/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఛలో సూర్యాపేటకు బీఎస్పీ పిలుపు ! Yadagiri Goud
ఛలో సూర్యాపేటకు బీఎస్పీ పిలుపు !

- గోర్లకు బర్రెలకు అమ్ముడుపోదామ ..

- మంత్రీ జగదీష్ రెడ్డి రౌడీ షీటర్

- బీసీ బిడ్డా జనయ్య యాదవ్ పై కుట్రలు సహించం

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్

సూర్యాపేట న్యూస్ ప్రతినిధి; 50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.

ఓటమి భయంతో కాకపోతే మంత్రి జగదీష్ రెడ్డి ఎందుకు తన పోలీసులతో బీసీ బిడ్డ అయిన వట్టె జానయ్య యాదవ్ మీద ముప్పేట దాడి చేస్తున్నాడు అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. జానయ్య మీద ఎన్నడు లేని కేసులను కుప్పలు తెప్పలుగా, ఆగమేఘాల మీద అక్రమ కేసులు పెట్టించి పీడీ యాక్టు కింద జైలుకు పంపాలని చూస్తున్నాడు ? ఎందుకు జానయ్యను కిరాయి మూకలతో ఖతం చేయాలని చూస్తున్నడో సమాధానం చెప్పాలని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మాఫియా చీకటి దందాల సంగతి గురించి బాగా తెలిసినోడనా ? జానయ్య యాదవ్ ఇప్పటికీ చిన్న ఇంట్లోనే ఉంటూ తన కష్టార్జితాన్ని నీళ్ల లాగా ఖర్చు పెట్టి పనిచేయకపోతే జగదీష్ రెడ్డి 2018 లో గెలిచేటోడా ? అంటే మేం మిమ్మల్ని గెలిపియ్యాలె, తర్వాత రోజూ భయం భయంగా బతకాలెనా అని మంత్రి జగదీష్ రెడ్డిని నిలదీశారు.

ఆయన కొడుకు పెళ్లికి యాభై వేల మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఆశీర్వదించిందుకా ? లేక ఆయనను సూర్యాపేట ప్రజలు ఆదరిస్తున్నందుకే మంత్రి జగదీశ్ రెడ్డి ఓర్వలేకపోతున్నారా అని ప్రశ్నించారు. ఆయన ఇంటికి బీయస్పీ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినందుకా ? ఎప్పుడు సూర్యాపేటలో, తెలంగాణలో రెడ్డి లేదా వెలమ భూస్వాములే రాజకీయాలను శాసించాల్నా ? బీసీ . ఎస్సీ , ఎస్టీ , మైనారిటీలు జీవితాంతం (ఎమ్మెల్యేలయినా) మీకు చంచాలుగానే బతకాల్నా అని మంత్రి జగదీశ్ రెడ్డిపై ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

నూటికి 99 % మంది ఉన్న బహుజనులు కేవలం సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లకే పరిమితమై మీ ఇండ్ల దగ్గర కావలి కుక్కలుగానే ఉండాల్నా ? వాళ్లకు ఎమ్మెల్యేలు, మంత్రులయ్యే అర్హత లేదా ? మీరు చేస్తేనేమో అది రియల్ ఎస్టేటు వ్యాపారం, భూములు వెంచర్లు అయితవి. మేం అదే వ్యాపారం చట్టబద్ధంగా చేస్తే కబ్జాలు అయితయా ? అంటే మీరే ఎప్పుడు డబ్బు సంపాయించాల్నా ? మేం ఎప్పుడూ బిచ్చగాళ్లుగానే ఉండాల్నా అని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజలారా …

50% బీసీ బిడ్డలు తెలంగాణలో కేవలం 1% ఉన్న ఈ అగ్ర వర్ణాల దొరలు చేస్తున్న దౌర్జన్యాలను ఎన్నాళ్లు భరిస్తనే ఉంటరు అంటూ తెలంగాణ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. వాళ్లిచ్చే పది గొర్రెలకు, బర్రెలకు దావత్ లకు మన ఆత్మ గౌరవాన్ని అమ్ముకుంటమా ? ఆలోచించండి అంటూ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. దొడ్డి కొమురన్న, బెల్లి లలితక్క, కానిస్టేబుల్ కిష్టయ్య, సిరిపురం యాదయ్య, చిట్యాల ఐలమ్మ, పండుగ సాయన్న, మారోజు వీరన్న, సర్వాయి పాపన్న లాంటి వీర యోధులు మన వర్గాల్లోనే జన్మించి దొరలపై పోరాటాలు చేసిండ్రన్న విషయం మర్చిపోయినమా అని బహుజనుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

