన కేవలం 29 రోజుల్లోనే సంస్థ ఏర్పాటు కావడం విశేషం.

ఆదిత్య L-1 మిషన్ కు సర్వం సిద్దం !

శ్రీహరికోట ;

చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ఊపుమీద కనిపిస్తోంది. అదే ఊపులో సూర్యుడిపై ఆదిత్య ఎల్1 మిషన్ కూడా ప్రయోగించేందుకు ముహుర్తం సిద్ధం చేసేసింది. వచ్చే నెల 2వ తేదీన సూర్యుడిపైకి ఆదిత్య ఎల్ 1 నౌకను పంపేందుకు సిద్దమవుతున్నట్లు ఇస్రో ఇవాళ ప్రకటించింది. ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 11.50 నిమిషాలకు ఆదిత్య ఎల్ 1 ను ప్రయోగిస్తున్నట్లు ఇస్రో తెలిపింది.

ఆదిత్య-L1 వ్యోమనౌక భూమి నుండి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న L1 (సూర్య-భూమి లాగ్రాంజియన్ పాయింట్) వద్ద సూర్యుడి కేంద్రం కరోనా అధ్యయనం, సూర్యుడిపై వీచే గాలిపై పరిశోధనలు చేయడానికి అందించడానికి రూపొందించారు.ఇది సూర్యుడిపై పరిశోధనలపై చేస్తున్న తొలి భారతీయ అంతరిక్ష ప్రయోగం కూడా కానుంది. ఇస్రో తన సోషల్ మీడియా పోస్ట్‌లో అంతరిక్ష నౌక సూర్యుడిని అధ్యయనం చేయడానికి అంతరిక్ష ఆధారిత మొదటి భారతీయ అబ్జర్వేటరీ - PSLV-C57 రాకెట్ ద్వారా ప్రయోగించబడుతుందని తెలిపింది.

ఆదిత్య-L1 మిషన్, L1గా పేర్కొంటున్న పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్య నుండి సూర్యుడిని అధ్యయనం చేసే లక్ష్యంతో ప్రయోగిస్తున్నారు. ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యుని యొక్క బయటి పొరలను, కరోనాను వేర్వేరు వేవ్‌బ్యాండ్‌లో పరిశీలించడానికి ఏడు పేలోడ్‌లను ఇది తీసుకువెళుతుంది. ఆదిత్య-ఎల్1 అనేది జాతీయ సంస్థల భాగస్వామ్యంతో చేపడుతున్న పూర్తి స్వదేశీ ప్రయత్నమని ఇస్రో వెల్లడించింది.

చంద్రుడిపై కాలు మోపిన నాలుగో దేశంగా రికార్డు సృష్టించిన భారత్ ఇప్పుడు సూర్యుడిపైనా విజయవంతంగా కాలు మోపగలిగితే అంతర్జాతీయంగా ఇస్రో పేరు మార్మోగిపోవడం ఖాయం. ఇందుకోసం ఇస్రో తీవ్రంగా శ్రమిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారంతో ఇస్రో ఆదిత్య ఎల్ 1 మిషన్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 2న జరిగే ఈ తొలి సౌర ప్రయోగంపై దేశవ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఉపాధ్యాయుల బదిలీలపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఉపాధ్యాయుల బదిలీలపై కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తుది తీర్పుకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

టీచర్ బదిలీలపై మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. టీచర్ యూనియన్ నేతలకు 10 అదనపు పాయింట్లను హైకోర్టు తప్పు పట్టింది. యూనియన్ నేతలకు అదనపు పాయింట్లు ఇవ్వకుండానే బదిలీలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

ఉపాధ్యాయుల దంపతులకు అదనపు పాయింట్లు కేటాయించడానికి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నది నిబంధన ఉద్దేశమని హైకోర్టు తెలిపింది.

తుది తీర్పుకు లోబడే బదిలీలు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది...

CBI Court: జగన్‌, విజయసాయి విదేశీ పర్యటనలకు అనుమతిపై నిర్ణయం వాయిదా

హైదరాబాద్‌: యూకే వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సెప్టెంబర్ 2న లండన్‌లోని తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన సీబీఐ కోర్టులో సీఎం జగన్‌ పిటిషన్‌ వేశారు..

దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతులు సడలించాలని పిటిషన్‌లో కోరారు. జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేసేందుకు గత విచారణలో సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్‌పై విచారణను ఈనెల 30కి వాయిదా వేసింది. ఇవాళ వాదనలు వినిపించిన సీబీఐ.. జగన్ విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరింది. వాదనలు విన్న ధర్మాసనం.. సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ఈ నెల 31కి వాయిదా వేసింది..

మరోవైపు, యూనివర్సిటీలతో ప్రభుత్వ ఒప్పందాల కోసం యూకే, యూఎస్, జర్మనీ, దుబాయ్, సింగపూర్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిందే. విజయసాయిరెడ్డి పిటిషన్‌పైనా ఇవాళ వాదనలు ముగిశాయి. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ.. కోర్టును దృష్టికి తీసుకెళ్లింది. విజయసాయిరెడ్డి విదేశీ పర్యటనకు అనుమతిపై నిర్ణయాన్ని ధర్మాసనం ఈ నెల 31కి వాయిదా వేసింది..

