/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ములుగు గడ్డపై బిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం: మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి Yadagiri Goud
ములుగు గడ్డపై బిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం: మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి

దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 119 కి 115 నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్‌ చరిత్ర స్పష్టించారని, పట్టుమని 10మంది అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితుల్లో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఉన్నాయని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌ అన్నారు. సోమవారం వారు ములుగు జిల్లాలో పర్యటించి ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

జూన్‌లో హఠాన్మరణం చెందిన దివంగత జడ్పీచైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌ కుటుంబ సభ్యులకు మంత్రులు, కార్యకర్తల సమక్షంలో బీఆర్‌ఎస్‌ పార్టీ సమకూర్చిన రూ.కోటి 50లక్షల విలువైన చెక్కును అందజేశారు.అనంతరం మంత్రులు మాట్లాడుతూ..

రానున్న ఎన్నికల్లో ములుగు గడ్డపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీని నమ్ముకొని పనిచే సే నాయకులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు...

TTD: తితిదే బోర్డు సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. నేరచరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని తితిదే బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు..

తితిదే బోర్డు సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు.

ఈ ముగ్గురిని తితిదే బోర్డు సభ్యులుగా తొలగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా❓️

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుందా? లేదా? అనే విషయమై నేడు స్పష్టత వచ్చింది. తెలంగాణ ఎన్నికల బరిలోకి టీడీపీ కూడా దిగనుంది.

ఈ క్రమంలోనే ఈ అసెంబ్లీ ఎన్నికల‌పై తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసింది. ఏడుగురు సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో ఒక కమిటీని నియమించారు.

కమిటీలో కాసాని జ్ఞానేశ్వర్, రావుల చంద్రశేఖరరెడ్డి, అర్వింద్ కుమార్ గౌడ్, కంభంపాటి రామ్మోహనరావు, బక్కిన నరసింహులు, కాశీనాథ్, నర్సిరెడ్డిలకు చోటు కల్పించారు. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఈ కమిటి స్వీకరించనుంది.

అనంతరం చంద్రబాబుకు నివేదిక సమర్పించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా అభ్యర్థులను టీడీపీ ప్రకటించనుంది....

తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి : ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిందని, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.

సోమవారం మెదక్ మండలం కోంటూరు పెద్ద చెరువులో సబ్సిడీపై 1,84,500 చేప పిల్లల విడుదల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో చెరువులన్నీ నిండటంతో చేప పిల్లలు వదిలి నీలి విప్లవం తీసుకురావాలన్నారు.

ప్రభుత్వం అందజేస్తున్న ఉచిత చేప పిల్లలను పెంచి మత్స్యకారులు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలని ఆకాంక్షించారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రత్యేక గ్రామపంచాయతీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్‌ ఎం. లావణ్య రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, జిల్లా మత్స్యశాఖ అధికారి రజని, మెదక్ వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, మెదక్ పీఏసీఎస్‌ చైర్మన్ హన్మంత్ రెడ్డి, మండల రైతుబంధు అధ్యక్షుడు కిష్టయ్య, మెదక్ ఎమ్మార్వో శ్రీనివాస్, నాయకులు రవి సిద్ధ గౌడ్, మోహన్, రెడ్డి తదితరులు పాల్గొన్నారు...,.

Mamata: 'డిసెంబర్‌'లోనే లోక్‌సభ ఎన్నికలు ఉండొచ్చు!

కోల్‌కతా: సార్వత్రిక ఎన్నికలపై (General Elections) పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) ఈ ఏడాది డిసెంబర్‌లో వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు.

ఇప్పటికే ప్రచారం కోసం అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ముందస్తుగా బుక్‌ చేసుకొందన్నారు. టీఎంసీ యువజన విభాగం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆమె.. మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే 'నిరకుంశ పాలనే'నని ఆరోపించారు..