అందుకే మనకు ఏమైనా చీము నెత్తురు ఉన్నా.. తెలంగాణ బహుజన సమాజం అందరం వట్టె జానయ్య యాదవ్ కు వెన్ను దన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో గ్రామ గ్రామాన రచ్చ బండల దగ్గర అన్ని సంఘాలు కేసీఆర్ - జగదీష్ రెడ్డిల మాఫియాలను గద్దె దించాలని ప్రతిజ్ఞ చేయాలె. అందరూ గ్రామ దేవతల సాక్షిగా బొడ్రాయి దగ్గర ప్రమాణం చేయాలె అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. మన కొమరెల్లి మల్లన్న సాక్షిగా చెబుతున్న, ఈ దోపిడి దొరలకు మన గొల్ల-కుర్మ ఢోలు దెబ్బ, మోకు దెబ్బ, గూటం దెబ్బ, చాకి రేవు దెబ్బ, వల దెబ్బల, నగారా దెబ్బల రుచి చూపించాలె అని బహుజనులకు పిలుపునిచ్చారు. లక్షలాదిగా స్వచ్ఛందంగా నడురి సూర్యాపేటకు తరలి రండి అంటూ పిలుపునిచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఈ దోపిడి దొంగ దొరల సంగతేందో సూద్దాము అని సవాల్ విసిరారు. పోలీసోల్లు సంపితే సద్దామి, కానీ మన బిడ్డను, మన ఇజ్జత్ ను కాపాడుకుందామి. దొరలందరూ ఒక్కటైనప్పుడు, మనమందరం ఒక్కటి కావాలె. కలవాలె. నిలవాలె. గెలవాలె.. అందుకోసం అందరూ ఏకమై రండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వట్టే జానయ్య యాదవ్ కి అండగా నిలుస్తూ ఛలో సూర్యాపేటకు పిలుపునిచ్చారు.

నేడు నీలిరంగు చందమామ ఆవిష్కృతం

ఆకాశంలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానున్నది. ఇటీవల శనిగ్రహం ఖగోళ ప్రియులను కనువిందు చేయగా.. అంతకు ముందు పంచగ్రహ కూటమి ఏర్పడింది. బుధుడు, యురేనస్‌, గురుగ్రహం, నైప్యూటర్‌, శనిగ్రహాలు ఒకే వరుసలోకి చేరాయి. ఈ ఘట్టాన్ని ఎలాంటి పరికరాలు లేకుండా చూడే అవకాశం కలిగింది.ఈ క్రమంలోనే బుధవారం మరో అరుదైన దృశ్యం నీలిరంగు చందమామ ఆవిష్కృతం కాబోతున్నది.

ఈ నెలలో రెండు పున్నములు ఉండగా.. ఒకటి ఆగస్టు ఒకటో తేదీన ఏర్పడింది. దీన్ని సూపర్‌మూన్‌గా పిలువగా.. నేడు నీలిరంగు చందమామ బుధవారం ఏర్పడబోతున్నది. సాధారణంగా ఒక ఏడాదిలో రెండు, మూడు సూపర్‌ మూన్స్‌ ఏర్పడుతుంటాయి..

కానీ, బుధవారం ఏర్పడబోయే బ్లూమూన్‌ మాత్రం అరుదైనది. పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా వచ్చిన సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది. సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపించడంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. సాధారణ రోజుల కంటే 16 శాతం వెన్నెలను పంచబోతున్నాడు..