AP: ఎస్‌ఐ ఫైనల్‌ ఎగ్జామ్‌ డేట్‌ ఖరారు.. ఎప్పుడంటే?

అమరావతి: ఏపీలో ఎస్‌ఐ పోస్టులకు ఫైనల్‌ రాత పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. అక్టోబర్‌ 14, 15 తేదీల్లో ఎస్‌ఐ ఫైనల్ రాత పరీక్షను నిర్వహించనున్నట్టు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఇక, ఏపీలో సివిల్‌, ఏపీఎస్పీ ఎస్‌ఐ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనున్నారు.

ఈ పరీక్షల కోసం రాష్ట్రంలోని విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూల్‌లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Chandrababu: మహిళల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు: చంద్రబాబు

అమరావతి: మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెదేపా మహిళా నేతలు వంగలపూడి అనిత, పీతల సుజాత తదితరులు చంద్రబాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు..

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... మహిళా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు.

''తెదేపా అధికారంలోకి రాగానే.. తల్లికి వందనం పేరుతో పిల్లలందరి చదువుకు ఆర్థిక చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఏటా రూ.15వేలు ఇస్తాం. మహిళల కోసం మహాశక్తి కార్యక్రమం ప్రకటించాం. పేద కుటుంబాలకు ఏటా 3 గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం.. అవసరమైతే మరో సిలిండర్‌ కూడా ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. పీ-4 పేరుతో ప్రత్యేక కార్యక్రమం తీసుకొస్తాం. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజల భాగస్వామ్యంతో అన్నీ చేయొచ్చు. ప్రస్తుత విధానాల వల్ల ధనికుడు మరింత ధనికుడు అవుతున్నాడు. పేదవారికి అండగా ఉండేందుకు అనేక కార్యక్రమాలు చేపడతాం. మనకు ఏమేం కావాలో ఇచ్చేందుకు చాట్‌ జీపీటీ వచ్చింది'' అని చంద్రబాబు అన్నారు..

Hyderabad: దారుణం.. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారం

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

వివరాల్లోకి వెళితే.. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని బండ్లగూడలోని ఓ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు బాబా గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అతడు పరారయ్యాడు. దీనిపై అత్తమామలకు చెప్పినా వారు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. దెయ్యం పట్టిందంటూ యువతిని వారు ఇంట్లోనే బంధించారు..

ఆ తర్వాత తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్‌ పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందంటూ భవానీనగర్‌ పోలీసులు వారిని అక్కడికే పంపించారు. పోలీసులు కూడా తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది..

TS News: రాజకీయాల్లోకి మరో నాయకుడి వారసురాలు

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు గుమ్మడి అనురాధ వెల్లడించారు..

సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య కూతురే గుమ్మడి అనురాధ. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజల అభీష్టం మేరకే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అనురాధ మీడియా సమావేశంలో వెల్లడించారు..

మా బాపు నన్ను మోసం చెయ్యడు !

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భావోద్వేగం

స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవటంతో.. తీవ్ర అసంతృప్తి అంతకుమించిన ఆవేదనతో ఉన్న రాజయ్య... ఆరు నూరైనా, నూరు నుటయాభై అయినా తాను మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ధర్మసాగర్ మండలంలో బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య.. ఇట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

దుక్కి దున్ని, నారు పోసి, కలుపుతీసి, పంట పండించి, కుప్ప పోశాక.. ఆ కుప్ప మీద ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటూ ప్రశ్నించారు.

పైన దేవుడున్నాడని.. దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నారన్న రాజయ్య.. రేపోమాపో తాను అనుకున్న కార్యక్రమం జరుగనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే తానున్నానని.. ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని చెప్పుకొచ్చారు.

అయితే.. టికెట్ రాలేదన్న బాధతో మొన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలను చూసి భోరున విలపించిన రాజయ్య.. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆవేదనతో చెప్పారు. తన స్థాయికి తగిన పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆయన మాట మీద తనకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తన అభిమానులందరూ సంయమనం పాటించాలంటూనే కిందపడి వెక్కి వెక్కి ఏడ్చారు.

.. ఉన్న కొన్ని రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలన్ని పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

.. ఇంతలోనే ఇలాటి కామెంట్లు చేయటంతో.. రాజయ్య మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చకు తెర లేచింది. ఇప్పటికే.. టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లంతా తలో దారి చూసుకుంటున్న నేపథ్యంలో.. రాజయ్య ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. పార్టీ మారనున్నారా.. లేదా ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి గురించి ఏమైనా బాంబు పేల్చనున్నారా.. అన్నది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఆయన అనుకున్నది ఏం జరుగనుందో..?