/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Hyderabad: దారుణం.. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారం Yadagiri Goud
Hyderabad: దారుణం.. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారం

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది. వైద్యం పేరుతో నవ వధువుపై బాబా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..

వివరాల్లోకి వెళితే.. హుస్సేనీఆలం ప్రాంతానికి చెందిన యువతికి 3 నెలల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరోగ్యం బాగాలేదని బండ్లగూడలోని ఓ బాబా వద్దకు అత్తమామలు తీసుకెళ్లారు. నవ వధువు కళ్లకు బాబా గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియడంతో అతడు పరారయ్యాడు. దీనిపై అత్తమామలకు చెప్పినా వారు పట్టించుకోలేదని యువతి ఆరోపించింది. దెయ్యం పట్టిందంటూ యువతిని వారు ఇంట్లోనే బంధించారు..

ఆ తర్వాత తల్లిదండ్రుల సాయంతో భవానీనగర్‌ పీఎస్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది. ఘటన బండ్లగూడ పరిధిలో జరిగిందంటూ భవానీనగర్‌ పోలీసులు వారిని అక్కడికే పంపించారు. పోలీసులు కూడా తనకు న్యాయం చేయకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది..

TS News: రాజకీయాల్లోకి మరో నాయకుడి వారసురాలు

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసురాలు ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మేరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు గుమ్మడి అనురాధ వెల్లడించారు..

సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరపున ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య కూతురే గుమ్మడి అనురాధ. ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశారు.

వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజల అభీష్టం మేరకే ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని అనురాధ మీడియా సమావేశంలో వెల్లడించారు..

మా బాపు నన్ను మోసం చెయ్యడు !

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భావోద్వేగం

స్టేషన్ ఘనఫూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం టికెట్ ఇవ్వకపోవటంతో.. తీవ్ర అసంతృప్తి అంతకుమించిన ఆవేదనతో ఉన్న రాజయ్య... ఆరు నూరైనా, నూరు నుటయాభై అయినా తాను మాత్రం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు. ధర్మసాగర్ మండలంలో బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య.. ఇట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

దుక్కి దున్ని, నారు పోసి, కలుపుతీసి, పంట పండించి, కుప్ప పోశాక.. ఆ కుప్ప మీద ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటూ ప్రశ్నించారు.

పైన దేవుడున్నాడని.. దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నారన్న రాజయ్య.. రేపోమాపో తాను అనుకున్న కార్యక్రమం జరుగనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే తానున్నానని.. ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని చెప్పుకొచ్చారు.

అయితే.. టికెట్ రాలేదన్న బాధతో మొన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలను చూసి భోరున విలపించిన రాజయ్య.. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆవేదనతో చెప్పారు. తన స్థాయికి తగిన పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆయన మాట మీద తనకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తన అభిమానులందరూ సంయమనం పాటించాలంటూనే కిందపడి వెక్కి వెక్కి ఏడ్చారు.

.. ఉన్న కొన్ని రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలన్ని పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

.. ఇంతలోనే ఇలాటి కామెంట్లు చేయటంతో.. రాజయ్య మళ్లీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న చర్చకు తెర లేచింది. ఇప్పటికే.. టికెట్లు ఆశించి భంగపడిన వాళ్లంతా తలో దారి చూసుకుంటున్న నేపథ్యంలో.. రాజయ్య ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు శ్రేణుల్లో ఉత్కంఠగా మారింది. పార్టీ మారనున్నారా.. లేదా ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరి గురించి ఏమైనా బాంబు పేల్చనున్నారా.. అన్నది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఆయన అనుకున్నది ఏం జరుగనుందో..?

కామారెడ్డి పై సీఎం కేసిఆర్ నజర్ !

- అభివృద్ది పనులపై ఆదేశాలు

- జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్య నేతలు

- నిధుల కేటాయింపు ప్రక్రియ పూర్తి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్య వహిస్తున్న గజ్వేల్ తో పాటు కామారెడ్డి నుంచి కూడా కేసీఆర్ పోటీ చేయనున్నారు. దీంతో కామారెడ్డిపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అక్కడ పెండింగ్ లో ఉన్న పనులన్ని ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయానికొచ్చింది. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తారన్న సమాచారంతో కేటీఆర్ కామారెడ్డికి కేటీఆర్ రూ.45 కోట్ల ఫండ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రూ.25 కోట్లతో ఏ పనులు చేపట్టాలో జీవో కూడా జారీ చేశారు.

