/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz గంగుల క్యాంప్ ఆఫీస్‌ ముట్టడి: మోహరించిన పోలీసులు Yadagiri Goud
గంగుల క్యాంప్ ఆఫీస్‌ ముట్టడి: మోహరించిన పోలీసులు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 5,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో కరీంనగర్ ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు మంగళవారం మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించారు.

విద్యార్థులు పెద్ద సంఖ్యలో మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థి నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగి కొద్ది సేపు తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది.

పోలీసులు విద్యార్థి నాయకులను చెదరగొట్టి అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులకు, ఏబీవీపీ నాయకులకు గాయలయ్యాయి..

కాంగ్రెస్‌ పార్టీ డిక్లరేషన్ ఆచరణ లో సాధ్యం కాని హామీలు: మంత్రి తలసాని

కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కానివేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అది ఏమన్నా కొత్త పార్టీయా అని ప్రశ్నించారు. వారి చరిత్ర ఎవరికి తెలయదని, ఆ పార్టీని తెలంగాణలోని కానీ, దేశంలో కానీ ఎవరూ నమ్మే స్థితిలో లేరని విమర్శించారు.

హైదరాబాద్‌ గోషామహల్‌లో బీసీ కులవృత్తిదారులకు ఆర్ధిక సహాయం పంపిణీ కార్యక్రమంలో మంగళవారం మంత్రి పాల్గొన్నారు. ఓట్లు దండుకోవడం తప్ప ఏరోజూ ప్రజల గురించి కాంగ్రెస్‌ ఆలోచించలేదన్నారు. 50 ఏండ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించారని, అప్పుడు పేదలకు పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదా అని నిలదీశారు.

గృహలక్ష్మి పథకంలో భాగంగా ఇండ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.3 లక్షలు ఇస్తుంటే.. వాళ్లు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పడం ఎంతవరకు సబబన్నారు. ఆ పార్టీ నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

అధికారం కోసం ఊకదంపుడు ఉపన్యాసాలు, అలవికాని హామీస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా ఇలాంటి హామీలే ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారని చెప్పారు. ఆ పార్టీ ప్రకటించే డిక్లరేషన్లు కనీసం మూతి తూడ్చుకోవడానికి కూడా పనికిరావని ఎద్దేవా చేశారు. అన్నివర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేస్తున్నారని చెప్పారు. వచ్చే నెల 2న 12 వేల డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు పంపిణీ చేస్తామని వెల్లడించారు...

Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. ఐదుగురు విటుల అరెస్ట్‌

హైదరాబాద్‌: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న రెండు సెంటర్లపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్పా సెంటర్లలో యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఎస్సై కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు..

మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన ఓ మహిళ.. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

14 మంది యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. ఐదుగురు విటులను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఒక్కో యువతికి వారానికి రూ.15వేలు ఇస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు నిర్వాహకులు అంగీకరించారు..

Polavaram: నేడు 'పోలవరం' పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

దిల్లీ: పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై కేంద్ర జలశక్తి శాఖ నేడు సమీక్ష నిర్వహించనుంది. సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో ఆ శాఖ కార్యదర్శి చర్చించనున్నారు..

ప్రతి నెలా జాతీయ ప్రాజెక్టులపై సమీక్షలో భాగంగానే ఈరోజు కూడా చర్చించనున్నట్లు జలశక్తి శాఖ అధికారులు తెలిపారు.

ప్రాజెక్టులో డయాఫ్రమ్‌వాల్‌తో పాటు అప్పర్‌, లోయర్‌ కాపర్‌ డ్యామ్‌ల పరిస్థితి.. రెండు చోట్ల నీటి లీకేజీపై అధికారులు సమీక్షించనున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న ప్రదేశంలో చేపట్టాల్సిన చర్యలు, ఇప్పటికే జలశక్తి శాఖ నుంచి ఇచ్చిన ఆదేశాల అమలు తీరుతెన్నులపై కీలకంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఏపీ అధికారులను కూడా పిలవాలని జలశక్తి శాఖ అధికారులు భావించినప్పటికీ చివరి నిమిషంలో వారిని వద్దనుకున్నట్లు సమాచారం. మంత్రిత్వశాఖలో చర్చించిన తర్వాతే రాష్ట్ర అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలిసింది..

ఘట్‌కేసర్‌లో చైన్ స్నాచర్ హల్‌చల్

నగరంలోని ఘట్‌కేసర్‌లో చైన్ స్నాచర్ హల్‌చల్ చేశాడు. ఓ మహిళ కంట్లో కారం కొట్టి ఆమె మెడలోన్ని మంగళసూత్రాన్ని దొంగలించాడు.

ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివారెడ్డి గూడ చౌరస్తాలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. మూడున్నర తులాల బంగారం చైన్‌ను దొంగ అపహరించాడు.

బాధితురాలు కల్వకుంట్ల మంజుల (52) ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా హన్మకొండలో విధులు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో శివారెడ్డి గూడ చౌరస్తాలో బస్ స్టాండ్‌లో బస్ కోసం మంజుల ఎదురు చూస్తున్నారు. అక్కడకు వచ్చిన ఓ దొంగ.. కంట్లో కారం కొట్టి మంగళ సూత్రం దొంగలించి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి పరారయ్యాడని బాధితురాలు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు...