తెలంగాణకు నేను తోబుట్టును: గవర్నర్ తమిళి సై

రాఖీ పౌర్ణమి సందర్భంగా బుధవారం రాజ్‌భవన్‌లో రక్షా బంధన్ వేడుకలు జరుగుతున్నాయి. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జిర్స్ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్మడ్ ఫోర్సెస్, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ తెలంగాణ రెడ్ క్రాస్‌ను చూస్తే ఎంతో గర్వంగా ఉందని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. అన్నా చెల్లెళ్ళు మాత్రమే కాదు... ప్రజలంతా రక్షా బంధన్ జరుపుకుంటున్నారన్నారు. దేశంలో ఎన్నో సంస్కృతులు... ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ..అంతా కలిసి మెలిసి ఉంటామని.. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదన్నారు.

సోల్జర్స్ వల్లే మనం ఇప్పుడు ఇంత హాయిగా ఉన్నామని, రాఖీ కట్టి వారికి మన కృతజ్ఞతలు తెలుపుకుందామని తమిళిసై అన్నారు. దేశం ఈరోజున ఇలా ఉండటానికి కారణమైన సైనికుల గురించి యూత్ తెలుసుకోవాలన్నారు.

మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశం కాదని.. అభివృద్ధి చెందిన దేశమని అన్నారు. చంద్రుని వరకు వెళ్ళిన మనం ఇప్పుడు సూర్యుని దగ్గరకి కూడా వెళ్ళబోతున్నామన్నారు. తెలంగాణకు తానొక తోబుట్టువునని, రాజ్‌భవన్‌లో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరికీ తాను రాఖీ కడుతున్నానని.. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు...........

కాంగ్రెస్ అభ్యర్థుల తోలి జాబితా విడుదల !

- టిపిసిసి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం

- సర్వే ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు ప్రారంభించింది. మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రాష్ట్ర పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు వెయ్యికిపైగా ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడంతో అభ్యర్థుల ఎంపికై చర్చించారు. అయితే, దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికై ఏకాభిప్రాయం కుదిరినట్లు తెలుస్తోంది. మిగితా స్థానాల్లో ఇద్దరు లేదా ముగ్గురు, అంతకంటే ఎక్కువ మంది పోటీ ఉండటంతో ఎన్నికల కమిటీ చర్చించింది. ఎంపిక కోసం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది.

సర్వేలో ఖరారైన అభ్యర్థులు వీరే !

దాదాపు ఖరారైన అభ్యర్థులు జాబితా ఇదే ...

నల్గొండ జిల్లా

నల్గొండ -కోమటిరెడ్డి వెంకటరెడ్డి హుజూర్ నగర్ - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కోదాడ - పద్మావతి ఆలేరు - బీర్ల ఐలయ్య

హైదరాబాద్

నాంపల్లి - ఫిరోజ్ ఖాన్ జూబ్లీహిల్స్ - విష్ణువర్ధన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా

వికారాబాద్ - గడ్డం ప్రసాద్‌కుమార్

ఇబ్రహీం పట్నం - మల్‌రెడ్డి రంగారెడ్డి పరిగి - టి రామ్మోహన్‌రెడ్డి

వరంగల్ జిల్లా

నర్సంపేట -దొంతి మాధవరెడ్డి వరంగల్ తూర్పు - కొండా సురేఖ

ములుగు - సీతక్క భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ

మహబూబ్‌నగర్ జిల్లా

కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు కల్వకుర్తి -వంశీచంద్‌రెడ్డి అచ్చంపేట - వంశీ కృష్ణ షాద్‌నగర్ - ఈర్లపల్లి శంకర్ కొడంగల్ - రేవంత్‌రెడ్డి అలంపూర్ - సంపత్‌కుమార్

మెదక్ జిల్లా

సంగారెడ్డి - జగ్గారెడ్డి ఆందోల్ - దామోదర రాజనర్సింహ జహీరాబాద్ - ఎ.చంద్రశేఖర్ నర్సాపూర్ - గాలి అనిల్‌కుమార్‌

ఆదిలాబాద్ జిల్లా

నిర్మల్ - శ్రీహరి రావు మంచిర్యాల - ప్రేమ్‌సాగర్‌రావు

నిజామాబాద్ జిల్లా

జుక్కల్ - గంగారాం

కామారెడ్డి - షబ్బీర్‌అలీ

ఖమ్మం జిల్లా

మధిర - భట్టి విక్రమార్క భద్రాచలం - పొదెం వీరయ్య కొత్తగూడెం - పొంగులేటి శ్రీనివాసరెడ్డి