'మూడోసారి భాజపా అధికారంలోకి వస్తే ఇక నిరంకుశ పాలనే. ఈ ఏడాది డిసెంబర్‌లోనే లోక్‌సభ ఎన్నికలకు భాజపా వెళ్లవచ్చని అంచనా వేస్తున్నా. ప్రచారం కోసం అవసరమైన అన్ని హెలికాప్టర్లను కాషాయ పార్టీ ఇప్పటికే ముందస్తుగా బుక్‌ చేసుకొంది. మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దనేది వారి ఆలోచన. పశ్చమ బెంగాల్‌లో సీపీఎం పాలనకు ముగింపు పలికాం. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాను తప్పకుండా ఓడిస్తాం. ఇప్పటికే అన్ని వర్గాల్లో చీలిక తెచ్చే ప్రయత్నం భాజపా చేస్తోంది. మరోసారి అధికారం చేపడితే పరిస్థితులు దారుణంగా ఉంటాయి' అని మమతా బెనర్జీ పేర్కొన్నారు..

ఇక అక్కడి గవర్నర్‌ తీరుపై మండిపడ్డ ఆమె.. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వంతో సవాలుకు దిగవద్దని సూచించారు.. గవర్నర్‌ పదవి అంటే తనకు గౌరవం ఉన్నప్పటికీ.. ఆయన తీరు మాత్రం బాగాలేదన్నారు. ఇక ఇటీవల జాదవ్‌పుర్‌ యూనివర్సిటీలో చోటుచేసుకున్న వివాదంపైనా స్పందించిన మమతా.. 'గోలీ మారో' అంటూ నినాదాలు చేసిన వారిని అరెస్టు చేస్తామన్నారు..

Ban On Mobiles: ఏపీలోని పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై నిషేధం

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్‌ ఫోన్ల వాడకంపై ఏపీ పాఠశాల విద్యాశాఖ నిషేధం విధించింది. పాఠశాలలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తేవటంపై పూర్తి నిషేధం విధిస్తూ మోమో జారీ చేసింది..

ఉపాధ్యాయులు సైతం తరగతి గదుల్లోకి ఫోన్లు తీసుకురాకుండా ఆంక్షలు విధించింది. టీచర్లు తరగతి గదులకు వెళ్లేముందు తమ మొబైల్స్‌ను ప్రధానోపాధ్యాయుడికి అప్పగించాలని సూచించింది. యునెస్కో విడుదల చేసిన గ్లోబల్‌ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా.. బోధనకు ఎటువంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పై అధికారులు ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చింది..

నగరిలో సీఎం జగన్‌ కామెంట్లు..

అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డి అయినా తింటారు. 28 ఏళ్ల క్రితమే ముఖ్యమంత్రి అయ్యాడు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా కనిపిస్తుందా?. సొంత కొడుకు మీదే చంద్రబాబుకు నమ్మకం లేదు. అందుకే దత్తపుత్రుడికి ప్యాకేజీ ఇచ్చి అరువు తెచ్చుకున్నాడు.

చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, అబద్ధాలు, మోసాలు. కుట్రలు, కుతంత్రాలనే నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి గొడవలు పెట్టి.. శవరాజకీయాలు చేయాలన్నదే ఆయన ఉద్దేశం. కావాలనే పోలీసులపై రాళ్లు రువ్వించారు. పోలీసులపై కర్ర, బీరు సీసాలతో దాడి చేయించాడు. ఓ పోలీస్‌కన్ను కూడా పోగొట్టారు.

చంద్రబాబు ఢిల్లీలో సీఈసీని కలుస్తాడట. దొంగ ఓట్లు ఆయనే సృష్టించి.. మన మీద ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లాడు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడానికి ఏమాత్రం వెనుకడాడని వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వ్యక్తి.. ఆయన ఫొటోనే దండం పెడతాడు. ఎన్టీఆర్‌ నాణేం విడుదల కోసం ఢిల్లీ కూడా వెళ్లాడు.