హైదరాబాద్‌పై మనసు పారేసుకున్న సినీ నటి

అతి తక్కువ కాలంలోనే మహాద్భుతంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ మహానగరంపై సెలబ్రిటీలు మనసు పారేసుకుంటున్నారు. విదేశాల్లో ఉండొచ్చిన వారు సైతం నగరాభివృద్ధికి ముచ్చటపడుతున్నారు. హైదరాబాద్‌ అమెరికాను తలపిస్తున్నదంటూ మనసులో మాటను బయటపెడుతున్నారు.

విశాలమైన రోడ్లు, నిరంతర విద్యుత్తు సరఫరా, అంతర్జాతీయస్థాయి మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చాయి. తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూడా ఇటీవల హైదరాబాద్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. ఒకరేమిటి ఎందరో సెలబ్రిటీలు హైదరాబాద్‌ను చూసి ఫిదా అవుతున్నారు.

తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్‌ నటి సోనాల్‌ చౌహాన్‌ చేరారు. బాలకృష్ణ సరసన లెజెండ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సోనాల్‌ ఇటీవల విడుదలైన ఆదిపురుష్‌ సినిమాలోనూ మెరిశారు. కడ్తాల్‌లో ఓ ప్రైవేటు డెవలపర్స్‌ లగ్జరీ విల్లాలకు సంబంధించి జూబ్లీహిల్స్‌లో జరిగిన బ్రోచర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరాభివృద్ధిని చూస్తుంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని అనిపిస్తున్నదని పేర్కొన్నారు.బాలీవుడ్‌లోని పలువురు నటీనటులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నట్టు తెలిపారు.

శంషాబాద్‌ నుంచి కారులో జూబ్లీహిల్స్‌ వస్తుంటే విదేశాల్లో ఉన్నట్టే అనిపించిందని చెప్పుకొచ్చారు. దేశంలోని మరే నగరంలోనూ ఇంత భారీ భవనాలు కనిపించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక్కడి నిర్మాణాలు, అభివృద్ధి చూస్తుంటే తనకు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచన వస్తున్నదని వివరించారు. ఎన్నో అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులకు తరలివస్తున్న విషయం తనకు తెలిసిందని సోనాల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

Telugu Bhasha Dinotsavam: తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు

అమరావతి: తెలుగు భాషా దినోత్సవం (Telugu Basha Dinotsavam) సందర్భంగా ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu naidu) శుభాకాంక్షలు తెలియజేశారు..

ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ... ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువచేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానన్నారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయివుండాలని ఆయన ఆశించారు. గిడుగు వారి ఆశయ స్ఫూర్తిగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించడం దగ్గర నుంచి పాలనలో తెలుగును ప్రవేశపెట్టడం వరకు తెలుగు భాష వ్యాప్తికి, సంరక్షణకు నడుం కట్టింది తెలుగుదేశమే అని చెప్పుకొచ్చారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు అందరం కలిసికట్టుగా పాటుపడాలని కోరుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు..

ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ - చంద్రబాబు

నిండైన ఆత్మీయతకు, ఆత్మాభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని కొనియాడారు టీడీపీ అధినేత చంద్రబాబు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు..

ఆత్మీయుడు హరికృష్ణ వర్ధంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తున్నానని వెల్లడించారు టీడీపీ అధినేత చంద్రబాబు.

ఇక అటు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రథమ భారతీయ భాషా శాస్త్రవేత్త, తెలుగు వెలుగు గిడుగు వేంకట రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామని..ఈ వేళ. ప్రపంచ వ్యాప్త తెలుగువారందరికీ శుభాకాంక్షలు అని పేర్కొన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

తెలుగు వ్యవహారిక భాషలోనే పుస్తక రచన చేయాలని ఉద్యమించి, సాహిత్యాన్ని సామాన్యుడికి చేరువ చేసిన గిడుగు రామ్మూర్తి స్మృతికి నివాళులర్పిస్తున్నానునన్నారు. విద్యావ్యాప్తి జరగాలంటే బోధన జరిగే భాష మాతృభాషే అయి వుండాలని ఆయన ఆశించారని పేర్కొన్నారు..

కడియం శ్రీహరిపై మంద కృష్ణ సంచలన వ్యాఖ్యలు

హనుమకొండ : మాజీ మంత్రి కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కడియం ఒక గుంట నక్క అని మంద కృష్ణ విమర్శించారు.

గతంలో రాజయ్య డిప్యూటీ సీఎం పదవి పోవడానికి రాజయ్యే కారణమన్నారు.

కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ ఇవ్వొద్దన్నారు. మాదిగ సీటును మాదిగకే ఇవ్వాలన్నారు. రాజయ్యకు ఇవ్వకపోతే మరో మాదిగకు ఇవ్వాలన్నారు. కడియం శ్రీహరికి బీ ఫామ్ ఎలా వస్తుందో చూస్తామని మంద కృష్ణ మాదిగ సవాల్ విసిరారు..

తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్‌

తాడేపల్లి: తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ''ఆధునిక తెలుగుభాషా వేత్తలలో అగ్రగణ్యుడు గిడుగు వెంకట రామమూర్తి గారు..

తన ఉద్యమం ద్వారా తెలుగుభాషను సామాన్యుల దగ్గరకు చేర్చి.. వ్యవహారిక భాషను మాధ్యమంగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి. భాషా నైపుణ్యాలను వృద్ధిచేయడం ద్వారా అక్షరాస్యత పెంపు.. తద్వారా మానవాభివృద్ధికి విశేషంగా కృషిచేశారు'' అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

గిడుగు వారి జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు'' అని సీఎం ట్వీటర్‌లో పేర్కొన్నారు..