కరీంనగర్ జిల్లా

హుస్నాబాద్ - పొన్నం ప్రభాకర్

మంథని- శ్రీధర్‌బాబు వేములవాడ- ఆది శ్రీనివాస్ జగిత్యాల- జీవన్‌రెడ్డి హుజురాబాద్- బల్మూరి వెంకట్ చొప్పదండి - మేడిపల్లి సత్యం మానకొండూరు- కవ్వంపల్లి సత్యనారాయణ

రామగుండం - రాజ్‌ఠాకూర్ పెద్దపల్లి - విజయ రమణారావు ధర్మపురి - వడ్లురి లక్ష్మణ్

కోరుట్ల - జువ్వాడి నర్సింగ్ రావు

దాదాపుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రతి అక్కకు, చెల్లెమ్మకు రాఖీ శుభాకాంక్షలు: సీఎం జగన్‌

తాడేపల్లి: రాఖీ పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అంటూ సీఎం బుధవారం ట్వీట్‌ చేశారు..

వారు చూపుతున్న ప్రేమాభిమానాలకు సదా కృతజ్ఞతుడినని అన్నారు. మహిళల సంక్షేమమే లక్ష్యంగా.. వారి రక్షణే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషిస్తున్నానని తెలిపారు.

ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఎప్పుడూ అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు పేర్కొన్నారు..

కాంగ్రెస్ పార్టీకి కొత్త టెన్షన్ .. !

- కాంగ్రెస్ టికెట్ల కోసం ఓయూ విద్యార్థుల ఆశలు ..

- ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సవాల్ ..

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్ పార్టీకి టికెట్ల విషయంలో మరో సమస్య ఎదురైంది. ఇప్పటికే ముందు నుండి పార్టీకి సేవ చేస్తూ నియోజకవర్గాల ఇంచార్జులుగా ఉన్న వారు టికెట్లు ఆశిస్తుండగా.. కొత్తగా ఆయా నియోజకవర్గాల్లో వేర్వేరు పార్టీల నుండి వచ్చి చేరిన వారు సైతం టికెట్లు ఆశిస్తున్నారు. ఇదిలావుండగానే.. తాజాగా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి నేతలుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న విద్యార్థి నేతల నుండి కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం పోరాటం మొదలైంది. ఇది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ తరుపున అసెంబ్లీ ఎన్నిక్లలో పోటీ చేసేందుకు మూడు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించాలని కోరుతూ ప్రదేశ్ ఎన్నికల కమిటీ చైర్మన్, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి, అలాగే టీ పీసీసీ సభ్యులు, సిఎల్పీ నేత అయిన భట్టి విక్రమార్కకు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ను కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఓయూ విద్యార్థి ఉద్యమ నేతలు మంగళవారం గాంధీభవన్‌లో కలిసి ఓ వినతిపత్రం అందించారు.

ఓయూ విద్యార్థి ఉద్యమకారులకు రెండు టికెట్లు ఇస్తానని రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విద్యార్థి నాయకులు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పీసీసీ సభ్యులకి విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీ 2014లో ఒక ఎంపీ 3 అసెంబ్లీ టికెట్లు విద్యార్థి ఉద్యమకారులకు కేటాయించిందని, 2018లో మూడు అసెంబ్లీ టికెట్లు 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు విద్యార్థి ఉద్యమకారులకు ఇచ్చిందని చెప్పిన విద్యార్థి నేతలు.. కాంగ్రెస్ పార్టీ సైతం ఈసారి విద్యార్థి ఉద్యమకార్లకు న్యాయం చేయాలని వారు కోరారు.