సీఎం జగన్‌ ప్రసంగం

ప్రతి పేద కుటుంబానికి నేటి కంటే రేపు మరింత బాగుండాలి. తల్లిదండ్రుల పేదరికం పిల్లల భవిష్యత్తుకు అడ్డురాకూడదు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పేద పిల్లలు ఇబ్బంది పడకూడదనే విద్యాదీవెన తీసుకొచ్చాం. ఇది వాళ్ల భవిష్యత్తు మార్చబోయే పథకం. నాలుగేళ్ల కాలంలో ఈ పథకం ద్వారా రూ. 11 వేల మూడు వందల కోట్లు జమ చేశాం. 8 లక్షల 44 వేల 336 మంది మంది తల్లుల ఖాతాలో రూ.680 కోట్లు జమ చేస్తున్నాం. జగనన్న వసతి దీవెన కూడా పేద విద్యార్థలు కోసం అమలు చేస్తున్నాం.

Marri Janardhan Reddy: కాంగ్రెస్‌ వాళ్లను కాల్చి పడేస్తా: ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాద్: కాంగ్రెస్‌పై నాగర్‌కర్నూల్‌కు చెందిన భారాస ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లను కాల్చి పడేస్తానని ఆయన వ్యాఖ్యానించారు..

నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలోని తెల్కపల్లి మండలంలో 'పదేళ్ల ప్రజా ప్రస్థానంలో మర్రన్న' పాదయాత్ర సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడారు.

''నా జోలికి వస్తే ఒక్కొక్కరిని కాల్చి పడేస్తా. కాంగ్రెస్‌ నేతలను గ్రామాల్లో తిరగకుండా చేస్తాను. నేను తలుచుకుంటే కాంగ్రెస్‌ చేయి ఊడిపోతుంది'' అని మర్రి జనార్దన్‌రెడ్డి వ్యాఖ్యానించారు..

మహబూబాబాద్ జిల్లా ఎస్పీగా చంద్రమోహన్

మహబూబాబాద్ ఎస్పీగా గుండేటి చంద్రమోహన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మహబూబాబాద్ ఎస్పీగా పని చేస్తున్న శరత్ చంద్ర పవార్ ను తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ కి బదిలీ చేశారు.మంచిర్యాల జిల్లా మందమర్రి కి చెందిన చంద్రమోహన్ 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీస్ శాఖలో చేరారు.

దేవరకొండ డిఎస్పీగా, కరీంనగర్ ఇంటెలిజెన్స్ డిఎస్పీగా పని చేశారు. కరీంనగర్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా పనిచేసి ఇటీవలే నాన్ క్యాడర్ ఎస్పీగా పదోన్నతి పొందారు.

ప్రస్తుతం హైదరాబాదులోని డిజిపి కార్యాలయంలోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం రోజు మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

సహనం కోల్పోతున్న బిఆర్ఎస్ నేతలు

రాజకీయాల్లో ముఖ్యంగా కావల్సింది సహనం బిఆర్ఎస్ నేతలు ఈమధ్య సహనం కోల్పోతున్నారు ఎంత సహనం ఉంటే అంతలా రాణిస్తారు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకో గానీ ఈ మధ్య పదే పదే సహనం కోల్పోతున్నారు.

మొన్నటికి మొన్న స్టీల్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తిని తోసేసి ఓ వర్గం ఆగ్రహానికి గురయ్యారు. ఆ తరువాత క్షమాపణలు చెప్పారు. తాజాగా మరోసారి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సహనం కోల్పోయారు. భాగ్యనగర్ గణేష్ సమితి సెక్రెటరీ పై మండిపడ్డారు.

ఓల్డ్ సిటీలో మ్యాన్ హోల్స్, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వివరిస్తున్న సెక్రటరీ పై తలసాని అసహనం వ్యక్తం చేశారు. గత బోనాలల్లో సరైన ఏర్పాట్లు లేక మ్యాన్ హోల్స్ లో పడి భక్తులకు గాయాల పాలయ్యారంటు చెపుతున్న గణేష్ ఉత్సవ నిర్వహకులపై మరోసారి మండిపడ్డారు.

మొన్నటికి మొన్న మంత్రి హరీష్ రావు పై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర విమర్శలు చేశారు..