కామారెడ్డి అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రణాళిక గురించి కేసీఆర్ లేదా కేటీఆర్ అక్కడి అధికారులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అంతే కాదు కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు అధికారులు ప్రపోజల్స్ కూడా పంపారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాలకు నీరందించేకు రూ.695 కోట్ల వ్యయంతో 3 రిజర్వాయర్లు నిర్మించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కేసీఆర్ ఇప్పటికే సమావేశమయ్యారు. కామారెడ్డి నియోజకవర్గ సమస్యలను అడిగి తెలుకున్నారు.

కామారెడ్డి కీ కేసిఆర్ పోటితోనే మహర్దశ ?

కామారెడ్డిలో అభివృద్ధి పనులు పూర్తి కాలేదని నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతే కాకుండా పలు శాఖల్లో పనులు పెండింగ్ లో ఉన్నట్లు పేర్కొన్నారు. దీంతో సీఎం కేసీఆర్ కామారెడ్డి నియోజకవర్గ ప్రజల అవసరాలపై రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు నత్తనడక కొనసాగుతోన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ప్రాణహిత- చేవెళ్ల పథకంలో భాగంగా పనులు మొదలు పెట్టింది. సదాశివనగర్ మండలం భూంపల్లి రిజర్వాయర్ నుంచి గ్రావిటీతో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గల్లోని 90 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు.కాంగ్రెస్ ఉన్నప్పుడు భూంపల్లి వద్ద రిజర్వాయర్ తో పాటు 2 మెయిన్ కెనాల్స్ పనులు కొంత జరిగాయి. ఆ తర్వాత 2014 తర్వాత పనులు నత్తనడక సాగుతోన్నాయి. భూ సేకరణ, రిజర్వాయర్ల్ నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల కాకపోవడంతో గుత్తేదారులు పనులు ఆపేశారు. కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలోనే 22 ప్యాకేజీ పనులకు మోక్షం లభించినట్లు అక్కడి వారు చెప్పుకుంటున్నారు. కేసీఆర్ రాకతో కామారెడ్డి రూపురేకలు మారుతాయని అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో జరిగిన అభివృద్ది కామారెడ్డి జరుగుంతుదని ఆశపడుతున్నారు.

ఛలో సూర్యాపేటకు బీఎస్పీ పిలుపు !

- గోర్లకు బర్రెలకు అమ్ముడుపోదామ ..

- మంత్రీ జగదీష్ రెడ్డి రౌడీ షీటర్

- బీసీ బిడ్డా జనయ్య యాదవ్ పై కుట్రలు సహించం

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్

సూర్యాపేట న్యూస్ ప్రతినిధి; 50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓటమి భయంతో కాకపోతే మంత్రి జగదీష్ రెడ్డి ఎందుకు తన పోలీసులతో బీసీ బిడ్డ అయిన వట్టె జానయ్య యాదవ్ మీద ముప్పేట దాడి చేస్తున్నాడు అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. జానయ్య మీద ఎన్నడు లేని కేసులను కుప్పలు తెప్పలుగా, ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టించి పీడీ యాక్టు కింద జైలుకు పంపాలని చూస్తున్నాడు ? ఎందుకు జానయ్యను కిరాయి మూకలతో ఖతం చేయాలని చూస్తున్నడో సమాధానం చెప్పాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మాఫియా చీకటి దందాల సంగతి గురించి బాగా తెలిసినోడనా ? జానయ్య యాదవ్ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటూ తన కష్టార్జితాన్ని నీళ్ల లాగా ఖర్చు పెట్టి పనిచేయకపోతే జగదీష్ రెడ్డి 2018 లో గెలిచేటోడా ? అంటే మేం మిమ్మల్ని గెలిపియ్యాలె, తర్వాత రోజూ భయం భయంగా బతకాలెనా అని మంత్రి జగదీష్ రెడ్డిని నిలదీశారు.

ఆయన కొడుకు పెళ్లికి యాభై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించిందుకా ? లేక ఆయనను సూర్యాపేట ప్రజలు ఆదరిస్తున్నందుకే మంత్రి జగదీశ్ రెడ్డి ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ఆయన ఇంటికి బీయస్పీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినందుకా ? ఎప్పుడు సూర్యాపేటలో, తెలంగాణలో రెడ్డి లేదా వెలమ భూస్వాములే రాజకీయాలను శాసించాల్నా ? బీసీ . ఎస్సీ , ఎస్టీ , మైనారిటీలు జీవితాంతం (ఎమ్మెల్యేలయినా) మీకు చంచాలుగానే బతకాల్నా అని మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నూటికి 99 % మంది ఉన్న బహుజనులు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే పరిమితమై మీ ఇండ్ల దగ్గర కావలి కుక్కలుగానే ఉండాల్నా ? వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యే అర్హత లేదా ? మీరు చేస్తేనేమో అది రియల్ ఎస్టేటు వ్యాపారం, భూములు వెంచర్లు అయితవి. మేం అదే వ్యాపారం చట్టబద్ధంగా చేస్తే కబ్జాలు అయితయా ? అంటే మీరే ఎప్పుడు డబ్బు సంపాయించాల్నా ? మేం ఎప్పుడూ బిచ్చగాళ్లుగానే ఉండాల్నా అని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలారా …

50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, చిట్యాల ఐలమ్మ, పండుగ సాయన్న, మారోజు వీరన్న, సర్వాయి పాపన్న లాంటి వీర యోధులు మన వర్గాల్లోనే జన్మించి దొరలపై పోరాటాలు చేసిండ్రన్న విషయం మర్చిపోయినమా అని బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అందుకే మనకు ఏమైనా చీము నెత్తురు ఉన్నా.. తెలంగాణ బహుజన సమాజం అందరం వట్టె జానయ్య యాదవ్ కు వెన్ను దన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో గ్రామ గ్రామాన రచ్చ బండల దగ్గర అన్ని సంఘాలు కేసీఆర్ - జగదీష్ రెడ్డిల మాఫియాలను గద్దె దించాలని ప్రతిజ్ఞ చేయాలె. అందరూ గ్రామ దేవతల సాక్షిగా బొడ్రాయి దగ్గర ప్రమాణం చేయాలె అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మన కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న, ఈ దోపిడి దొరలకు మన గొల్ల-కుర్మ ఢోలు దెబ్బ, మోకు దెబ్బ, గూటం దెబ్బ, చాకి రేవు దెబ్బ, వల దెబ్బల, నగారా దెబ్బల రుచి చూపించాలె అని బహుజనులకు పిలుపునిచ్చారు. లక్షలాదిగా స్వచ్ఛందంగా నడురి సూర్యాపేటకు తరలి రండి అంటూ పిలుపునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ దోపిడి దొంగ దొరల సంగతేందో సూద్దాము అని సవాల్ విసిరారు. పోలీసోల్లు సంపితే సద్దామి, కానీ మన బిడ్డను, మన ఇజ్జత్ ను కాపాడుకుందామి. దొరలందరూ ఒక్కటైనప్పుడు, మనమందరం ఒక్కటి కావాలె. కలవాలె. నిలవాలె. గెలవాలె.. అందుకోసం అందరూ ఏకమై రండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వట్టే జానయ్య యాదవ్ కి అండగా నిలుస్తూ ఛలో సూర్యాపేటకు పిలుపునిచ్చారు.

నేడు నీలిరంగు చందమామ ఆవిష్కృతం

ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.

ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..

కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..

తెలంగాణకు నేను తోబుట్టును: గవర్నర్ తమిళి సై

రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లో రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జిర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్మడ్ ఫోర్సెస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రెడ్ క్రాస్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు... ప్రజలంతా రక్షా బంధన్ జరుపుకుంటున్నారన్నారు. దేశంలో ఎన్నో సంస్కృతులు... ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ..అంతా కలిసి మెలిసి ఉంటామని.. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదన్నారు.

సోల్జర్స్ వల్లే మనం ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నామని, రాఖీ కట్టి వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుందామని తమిళిసై అన్నారు. దేశం ఈరోజున ఇలా ఉండటానికి కారణమైన సైనికుల గురించి యూత్ తెలుసుకోవాలన్నారు.

మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదని.. అభివృద్ధి చెందిన దేశమని అన్నారు. చంద్రుని వరకు వెళ్ళిన మనం ఇప్పుడు సూర్యుని దగ్గరకి కూడా వెళ్ళబోతున్నామన్నారు. తెలంగాణకు తానొక తోబుట్టువునని, రాజ్‌భవన్‌లో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తాను రాఖీ కడుతున్నానని.. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు...........

కాంగ్రెస్ అభ్యర్థుల తోలి జాబితా విడుదల !

- టిపిసిసి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం

- సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు ప్రారంభించింది. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వెయ్యికిపైగా ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడంతో అభ్యర్థుల ఎంపికై చర్చించారు. అయితే, దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మిగితా స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పోటీ ఉండటంతో ఎన్నికల కమిటీ చర్చించింది. ఎంపిక కోసం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.

సర్వేలో ఖరారైన అభ్యర్థులు వీరే !

దాదాపు ఖరారైన అభ్యర్థులు జాబితా ఇదే ...