వినతి పత్రం ఇచ్చిన వారిలో సత్తుపల్లి నుంచి టికెట్ ఆశిస్తున్న కోటూరి మానవతారాయ్, చెన్నూరు నుంచి టిక్కెట్ ఆశిస్తున్న దుర్గం భాస్కర్, జనగాం నుంచి టికెట్ ఆశిస్తున్న బాల లక్ష్మి, గద్వాల నుంచి టికెట్ ఆశిస్తున్న కురువ విజయ్ కుమార్, మునుగోడు నుంచి టికెట్ ఆశిస్తున్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నేత డాక్టర్ లింగం యాదవ్, కరీంనగర్ నుంచి కొనగాల మహేష్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీతో పోరాటం చేస్తోన్న తమకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఇవ్వాలని సదరు విద్యార్థి ఉద్యమాల నేతలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కోరారు. అంతేకాకుండా ఇది ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ కూడా అని గుర్తుచేసిన విద్యార్థి నేతలు.. ఆ హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.

డిసెంబర్‌లోనే డీఎస్సీ ఎగ్జామ్‌.. ఆన్‌లైన్‌లోనే పరీక్ష నిర్వహణ?

టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన డీఎస్సీ పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. పరీక్షను ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని అధికారులు ఖరారు చేశారు.

ఒక్కో రోజు ఒక పేపర్‌కు మాత్రమే పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే అభ్యర్థుల నుంచి వచ్చే దరఖాస్తులను బట్టి షిప్టుల వారీగా నిర్వహించాలా? లేదా? అనేది ఇంకా నిర్ణయించాల్సి ఉంది. డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించనుండడంతో అందుకు కావాల్సిన పరీక్షా కేంద్రాలను గ్రేటర్‌ హైదరాబాద్‌ చుట్టుపక్కల జిల్లాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

దరఖాస్తులు భారీగా వస్తే దానికనుగుణంగా పరీక్షా కేంద్రాలను జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. పేపర్‌ తయారి, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఎస్‌సీఈఆర్టీకి అప్పగించనున్నారు.

ఈక్రమంలోనే దరఖాస్తుల స్వీకరణ, విద్యార్హతలు, పరీక్ష తేదీ, సిలబస్‌, రోస్టర్‌ పాయింట్‌, అభ్యర్థుల స్థానికత, ఈడబ్ల్యూఎస్‌, ఎస్టీ రిజర్వేషన్ల అమలు, లోకల్‌, ఓపెన్‌ కోటా తదితర అంశాలపై అధికారులు కొన్ని రోజులుగా భేటీ అవుతూ కసరత్తులు చేస్తూవస్తున్నారు. అధికారిక సమాచారం ప్రకారం నేడు లేదా రేపు డీఎస్సీ మార్గదర్శకాలను విద్యాశాఖ విడుదల చేయనుంది.

మొన్న జరిగిన గురుకుల ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షను కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌,సీబీటీ,పద్ధతిలో గురుకుల బోర్డు అధికారులు రోజుకు మూడు షిప్టుల్లో విజయవంతంగా నిర్వహించారు.

డీఎస్సీని సైతం కూడా ఇదే తరహాలో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. ఇందుకు టీఎస్‌ ఆన్‌లైన్‌ వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో మాదిరిగానే ఎస్జీటీ అభ్యర్థులకు ఒక రోజు, స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు రెండు రోజుల పాటు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

దాదాపు ఆరేళ్ల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్‌ పడడంతో ఎలాంటి కోర్టు చిక్కులు, లీకులు లేకుండా పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సర్కారు చర్యలు చేపట్టింది. 6612 పోస్టులను భర్తీ చేసేందుకు ఇప్పటికే సర్కారు జీవోలు కూడా జారి చేసింది.

అయితే 2017లో 8972 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ టీఆర్టీ, ద్వారా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా, ఈసారి మాత్రం పాఠశాల విద్యకే నియామక బాధ్యతలను అప్పగించారు.

డిసెంబర్‌ 15వ తేదీలోపు డీఎస్సీని నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎస్జీటీ పోస్టులకు డీఎడ్‌ అభ్యర్థులు, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు బీఎడ్‌ వారు మాత్రమే అర్హులుగా తేలుస్తూ విద్యాశాఖ మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు సమాచారం.

నేడు మహారాష్ట్రకు మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ!