నల్గొండ జిల్లా

నల్గొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుజూర్ నగర్ - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ - పద్మావతి ఆలేరు - బీర్ల ఐలయ్య

హైదరాబాద్

నాంపల్లి - ఫిరోజ్ ఖాన్ జూబ్లీహిల్స్ - విష్ణువర్ధన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా

వికారాబాద్ - గడ్డం ప్రసాద్‌కుమార్

ఇబ్రహీం పట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి పరిగి - టి రామ్మోహన్‌రెడ్డి

వరంగల్ జిల్లా

నర్సంపేట -దొంతి మాధవరెడ్డి వరంగల్ తూర్పు - కొండా సురేఖ

ములుగు - సీతక్క భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ

మహబూబ్‌నగర్ జిల్లా

కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు కల్వకుర్తి -వంశీచంద్‌రెడ్డి అచ్చంపేట - వంశీ కృష్ణ షాద్‌నగర్ - ఈర్లపల్లి శంకర్ కొడంగల్ - రేవంత్‌రెడ్డి అలంపూర్ - సంపత్‌కుమార్

మెదక్ జిల్లా

సంగారెడ్డి - జగ్గారెడ్డి ఆందోల్ - దామోదర రాజనర్సింహ జహీరాబాద్ - ఎ.చంద్రశేఖర్ నర్సాపూర్ - గాలి అనిల్‌కుమార్‌

ఆదిలాబాద్ జిల్లా

నిర్మల్ - శ్రీహరి రావు మంచిర్యాల - ప్రేమ్‌సాగర్‌రావు

నిజామాబాద్ జిల్లా

జుక్కల్ - గంగారాం

కామారెడ్డి - షబ్బీర్‌అలీ

ఖమ్మం జిల్లా

మధిర - భట్టి విక్రమార్క భద్రాచలం - పొదెం వీరయ్య కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కరీంనగర్ జిల్లా

హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్

మంథని- శ్రీధర్‌బాబు వేములవాడ- ఆది శ్రీనివాస్ జగిత్యాల- జీవన్‌రెడ్డి హుజురాబాద్- బల్మూరి వెంకట్ చొప్పదండి - మేడిపల్లి సత్యం మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ

రామగుండం - రాజ్‌ఠాకూర్ పెద్దపల్లి - విజయ రమణారావు ధర్మపురి - వడ్లురి లక్ష్మణ్

కోరుట్ల - జువ్వాడి నర్సింగ్ రావు

దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రతి అక్కకు, చెల్లెమ్మకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం జగన్‌

తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం బుధవారం ట్వీట్‌ చేశారు..

వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు.

ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు..

కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ .. !

- కాంగ్రెస్ టికెట్ల కోసం ఓయూ విద్యార్థుల ఆశలు ..

- ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సవాల్ ..

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీకి టికెట్ల విషయంలో మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే ముందు నుండి పార్టీకి సేవ చేస్తూ నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న వారు టికెట్లు ఆశిస్తుండగా.. కొత్తగా ఆయా నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీల నుండి వచ్చి చేరిన వారు సైతం టికెట్లు ఆశిస్తున్నారు. ఇదిలావుండగానే.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థి నేతల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం పోరాటం మొదలైంది. ఇది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేసేందుకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి, అలాగే టీ పీసీసీ సభ్యులు, సిఎల్పీ నేత అయిన భట్టి విక్రమార్కకు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు మంగళవారం గాంధీభవన్‌లో కలిసి ఓ వినతిపత్రం అందించారు.

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీ 2014లో ఒక ఎంపీ 3 అసెంబ్లీ టికెట్లు విద్యార్థి ఉద్యమకారులకు కేటాయించిందని, 2018లో మూడు అసెంబ్లీ టికెట్లు 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు విద్యార్థి ఉద్యమకారులకు ఇచ్చిందని చెప్పిన విద్యార్థి నేతలు.. కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి విద్యార్థి ఉద్యమకార్లకు న్యాయం చేయాలని వారు కోరారు.

వినతి పత్రం ఇచ్చిన వారిలో సత్తుపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న కోటూరి మానవతారాయ్, చెన్నూరు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న దుర్గం భాస్కర్, జనగాం నుంచి టికెట్ ఆశిస్తున్న బాల లక్ష్మి, గద్వాల నుంచి టికెట్ ఆశిస్తున్న కురువ విజయ్ కుమార్, మునుగోడు నుంచి టికెట్ ఆశిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత డాక్టర్ లింగం యాదవ్, కరీంనగర్ నుంచి కొనగాల మహేష్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేస్తోన్న తమకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని సదరు విద్యార్థి ఉద్యమాల నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కోరారు. అంతేకాకుండా ఇది ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కూడా అని గుర్తుచేసిన విద్యార్థి నేతలు.. ఆ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.