మహారాష్ట్ర పర్యటనకు బీఆర్ఎస్ మంత్రులు వెళ్తున్నారు.బుధవారం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో పర్యటించనున్నారు.

పద్మశాలీలు ఘనంగా నిర్వహించే మార్కండేయ రథోత్సవానికి ఆహ్వానం అందడంతో వెళ్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్‌చార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు తదితరులు రథోత్సవంలో పాల్గొననున్నారు.

అనంతరం పార్టీ నాయకులతో భేటీ అయి పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

హైదరాబాద్ టు బల్లార్ష పలు రైళ్ల కుదింపు

కాజీపేట రైల్వే జంక్షన్‌ బలార్ష సెక్షన్‌లో జరుగుతున్న మూడోలైన్‌ ఇంటర్‌ లాకింగ్‌, నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా మంగళవారం నుంచి ఇంటర్‌సిటీ, భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండు రైళ్లను బెల్లంపల్లి వరకు కుదిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

సెక్షన్‌లోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సిర్పూర్‌ రెండు ముఖ్య రైల్వేస్టేషన్లలో మూడోలైన్‌ పనులు జరుగుతున్నందున ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 26 వరకు హైదరాబాద్‌ సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలు, సికింద్రాబాద్‌-బలార్ష మధ్య నడిచే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలను బెల్లంపల్లి వరకు కుదించి నడిపిస్తున్నట్లు చెప్పారు.

బెల్లంపల్లి-బలార్ష సెక్షన్‌ మూడో లైన్‌ పూర్తయ్యే దశలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఈ రైళ్ల సమయంలో ఎలాంటి మార్పులు లేకుండా బెల్లంపల్లి వరకు మాత్రమే నడిపిస్తున్నట్లు వివరించారు. వీటితో పాటుగా ఇంతకు ముందు రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్‌ ప్యాసింజర్‌, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్‌ 2వ తారీకు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

రాఖీ పౌర్ణమి కి మహిళలకు అదిరిపోయే బహుమతులు

రాఖీ పౌర్ణమికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది.

ఆడపడుచుల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50 లక్షల విలువగల బ‌హుమ‌తులు అందించి.. వారి ప‌ట్ల సంస్థ‌కున్న గౌర‌వభావాన్ని ప్ర‌క‌టించనుంది.

ప్రతి రీజియన్ పరిధిలో ముగ్గురికి చొప్పున మొత్తం 33 మందికి బహుమతులను ఇవ్వనుంది.

ఈ నెల 30, 31 తేదిల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్ ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్ లలో వేయాలి. ఆ డ్రాప్ బాక్స్ లను ఒక చోటికి చేర్చి.. ప్రతి రీజియన్ పరిధిలో లక్కీ డ్రా నిర్వహించి ముగ్గురి చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ముఖ్య అతిథుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేస్తారు.

మహిళలకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైంది. అత్యంత పవిత్రంగా ఈ పండుగను వారు జరుపుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి మరీ తమ సోదరులకు వారు రాఖీలు కడుతుంటారు. సోదరసోదరీమణుల ఆత్మీయత, అనురాగాలతో కూడిన ఈ పండుగ నాడు.. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా నిర్వహించాలని సంస్థ నిర్ణయించింది.

ఈ నెల 30, 31 తేదిల్లో సంస్థ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఈ లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. టికెట్ వెనకాల పేరు, ఫోన్ నంబర్ రాసి డ్రాప్ బాక్స్ లలో వాటిని వేయాలి. ప్రతి బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాల్లో డ్రాప్ బాక్స్ లను సంస్థ ఏర్పాటు చేసింది. మహిళా ప్రయాణికులందరూ ఈ లక్కీ డ్రాలో పాల్గొని విలువైన బహుమతులను గెలుచుకోవాలని సంస్థ కోరుతోంది.

సెప్టెంబర్ 9లోగా లక్కీ డ్రాలు నిర్వహించి.. విజేతలకు బహుమతులను అందజేయడం జరుగుతుంది.” అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు.

ఈ రాఖీ పౌర్ణమి లక్కీ డ్రాకు సంబంధించి పూర్తి వివరాలకు టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని వారు సూచించారు...